సిరిసిల్లలోని అంబేద్కర్ కి వినతి పత్రం..

సిరిసిల్లలోని అంబేద్కర్ కి వినతి పత్రం

బి.ఆర్.యస్.వి కంచర్లరవి గౌడ్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బిఆర్ఎస్వి కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం విద్యార్థుల సమక్షంలో అందజేయడం జరిగినది. విషయం రాష్ట్రంలోని గురుకుల రోజుకో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ హై విద్యార్థులు హాస్పిటల్ పాలవడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నుండి దాదాపు 95 మంది విద్యార్థులు చనిపోవడం జరిగినది.అలాగైనా ఈ ముఖ్యమంత్రి విద్యార్థుల సమస్యలపై మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరమని తెలియజేస్తున్నాం తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నాయకత్వంలో గురుకుల వ్యవస్థ ఎంత ప్రతిష్టంగా ఉన్నదో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణంగా తయారైందని విద్యార్థి తల్లిదండ్రులు గురుకులాలకు పంపియాలంటేనే భయపడే పరిస్థితి తీసుకు వచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల గోస కనిపియ్యకపోవడం చాలా బాధాకరం తరగతి గదిలో చదువుకునే విద్యార్థులు నడిరోడ్డు మీదికి రావడం మా సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కోరుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడతలేదా అని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా గురుకుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రి పడుకున్నప్పుడు కలలోకి పోయి ఇటు బోధన చేయాలని అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు వడ్లూరి సాయికిరణ్, ముధం అనిల్ గౌడ్, ఎస్.కె అప్రోచ్, హరీష్,జోయల్, శివ రాకేష్, కృష్ణ, వంశీ,రోహిత్,విష్ణు తదితరులు పాల్గొన్నారు

జాతీయ కవి సమ్మేళనంలో సిరిసిల్ల కవులకు సత్కారం..

జాతీయ కవి సమ్మేళనంలో సిరిసిల్ల కవులకు సత్కారం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T120808.812.wav?_=1

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ,తెలంగాణ పోలీస్ శాఖ, మరియు జ్యోతి జాతీయ తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో పోలీసులు_ సామాజిక బాధ్యత అనే అంశం పై కవి సమ్మేళనం హైదరాబాద్ లో జరిగినందున ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షులు రాంప్రసాద్ కేశి రాజు, ముఖ్య అతిథి ఐపీఎస్ ,ఎం రమేష్ డి.ఐ.జి ,వెంకట సాయి నాంపల్లి సీ.ఈ.ఓ జ్యోతి, విశ్వనాథ రాజు అధ్యక్షులు తెలంగాణ సారస్వత పరిషత్ తెలంగాణ శాఖ. తెలంగాణ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కవులు, రచయితలు డాక్టర్ జనపాల శంకరయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు,సర్వజన సంరక్షకుడు రక్షక భటుడు అనే అంశంపై తన కవితను ధారాళంగా ఆలాపించారు. బాలసాహితీవేత్త డాక్టర్ .వాసర వేణి పరుశురాం రక్షకభటులు కవిత చదివారు. సిరిసిల్ల సాహితీ సమితి కార్యదర్శి ముడారి సాయి మహేశ్ ,రక్షణ విలువ అనే అంశంపై తన కవితను విన్నవించారు. తర్వాత ముఖ్య అతిథులు ఘనంగా కవులను సత్కరించారు.

చట్టాలపై అవగాహన సదస్సు

చట్టాలపై అవగాహన సదస్సు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని 19వ వార్డులోని పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్, గోపాల్ నగర్ లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జ్ కం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ పాల్గొని చట్టాలపై అవగాహన కల్పించారు.

గృహహింస మరియు మహిళలు ఎదుర్కొంటున్న అనేక చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు,జూపల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు, శ్రీ.గుర్రం ఆంజనేయులు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్,ఈ.జ్యోతి, అడ్వకేట్లు,గెంట్యాల భూమేష్, తిరుపతి, అనుష, అరుణ, అలేఖ్య మరియు 19వ వార్డు మాజీ కౌన్సిలర్,అన్నారం శ్రీనివాస్, జి.జ్యోతి, డి.అనుష, టి.కావ్య, వి.సునీత మరియు వార్డు మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు 19వ వార్డు మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ మరియు మహిళలను జడ్జి రాధిక జైస్వాల్ అభినందించారు.

ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ.

సిరిసిల్ల జిల్లాలో ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ

*ప్రజావాణికి 157 ఆర్జీలు రాక *

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి.. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 157 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 45, హౌసింగ్ శాఖకు 33, డీఆర్డీఓకు 15, జిల్లా విద్యాధికారి 11, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 10, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు 8, జిల్లా వ్యవసాయ అధికారి,జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి నాలుగు చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి, ఏడీ ఎస్ఎల్ఆర్, జిల్లా పౌర సరఫరాల అధికారికి మూడు చొప్పున, ఫిషరీస్, జిల్లా సంక్షేమ అధికారి, ఈఈ నీటి పారుదల శాఖ, ఈఓ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రెండు చొప్పున, ఎల్ డీ ఎం, ఈఈ పీఆర్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఏడీ హ్యాండ్ లూమ్స్, మైనార్టీ, ఆర్ టీ సీ, జడ్పీ సీఈవో, ,సెస్, ఈఈ ఆర్ డబ్ల్యూ ఎస్, ఎస్పీ ఆఫీస్ కు ఒకటి చొప్పున వచ్చాయి.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల సిరిసిల్ల జిల్లా ఫోరమ్.

తెలంగాణ ఉద్యమకారుల సిరిసిల్ల జిల్లా ఫోరమ్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల పోరం జిల్లా కో-ఆర్డినేటర్ వెంగళ శ్రీనివాస్ వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని అన్నారు.సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ ఇండ్లలో రాజీవ్ యువ వికాస పథకంలో 20% శాతం తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని అన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పదివేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గౌరవించి నెలకు 25 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని అన్నారు. ఉద్యమకారులకు ప్రమాద బీమా ఐదు లక్షలు అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ కళాకారుల విభాగం నాయకులు ఎల్ల పోశెట్టి, ఉద్యమకారుల ఫోరం జిల్లా నాయకులు బొజ్జ కనకయ్య, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు వెంగళ వెంకటేశం,బొడ్డు రాములు,సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.

సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

గర్భిణీ మహిళలకు యోగ ఒక వరం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

ఈరోజు మహిళా శిశు దివ్యాంగులు వయవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో ఆడిటోరియంలో గర్భిణీ మహిళలకు బాలింతలకు అంగన్వాడీ టీచర్లకు యోగ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మహిళల ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్య జనని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా మహిళలు గర్భిణీ సమయంలో బాలింత సమయంలో చేయవలసినటువంటి ప్రత్యేక ఆసనాలు ప్రత్యేక ధ్యానం ప్రత్యేక యోగా పద్ధతుల గురించి వివరించడం జరిగింది. ఈ పద్ధతులను ఉపయోగించడం ద్వారా పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలు జరుగుతాయని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం వివరించారు. అలాగే జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ యోగ పద్ధతులు నేర్చుకోవడం ద్వారా సాధారణ ప్రసవాలు జరుగుతాయనిచెప్పారు. మన దేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు సిరిసిల్ల జిల్లా సి సెక్షన్ లలో అత్యధిక శాతంతో ముందున్నాయి.

