పలమనేరు రైతులకు పంట నష్టం పరిహారం

*రైతున్నలకు అండగా నిలుస్తోన్న కూటమి ప్రభుత్వం..

*గత ప్రభుత్వం తప్పిదం… ఆర్థిక విధ్వంసం వల్ల ఇబ్బందుల్లో పడ్డ రాష్ట్రం..

*రైతులను ఆదుకోవడం…ఏనుగుల దాడుల కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి..

*అటవీ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలి..

*పంట నష్ట పరిహార చెక్కుల పంపిణిలో ఎమ్మెల్యే అమర్..

పలమనేరు(నేటి ధాత్రి)నవంబర్ 27:

 

రైతన్నలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పలమనేర్ అటవీ రేంజ్ పరిధిలోని వీ.కోట, బైరెడ్డిపల్లి గంగవరం, పలమనేరు రూరల్ మండలాలకు చెందిన అటవీ ప్రాంత గ్రామాల రైతులకు పంట నష్ట నివారణ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మొత్తం 92 మంది రైతులకు 9.60 లక్షల రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూగత ప్రభుత్వం తప్పిదం వల్ల ఆర్థిక విధ్వంసం జరిగి రాష్ట్రం ఇబ్బందుల్లో కూరుకుపోయింది అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం రైతులకు సంబంధించిన అన్ని అంశాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని ఆదుకుంటున్నదన్నారు. అందులో భాగంగా ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన రైతులకు మూడు నెలలలోనే పరిహారపు చెక్కులను అందించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదన్నారు తెలియజేస్తుందన్నారు.ఇక ఏనుగుల దాడులను నివారించేందుకు చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలను తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు అటవీ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు. అటవీ అధికారుల సలహాల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపాలని పేర్కొన్నారు. ఇలా ఉండగా పంట నష్టపరిహారం తక్షణం అందుతుండటంపై పలు రైతులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు,ఈ పరిహారపు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, టిడిపి నాయకులు సోమశేఖర్ గౌడ్, నాగరాజరెడ్డి,ఆర్బిసి కుట్టిలతో పాటు సబ్ డీఎఫ్వో వేణుగోపాల్, ఎఫ్ ఆర్వో నారాయణ, మరియు సిబ్బందితో పాటు పలువురున్నారు.

డైరీ వ్యర్థలతో కలుషితమైన చెరువులు..

డైరీ వ్యర్థలతో కలుషితమైన చెరువులు..

*రసాయనాల దెబ్బతో మృతి చెందిన చేపలు, పాములు..

*ఆందోళనలో పసుపత్తూరు పంచాయతీ వాసులు..

*తక్షణం స్పందించి చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే అమర్..

*వెంటనే సమస్య పరిష్కారం కావాడమే గాక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు..

*పంచాయతీ ప్రజలు అప్రమత్తతో ఉండాలని విజ్ఞప్తి..

పలమనేరు(నేటిధాత్రి)అక్టోబర్ 29:

 

 

