పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి..

పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి..

సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం…

ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి..

అమరవీరుడు పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు

హన్మకొండ జిల్లా (నేటిధాత్రి):

 

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం అలుపెరగని కృషి చేస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివి నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన అమరవీరుడు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ పెరుగు రవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి దేశానికి చేసిన సేవ స్మరించుకున్న గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజుఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మన సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. వారు దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను అర్పించి అపారమైన ధైర్యసాహసానికి నిదర్శనంగా నిలిచారు. అమరవీరులు చూపిన త్యాగమార్గం ప్రస్తుత పోలీసు సిబ్బందికి, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ప్రభుత్వం ఎల్లప్పుడూ పోలీసు శాఖ సంక్షేమం కోసం కృషి చేస్తుంది. ప్రజలందరూ పోలీసుల పట్ల గౌరవభావం కలిగి, సమాజ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజి రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు, నక్క రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం.డి అన్వర్ కాంగ్రెస్ నాయకులు బండారి మొగిలి, చాందరాజు సంతోష్, మల్లాడి తిరుపతి రెడ్డి, వీరబోయిన రవి, బైరి సునీల్, లింగారెడ్డి, రవి, స్వర్ణలత, రావుల శ్రీకాంత్ తో హసన్పర్తి పోలీస్ స్టేషన్ సిఐ చేరాలు, ఎస్సై రవి, సిబ్బంది తో పాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు….

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

నర్సంపేట, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ 10 వార్డులోని సాంబారి సత్యం బుధవారం మృతిచెందగా స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరిమర్శించి , ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం కుటుంబానికి ఆర్థికసహాయంగా రూ.5 వేలు రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎదరబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యం, డాక్టర్ హరిబాబు, మూస్కు రాజేందర్, పసునూరి రమేష్, నాగిశెట్టి ప్రవీణ్, పస్తం కృష్ణ, ఆరేపల్లి కిరణ్ ,  కంప సమ్మయ్య, మల్యాల శ్రీనివాస్, అడెపు రవిందర్,చిటిమల్ల బ్రహ్మచారి, గోరంట్ల మహేందర్, మేడి నరేష్, గ్యార శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

హౌసింగ్ బోర్డ్ కాలనీలో బతుకమ్మ సంబరాలు…

హౌసింగ్ బోర్డ్ కాలనీలో బతుకమ్మ సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో యూవసేన మట్టి గణేష్ ఉత్సవాకమిటి ఆధ్వర్యంలో అక్టోబర్ 01న బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కాలనీ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మ పేర్చి, ఆటపాటలతో పండుగను జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పట్టం కట్టే విధంగా ఈ పండుగను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని, మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధించాలని, దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని మహిళలు తెలిపారు.

నస్కల్ లో సద్దుల బతుకమ్మ…

నస్కల్ లో సద్దుల బతుకమ్మ

నిజాంపేట: నేటి ధాత్రి

నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం నుండి బతుకమ్మలను పేర్చి గ్రామంలో గల ప్రధాన కూడలి వద్ద బతుకమ్మలను ఉంచి పండుగ నిర్వహించారు. నూతన పట్టు చీరలు ధరించి ప్రేమానురాగాలతో బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురూ మహిళలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో
పూలను దైవంగా భావిస్తూ ప్రకృతిని కాపాడుతూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఎంగిలిపూలతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులను పూజిస్తూ జరుపుకుంటామనిఅన్నారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు పుట్టినిల్లని ఇక్కడ జరుపుకునే బతుకమ్మ పండుగ చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ సభ్యులు పాల్గొన్నారు

సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ…

సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంటా కళావతి

పరకాల,నేటిధాత్రి

పూలను దైవంగా భావిస్తూ ప్రకృతిని కాపాడుతూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంటా కళావతి అన్నారు.ఎంగిలిపూలతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులను పూజిస్తూ జరుపుకుంటారని ఆమె తెలిపారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు పుట్టినిల్లని ఇక్కడ జరుపుకునే బతుకమ్మ పండుగ చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటారని అన్నారు.ఈ సందర్భంగా పరకాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని,ప్రతి ఒక్కరూ ఆనందంగా,ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T113849.670.wav?_=1

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ

ఎంగిలిపూల బతుకమ్మ మొదటిరోజు సంబరాలు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