కాబట్టి యోగ నేర్చుకోవడం ఆసనాలు ధ్యానం ద్వారా మనం సాధారణ ప్రసవాలకు మళ్ళించవచ్చని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం నుండి డాక్టర్ అంజలి,దీప్తి చాలా సాధారణ పద్ధతులతో ఏ విధంగా యోగాను పూర్తి చేయవచ్చు ధ్యానం గురించి కూడా వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా ఒక్కో మెట్టు గురించి వివరించడం జరిగింది. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి వివరించారు. మంచి సంకీర్తన వినడం మంచి చిత్రాలు చూడడం ఆహ్లాదకర వాతావరణము ప్రశాంత వాతావరణము సమయానికి ఆహారం తీసుకోవడం కనీసం 8 గంటల నిద్ర ఇలాంటివి కూడా తప్పనిసరిగా పాటించాలని సూచించారు.. అలాగే ఈ కార్యక్రమానికి డాక్టర్ సురేంద్రబాబు పీడియాట్రిషన్ అతిథిగా హాజరై పిల్లల ఆరోగ్యానికి మంచి చేస్తాయని యోగా ధ్యానం పద్ధతులు వాడుకుని ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని సదస్సుకు హాజరైన అందరు సిబ్బందికి తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో సిడిపివోలు సౌందర్య ఉమారాణి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రోజా సూపర్వైజర్లు పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకిషన్ ఇన్చార్జ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ , చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ పరమేశ్వర్, సఖి కో ఆర్డినేటర్ మమత, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల ప్రజలకు చేతినిండా ఉపాధి.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల ప్రజలకు చేతినిండా ఉపాధి

బతుకమ్మ చీరల బకాయిలు 280 కోట్లు చెల్లించాం

రూ. 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):

shine junior college

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతినిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఉన్న మామిడాల నారాయణ, కొండ సుభాష్ కు మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి ఈ రోజు చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కార్మికులతో మాట్లాడారు. వేముల శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్ తదితర కార్మికులతో ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ మాట్లాడారు. ప్రతి రోజు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని? వారానికి ఎంత ఆదాయం వస్తుందని? అడిగి తెలుసుకున్నారు. చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నాయని ఆరా తీశారు. తమకు ప్రతివారం రూపాయలు 4000 నుంచి 5000 వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికులను ఆదుకునేందుకు చేతినిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళ శక్తి కింద చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించామని తెలిపారు.
కార్మికులు, ఆసాములు కోరిన విధంగా ధర నిర్ణయించామని వెల్లడించారు.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు, ఆసాములకు దాదాపు 8 నెలల పాటు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గతంలోని బతుకమ్మ చీరల బకాయిలు దాదాపు 280 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కల నెరవేరుస్తూ వేములవాడలో రూపాయలు 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అవసరమైన యార్న్ అంతా అక్కడ అందుబాటులో పెడుతున్నామని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖ ఆర్డర్లు సిరిసిల్లకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడేవారు అని ఇప్పుడు చేతినిండా పని ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్డర్లను ఆసాములు, కార్మికులు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. సెస్ పరిధిలోని బ్యాక్ బిల్లింగ్ సమస్య కోర్టు పరిధిలో ఉందని దానిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,
చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్,కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ కేంద్రంలో.

సిరిసిల్ల జిల్లా పోలీస్ పరేడ్ కేంద్రంలో తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుక

వేడుకలో పాల్గొన్న, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని జిల్లా పోలీస్ పరేడ్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వేములవాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పాల్గొని భారత త్రివర్ణ పతాక జెండా ఆవిష్కరించడం జరిగినది. తదనంతరం పోలీస్ పరేడ్ వందన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది,ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ.

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం జరిగినది. అంతేకాకుండా ఎందరో అమరుల త్యాగం వల్ల సిద్ధించిన తెలంగాణ, నేడు ప్రజా పాలన వ్యవస్థగా పురుడుపోసుకున్నదని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి, ప్రభుత్వం ద్వారా, పాలకుల ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే ప్రతిఫలాలు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నామని.
అంతేకాకుండా జిల్లాను విద్యా,వైద్య, ఉపాధి కల్పనలో ముందుండడానికి ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప తిరుపతిరెడ్డి,

రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగినది.

సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి.