గంగవరం మండలంలోని ఒక ప్రైవేటు డైరీ కారణంగా పలు చెరువులు కలుషితంగా మారాయి.ఆ డైరీ నుంచి వెలువడే రసాయనలతో కూడిన కలుషిత నీరు చెరువులకు చేరడంతో చేపలు మరియు పాములు మృతి చెందాయి. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తక్షణమే స్పందించి బుధవారం గంగవరం మండలం పసుపత్తూరు పంచాయతీలోని చెరువులను మండల నాయకులు, అధికారులతో కలసి పరిశీలించారు. ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఫామ్ గెట్ డైరీ వ్యర్థాల కారణంగా వనపకుంట, తూము గుంట, కమ్మ వాళ్ళ కుంట చెరువులలో నీరు కలుషితమై చేపలు మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో అధికారుల అలసత్వంపై తీవ్ర అగ్రహానికి గురైన ఆయన వారిని అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులలో కలుషితమైన నీటిని ప్రజలు వినియోగించకుండా చూడాలని అదేవిధంగా పశువులు ఇతర జంతువులు నీటిని తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక అదే విధంగా చెరువులలో నీరు కలుషితం కావడానికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్, ఫిషరీస్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధ్యుల నుంచి రాబట్టాలని అధికారులకు తెలిపారు. భవిష్యత్తులో తిరిగి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరో వైపు చెరువు కట్టలు, సప్లై ఛానల్ కు సంబంధించి వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను అధికారులు త్వరగా పరిష్కరిస్తారని అంతవరకు పంచాయతీ వాసులు కలుషితమైన నీటిని వాడకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన వారిని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న,
తహసిల్దార్ రేఖా రెడ్డి, ఇరిగేషన్ డిఈ చొక్లా నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ, సర్వేయర్ రవి,అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీష్ పయనిలతో పాటు గంగవరం మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సోమశేఖర్ గౌడ్,ప్రతాప్ రెడ్డి,ప్రసాద్ నాయుడు, భాస్కర్ రెడ్డి,గిరిధర్ గోపాల్, సోము, శేఖర్,రెడ్డప్ప, శీన, హేమగిరి తదితరులున్నారు.

పలమనేరులో దిగ్విజయంగా సాగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం..

*పలమనేరులో దిగ్విజయంగా సాగిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం..

*మార్కెట్ యార్డ్ నుంచి మదర్ థెరిసా కళాశాల వరకు భారీగా జరిగిన ఆటో ర్యాలీ..

*ఆటో డ్రైవర్ల ఆనందం…కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు..

పలమనేరు(నేటి ధాత్రి)అక్టోబర్ 04:

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ఆర్థిక చేయుతను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం పలమనేరులో దిగ్విజయంగా సాగింది.
ఆ మేరకు కూటమి నాయకులతో పాటు అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారుపట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం చిత్తూరు డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ఆటో ర్యాలీని ప్రారంభించారుమార్కెట్ యార్డ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం గంగవరం మండలంలోని మదర్ తెరిసా కళాశాల వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూడ్రైవర్ల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు.ఆటో డ్రైవర్ సేవలో, పథకం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నరలోనే అన్ని కార్యక్రమాలు అమలు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.చెప్పినవి. చెప్పనవి.
చేసి చూపే ఏకైక నాయకుడు చంద్రబాబని.. ఆయనకున్న దూర దృష్టి కారణంగా నేడు రాష్ట్రం అన్ని రంగాలలో పరుగులు పెడుతోందని కొనియాడారు. మనందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే మునుముందు కూటమి ప్రభుత్వానికి అందరి మద్దతు ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, డిఆర్డిఏ పీడీ శ్రీదేవి, ఎం వి ఐ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఎన్ వి రమణ రెడ్డి, ఏఎంసి చైర్మన్ రాజన్న, నాయకులు ఆర్.వి. బాలాజీ, రంగనాథ్, కిషోర్ గౌడ్, సోమశేఖర్ గౌడ్,ఆనంద, నాగరాజు రెడ్డి,
ఆర్ బి సి, కుట్టి,సుబ్రహ్మణ్యం గౌడ్,
నాగరాజు, రాంబాబు,, మదన్, శ్రీధర్, బిఆర్సీ కుమార్, జనసేన నాయకులు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్, నాగరాజు మరియు సింగిల్ విండో చైర్మన్ లు మరియు డైరెక్టర్లులతో పాటు ఆటో యూనియన్ లీడర్లు మురుగ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

గంగవరం మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న.