బెల్లంపల్లి లో బాబు క్యాంప్ బస్తి సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి
ఈ సమయంలో వర్షాకాలం చివరి దశ, శీతా కాలం ప్రారంభం అవుతున్న వేళలో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుందని, రమనీయమైన, కనువిందులు చేసే వివిధ రకాల పూలతో ప్రకృతి పులకిస్తుంది. తెలంగాణాలో బతుకమ్మ పండుగ అనేది సాంప్రదాయ చిహ్నం. మహిళలు అందరూ కలిసి రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ ఎంతో ఉత్సహంగా, ఘనంగా జరుపుకుంటారు.పూలనే రాశి పోసి పూజించే గొప్ప సంకృతి మరెక్కడా లేదని, మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. సంఘమిత్ర యూత్ క్లబ్ కమిటీ వారు బతుకమ్మ ఆడుటకు చాలా చక్కని ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఎంగిలిపూల బతుకమ్మ మొదటిరోజు సంబరాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-22T112737.612.wav?_=2

 

ఎంగిలిపూల బతుకమ్మ మొదటిరోజు సంబరాలు

మందమర్రి నేటి ధాత్రి

 

 

బాలగణేష్ మండలి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి యపల్ ప్రాంతంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి
ఈ సందర్భముగా శ్రీమతి పట్టి సౌష్ణ, పంబాల సంతోషి, మారం మధులక్క, పిట్టల పవిత్ర, ముప్పు రాజేశ్వరి, కొమ్మ లక్ష్మి, గాదే సంధ్యారాణి, కట్ల లలిత, సుంకు పద్మ, బెడ్డల తార, దుగుట తిరుమల, సుజాత, రజిత, సరోజన గార్లు మాట్లాడుతూ ఈ సమయంలో వర్షాకాలం చివరి దశ, శీతా కాలం ప్రారంభం అవుతున్న వేళలో ప్రకృతి ఎంతో అందంగా ఉంటుందని, రమనీయమైన, కనువిందులు చేసే వివిధ రకాల పూలతో ప్రకృతి పులకిస్తుంది.

 

 

తెలంగాణాలో బతుకమ్మ పండుగ అనేది సాంప్రదాయ చిహ్నం. మహిళలు అందరూ కలిసి రామ రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ ఎంతో ఉత్సహంగా, ఘనంగా జరుపుకుంటారని తెలిపారు.పూలనే రాశి పోసి పూజించే గొప్ప సంకృతి మరెక్కడా లేదని, మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. బాల గణేష్ మండలి కమిటీ వారు బతుకమ్మ ఆడుటకు చాలా చక్కని ఏర్పాట్లు చేశారు.

 

అందుకు మహిళందరి తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

ప్రారంభమైన బతుకమ్మ..

ప్రారంభమైన బతుకమ్మ

అంబరాన్ని అంటిన సంబరాలు

నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

ఆదివారం (పితృ అమావాస్య )బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. ప్రతి గ్రామంలో వేద బ్రాహ్మణులకు తమ పితృదేవతల జ్ఞాపకార్థం బియ్యం తదితర వాస్తు సామాగ్రిని అప్పజెప్పి బ్రాహ్మణుల ఆశీర్వాదం పొందిన పలు వర్గాల ప్రజలు, ఇదిలా ఉండగా మహిళలు తంగేడు పువ్వు, గునుగు పువ్వు, తిరోక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం గ్రామ లలో నీ చెరువుగట్టులు, దేవాలయ ప్రాంగణాలలో, బతుకమ్మ ఆటపాటలతో అంగరంగ వైభవంగా నిర్వహించి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మెజారిటీ గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుడి, పదవులు ఆశిస్తున్న చోట నేతలు వారి శక్తి కొద్ది కొందరు డి జే లు, మరికొందరు కోలాటాలకు కోలలు , సమకూరు ఇస్తే, ఇంకొందరు మహిళలకు ఏక దుస్తులు అందించారు. దీంతో గ్రామాలలోని మహిళలు, చిన్నలు, పెద్దలు, అందరూ బతుకమ్మ సంబరాలను సంబరాన్ని అంటే మాదిరిగా నిర్వహించారు.