సిరిసిల్లలో పిడుగుపాటుకు పశువులు మృతి

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చిన్న బోనాల మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డు మాజీ కౌన్సిలర్ బొల్గాం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, మరియు జిల్లా కలెక్టర్ కి , సంబంధిత జిల్లా పశు వైద్యాధికారులకు విన్నవించడం ఏమనగా, నిన్నటి రోజున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న బోనాల లో నిన్న మమిండ్ల నాగరాజు అనే రైతు యొక్క ఆవు పిడుగుపాటు గురై మరణించడం జరిగినది తెలిపారు. ఆ రైతు యొక్క జీవన ఉపాధి పశువులపైనే ఆధారపడి ఉన్నందున, సుమారు 50 వేల నుండి 80 వేల విలువగల ఆవు మరణించినందునకు, ఆ రైతు రోధిస్తున్నాడు తెలిపారు.కావున వెంటనే ప్రభుత్వం తరఫున రైతుకు నష్ట పరిహారాన్ని చెల్లించి, జీవన ఉపాధిని కల్పించాలని స్థానిక మాజీ కౌన్సిలర్ గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను తెలిపారు.

వ్వవసాయ శాఖ మంత్రిని కలసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ.

వ్వవసాయ శాఖ మంత్రిని కలసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ బృందం

సిరిసిల్ల (నేటి ధాత్రి):

హైదరాబాద్ లోని మినిష్టర్ నివాసంలో వ్వవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరావు ను సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కె కె మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి, వైస్ చైర్మెన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, కమిటీ డైరెక్టర్ లు కలసి పుష్పగుచ్చాము అందజేసి శాలువతో సత్కరించారు.అనంతరం సర్దాపూర్ లో గల వ్వవసాయ్ మార్కెట్ కమిటీ సిసి రోడ్ కాపౌండ్ వాల్ కొరకు నిధులు కొరకు మంత్రి దృష్టి కి తీసుకెళ్లగా, మంత్రి గారు స్పందించి, సిసి రోడ్ కు నిర్మాణానికి 1 కోటి 30 లక్షలు, కాంపౌండ్ వాల్ కోటి రూపాయలు కేటాయించి నిధులు మంజూరు చేశారాని మార్కెట్ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి పేర్కొన్నారు.మంజూరు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావ్ కు సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్స్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

* సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్.!

* సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్*

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

 

ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. మొన్న జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల డి.సి.సి సమావేశంలో ప్రభుత్వ విప్ చీప్ ఆది శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తల ముందు చిటి ఉమేష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దానిపై ఈరోజు కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు సమావేశం నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎప్పుడో ఒకసారి వచ్చే చీటీ ఉమేష్ రావు ఏ నాయకులను గాని ఏ కార్యకర్తలను గాని పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి. సిరిసిల్లలోని కాంగ్రెస్ కార్యకర్తలపై
పార్టీ పరంగా గాని వ్యక్తిగతంగా గాని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సరైనది కాదని అందువల్ల అతనిపై టీ.పి.సీ.సీకి ఫిర్యాదు చేస్తూ చర్యలు తీసుకునే విధంగా చూస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోనీ, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, మరియు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగినది.

అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు. 

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్య నిర్వహణలో లక్ష్మణ్ ప్రింటర్స్ లో 11 గంటలకు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి .అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రచనల్లో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. దేశ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసిన భారతరత్న బాటలో అందరం కలసి నడుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, సహధ్యక్షులు కోడం నారాయణ, ఉపాధ్యక్షులు బూర దేవానందం, ముడారి సాయి మహేష్, గుండెల్ని వంశీ, దొంత దేవదాసు ,సిరిసిల్ల తిరుపతి, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సిరిసిల్ల చేనేత కార్మికులను పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు.  

సిరిసిల్ల చేనేత కార్మికులను పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు.  

సిరిసిల్ల సి.పి.ఎం పట్టణ కార్యదర్శి అన్నదాస్ గణేష్

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులు గత ఎనిమిది రోజులుగా పవర్ లూమ్ ,వార్పిన్ , వైపని కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరెలకు కూలీ నిర్ణహించాలని సమ్మె చేస్తున్న కార్మికులకు సీపీఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ 24 గంటల నేతన్న దీక్షను విరమింప జేస్తూ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి. అనంతరం అన్నదాస్ గణేష్ మాట్లాడుతూ పట్టణంలోని తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లుకు కండ్లు కనిపించడం లేదా కార్మికుల గోడు వినిపించడం లేదా అని ప్రశ్నించారు.

