నిజాయితీ గా పని చేసే సర్పంచ్ లను ఎన్నుకోవాలి..

నిజాయితీ గా పని చేసే సర్పంచ్ లను ఎన్నుకోవాలి

బీరు విస్కీ రూపాయలకు ఆశపడవద్దు అఖిలపక్ష ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి .

 

నేడు మొదటి విడత జేరిగే సర్పంచ్ ఎన్నాకల లో గామాని కి సేవ చేసే వారిని పార్టీల కు అతీతంగా ఎన్నుకో వాలని జిల్లా అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ గ్రామాల ప్రజల కు పిలుపునిచ్చారుఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూనేడు జరిగే సర్పంచ్ ల ఎన్నికలలో గ్రామంలో ప్రజలంతా ఏకమై నిజాయితీ గా ప్రజలకు పని చేసే వారిని గెలిపించాలని కోరారు బీరు విస్కీ రూపాయలకుం రాజకీయ పార్టీల ను దూరం పెట్టి గ్రామ అభివృద్ధి చేసే వారిని ఎన్నుకో వాలని సతీష్ కోరారు

సేవే నా లక్ష్యం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T125126.032.wav?_=1

 

సేవే నా లక్ష్యం…

– అందరి సహకారంతో ముందుకు

– కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాష్ట్ర వైద్య–ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారి సహకారంతో, గ్రామస్తులందరినీ కలుపుకొని సేవే లక్ష్యంగా ముందుకు వెళ్తానని ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

గ్రామాభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలతో పని చేస్తూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. సీసీ రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గ్రామ అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున, ప్రభుత్వం పెద్దల సహకారంతో మరిన్ని పథకాలు, నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.

గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతానని, సేవ చేసే అవకాశం మరోసారి ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

“ప్రలోభాలకు లొంగొద్దు: ఆంజయ్య పిలుపు”

ఓటర్లు డబ్బు మద్యం ప్రలోబాలకు లొంగొద్దు

• నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలి
•సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెక్రటరీ మంగలి ఆంజయ్య

చేవెళ్ల, నేటిధాత్రి :

 

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు అధికంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దని సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెసెక్రటరీ మంగలి ఆంజయ్య అన్నారు. ఈ సందర్బంగా మండలంలో సర్పంచి, వార్డు నెంబర్లుగా పోటీచేస్తున్న అభ్యర్థులు డబ్బులతో ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో గెలవడానికి ముందుగా ఎన్నికల్లో ఓటర్లకు మద్యం, విందు కార్యక్రమాలకు ఖర్చు చేసే డబ్బులు గెలిచిన తరువాత ప్రభుత్వం గ్రామపంచాయతీకి విడుదల చేసే నిధుల నుండి ఖర్చును పూడ్చుకునే అవకాశం సాధ్యం కాదనీ సమాచార హక్కు వికాస సమితి ముందుగా హెచ్చరిక తెలియజేస్తుందని అన్నారు. గ్రామానికి వచ్చిన నిధులను పనులు నిమిత్తం మాత్రమే పారదర్శకంగా ఖర్చు చెయ్యాలని సమాచార హక్కు చట్టం ప్రకారంగా పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240
ప్రకారంగా ప్రతీ విషయం ప్రజలందరూ తెలుసుకునే హక్కు ఉందని ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240 ను ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో సూచిక బోర్డు పై ప్రజలందరికీ తెలిచేలా ఏర్పాటు చెయ్యాలని అన్నారు .
నిధులను పక్కదారి పట్టించిన దుర్వినియోగం చేసినా,
సొంతానికి వాడుకున్న, తప్పుడు లెక్కలు చూపిన ప్రజలు ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి, నిధులను రికవరీ చేసి, పదవి నుండి తొలగించె అవకాశం ఉందని, కాబట్టి ఎన్నికల్లో అధిక ఖర్చులు పెట్టి అప్పుల పాలు కావద్దని సూచించారు. ఓటర్లు డబ్బు, మద్యం, ప్రలోబాలకు లొంగి ఓటు వేయొద్దని, నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలని ఓటర్లకు సూచించారు.

హస్తగతమౌతున్న పల్లెలు!

`కాంగ్రెస్‌ ఖాతాలో పడుతున్న మెజారిటీ పంచాయతీలు

`ఇప్పటికే ఏకగ్రీవాలా పేరుతో కాంగ్రెస్‌ జెండా రెపరెపలు.

`అధికార పక్షం వైపే చూస్తున్న పల్లెలు.

`అధికారికంగా పార్టీ గుర్తులు లేకపోయినా కాంగ్రెస్‌ నాయకులు ముందంజలో వున్నారు.