బిట్స్ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు…

బిట్స్ పాఠశాలలో ముందస్తుగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ పాటలతో ప్రత్యేక నృత్యాలతో ఆకట్టుకున్న విద్యార్థులు

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని బిట్స్ పాఠశాలలోని ప్రిన్సిపల్ యుగేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ బతుకమ్మ వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో పేర్చినటువంటి బతుకమ్మలను తీసుకొచ్చారు.తొమ్మిది రోజులకు అనుగుణంగా 9మంది అమ్మవార్లను తయారు చేసి పిల్లలందరూ బతుకమ్మల చుట్టు తిరుగుతూ పాటలు పాడుతూ కోలలతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.ఈ సందర్బంగా పాఠశాల చైర్మన్ రాజేంద్రప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ ఇది పూల జాతర సెప్టెంబర్ నెలలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకోక తీరున రోజుకొక పేరుతో బతుకమ్మను పూలతో పేరుస్తూ ఆడపడుచులందరూ ఆనందంగా జరుపుకునే పండుగఅని అన్నారు.ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగనీ పువ్వులనే దేవుడిగా కొలవడం తమ బతుకులను,కష్టాలను పాటలుగా పాడుకోవడం ఒక తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే బతుకమ్మకు తెలంగాణలో ఎక్కడ గుడి

 

 

కనిపించదని,బతుకమ్మ పేర్చటంలో వాడే ఆకులు,పూలు మంచి ఔషధాలు వీటిని చెరువులో కలపడం వల్ల నీటి శుద్ధి జరుగుతుంది అందుకే బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ అయిందని తెలియజేశారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ యుగేందర్ మాట్లాడుతూ తెలంగాణ పడుచు బోనమెత్తితే దుర్గమ్మ పరవశిస్తుందనీ తెలంగాణ పడుచు బతుకమ్మ ఆడితే ప్రకృతి పులకరిస్తుందని హిందూ ముస్లింల ఆలైబలైలు తెలంగాణతో మమేకం మనకంటూ ప్రత్యేక విశిష్టత ఉందని మనకంటు ప్రత్యేక సంస్కృతి మన సంస్కృతిలోని పండుగలా వైభవం ఎంతో గొప్పదని అలాగే దసరా పండుగ రోజు జరిపే రావణాసురుని వధ ప్రత్యేకతను తెలియజేసి చెడుపై మంచి విజయం సాధించిన తీరును తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

బాలాజీ విద్యాసంస్థల్లో– బతుకమ్మ సంబరాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T140551.291.wav?_=3

 

బాలాజీ విద్యాసంస్థల్లో– బతుకమ్మ సంబరాలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

బాలాజీ విద్యాసంస్థల్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుపుకున్నారు.నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథులుగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి,ట్రెజరర్ డాక్టర్ ఎ .వనజ ప్రిన్సిపల్ పి. రాజేంద్ర ప్రసాద్ హాజరైనారు. డాక్టర్ ఎ. వనజ విద్యార్థులతో కలిసి ఆటపాటలతో పాలుపంచుకొని బతకమ్మ పండుగ నేపథ్యాన్ని వివరించారు.తెలంగాణలో బతుకమ్మ పండుగ వెయ్యి ఏండ్ల నాటిదని బతుకమ్మ పండుగ తెలంగాణ యొక్క సంస్కృతి ,సాంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతిని, పుడమితల్లని స్థానికంగా దొరికే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో అలంకరించి గౌరీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే స్త్రీల పండుగ…ఈ పండుగ భాద్రపద మాసంలో పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజులపాటు తీరొక్కపూలతో బతకమ్మను అలంకరించి ఆటపాటలతో ఆడుకుంటారని తెలిపారు.చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు పూల బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారని చెప్పారు. నేడు బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ అస్తిత్వానికి,సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. స్త్రీల ఐక్యతను సామాజిక కలయికను ప్రోత్సహిస్తుందని పంటలు బాగా పండాలని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తెలుగువారు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ప్రవాసభారతీయులు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కంప్యూటర్ ఆపరేటర్ మృతికి సంతాపం తెలిపిన ఎంపీడీఓ ఆపీస్ సిబ్బంది…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T121029.177.wav?_=4

 

కంప్యూటర్ ఆపరేటర్ మృతికి సంతాపం తెలిపిన ఎంపీడీఓ ఆపీస్ సిబ్బంది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

కీర్తిశేషులు ఏలేటి సోమిరెడ్డి తుంగతుర్తి మండలం కంప్యూటర్ ఆపరేటర్ మరణించటం తో అయన చిత్రపటానికి సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఎంపీడీవో మంజుల, కార్యాలయంలో ఎంపీడీవో జూనియర్ అసి స్టెంట్ శాస్త్రము, పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ సిబ్బంది పూలమాల వేసి నివాళుఅర్పించి మౌనంపాటించి సంతాపం తెలిప్యారు.

