సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి…

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారం ఇవ్వాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన “సమాచార హక్కు చట్టం 2005” వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలని సూచించారు. అలాగే స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని పౌరులకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని, స్వచ్ఛందంగా ఇవ్వవలసిన సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తారని, పనితీరులో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎస్డిసి రమేష్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సమాచార హక్కు చట్ట నిబంధనలను పాటించని ఎంఆర్ఓ…

సమాచార హక్కు చట్ట నిబంధనలను పాటించని ఎంఆర్ఓ

దరఖాస్తు ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా వీడని నిర్లక్ష్య వైఖరి

◆:- ఎంఐఎం పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు షేక్ రబ్బాని

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ సమాచార హక్కు చట్టం 2005 నిబంధనలను పాటించకుండా తన నిర్లక్ష్య వైఖరిని వ్యక్తపరుస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు తమ పనులకు జవాబుదారీగా ఉండాలని నిర్దేశించడం, పనుల పారదర్శకత కోసం ప్రజాస్వామ్య ప్రక్రియను మెరుగుపరచడం పౌరుడికి కావాల్సినటువంటి సమాచారం పొందుటకు సమాచారకు చట్టాన్ని అమలులోకి తెచ్చి సంబంధిత అధికారి ప్రజల కోరిన సమాచారాన్ని ఇవ్వాలన్న ఆదేశాలు సంబంధిత అధికారులు కలిగి ఉన్నప్పటికీ సంబంధిత సమాచారం కలిగి ఉండి సమాచారం ఇవ్వకుండా నాలుగు నెలలుగా నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల తాసిల్దార్ తిరుమలరావు మండల పరిధిలోని వ్యవసాయ, వ్యవసాయతర భూముల వివరాల సమాచారం కోరగా ఇప్పటివరకు దాదాపు నాలుగు నెలలు గడుస్తున్న సమాచారం ఇవ్వలేదని ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని అన్నారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జూలై 11.2025 రోజున ఎంఆర్ఓ ను సమాచారం కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన ప్రతిఫలం లేకుండా పోయిందని వాపోయారు.అధికారుల నిర్లక్ష్యంతో భూముల వివరాల అడిగిన బ్యాంకులో నువ్వు ఉన్నవారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అనుమానంతో రైతుల వద్ద డబ్బులు వసూలు చేసి దోచుకుంటున్నారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని,అధికారుల అండ చూసుకోనీ భూములు రిజిస్ట్రేషన్లు చేస్తున్నా
వ్యాపారం చేస్తున్నారని అన్నారు.ఇప్పటివరకు దాదాపు నాలుగు నెలలు కావస్తున్న సమాచారం ఇవ్వలేదని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లిన అందుబాటులో ఉంటూ ఏ సమాధానం ఇవ్వలేదన్నారు ఆర్డిఓ అధికారి కార్యాలయం,పౌర సమాచార అధికారి అప్పిలేటుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version