`బీఆర్‌ఎస్‌ నుంచి పంచాయతీ లలో స్పందన కరువు.

`అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టలేని స్థితిలో బిఆర్‌ఎస్‌.

`తూతు మంత్రంగా పేర్లు ప్రకటిస్తున్నారు.

`అభ్యర్థులు ఎంపిక తలనొప్పి వద్దనుకున్నారు?

`ఆయా గ్రామాలకే వదిలేశారు.

`అందుకే పేర్లు వెల్లడిరచడానికి బిఆర్‌ఎస్‌ సిద్దపడడం లేదు.

`గెలిచినా వాళ్ళు బిఆర్‌ఎస్‌ లో ఉంటారన్నా నమ్మకం లేదు.

`ఇంకా మూడేళ్లు సమయం ఉంది.

`అధికార పార్టీ నాయకుల మాటే చెల్లుతుంది.

`బీఆర్‌ఎస్‌ పార్టీ ఆశలు నెరవేరా లేదు.

`జనం కాంగ్రెస్‌ మీద వ్యతిరేకత చూపిస్తున్న సందర్భం కనిపించడం లేదు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:

తెలంగాణ పల్లెపోరులో ఏం జరుగుతోంది. పాలక, ప్రతి పక్షాల మధ్య పోరు ఎలా సాగుతున్నది? పై చేయి ఎవరు సాదిస్తున్నారు? అనే ఉత్కంఠ అందరిలోనూ వుంది. కాని క్షేత్ర స్దాయిలో ప్రజల్లో ఎలాంటి సందేహాలు లేదు. ప్రభుత్వం మీద పెద్దగా వ్యతిరేకత లేదు. ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను నమ్మి ఆ పార్టీ అభ్యర్దులను గెలిపించుకునే పరిస్దితి పెద్దగా కనిపించడం లేదు. ఇది అంతు పట్టని వ్యహారంలా మారింది. నిన్నటి దాక బిఆర్‌ఎస్‌ చెప్పుకున్నదానికి ఇప్పుడు పల్లెల్లో కనిపిస్తున్నదానికి సంబధం లేకుండా వుంది. గత ఏడాదిన్న కాలంగా పంచాయితీ ఎన్నికలు పెట్టండి? మా తడాఖా చూపిస్తామంటూ బిఆర్‌ఎస్‌ రంకెలేసింది? అంతెందుకు ఈ మధ్య జరిగిన జూబ్లీహిల్స్‌లో ఓటమి తర్వాత కూడా బిఆర్‌ఎస్‌ పల్లె మాదే. అక్కడ గెలుపు మాదే. పల్లెల్లో పంచాయితీలు మావే. కాంగ్రెస్‌కు చోటు లేకుండా చేస్తాం. కాంగ్రెస్‌ను తుడిచేస్తాం. పల్లెల్లో కాంగ్రెస్‌ జెండా కనపడకుండా గెలుస్తాం. అంటూ చెప్పుకున్న గొప్పలకు లెక్కే లేదు. కాని క్షేత్రస్దాయిలో చూస్తే అలాంటి పరిస్దితులు చూస్తే మచ్చుకు కూడా కనిపించడం లేదు. బిఆర్‌ఎస్‌ చెప్పుకున్నంత సులుగా ఆ పార్టీకి పరిస్ధితులు అనువుగా లేవు. పల్లె పోరులో వరుస విజయ పరంపరలను కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ కూడా ముందంజలో వుంది. ముఖ్యంగా ఏకగ్రీవాలలో కాంగ్రెస్‌ దూసుకుపోయింది. చాల వరకు కాంగ్రెస్‌ పార్టీ ఏక గ్రీవాలను సాధించింది. ఇంకా మిగిలిన ఎన్నికల పోరులో సత్తా చూపిస్తామని కాంగ్రెస్‌ అంటోంది. నిజం చెప్పాలంటే కాంగ్రెస్‌ పల్లె పోరులో కూడా దూసుకుపోతోంది. విజయాలు సొంతం చేసుకుంటోంది. పంచాయితీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు వుండకపోవచ్చు. కాని పార్టీల అభ్యర్దులుగానే రంగంలో వుంటారు. సహజంగా అందరూ ఇండిపెండెంట్లుగానే పోటీ చేస్తారు. కాని అందరూ ఏదో ఒకపార్టీకి అనుబంధ సభ్యులై వుంటారు. అందుకే ఒక ఊరిలో ఒకే పార్టీకి చెందిన పలువులు వ్యక్తులు పోటీచేస్తారు. అందులో ఏదొ ఒకరిని పార్టీ గుర్తించినట్లు మాత్రమే చెప్పుకుంటారు. అందులో గెలిచిన వారిని కూడా తమ పార్టీయే