14 ఏళ్ల బాలుడు రాజ్యాంగం చేతపట్టుకొని ప్రశ్నిస్తున్న అశ్వమిత్ గౌతం…

14 ఏళ్ల బాలుడు రాజ్యాంగం చేతపట్టుకొని ప్రశ్నిస్తున్న అశ్వమిత్ గౌతం

భూపాలపల్లి నేటిధాత్రి

 

సిపిఐ ఎంఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 14 ఏళ్ల కుర్రాడి ప్రశ్నలకు భయపడుతోందా?
ప్రశ్న అడగడం నేరమైపోయిన రోజుల్లో
నిజం మాట్లాడటం తిరుగుబాటుగా మారిన కాలంలో
ఒక 14 ఏళ్ల బాలుడు రాజ్యాంగం చేత పట్టుకుని
వ్యవస్థనే నిలదీస్తున్నాడు! మోడీ, యోగి సర్కార్ జవాబు చెప్పలేక పోతుందా?
ఆటబొమ్మలు చేతిలో ఉండాల్సిన వయసులో
అతని చేతిలో ఉంది అంబేడ్కర్ పుస్తకం.
కార్టూన్లు చూడాల్సిన కళ్లలో కనిపిస్తున్నాయి సమాజంలోని అసమానతలు. అతడి పేరు అశ్వమిత్ గౌతం. లక్నోకు చెందిన ఒక సాధారణ బాలుడు.కానీ అతని ఆలోచనలు మాత్రం
సాధారణ వ్యవస్థలకు అస్సలు నచ్చని అసాధారణమైనవి.
చేతిలో తుపాకీ లేదు. గొంతులో విద్వేషం లేదు.
నోట్లో బూతులు లేవు. కానీ అతని దగ్గర ఉంది
ఒక అత్యంత ప్రమాదకరమైన ఆయుధం –
ప్రశ్న.
తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా
రాజ్యాంగం ఏమంటుందో చెబుతున్నాడు.
హక్కులు అంటే ఏమిటో వివరిస్తున్నాడు.
చరిత్రను వర్తమానంతో పోలుస్తున్నాడు.
“ఎందుకు ఇలా జరుగుతోంది?” అని నిలదీస్తున్నాడు.
అంతే… దోపిడి చేసే, పెట్టుబడి దారుల కొమ్ము కాసే వ్యవస్థ ఉలిక్కిపడింది. ప్రభుత్వానికి నిద్రపట్టలేదు.
చిన్నోడిని చర్చించాల్సింది పోయి చట్టంతో బెదిరించాలనుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రశ్న అడిగితే కేసులు?
ఆలోచిస్తే నేరం? చదివితే ప్రమాదం?
ఈ దేశంలో లక్షల మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు
కులాల గొప్పలు చెబుతూ బూతులు తిడుతూ
వ్యవస్థకు భజన చేస్తూ మిలియన్ల వ్యూస్ సంపాదిస్తారు. వాళ్లకు అవార్డులు. వాళ్లకు గుర్తింపు. వాళ్లకు ప్రోత్సాహం. కానీఒక పేద బాలుడు నిజం మాట్లాడితే మాత్రం అతనిపై కేసులు. అతనికి విచారణ. అతనిని భయపెట్టే వ్యవస్థ.
ఇది న్యాయమా? లేదా ఇది భయపడే పాలనా?
అశ్వమిత్ ఎక్కడా ద్వేష ప్రసంగం చేయలేదు.
ఎవరినీ రెచ్చగొట్టలేదు. కేవలం పుస్తకాలలో ఉన్న మాటలే చెప్పాడు. రాజ్యాంగంలో ఉన్న హక్కులే గుర్తు చేశాడు. అంతే. అదే అతడు చేసిన “నేరం”.
భగత్ సింగ్ తుపాకీతో లేడు. అంబేడ్కర్ ఖడ్గంతో లేడు. కలాం బాంబులతో లేడు.
వాళ్లందరికీ ఉన్నది ఒక్కటే – ఆలోచన.
ఈ రోజు ఆ ఆలోచన రూపమే అశ్వమిత్.
భయపెడితే ఆలోచనలు ఆగవు. కేసులు పెట్టితే ప్రశ్నలు చనిపోవు. ఎంత నొక్కితే అంతే బలంగా
ధిక్కారపు మొక్క మొలుస్తుంది.
అశ్వమిత్ గౌతం ఒక వ్యక్తి కాదు.
ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ వాద సంకేతం
పేద వర్గాల చైతన్యానికి ప్రతిరూపం.
రాబోయే తరాల ప్రశ్నల స్వరం.
అతని గొంతుకు అండగా నిలబడటం అంటే
ఒక బాలుడిని కాపాడటం కాదు.
రాజ్యాంగాన్ని కాపాడటం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. మన భవిష్యత్తును కాపాడటం.
ప్రశ్నలను అణచలేరు. ఆలోచనలను అరెస్ట్ చేయలేరు. నిజాన్ని ఎఫ్ఐఆర్ లో బంధించలేరు.
అశ్వమిత్‌తో పాటు నిలబడదాం.
ఎందుకంటే ఈ రోజు అతడిని గొంతు నొక్కితే
రేపు మన గొంతుక కూడా అదే చేతుల్లో ఉంటుంది….
ప్రజలారా ప్రజాస్వామికవాదులారా, ఆలోచించండి..
అశ్వమిత్ గౌతమ్ పై అక్రమ కేసులను ఖందించండి…. ప్రజాస్వామ్యం కాపాడండి అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు అంబాల అశ్వద్ధామ మారపల్లి రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు

పత్రికలపై అవమానాలకు కోడెల నరేష్ నిప్పులు చల్లి

పత్రికలపై బురద జల్లడం సరికాదు

జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్

మంగపేట నేటిధాత్రి

 

తప్పుడు పనులకు పాల్పాడే వారి విషయంపై వార్తలు ప్రచురిస్తే పాత్రికేయులకై, పత్రికా యాజమాన్యంపై బురద జల్లడం సరికాదని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్ గురువారం ఒక ప్రకటనలో అన్నారు. నిర్భయంగా, నికార్సైన వార్తలు ప్రచురిస్తే అధికార పార్టీ అండతో పాత్రికేయులపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉంటుందని కానీ కొందరు అధికార అహంకారంతో ఇతరుల హక్కులని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంకి ప్రజలకి వారదిగా ఉంటూ నిత్యం వాస్తవాలు ప్రచురించే పాత్రికేయులపైనే తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు చొరవ తీసుకొని బోర్ నరసాపురం సెంటర్ పై తగు విచారణ జరిపి తప్పు చేసిన వారు ఎవ్వరైనా వారిపై తగు చర్యలు తీసుకొని అన్యాయం గా అమ్ముకున్న ధాన్యం డబ్బులను రికవరీ చేయాలని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version