ముందస్తుగా గ్రీన్ వుడ్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T141934.802.wav?_=5

 

ముందస్తుగా గ్రీన్ వుడ్ హైస్కూల్లో బతుకమ్మ వేడుకలు

మహాదేవపూర్ సెప్టెంబర్ 15 (నేటి ధాత్రి)

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రీన్ వుడ్ హైస్కూల్లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ ముందస్తు వేడుకలలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి రంగురంగుల తీరోక్క పూలతో బతుకమ్మలను పేర్చి ముత్యాల ముగ్గులు రంగవల్లులతో ప్రాంగణాన్ని తీర్చిదిద్ది దానిలో బతుకమ్మను నెలకొల్పి కోలాటాలతో, బతుకమ్మ పాటలతో, నృత్యాలు చేస్తూ ఘనంగా గ్రీన్ వుడ్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో జరుపుకున్నారు తదనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మలోని రంగురంగుల పూలు మన జీవితం రంగుల మయంగా ఉండాలని, అందరితో కలిసి ఆడడం అంటే జీవితాంతం అందరితో కలిసి మెలిసి సుఖసంతోషాలతో ఎలా జీవించాలో నేర్పే పండుగనే బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాపు, పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ డైరెక్టర్ ఆకుతోట రాజకుమార్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై పవన్ కుమార్, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కటకం అశోక్, మండల ప్రచార కమిటీ అధ్యక్షుడు కడార నాగరాజు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాపకేతర బృందం పాల్గొన్నారు.

మంత్రి గడ్డం వివేక్ మృత కుటుంబాలను పరామర్శించారు….

పలు కుటుంబాలను పరామర్శించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి పుల్లూరి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను శనివారం చెన్నూర్ ఎమ్మెల్యే,రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి సానుభూతి తెలిపారు. అమ్మ గార్డెన్ ఏరియాలో నివాసముండే ఐఎన్టీయూసీ నాయకులు చందుపట్ల సంజీవరెడ్డి తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని సైతం మంత్రి వివేక్ పరామర్శించారు. సంజీవరెడ్డి తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉండే నవీన్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నవీన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, గోపతి భానేష్,బత్తుల వేణు, కుర్మ సురేందర్, పల్లె దినేష్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి…

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి

మరిపెడ నేటిధాత్రి

 

 

తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర విశేషమైనదని, ఆమె మహిళా చైతన్యం, శక్తికి ప్రతీక అని మరి పెడ ఎంపిడిఓ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ 40వ వర్థంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపిడిఓ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపారని ఈ సందర్భంగా అన్నారు. ఆమె ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ఎంపీఓ సోములాల్ నాయక్,ఏపీఓ భీమా నాయక్, పంచాయతీ కార్యదర్శి లెనిన్, టెక్నికల్ అసిస్టెంట్ నెహ్రూ, ధర్మయ్య ఎల్లమ్మ, జూనియర్ అసిస్టెంట్ సౌజన్య పంచాయతీ కార్యదర్శిలు లతా,ప్రియదర్శిని,సరిత, విజయ కుమారి,నజియా తదితరులు పాల్గొన్నారు.

ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-09T142657.332.wav?_=6

 

ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )న్యూస్

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజా కవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్  హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కాళోజీ చిత్ర పటానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్ డీవైఎస్ఓ రామ్ దాస్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత కలెక్టరేట్ ఏవో రామిరెడ్డి, అన్సర్ ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ లో శాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-08T124815.290-1.wav?_=7

 

జహీరాబాద్ లో శాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జనం

◆:- మీ సేవలకు శతకోటి దండాలు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది గత 11 రోజులుగా నిత్యం పూజలు అందుకున్న వినాయకుని శనివారం రాత్రి ఘనంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ప్రజలు భక్తులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ మున్సిపల్ పంచాయతీరాజ్ వివిధ శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.రాత్రి నిమజ్జనోత్సవంలో అంబరాన్ని అంటిన సంబరాలు మిగిల్చిన గుర్తులు. పట్టణ వీధుల గుండా గణపయ్యలను ఊరేగిస్తూ భక్తులు చల్లిన పూలు. నిమజ్జనం అనంతరం ఇళ్లకు వెళ్లిన యువత కునుకుతీసింది. సుఖమెరుగని ఈ కష్టజీవులు రాత్రనకా.. పగలనకా.. చెమటోడ్చి చెత్తను అంతా ఎత్తిపోశారు. పారిశుద్ధ్య కార్మికులూ మీ సేవలకు శతకోటి దండాలు!