అని చెప్పుకుంటారు. ఇది సహజం. అలా పోటీ చేసే అభ్యర్ధులలో కూడా కాంగ్రెస్‌కు చెందని వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ముందు బిఆర్‌ఎస్‌ చెప్పిన విధంగా ఆ పార్టీ నుంచి పోటీచేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్‌తో పోలిస్తే బిఆర్‌ఎస్‌ అభ్యర్దులు ఎక్కుగా బరిలో లేరు. వున్నదల్లా ఎక్కువగా కాంగ్రెస్‌కు చెందిన నాయకులే ఎక్కువగా వున్నారు. ఇక్కడే కాంగ్రెస్‌ విజయాలు దాగి వున్నాయని చెప్పడంలో సందేహంలేదు. అందుకే ఏక గ్రీవాలతో కాంగ్రెస్‌ ఇప్పటికే గెలుపు ఖాతాలు బాగానే తెరిచింది. గెలిచిన వాళ్లంతా కాంగ్రెస్‌ అభ్యర్ధులే కావడం గమనార్హం. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం బిఆర్‌ఎస్‌ అభ్యర్దులు ఏకగ్రీవం అయ్యారు. వారిని చూపించుకొని బిఆర్‌ఎస్‌ పెద్దగా షో చేస్తోందని చెప్పొచ్చు. కాంగ్రెస్‌కు అలా చూపించుకోవాల్సిన అసవరం లేదు. ఒక దశలో మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసేందుకే సమయం ఇవ్వని కేసిఆర్‌ ఇప్పుడు ఏకగ్రీవమైన ఓ నలుగురు సర్పంచ్‌లను కూడా కలుసుకునే స్ధితికి చేరింది. ఒక రకంగా ఇది ప్రచారంలో ఓ భాగమని చెప్పుకునే పరిస్దితి వచ్చింది. లేకుంటే గతంలో ఏనాడైనా కేసిఆర్‌ కనీసం తన నియోజకవర్గ సర్పంచ్‌లను కలిసిన సందర్భం ఒక్కటైనా వుంది. కనీసం ఆయన ఫామ్‌ హౌజ్‌ దరిదాపులకు రానిచ్చినట్లు వార్తలేమైనా వున్నాయా? ఇప్పుడు ఏకగ్రీవమైన సర్పంచ్‌తో కలవాల్సిన పరస్దితులు ఎదురౌతున్నాయి. అదే ప్రజాస్వామ్యం. అదే ప్రజాస్వామ్య గొప్పదనం. ఆ ఏకగ్రీవమైన నాలుగు సర్పంచ్‌లు కూడా కేవలం కేసిఆర్‌ పామ్‌ హౌజ్‌కు పక్కనే వున్న గ్రామాలు కావడం కూడా విచిత్రం. లేకుంటే ఆ నాలుగు కూడా బిఆర్‌ఎస్‌ ఖాతాలో పడేవి కాదని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. ఎక్కడ పరువు పోతుందో అన్న ఆందోళనతోనే ఆ నాలుగైదు గ్రామాలను ఏకగ్రీవం చేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అదే తెలంగాణ మొత్తం వున్నట్లు చెప్పుకోవడానికి బిఆర్‌ఎస్‌ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. కాని క్షేత్ర స్దాయిలో ఆ పరిస్దితులు అసలే లేవు. బిఆర్‌ఎస్‌ను గెలిపించుకుంటున్నట్లు కూడా కనిపించడం లేదు. ఇక ఘట్టం ముందుంది. నిజం చెప్పాలంటే సాదారణ ఎన్నికలకు మరో మూడు సంవత్సరాల గడువుంది. ఈ మూడు సంవత్సరాలు పంచాయితీలకు నాలుగు రూపాయలు విడుదల కావాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఇవ్వాలి. అదే బిఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లలేరు. నిదులు అడగలేరు. సహజంగ వచ్చే నిధులు గ్రామాభివృద్దికి సరిపోవు. ఎమ్మెల్యే నిధుల నుంచి ఎన్నో కొన్ని నిదులు తేవాల్సి వుంటుంది. తాను సర్పంచ్‌గా వున్న సమయంలో చేసిన అభివృద్ది ఇది అని చూపించుకోవడానికి వుంటుంది. లేకుంటే ఐదేళ్లు చేయడానికి ఏమీ వుండదు. ఆ ఊరికి సర్పంచ్‌ వున్నారా? అంటే వున్నారు. అనే విధంగా గ్రామ పాలన సాగుతుంది. ఆ సర్పంచ్‌ పాలన మీద వ్యతిరేతక మొదలౌతుంది. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సంక్లిష్ల పరిస్ధితులు ఎదురైనప్పుడు తప్పని పరిస్దితుల్లో ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచినా పాలక పక్షం తీర్దం పుచ్చుకోవాల్సి వస్తుంది. ఒక వేళ ఈ మూడు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోవున్నా, సాదారణ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌ గెలిస్తే అప్పుడు వద్దన్నా ఈ సర్పంచ్‌లంతా కాంగ్రెస్‌లో చేరుతారు. చాలా మంది గెలిచిన వెంటనే గ్రామాభివృద్ది కోసం కాంగ్రెస్‌లో చేరుతారు. ఎమ్మెల్యేలే తమ నియోజకవర్గం అభివృద్ది కోసమంటూ పార్టీలు మారుతున్న సమయం. అలాంటిది సర్పంచ్‌లు మారడం అనేది పెద్ద సమస్య కాదు. అసలు విషయమే కాదు. ఇక బిఆర్‌ఎస్‌ నుంచి సర్పంచ్‌లు మళ్లీ ఆపార్టీ నాయకులు పెద్దగా పోటీకి ఆసక్తి చూపకపోవడానికి మరో బలమైన కారణం వుంది. గత రెండుసార్లు బిఆర్‌ఎస్‌ నుంచి సర్పంచ్‌లుగా గెలిచిన వారికి లక్షల రూపాయలు బకాయిలున్నాయి. బిఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని నమ్మి పెద్దఎత్తున నిదులు వెచ్చించి గ్రామాభివృద్ది కోసం సొంత నిదులు ఖర్చు చేశారు. అభివృద్ధి పనుల కోసం మాజీ సర్పంచ్‌లు అప్పులు తెచ్చి మరీ పనులు చేపట్టారు. ఆ పనులు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా వారికి ఆ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. ప్రజా ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ బకాయిలు చెల్లించలేదు. దాంతో వారి రాజకీయం ఏనాడో తలకిందులైంది. వారిని కదిలిస్తే బోరున ఏడ్వడం తప్ప మరేమీ వుండదు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలంటే కలలో కూడా భయపడే పరిస్దితి వచ్చింది. ఎన్నికంటేనే భయపడుతున్నారు. సర్పంచ్‌ ఎన్నికలంటే ఆమడ దూరం పారిపోతున్నారు. పార్టీలకో దండం, పదవికో దండం అని అంటున్నారు. గతంలో మేం చేసిన పనులకు బకాయిలు వస్తే అదే మాకు చాలు అంటున్నారు. ఒక్కసారి సర్పంచ్‌ అయిన పాపానికి చేసిన అప్పులకు ఆస్ధులు అమ్ముకున్నాం. ఇక చాలు ఈ రాజకీయాలు. ఇక చాలు సర్పంచ్‌ పదవులు అని చెబుతున్నారు. అందుకే బిఆర్‌ఎస్‌ నాయకులు సర్పంచ్‌ ఎన్నికలు అంటేనే దండం పెడుతున్నారు. మమ్మల్ని పార్టీ ఉద్దరించింది చాలు అంటూ ఆ పార్టీ నాయకుల ముఖం మీదే మాజీ సర్పంచ్‌లు చెబుతున్నారు. అంటేనే బిఆర్‌ఎస్‌ పరిస్దితి అంచానా వేయొచ్చు. ఆ పార్టీ దుస్దితిని అర్దం చేసుకోవచ్చు. ఇది కూడా కాంగ్రెస్‌కు వరమైపోయింది. పల్లెలన్నీకాంగ్రెస్‌ ఖాతాలో పడేందుకు దారి చూపింది. కాగల కార్యం గందర్వులే తీర్చినట్లైంది. పోటీలో వుంటారనకున్న బిఆర్‌ఎస్‌ నాయకులు పక్కకు తప్పుకోవడంతో కాంగ్రెస్‌ గెలుపుకు అడ్డు లేకుండాపోయింది. పల్లెల్లో కాంగ్రెస్‌ పండుగ చేసుకుంటోంది.