Workers.

మున్సిపల్ ఎన్నికలలో కార్మికుల ఓట్ల కోసం చేతులు చాచే కౌన్సిలర్లు కార్మికుల వేతనాలు ఇతర సమస్యల పై మాట్లాడకుండా యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.

Workers.

పట్టణంలోని పవర్ లూమ్ కార్మికులు బి.ఆర్.ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఇక్కడి కార్మికులు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. పవర్ లూమ్ కార్మికుల కూలీ సమస్యపై స్పందించని తాజా మాజీ కౌన్సిలర్లు వారి పార్టీలపై పట్టణ కార్మిక కుటుంబాలు రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్, బి.ఆర్.ఎస్ పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తుంటే బిజెపి నాయకులు మాత్రం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కార్మికుల సమస్యలపై మాట్లాడకుండా యజమానులకు తొత్తులుగా మారి కార్మికుల సమస్యలపై మౌనం వహిస్తున్న పై మూడు పార్టీలు రాజకీయ చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని కార్మిక వర్గం రాబోయే ఎన్నికల్లో వీరికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, మూషం రమేష్, సూరం పద్మ, సిరిమల్ల సత్యం, నక్క దేవదాస్, బెజుగం సురేష్,ఉడుత రవి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలులకు.!

కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలులకు ఆర్డర్ కాపీలు అందజేసిన సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత నలినీకాంత్. 

* సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )*

 

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత -నలినీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇల్లంతకుంట బోయినిపల్లె తంగళ్ళపల్లి, ముస్తాబాద్ మండల అధ్యక్షురాలకి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సునీత రావు, ఇచ్చిన ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు చేసినవారికి ఈరోజు పదవులు ఇవ్వడం జరిగింది ఇల్లంతకుంట మండల అధ్యక్షురాలుగా జ్యోతి గారిని, బోయిన్ పల్లి మండల అధ్యక్షురాలుగా రాజలక్ష్మి గారిని, తంగళ్ళపల్లి మండల అధ్యక్షురాలుగా హారిక రెడ్డిని, ముస్తాబాద్ మండల అధ్యక్షురాలుగా వనిత బ్లాక్ కాంగ్రెస్ మహిళ ప్రెసిడెంట్ రమాదేవి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా సామల రోజా, జిల్లా సెక్రెటరిగా సరితరెడ్డి,

 

Congress President.

జిల్లాకాంగ్రెస్ కార్యలయంలోఈరోజు ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం సభ్యత్వ నమోదులో లక్షకు పైచిలుకు సభ్యత్వాలు చేసి ముందంజలో ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు మహిళలందరూ కూడా ముందుండి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మహిళ సాధికారత కోసం కృషి మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే క్రమంలో మహిళలకు అందరికీ సమైక్య సంఘాల నుండి బస్సులు కొనుగోలు చేసి మహిళలకు పెద్ద పీట వేయడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహ జ్యోతి 200 యూనిట్ల కరెంటు ఉచితం ఆరోగ్యశ్రీ , నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమంలోamc చైర్మన్ వెలుముల స్వరూప జిల్లా మహిళ కాంగ్రెస్ సినియర్ నాయకరాలు మడుపు శ్రీదేవి, మరియు జిల్లా మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, సుధా, ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి బోయినిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమణారెడ్డి తంగళ్ళపల్లె మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్( టోని) మరియు సిరిసిల్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి.

సిరిసిల్ల జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

మరియు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను సిరిసిల్ల జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.

Celebrations.

 

ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్.బి.గితే చిత్రపటానికి పూలమాలలు వేసి సమర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎస్సీ అభివృద్ధి అధికారి రాజ మనోహర్ రావు, ఆయా శాఖల అధికారులు, అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణం 9వ వార్డు (సర్ధాపూర్, జెగ్గరావుపల్లె) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి గారు గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ గారు.