వద్దిరాజు కుటుంబం ప్రత్యేక గణేశ్ పూజ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-61.wav?_=8

ఎంపీ వద్దిరాజు ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు
Date 05/09/2025

నేటిధాత్రి:

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసం వద్ద వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు గణనాథుడిని ప్రతిష్ఠించి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.నిమజ్జనానికి బయలుదేరడానికి ముందు వినాయకుడికి శుక్రవారం విజయలక్ష్మీ, నిఖిల్ చంద్రలు పూలమాల వేసి,హారతినిచ్చి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.

Vigneshwara

ఈ సందర్భంగా గంగాభవాని తన కుమారులు సౌరవ్,సనవ్ లతో కలిసి గణనాథుడికి కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

 

Vigneshwara

వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు ముడ్డంగుల కృష్ణ,గగులోతు నవీన్ నాయక్,యరగాని పృథ్వీ గౌడ్,ముకుంద అనిల్ పటేల్,అనంతుల శ్రీనివాస్ గౌడ్, మల్యాల శేఖర్, నాగిరెడ్డి, ముకరా దుర్గాప్రసాద్, దండు రాజు ధూదిగామ సాత్విక్,జ్యోతి, సంతోష్ తదితరులు విజయలక్ష్మీ, గంగాభవాని, నిఖిల్ చంద్ర, స్థానిక ప్రముఖులను శాలువాలతో సత్కరించి వినాయకుడి చిత్రపటాలను బహుకరించారు.

Vigneshwara

వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు అందజేసిన విఘ్నేశ్వరుడి లడ్డూ ప్రసాదాన్ని నిఖిల్ చంద్ర భక్తిప్రపత్తులతో స్వీకరించి తలపై పెట్టుకుని తన నివాసంలోకి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు”జై గణేశ జైజై గణేశ” అంటూ నినాదాలు చేశారు.

బిట్స్ పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-1-2.wav?_=9

బిట్స్ పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం

హాజరైన బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్.రాజేంద్రప్రసాద్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగేందర్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిట్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్.సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేశారు.ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జీవిత సూత్రాలను అనుసరించినటువంటి పద్ధతులను అలాగే ఉత్తమ ఉపాధ్యాయులకు ఉండవలసినటువంటి లక్షణాలను తెలియజేశారు. తరువాత విద్యార్థులు వివిధ నృత్యాలతో,పాటలతో,ఉపన్యాసాలతో చూపర్లను అలరించారు.తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులను పుష్ప మాలా అలంకృతులతో సన్మానం చేశారు.తదానంతరం బిట్స్ పాఠశాల ప్రిన్సిపల్ యుగేందర్ గారు మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఉపాధ్యాయుల ఆవశ్యకతను మరియు విద్యార్థిదశ నుండి పెంపొందించుకోవాల్సినటువంటి లక్షణాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

https://netidhatri.com/wp-content/uploads/2025/09/teacher.wav?_=10

ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ (నేటి ధాత్రి)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రం లోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి లో బాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల లో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను పూల మాలలు మరియు శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు. భారత దేశపు రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మొత్తంలో ఉపాధ్యాయుడిగా చేసిన సేవలే అత్యంత తృప్తినిచ్చాయని తన జీవిత చరిత్రలో రాసుకున్న సందర్భాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన రోజని ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి కవితలు, పాటలు వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజయ్య, దేవేందర్ రెడ్డి, రమేష్, లచ్చయ్య, అనిల్ కుమార్, సమ్మయ్య,షాజహా, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో అంగరంగ వైభవంగా గణేశ్ వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-95.wav?_=11

భక్తిశ్రద్ధలతో కొలువుతీరిన బొజ్జ గణపయ్య

బాబు క్యాంప్ సంఘమిత్ర ఆధ్వర్యంలో.కొలువుదీరిన బొజ్జ గణపయ్య.

 

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో వినాయకచవితి వేడుకలు జరిగాయి గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.

పూజారి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రసాదాలు తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లతో పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర యూత్ క్లబ్ కమిటీ సభ్యులు బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version