ఎన్నికల నేపథ్యంలో మండల అధికారుల సమీక్ష..

ఎన్నికల నేపథ్యంలో మండల అధికారుల సమీక్ష

జైపూర్,నేటి ధాత్రి:

 

ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జైపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం లో మండల అధికారులు సమన్వయ సమీక్ష నిర్వహించారు.శనివారం నిర్వహించిన ఈ సమీక్షలో మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.రెండవ సాధారణ ఎన్నికలు 2025 సంవత్సరానికి గాను సర్పంచ్ వార్డు సభ్యుల పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా పంచాయతీ కార్యదర్శులను,జిపిఓ సిబ్బందిని ముందస్తు ప్రణాళిక ప్రకారం సిద్ధం చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో గుర్రం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. పల్లెల్లో స్థానిక ఎన్నికల పోరంటే ఆశామాషిగా ఉండదని అధికారులకు సూచించారు.ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా,ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంగా విధులు నిర్వహించాలన్నారు.నామినేషన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,ప్రజలకు నామినేషన్ కేంద్రాల గురించి విస్తృత ప్రచారం చేయించాలని తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో తగిన సౌకర్యాలు ఉండేటట్లు చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వనజ రెడ్డి,సీఐ నవీన్ కుమార్, ఎస్సై శ్రీధర్,ఎంపీఓ శ్రీపతి బాబురావు,డిప్యూటీ తహసిల్దార్ సంతోష్,వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై…

గడపగడపకు వెళ్లి బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపుకై

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ప్రచారం నిర్వహించారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహ్మత్ నగర్ డివిజన్ లోని వివిధ బూత్ లలో ప్రచారం నిర్వహించారు.ప్రజావ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న, *కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీత గారి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటువేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని,తెలంగాణ లో రామ రాజ్యం రావాలంటే కెసిఆర్ పాలన రావాలని అందుకు ఈ ఎన్నిక గెలుపుతో ఆరంభం కావాలని ఈ గెలుపుతో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,బూత్ ఇంచార్జులు ,బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షులుగా పొదిల సురేష్

#నెక్కొండ, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నెక్కొండ మండల కేంద్రంలోని చంద్రుగొండ, బంజరపల్లి, మూడు తండా, గొల్లపల్లి, వాగ్య నాయక్ తండ, లకు సంబంధించి ఆటో యూనియన్ ఏర్పరచుకొని 30 సంవత్సరాలుగా అవుతున్న తరుణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఆటో యూనియన్ ఎన్నికలను నెక్కొండ నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలలో చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ ని, కార్యదర్శిగా చిలువేరు కొమ్మాలను, కోశాధికారి జితేందర్ , కమిటీ మెంబర్ గా కాజా పాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడు పొదిల సురేష్ తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా నెక్కొండ నవత యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు…

ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం

గ్రామాల అభివృద్ధి గాలికి ఒదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిన్నటి దాకా ఎన్నికల డ్రామా నిర్వహించిందని, వారిది బీసీలపై కపట ప్రేమ నటిస్తుందని వారు అన్నారు. కేవల రాజకీయ లబ్ది కోసమే బీసీ రిజర్వేషన్లు అమలు చేసినట్టుగా నటించి తిరిగి వారి నాయకులతోనే హై కోర్ట్ లో కేసులు వేపియ్యడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ కి అన్ని పార్టీలు సహకరించాయని ఆనాడు తెలిపి, ఈరోజు కాంగ్రెస్ పార్టీయే ఒంటరి పోరాటం చేస్తుందని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం ఏనాడు వ్యతిరేకంచలేదని, భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని వారు తెలిపారు. కేవలం వారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందొ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో లేదో అని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న ట్రయల్ వేసినట్టు ఉందని, వారి ప్రభుత్వం మీద,వారి అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకొని ఎన్నికల పట్ల కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం అని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్,జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, సూదగోని మహేష్ గౌడ్, కలిగేటి ఎల్లయ్య, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల ఐటి సెల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, బూత్ కమిటీ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, నాగి లచయ్య, మాడిశెట్టి శ్రీసాయి, కోడూరి ప్రణయ్,కట్ట అనీల్ కుమార్, కొలిపాక రాజేష్, పురేళ్ల సన్నీ, కొలిపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి

కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి

మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
ఆనాడు ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేటికి రోజులు లెక్కపెట్టి చూస్తే దాదాపుగా 660 రోజులు అయ్యింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయింది ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తు చేద్దామని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు ఇస్తూ వివరిస్తూ వారిని చైతన్య పరిచే దిశలో మేము పని చేస్తుంటే వాళ్ళ పునాదులు కదులుతాయనే భయంతో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తూ ఏదో డోఖా కార్డుల పేరుతో కొత్త రాజకీయం మొదలు పెట్టారు.
మేము ఏమైనా లేనివి ఇవ్వమని చెప్పుతున్నామా మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్నామని అన్నారు.
బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజలకు మంచి చేసిందా,చేడు చేసిందా అనేది వాస్తవం తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్యూరిటీ లేకుండా ప్రజలలోకి రావాలి.
రాబోయే 38 నెలలు వీళ్ళు అధికారంలో ఉంటారు కావచ్చు.ఈ 38 నెలలు వీళ్ళ నీడలాగ వెంటాడుతూనే ఉంటాం.
పడేండ్లలో డోఖా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఈ విదంగా ఉండదు.
భూపాలపల్లి చిన్న కుగ్రామం నేడు జిల్లా స్థాయికి వచ్చింది.
మారుమూల జిల్లా అయిన ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చిన్నాయి, పెన్షన్స్ వచ్చినాయి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినయి.
కేసీఆర్ మాట చెప్పి ఎన్ని రోజులు నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని.
కనీసం యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, చేతకాని ముఖ్యమంత్రి అని ప్రజలు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు పెట్టాలంటే బయపడుతున్నారు.
ప్రధాన ప్రతిపక్ష హోదాలో మాకు ప్రశ్నించే హక్కు ఉంది డానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసి ఎస్ చైర్మన్ మేకల సంపత్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట రాణి సిద్దు గండ్ర హరీష్ రెడ్డి నూనె రాజు తదితరులు పాల్గొన్నారు

కిష్టంపేట ఎంపిటిసి బరిలో దాసరి శ్రీనివాస్…

కిష్టంపేట ఎంపిటిసి బరిలో దాసరి శ్రీనివాస్

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కిష్టంపేట ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయనున్నట్లు దాసరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న శ్రీనివాస్ కు మండల సమస్యలపై మంచి పట్టు ఉండటం వలన మౌలిక సదుపాయాల అభివృద్ధి కై కృషి చేస్తారని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎంపీపీ సీట్ కోసం రసవత్తరంగా పోటీ ఉండనున్నట్లు తెలిపారు.రాజకీయాల్లోకి చదువు కున్న యువతి, యువకులు రావాలని, అప్పుడే అన్ని గ్రామాలలో అభివృద్ధి మెరుగవుతుందని అన్నారు.తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేసే వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు.

“ప్రజలకు హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌పై బీజేపీ నేత విమర్శ”…

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ప్రధానమంత్రి మోడీ గారిని మరియు భారతీయ జనతా పార్టీ నీ విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు
భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట( నేటిధాత్రి):

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి పేద ప్రజల అభివృద్ధి తోనే సాధ్యమవుతుందని ఆలోచించి ప్రజలకు భారమైన జీఎస్టీ పన్నును నాలుగు స్లాబులుగా ఉన్నదాన్ని తగ్గి రెండు స్లాబుల కిందికి తీసుకువచ్చి నిత్యవసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టే విధంగా ఆటోమొబైల్ పరిశ్రమలు ఫార్మా కంపెనీల లాభాలను తగ్గించి జిఎస్టిని తగ్గించడం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని ఆలోచించి జిఎస్టి తగ్గిస్తే దానిని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం చాలా హాస్యస్పదంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అన్నారు. లేనిపోని మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేక జనాల్లోకి పోయే ముఖం లేక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారిని విమర్శించడం తగదని ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామన్న హామీ ఇప్పటివరకు దరిదాపుల్లో కనపడడం లేదని గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు హామీని నెరవేర్చిన దిశగా వెళ్లలేదని ఆసరా పింఛన్లు డబల్ చేసి ఇస్తామని మోసం చేసి ఓట్లు ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ మళ్ళీ మాయమాటలు చెబుతూ ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అప్పుడు వాళ్ళ పార్టీకి మరియు నాయకులకు కళ్ళు తెరుచుకుంటాయని అప్పటివరకు భ్రమలో కొనసాగాలని మహేందర్ రెడ్డి అన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి…

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

వీణవంక,(కరీంనగర్ జిల్లా ):

నేటి ధాత్రి:

 

 

వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సోమవారం మహాధర్నా కార్యక్రమం చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి బీడీ, చేనేత, గీత కార్మికులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పెన్షన్లు పెంచుతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి 22 నెలలు గడుస్తున్న వృద్ధులు వితంతుల వికలాంగుల గీతా చేనేత బీడీ కార్మికుల డయాలసిస్ క్యాన్సర్ హెచ్ఐవి పేషెంట్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా దాటవేయడం సబాబు కాదని వారు ఇచ్చిన మాటను తక్షణమే నిలబెట్టుకోవాలని లేనియెడల రాబోయే పంచాయతీ ఎంపిటిసి ,జెడ్పిటిసి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని పంచాయతీ సెక్రటరీ రామగిరి హరీష్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో
శ్రీ సాయి వికలాంగుల సేవా కేంద్రం అధ్యక్షులు పైడిమల్ల శ్రీనివాస్ గౌడ్
వడ్డేపల్లి రమేష్,
అంబాల మధున్నయ్య , గట్టు సాయి తేజ ,ఎండి షాహిద్ గుంట్టి శంకరయ్య, కాంతాళ రాజిరెడ్డి ,మాడ సుధాకర్ రెడ్డి ,కట్ట సదానందం, గాండ్ల శేఖర్ అయ్యా గట్టు సమ్మయ్య, ఏలువాక దశరథం, అంబాల నాగయ్య అంబాల సదయ్య, వడ్డేపల్లి తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి భవన్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎన్నిక…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-15T140233.017.wav?_=2

