మౌనిక ఆత్మకి శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ..

మౌనిక ఆత్మకి శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రం లో అంబేడ్కర్ చౌరస్తా వద్ద
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో.. ఫిబ్రవరి 18 వ తారీఖున అగ్రకుల రెడ్లు… రజక కులస్తులైన నలుగురు సోదర సోదరీమణులపై దాడి చేయడం జరిగింది ఒక మాదిగ స్త్రీపై దాడి చేయడం జరిగింది. అదే క్రమంలో రెండు నెలల పసిపాపని కాలితో తన్ని చంపడం జరిగింది. ఈ ఘోరమైన సంఘటనని ఖండిస్తూ చనిపోయిన మౌనిక ఆత్మ శాంతి కోసం… బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా వివిధ ప్రజాసంఘాలు సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీని భారీ ఎత్తున
నిర్వహించడం జరిగింది…
అదే విధంగా అగ్రకుల రెడ్ల దిష్టిబొమ్మ ను దహనం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కన్వీనర్ క్యాతం మహేందర్ మాట్లాడుతూ
కుమ్మెర గ్రామంలో దాడి చేసిన రెడ్లoదరిపై బలమైన సెక్షన్స్ అన్ని పెట్టి కేసును బలంగా నడిపించాలని వారికి సరైనటువంటి శిక్ష వేయకుంటే ప్రజల మధ్యన అహంకారపు రెడ్లకు సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర డిజిపి వెంటనే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి శిక్షించాలని మౌనిక కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్సగ్రెషియా చెల్లించాలని వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సి ఎస్టీ జేఏసీ కో -కన్వీనర్స్ జోగు బుచ్చన్న చిలుక సమ్మయ్య, పిల్లి క్రాంతి కుమార్, పిక్కల సారయ్య,రఘువరన్ బీసీ ఎస్సి ఎస్టీ జేఏసీ జిల్లా కో-ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ సిపియుఎస్ ఐ వావిలాల లక్ష్మణ్ చంద్రగిరి శంకర్ భూపాలపల్లి రజక సంఘం అర్బన్ అధ్యక్షులు వైనాలా శోభన్ బాబు,గోపరాజు రాజు ప్రధాన కార్యదర్శి, నాంపల్లి కుమార్, చిలకాని రమేష్,ఫైండ్ల రఘు, వైనాలా శంకర్, ఫిట్ సెక్రటరీ సమ్మన్న, , ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజు, నాయకులు పుల్ల అశోక్, కొయ్యాడ రమేష్,చెన్నూరి నరసింహ, బోయిని ప్రసాద్, బండారి దశరథం, జేఏసీ నాయకులు బొజ్జపెల్లి మహర్షి, రేణుకుంట్ల అరవింద్ తదితరులు పాల్గొన్నారు

చిన్నారిని చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలి…

చిన్నారిని చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలి

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఎస్సీ వర్గానికి చెందిన చిన్నారి ప్రాణాలు కోల్పోవడం కేవలం ప్రమాదం కాదని, ఇది అగ్రకుల దౌర్జన్యం, వ్యవస్థాపిత నిర్లక్ష్యం సామాజిక నేరమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్ తీవ్రంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
బాధితుడు దళిత కుటుంబానికి చెందినవారని తెలిసినా, కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా అధికారుల కనుసన్నల్లోనే అగ్రకులానికి చెందిన నేరస్థులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం వారు అన్నారు

బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం

బీసీ రిజర్వేషన్ల అమలులో అధికారుల నిర్లక్ష్యం:

◆:- పరమేశ్వర్ పటేల్ ఆరోపణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల మేదపల్లి గ్రామ మాజీ తాజా సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల అమలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల బీసీ వర్గాలు నష్టపోతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చి, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించి బీసీలను మోసం చేశారని, పాత పద్ధతిలోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. రాజకీయ పలుకుబడితో బీసీలను అణిచివేసేలా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు కావడం లేదని, దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.వెంటనే కలెక్టర్ స్పందించి విచారణ జరిపి, రిజర్వేషన్ ప్రక్రియను పునర్విమర్శించి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version