 

Ration shop.

బాలకీస్టాయ్య, యాదయ్యా,రాజనర్సు,కనకయ్య,రాములు,ఉపేందర్, షాధుల్, అంజయ్య, తిరుపతి, మోఫిక్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు..

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్..

సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సంగీతం శ్రీనివాస్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ
నేడు బిజెపి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆహార భద్రత చట్టంను (ఫుడ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా)ను
తీసేయడానికి ప్రయత్నించింది కేంద్ర బిజెపి ప్రభుత్వం, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి పన్నును కేంద్ర ప్రభుత్వం అనుభవిస్తుంది. నేడు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన అటువంటి నిధులు కేవలం 100 రూపాయలలో కేవలం 42 రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది.అంతేతప్ప వేరే రాష్ట్రాల్లో బీహార్ గాని, ఉత్తరప్రదేశ్ కాని రాష్ట్రాలలో పది రూపాయలకు 8 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారు. మన తెలంగాణ ప్రభుత్వం పై వివక్షత చూపుతో చూస్తున్నారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఆహార భద్రత చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పేదలందరికీ ఉచితంగా సరఫరా చేస్తుంది.అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర దేవరాజు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెలుముల తిరుపతిరెడ్డి స్వరూప, సిరిసిల్ల మహిళా పట్టణ అధ్యక్షురాలు కామూరి వనిత నలినీకాంత్, మ్యాన ప్రసాద్, గోలి వెంకటరమణ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా.

ఉమ్మడి కరీంనగర్ లో బిజెపి సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ధర్నా

 

సిరిసిల్ల 🙁 నేటి ధాత్రి )

 

బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి నేడు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ఉమ్మడి కరీంనగర్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొనడం జరిగింది.
₹2 లక్షల రుణమాఫీ హామీ అమలు చేయాలని, రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, వ్యవసాయ కూలీలకు ₹12,000 అందించాలని, పంటల బీమా యోజన అమలు చేయాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ బిజెపి జిల్లా కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు

వేసవికాలం దృష్ట్యా కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!

సిరిసిల్ల పట్టణ మున్సిపల్ వేసవికాలం దృష్ట్యా కంట్రోల్ రూమ్ ఏర్పాటు

సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తాగునీరు సమస్య లేకుండా అందించడం కోసం

ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు

సిరిసిల్ల టౌన్:( నేటిదాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని ప్రజలందరికీ వచ్చే వేసవికాలం దృష్ట్యా, తాగునీరు సరఫరా కోసం సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ గదిని ఏర్పాటు చేయడం జరిగినది. సిరిసిల్ల పట్టణ ప్రజలకు తాగునీరు సమస్య రాకుండా వార్డుల వాయిసుగా ఎలాంటి సమస్య లేకుండా ఉండడం కోసం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ 7893593330 సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు.

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న.!

సిరిసిల్ల బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

సిరిసిల్లబిజెపి బిజెపి కార్యకర్తల్లో జోష్

సిరిసిల్ల టౌన్:( నేటిదాత్రి )

సిరిసిల్ల కి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ * తేదీ:16-03-2025 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా * విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా నేడు సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు శ్రీ నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీ రెడ్డబోయిన గోపి మరియు స్టేట్ కౌన్సిల్ మెంబర్ శ్రీ రాంప్రసాద్, పార్లమెంటు కో- కన్వీనర్ శ్రీ ఆడెపు రవీందర్, మరియు జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి భాస్కర్, జిల్లా అధికార ప్రతినిధి నవీన్ యాదవ్, మరియు రాజాసింగ్ మరియు సిరిసిల్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షుడు వంగ అనిల్, మరియు సిరిసిల్ల ఓ బి సి టౌన్ అధ్యక్షుడు శ్రీ అంకారపు రాజు, సిరిసిల్ల ఎస్టి టౌన్ అధ్యక్షుడు మొగిలి రాజు మరియు సిరిసిల్ల టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీ వైశాలి మరియు బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version