రాజ్‌పల్లి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మల్లాపూర్ నవంబర్ 3 నేటి దాత్రి

 

కొత్త ధాం రాజ్ పల్లి గ్రామంలో పాక్స్ ఆద్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పుస్పలత నర్సయ్య,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణ రావు లు కలిసి ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి,పాక్స్ సీఈవో భూమేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దం రాధ సుధాకర్ రెడ్డి ,పాక్స్ డైరెక్టర్ నారాయణ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం. నర్స రెడ్డి, నిగ రవి,ఏలేటి లింగా రెడ్డి,ఉత్కం.హన్మంతు,రోండ్ల.రాజ రెడ్డి, పతకాల.కిరణ్,సురేష్,ఎల్లా రెడ్డి,నత్తి రాం తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుని నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే…

ఉపాధ్యాయుని నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలోని జంగిడిపురం లో ఉపాధ్యాయులు నిరంజన్ గౌడ్ నూతన గృహప్రవేశం సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన సత్యనారాయణ స్వామి వారి తీర్థప్రసాదాలను స్వీకరించారు
ఎమ్మెల్యే వెంట వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు జయసుధ మధుసూదన్ గౌడ్ బ్రహ్మాoచారి.తదితరులు ఉన్నారు

మెదక్ ఎంపీ సహకారం తో.. కొనుగోలు కేంద్రం ప్రారంభం…

మెదక్ ఎంపీ సహకారం తో.. కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంపేట: నేటి ధాత్రి

 

ఎంపీ రఘునందన్ రావు సహకారంతో కొత్త ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామంలో ఇప్పటికే ఐకెపి కొనుగోలు కేంద్రం ఉండగా రైతులకు ఇబ్బందులు కలగకూడదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సొసైటీ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్మనమైన శ్రీనివాస్, దుర్గ రెడ్డి, రాజు, అంజయ్య, తదితరులు ఉన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి

చౌటుప్పల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చౌటుప్పల ఆధ్వర్యంలోఏర్పాటుచేసినటువంటి నక్కలగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను సంఘ పి ఐ సి చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాలు వస్తున్నందున రైతులు తమ ధాన్యరాశులపై టార్పాలిన్లు కప్పుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఆధార్ కార్డులకు తమ పాన్ నెంబర్లకు లింక్ చేయించుకోవాలని తెలిపారు .కొనుగోలు ప్రారంభం అయినందున రైతులు తమ ధాన్యాన్ని ఎండబెట్టుకోవాలని తాలు పట్టుకోవాలని సూచించారు. అధికారులు సూచించిన పరిమితులు లోబడి ఉంటే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, సంఘం డైరెక్టర్ కృష్ణ, ఏఈఓ సౌమ్య, రైతులు జంగయ్య, వై బుచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి ,శ్రీశైలం ,కార్యదర్శి వై రమేష్ ,సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version