గంగవరం మండలంలో పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న అక్రమ లేఔట్ లు

నోటీసులకే పరిమితమైన అధికారులు

గంగవరం(నేటి ధాత్రి) జూలై 16:

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో అక్రమాలకు అడ్డాగా మారిపోయింది, అక్రమ కట్టడాలు ఒకవైపు ఉంటే మరోవైపు అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి, అధికారులు నోటీసులు ఇవ్వడం వరకే పరిమితమై పూర్తిస్థాయిలో అరికట్టడంలో విఫలమయ్యారు,ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి అక్రమాలు చేస్తుంటే నోటీసులు ఇస్తుంటే ఉంటే లాభం ఏమిటి అని ఇప్పటికే ఎన్నో వార్తా కథనాలు రూపంలో అధికారుల నిర్లక్ష్యం చూపుతున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదు, ఇందుకు కారణం రాజకీయ ఒత్తుల్లా ? లేక ఏదైనా ప్రలోభాలకు లోబడి ఈ విధంగా చేస్తున్నారా అని సందేహాలు కూడా వస్తున్నాయి, ఇదే క్రమంలో భాగంగా గంగవరం మండలంలో దాదాపు 20 నుంచి 25 లేఔట్ లు అనుమతులు లేకుండా ప్రభుత్వ నియమాలు పట్టించుకోకుండా వేశారు,
అయిన కూడా అధికారులు ఏ విధమైనటువంటి స్పందన లేదు అంటే ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది, ఇదే క్రమంలో భాగంగా ఈ విషయంపై గంగవరం పంచాయతీ కార్యదర్శి సుధాకర్ వివరణ కోరగా అక్రమ కట్టడాలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని అయినా కూడా నిర్లక్ష్యప్రయంగా నిర్మిస్తున్నారని వారిపై చర్యలు కచ్చితంగా తీసుకుంటామని
ఈ సందర్భంగా ఆయన
తెలిపారు,అదే విధంగా లేఔట్ విషయంలో కూడా నోటీసులు ఇచ్చామని వారిపై కూడా ప్రభుత్వ నియమాల పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు,ఏది ఏమైనా అగ్రికల్చర్ భూములను మార్చి ఎటువంటి అనుమతులు లేకుండా కమర్షియల్ గా మార్చుకుంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోకుంటే రాబోవు రోజుల్లో పూర్తిస్థాయిలో అగ్రికల్చర్ భూములన్ని లేఔట్ గా మారి పూర్తిస్థాయిలో వ్యవసాయం దూరమయ్యే అవకాశాలు లేకపోలేదు, మరి ఇన్ని జరుగుతున్నా కూడా గంగవరం మండలం పై అధికారులు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోలేదంటే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి, అలాగే కొన్ని విద్యాసంస్థలు కూడా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు నిర్మించినట్లు కూడా వెలుగులోకి వచ్చింది,
మరి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంది…

గంగవరంలో శృతి మించిపోతున్న అక్రమ కట్టడాలు.

గంగవరంలో శృతి మించిపోతున్న అక్రమ కట్టడాలు

చోద్యం చూస్తున్న అధికారులు

గంగవరం(నేటి ధాత్రి) జూలై 12:

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో మదనపల్లి పలమనేరు జాతీయ రహదారిని ఆనుకుని ప్రభుత్వ అనుమతులకు మించి అక్రమ కట్టడాల నిర్మాణం రోజు రోజుకు శృతి మించి పోతుంది, ప్రభుత్వ అనుమతులు ఉన్న లేకపోయినా రాజకీయ పలుకుబడితో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారా లేదా ప్రభుత్వ అధికారులు ఏదైనా ప్యాకేజీ తీసుకొని ఈ అక్రమ కట్టలు కట్టిస్తున్నారు అర్థం కావడం లేదు కానీ ప్రమాదకరస్థాయిలో అక్రమ కట్టాల నిర్మాణం రోజు రోజుకు జరుగుతూనే ఉంది జాతీయ రహదారిని ఆనుకొని ఈ విధంగా ప్రభుత్వ నియమాలు ఉల్లంఘిస్తూ అక్రమ కట్టడాలు నిర్మిస్తుంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ఇప్పటికే ఎంతోమంది మదిలో ఈ ప్రశ్న వెలిబడుతుంది, మరి ఇలాంటి
క్రమంలో అంతస్తులపై అంతస్తులు కట్టుకుంటూ వెళ్తున్నారు కొందరు మరి వీటి పట్ల గంగవరం అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఎందుకు ఇంత నిర్లక్ష్యప్రాయంగా ఉన్నారో అర్థం కావడం లేదు ఇప్పటికే గంగవరం మండలంలో ప్రభుత్వ భూములు సైతం పక్కదారి పట్టించి పెత్తందారి వ్యవస్థను తీసుకువచ్చిన ఘటనలు కూడా ఎన్నో వార్తా కథనంలో చూసాం అదేవిధంగా ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి అక్రమ ఇసుక రవాణా కూడా గంగవరం మండలంలోని అధికంగా ఉండడం కూడా చూశాం అక్రమ మట్టి మాఫియా కట్టి మాఫియా ఇంకా ఎన్నెన్నో అక్రమాలు గంగవరం మండలానికి పెట్టింది పేరుగా ముందుకెళ్తుంది అంటే అధికార వ్యవస్థ ఏ మాత్రం అక్రమాలకు అండగా ఉందో మనకు అర్థమవుతూనే ఉంది మరి ఇలాంటి తరుణంలో ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి మరి అక్రమ కట్టడాలకు
సకరిస్తున్నారు,
అలాగే
అధికారులు రాజకీయ ఒత్తుల్లో ఉన్నారా లేక ప్యాకేజ్ తీసుకుని సైలెంట్ అయిపోతున్నారా అని అర్థం కావడం లేని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి నిర్మిస్తున్న కట్టడాలపై చర్యలు తీసుకొని ప్రమాదాలను అరికట్టాల్సి ఉంది, ఇదే విషయంపై ఒక దినపత్రిక ఈ అక్రమాలపై వార్తా కథనాన్ని ప్రచురించగా అధికారుల స్పందన కూడా ఏమాత్రం లేదంటే మరి జిల్లా అధికారులు వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది..

గంగవరం మండలంలో రెచ్చిపోతున్న.!

*గంగవరం మండలంలో రెచ్చిపోతున్న
ఇసుక అక్రమ రవాణా దారులు..

*చోద్యం చూస్తున్న అధికారులు..

గంగవరం(నేటి ధాత్రి) మార్చి 06:

పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గంగవరం పంచాయతీ
చిన్నూరు గ్రామానికి చెందిన అధికార
పార్టీ నాయకుడు నడుం
పల్లి సమీపంలోని అప్పిరెడ్డి
చెరువులో స్మశాన వాటికను సైతం ఆక్రమించి జెసిబిలతో ఇసుకను తోడేస్తూ ట్రాక్టర్ల ద్వారా నింపి సొమ్ము చేసుకుంటున్నారు.సమీపంలోని మట్టిని సైతం ఫిల్టర్ చేసి ఇసుకను తయారుచేసి నిల్వ ఉంచి విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇసుకను టిప్పర్ల ద్వారా ఆ అక్రమ రవాణా దారుడు15 కిలోమీటర్లు
సమీపంలో ఉన్న కర్ణాటకకు రాత్రికి
రాత్రే అధికారుల కన్ను సన్నుల్లో
ఈ అక్రమ రవాణా జరుగుతుందని
పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా గాని
భూగర్భ గనుల శాఖ,ఇరిగేషన్ అధికారులు, రెవిన్యూ అధికారులు పట్టించుకోక పోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రభుత్వ సంపదను ప్రక్క దారి పట్టిస్తున్నా,
లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నాయకుడికి అధికారులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి..
రానున్న రోజుల్లో నడుంపల్లి గ్రామంలో ఎవరైనా మరణిస్తే మా శవాలను
ఎక్కడ వేయాలని ఆ గ్రామస్తులు సైతం
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇతనిపై ప్రభుత్వ అధికారులు ప్రజా నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే ఇందులో వారి చేతివాటం ఎంతో ఉందో అర్థం అవుతుంది. దాదాపుగా చెరువు నుండి నిత్యం 200 లోడ్లు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న ఇతను పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version