మొగిలిపేట్ గ్రామంలో పుష్కర ఘాట్ పరిశీలన…

మొగిలిపేట్ గ్రామంలో పుష్కర ఘాట్ పరిశీలన
మల్లాపూర్ మార్చి 4 నేటి ధాత్రి

మొగిలిపేట గ్రామంలో గోదావరి పుష్కరాలలో భాగంగా మొగిలిపేట తీరంలో పుష్కర ఘాట్ పరిశీలన నిమిత్తం పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి రాములు మల్లాపూర్ మండల సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ మొగిలిపేట గ్రామ సర్పంచ్ గోల్కొండ కళా రమేష్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. మొగిలిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి సౌజన్య , వార్డు సభ్యులు తిప్పని మునీందర్ గ్రామ ప్రజలు దరిపెల్లి అశోక్. మాసుల బుచ్చి రెడ్డి. నైనేని రాజేందర్ పాల్గొనడం జరిగింది

ఎమ్మెల్యే మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు…

ఎమ్మెల్యే మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని బడంపేట గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో స్థానిక శాసనసభ్యులు కె.మానిక్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ రాజ, జహీరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కోహీర్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోవూరి నర్సింలు పాల్గొన్నారు.

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్

వనపర్తి నేటిధాత్రి

 

వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ సోమవారం నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ మాధవి రమేష్ ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చు రాం మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ ను శాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత మార్కెట్ యార్డులో ఆర్యవైశ్య సంఘానికి చెందిన ఖాళీ స్థలం ఉన్నదని స్థలంలో నిర్మాణం చేయుటకు ప్రభుత్వంచే నిధులు ఇప్పించుటకు కృషి చేయాలని నూతన చైర్మన్ మాధవి రమేష్ దృష్టికి తెచ్చారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయంగా ధైర్యంగా ఏ ఎన్నికలు వచ్చినా పోటీలోఉండాలని పిలుపునిచ్చారు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనందుకు మాధవి రమేష్ ని అభినందించారు . వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా ఆర్యవైశ్యు మహిళ మాధవి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు జిల్లా ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పూరి బాలరాజు అధ్యక్షులు ఇటుకూరు బుచ్చయ్య శెట్టి మారం బాలేశ్వర శెట్టి సంబు వెంకటేశ్వర్లు ఏపూరి శ్రీనివాసులు కోట్రరామకృష్ణ చవ్వపండరయ్య తాడిపర్తి శేషయ్య కటకం సుధాకర్ నరహరి నరేష్ శ్రీరాములు కె బి శ్రీనివాసులు పూరి పాండు కండే జ్యోతిబాబు మహిళా సంఘం మాజీ అధ్యక్షురాలు శ్రీమతి కలకొండ భాగ్యలక్ష్మి పట్టణ ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో 31వ వార్షికోత్సవం

మెట్ పల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో 31 వార్షికోత్సవ వేడుకలు
మెట్ పల్లి ఫిబ్రవరి 3 నేటి ధాత్రి

 

మెట్ పల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 31 వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నిత్య హోమం బలిహరణం అనంతరం స్వామివారి నీ ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది అనంతరం స్వామి వాళ్లకు ఓడి బియ్యం కార్యక్రమం తీర్థ ప్రసాదం అన్న ప్రసాదం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పర్మినర్సయ్య గంగపుత్ర సంఘ అధ్యక్షులు ఆర్మూర్ నరేందర్ ప్రోహర్ హేమ చందర్ నాగయ్య రాజేందర్ సురేష్ గంగాధర్ ఆర్మూర్ పోచయ్య తోపారపు నాగయ్య పురుషోత్తం తోపారం రాజేందర్. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

దేవుడు మల్లన్న సేవలో ఎమ్మెల్యే మల్లన్న…

దేవుడు మల్లన్న సేవలో ఎమ్మెల్యే మల్లన్న

* అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో మల్లికార్జున స్వామి కళ్యాణాలు
* స్వామివారి దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :

దేవుడు మల్లన్న సేవలో మాజీ మంత్రి మల్లన్న ముక్కులను నెరవేర్చుకున్నాడు. అలియాబాద్ మూడు చింతలపల్లి మున్సిపాలిటీల పరిధిలోని లాల్ గడి మలక్పేట్, జగన్ గూడా, ఉద్దమర్రిలో మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా సోమవారం స్వామివారి కల్యాణ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కల్యాణోత్సవ లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆయా ఆలయాల్లో మొక్కులు నెరవేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు భద్రారెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచులు విష్ణువర్ధన్ రెడ్డి అనురాధ రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు నవీన్ కుమార్, అనిల్ రెడ్డి, సంజీవ, టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.