 

పద్మశాలి భవన్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎన్నిక,

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

విశ్రాంతి ఉద్యోగుల సంగం సమావేశం పద్మశాలి భవన్ నందు తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉధ్యోగుల సంఘం జహీరాబాద్ మండల శాఖ ఎన్నికలు ఎకగ్రీవంగా జరిగినవి.అధ్యక్షులుగడ్డం జనార్దన్, ప్రధాన కార్యదర్శి పటేల్ రాజేందర్ రావు, కోశాధికారి శ్రీ బెండి చంద్రశేఖర్, అసోసియేట్ ప్రసిడెంట్ శ్రీ కౌలస్ ప్రభాకర్, ఉపాధ్యక్షులు ఎం. డి. ఆజీం, విజయ లక్ష్మీ, జాయింట్ సేక్రటరి నర్సిములు, అర్గనైజింగ్ సేక్రటరి కౌలస్ రాజేశేఖర్, పబ్లిసిటీ సేక్రటరి మహబూబ్ గౌరి, కార్య వర్గ సభ్యులుగా జి. చంద్రశేఖర్, యాకుబ్ అలి, సైఫోద్దిన్ గౌరీ, ఎ. బాగారెడ్డి, జి. రాందాస్, వి. నర్సిములు జిల్లా కౌన్సిల్ రమేష్ బాబు, పి. దుర్గయ్య, మల్లేష్ం ఎంపిక కాబడినారు. ఎన్నికల అధికారిగా విజయ రావు అబ్జర్వర్ జగదీశ్వర్ రావడం జరిగింది.

 

 

ముఖ్య అతిధిగా రాష్ట్ర జనరల్ సేక్రటరి సి. చంద్రశేఖర్ మాట్లాడుతు త్వరలో మనకు రావల్సిన డి. ఎ, పిఅర్సి, హేల్త్ కార్దులు ఇప్పించడానికి ప్రభుత్వానికి ప్రాతి నిధ్యం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమలో విశ్రాంత ఉధ్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి..

 

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-08T131535.150.wav?_=3

 

సింగరేణి కి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి..

సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి గత ఆర్థిక సంవత్సరం సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో 35% వాటాను వెంటనే చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి డిమాండ్ చేశారు. పట్టణం లోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు పూర్తయినప్పటికీ లాభాల వాటా ప్రకటించక పోవడం దుర్మార్గం అన్నారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎన్నికల కోడ్ అమలు అయితే కార్మికుల లాభాల వాటా చెల్లించడం మరింత ఆలస్యం అవుతుందని వెంటనే గుర్తింపు సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 35% వాటా చెల్లించాలన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల సాధన కోసం ఈనెల 11,12 తేదిలలో సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, డిపార్ట్మెంటు లలో వినూత్న రీతిలో కార్మికు ల అభిప్రాయాల సేకరణ కోసం ఓటింగ్ నిర్వహించడం జరుగు తుందని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటింగ్ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కమిటీ నాయకులు రామగిరి రామస్వామి, వైస్ ప్రెసిడెంట్ రమేష్, సంజీవ్, సురేష్, మల్లేష్, తాజుద్దీన్, శ్రీధర్, కుమారస్వామి, ఆదర్శ్ లు పాల్గొన్నారు.

 రాజీనామాకు జపాన్ ప్రధాని ఇషిబా నిర్ణయం

 రాజీనామాకు జపాన్ ప్రధాని ఇషిబా నిర్ణయం

ఎల్‌డీపీ లోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెలరోజులుగా ఇషిబా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి.

టోక్యో: జపాన్ ప్రధానమంత్రి పదవికి షిగేరు ఇషిబా (Shigeru Ishiba) రాజీనామా చేయనున్నారు. అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)లో చీలకను నిరోధించేందుకు ఆయన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఇషిబా ధ్రువీకరించినట్టు జపాన్ ప్రభుత్వరంగ టీవీ ఎన్‌హెచ్‌కే తెలిపింది.

జూలైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఇషిబా సారథ్యంలోని ఎల్‌డీపీ ఎగువ సభ, దిగువ సభ రెండింటిలోనూ మెజారిటీని కోల్పోయిన క్రమంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఎగువ సభలో 248 సీట్ల మెజారిటీని సాధించడంలో ఎన్‌డీపీ విఫలమైంది. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరగడంతో ఓటమికి బాధ్యత వహించాలంటూ పార్టీలోనే అసంతృప్తులు పెరిగాయి. ఎల్‌డీపీ లోని రైట్ వింగ్ ఫాక్షన్ల ఒత్తిడిని గత నెలరోజులుగా తట్టుకుని నిలబడినప్పటికీ ఆయన నాయకత్వంపై పార్టీ అంతర్గత డివిజన్లలో అసంతృప్తులు తీవ్రమయ్యాయి. దీంతో ఆయన రాజీనామా నిర్ణయానికి వచ్చారు.

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక…

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్ సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:

 

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రోజున సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడుగా రాయిల్ల జనార్థన్,ముఖ్య సలహాదారుడుగా గంగాధరి సురేష్, నూతన అధ్యక్షుడుగా శ్రీగద్దె సుమన్ ,ఉపాధ్యక్షులుగా కొయల్ కర్ వినోద్,తొగిటి రవితేజ, ప్రధాన కార్యదర్శి మోర శశికాంత్,కోశాధికారిగా గట్టు నవీన్ కుమార్ , సంయుక్త కార్యదర్శిలుగా దువ్వాక కృష్ణ చైతన్య,శ్రీ గద్దె శ్రావణ్ కుమార్,కార్యవర్గ సభ్యులు పారిపెల్లి శివ ప్రసాద్,కటుకం శివ కుమార్,గట్ల తరుణ్,కొరల్ కర్ ప్రవన్,కుంబలకర్ వెంకటేష్,కట్టెకొల అకిలేష్ లను ఏకగ్రీవంగా శ్రీ భవానీ సేవా సమితి సభ్యులు అందరు ఎన్నుకున్నారు.

వికలాంగుల పింఛన్ల కొరత, తక్షణమే పరిష్కారం కావాలి.

వికలాంగుల పింఛన్ల మాటమర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున వికలాంగుల నాయకుడు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ… గత నాలుగు సంవత్సరాలుగా వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా సైట్ బంద్ చేసి వారి జీవితాలతో చెరగట మాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తాగిన.బుద్ధి చెప్పాలన్నారు. కొత్త పింఛన్లు రాక వికలాంగులకు సరియైన తిండి లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధించిన జిల్లా అధికారులు తక్షణమే వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆన్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు కొత్త పిక్చర్లు ఇవ్వడానికి సైట్ ఓపెన్ చేసి పింఛన్లు మంజూరు చేసివారిని ఆదుకోవాలని కోరారు.

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు..

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు

రైతు శ్రేయస్సును మరిచిన.. కాంగ్రెస్ ప్రభుత్వం

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రాజును చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది.

రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్.

బాలానగర్ /నేటి ధాత్రి

బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు కలగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను గాలికి వదిలేసారన్నారు. సకాలంలో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ఆలస్యం జరిగితే రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్ల అవినీతి అవస్తమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. వచ్చే మూడేళ్ల తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీపీ కమల, లక్ష్మయ్య, గోపి నాయక్, లక్ష్మణ్ నాయక్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

వర్తక సంఘ నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T125458.443.wav?_=4

 

వర్తక సంఘ నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణ బిజోన్ వర్తక సంఘం నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గాన్ని శ్రీలక్ష్మి గణేష్ మండపం వద్ద వర్తక సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి కొండ కుమార్, కోశాధికారి ఏముల దేవేందర్ రెడ్డి,
సహాయ కార్యదర్శి గోక శ్రీనివాస్, ప్రచార ప్రతినిధి పరికిపండ్ల రాజు, గౌరవ అధ్యక్షులు పాలకుర్తి గంగాజలం,గౌరవ సలహాదారులు ఆడెపు లక్ష్మణ్, వెంగళదాసు సత్యనారాయణ, బత్తుల శ్రీనివాస్,ఆడెపు తిరుపతి, ఉపాధ్యక్షులు గుండా రమేష్ కేతుపల్లి నారాయణరెడ్డి కొక్కుల సతీష్ గడ్డం శ్రీనివాస్, బండి మల్లేష్ లను ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఆడెపు కృష్ణ మాట్లాడారు. బి జోన్ వర్తక సంఘం సభ్యుల సమస్యల పరిష్కారానికి తోడ్పడతానని,వర్తక సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version