మండపల్లి సమ్మక్క సారలమ్మ జాతరకు మాజీ జెడ్పిటిసి కుటుంబానికి ఆహ్వానం

మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానించిన ఆలయ కమిటీ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని మాజీ జెడ్పిటిసి పూర్మాని మంజుల రామలింగారెడ్డి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవానికి మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాద స్వీకరించి అమ్మ వార్లను దర్శించుకోవాల్సిందిగా సమ్మక్క సారలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ .కడారిరామ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆహ్వానించారు. ఇ o దుకుగాను మాజీ జెడ్పిటిసి మంజుల లింగారెడ్డి తప్పకుండా కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటామని. అది మా అదృష్టంగా భావించి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతామని తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచి ఉపసర్పంచ్ వార్డ్ మెంబర్లను. పాలకవర్గాన్ని అలాగే ఆలయ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ .కడారి రామ్ రెడ్డి. స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్. జిల్లా .కాంగ్రెస్ ఫిషరీఫ్.ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. మాజీ జెడ్పిటిసి పూర్మాని .మంజుల లింగారెడ్డి. తదితరులు పాల్గొన్నారు

అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర వర్కింగ్….

అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా తాళ్లపల్లి రమేష్ గౌడ్ నియామకం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏబి జెపిఎఫ్) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ తాళ్లపల్లి రమేష్ గౌడ్ నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
గత కొన్నేళ్లుగా జర్నలిజం రంగంలో రమేష్ గౌడ్ అందిస్తున్న సేవలను, జర్నలిస్టుల సమస్యలపై ఆయనకున్న అవగాహనను గుర్తించి రాష్ట్ర కమిటీ ఈ బాధ్యతలను అప్పగించిందన్నారు.జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం,వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా రమేష్ గౌడ్ పేర్కొన్నారు.తన నియామకానికి సహకరించిన జాతీయ,రాష్ట్ర కమిటీ సభ్యులు,మీడియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకాడమీ చైర్మన్,ఇసంపెల్లి వేణు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బింగి సుధాకర్,అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొడక్షన్స్ ఫోర్స్ రాష్ట్ర చైర్మన్ చుంచు కుమార్,తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పర్కాల సమ్మయ్య గౌడ్,తోటి జర్నలిస్ట్ మిత్రులకు రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.రమేష్ గౌడ్ నియామకం పట్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

అమావాస్య సందర్భంగా రామేశ్వరుని ఆలయం లో ప్రత్యేక పూజలు…

అమావాస్య సందర్భంగా రామేశ్వరుని ఆలయం లో ప్రత్యేక పూజలు

భక్తులకు అన్న ప్రసాదం చేసిన డప్పుర్ సంగమేష్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు రామేశ్వరుని ఆలయంలో అమావాస్య సందర్భంగా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు పూజారులు టేకుర్ స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సంగమేష్ దంపతులు అన్నప్రసాద ఏర్పాటు చేశారు. పూజలు అనంతరం అతిథులకు ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ సునీతా హన్మంత్ రావు పాటిల్, మాజీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్, గ్రామ అధ్యక్షులు డప్పుర్ సంగమేష్, సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్, యువ నాయకులు ఉదయ్ శంకర్ పాటిల్ ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ వివిధ గ్రామాల సర్పంచ్ లు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు,

2026 సంవత్సరానికి హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ అవార్డును ప్రదానం చేశారు.

2026 సంవత్సరానికి హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ అవార్డును ప్రదానం చేశారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ ఖాద్రీ షహీద్ బాగ్దాదీ 437వ ఉర్స్ షరీఫ్ సందర్భంగా, 2026 సంవత్సరానికి హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ అవార్డు వేడుక జనవరి 3న జహీరాబాద్‌లో ఇషా ప్రార్థనల తర్వాత దర్గా షరీఫ్ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా, తెలంగాణ మరియు దర్గా అసోసియేషన్ చీఫ్ ట్రస్టీ మౌలానా హఫీజ్ సయ్యద్ షాద్ కలీముల్లా హుస్సేని అలియాస్ కాషిఫ్ పాషా, ఆయన ఆదర్శప్రాయమైన సామాజిక, విద్యా, మేధో, మత మరియు సన్యాసుల సేవలకు గుర్తింపుగా మొదటి వార్షిక అవార్డు తిరా బండా నవాజ్ గేసో దార్‌ను ప్రదానం చేశారు. ఈ అవార్డును సజ్జాద్ మరియు నాషిన్ హజ్రత్ సయ్యద్ షా రిజ్వాన్ ఖాద్రీ సాహిబ్ ప్రదానం చేశారు. అవార్డు ప్రదానోత్సవానికి ముందు, గొప్ప సాధువుల సమావేశం జరిగింది, దీనిలో మౌలానా సయ్యద్ షా కాషిఫ్ పాషా బండా నవాజ్ మరియు స్థానిక పండితులు ప్రసంగించారు.
సభకు సజ్జాదా నాషిన్ మామ హఫీజ్ అల్-హజ్ సయ్యద్ షా అఫ్సీర్ పాషా ఖాద్రీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మౌలానా సయ్యద్ మొహిబుద్దీన్ ఖాద్రీ సోదరుడు సజ్జాదే నేషిన్, సయ్యద్ షా ఫర్హాన్ ఖాదేరీ బాగ్దాదీ, సయ్యద్ బ్రదర్ సజ్జాదే నేషిన్, సయ్యద్ బద్రుద్దీన్ ఖాదేరీ, సయ్యద్ ఫరాజ్ ఖాదేరీ, మౌలానా ఖాజీ సయ్యద్ జియావుద్దీన్ ఖతీబ్ ఈద్గా జహీరాబాద్, మౌలానా యూసుఫ్ సూఫీ ఖాద్రీ, గోర్ మియాన్ సికందర్ మరియు ఖాద్రీ కుటుంబం శిష్యులు, విశ్వాసులు మరియు ప్రజలతో సహా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సభ్యులు .

ప్రత్యేక పూజలు

వనపర్తి నేటిధాత్రి.

 

వనపర్తి జిల్లా కేంద్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఆలయ చైర్మన్ ధర్మకర్త అయ్యలూరి రఘునాథ శర్మ,ఆలయ పురోహితులు ఆశీర్వదించారు. పూజలో వనపర్తి మార్కెట్ యార్డు చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత 33 వ వార్డు ఎస్ ఎల్ ఎన్ మీడిదొడ్డి రమేష్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ పురోహితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ మేరకు వనపర్తి టౌన్ ఎస్. ఐ హరి ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో గణితం టాలెంట్ టెస్ట్…

ప్రభుత్వ పాఠశాలలో గణితం టాలెంట్ టెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం గణితం టాలెంట్ కార్యక్రమం జరిగింది. మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ ప్రశ్నాపత్రాలను ఆవిష్కరించారు. పదవ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ పరీక్ష మంచి మార్కులు సాధించడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్..

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే డిసిఎంఎస్ చైర్మన్

◆-: ఎమ్మెల్యే మాణిక్ రావు

◆-: డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సీనియర్ నాయకులు నామ రవికిరణ్ గురు స్వామి గారి ఆహ్వానం మేరకు తన కుమారుడి మొదటి జన్మదిన సందర్భంగా వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన శాసనసభ్యులు శ్
కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,వెంకటేశం ,సంజీవ్ రెడ్డి ,నర్సింలు ,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు.

అయ్యప్పస్వామిని దర్శించుకున్న ఆర్డీఓ ఉమారాణి…

అయ్యప్పస్వామిని దర్శించుకున్న ఆర్డీఓ ఉమారాణి

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా
నర్సంపేట శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో స్థానిక ఆర్డీఓ ఉమారాణి బుదవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవాలయ సిల్వర్ జూబ్లీ 25వ మండల పూజల మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్త దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవాలు జరిగాయి.ఈ సందర్భంగా ఆర్డీఓ ఉషారాణి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు.ఆలయ కమిటీ చైర్మన్ శింగిరికొండ మాదవశంకర్,అధ్యక్షుడు సైపా సురేష్ ఆలయ కమిటీ దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా ఆర్డీఓతో ప్రత్యేక పూజలు చేసి శాలువాతో సన్మానించారు.

అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-15T115041.975.wav?_=1

 

అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నిన్న రాత్రి జహీరాబాద్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమానికి ఎస్.ఎస్.డి అగ్రి ఇన్ఫ్రా యజమాని ఆకారపు షణ్ముక్ గుప్తా గురుస్వామి ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీనియర్ నాయకుడు నామ రవి కిరణ్.యువ నాయకులు మిథున్ రాజ్ తదితరులు పాల్గొన్నారు,

రమేష్ కన్నా స్వామి శబరిమల పాదయాత్ర పూర్తి

శబరిమల యాత్ర పూర్తి చేసుకున్న స్వామికి ఘన సన్మానం..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ విజయగణపతి ఆలయంలో అయ్యప్ప దీక్షలో భాగంగా మాల ధరించి పాదయాత్ర ద్వారా యాత్రను పూర్తి చేసుకున్న రమేష్ కన్నా స్వామిని ఆలయ అయ్యప్ప బృందం సభ్యులు ఆలయ ప్రాంగణంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ గత అక్టోబర్ నెలలో మాల ధరించి పాద యాత్రతో అయ్యప్ప స్వామిని దర్శించుకొని పట్టణానికి రావడం శుభకరమన్నారు. ఇప్పటికి ఆరుసార్లు పాదయాత్ర చేసిన రమేష్ కన్నా మరో 14 సార్లు యాత్రను దిగ్విజయం చేయాలని వారు ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో స్వాములు కుమార్ స్వామి, రమేష్ సదానందం, దేవేందర్ చారి, శ్రీధర్ రెడ్డి, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

మల్గి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

మల్గి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం లోని మల్గి మల్లన్నస్వామి జాతర మహోత్సవంలో భాగంగా మాజీ సర్పంచ్ దంపతులు జట్గొండ మారుతి శిరీష ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలో బుధవారం స్వామివారికి అభిషేకం హారతి పూజా కార్యక్రమ నిర్వహించినారు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలుచేసి దర్శించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదనం చేశారు,

ఉమ్రా యాత్ర కు వెళుతున్న మహ్మద్ షౌకత్ అలీ కి ఘన సన్మానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T141740.926.wav?_=2

 

ఉమ్రా యాత్ర కు వెళుతున్న మహ్మద్ షౌకత్ అలీ కి ఘన సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల కేంద్రమైన ఝరాసంగం కు చెందిన మహమ్మద్ షౌకత్ అలీ కి ఉమ్రా యాత్ర కు వెళుతున్న శుభ సందర్భంగా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఝరాసంగం గ్రామ పెద్దలు మాజీ ఎంపిపి హన్మంత్ రావు పాటిల్ మాజీ సర్పంచ్ రుద్రప్ప పాటిల్, డాక్టర్ రామయ్య నాయకులు ఆశ్రసఫ్ అలీ,లియకత్, ఏజాజ్ బాబా, నాగన్న పటేల్, రాజేందర్ సింగ్ నాగన్న, పెంటయ్య సంగన్న రాయికోటి నర్సిములు, హన్మంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇస్మాయిల్, పాఖుర్, కృష్ణ ఖ్యాయుమ్, అంజాద్, మహేష్, ఆన్సర్, నాసర్, వారితోపాటు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు,

షౌకత్ అలీ మరియు ఆయన కుమారుడు జాకీర్ మియా సౌదీ అరేబియాలోని. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే ఉమ్రా యాత్ర కు బయలుదేరడం జరిగింది.ఈ సందర్భంగా వాళ్ళని సన్మానించిన రేజింతల్ గ్రామ కాంగ్రెస్ సినియర్ నాయకులు మహమూద్ మియా అహ్మద్మియా ముంతాని ఇతరులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షౌకత్ అలీ ఏర్పాటు చేసిన విందు లో పాల్గొన్నారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా సన్మానం…

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామివారి దేవస్థానము లో పార్వతి పరమేశ్వరుల కళ్యాణోత్సవ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు మరియు తోటి మిత్రులతో దైవదర్శనం చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లికార్జున్ ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది,

ఘనంగా పల్లకి సేవ

ఘనంగా పల్లకి సేవ

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సంగారెడ్డి: జహీరాబాద్ మండలం హోతికే గ్రామ శివారులోని భవానీ మాత, మహేశ్వరి మాత మందిరంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజా కార్యక్రమాల తర్వాత నిర్వహించిన పల్లకి సేవలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రముఖులు పాల్గొని దేవీ ఆశీస్సులు పొందారు.

వైభవంగా చండీయాగం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-01T141753.181.wav?_=3

వైభవంగా చండీయాగం

రాయికల్ అక్టోబర్ 1: నేటి ధాత్రి:

రాయికల్ పట్టణంలోని శ్రీ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన చండీయాగం భక్తుల్ని ఆకట్టుకుంది. ఉదయం నుండి ప్రారంభమైన యాగ కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. వేదపండితుడి మంత్రోచ్చారణల నడుమ జరిగిన యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులందరికీ యాగ దర్శనం కనుల విందుగా నిలిచింది. సమితి సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు ప్రసాదాలను అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version