వర్తక సంఘ నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T125458.443.wav?_=1

 

వర్తక సంఘ నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణ బిజోన్ వర్తక సంఘం నూతన అధ్యక్షులుగా ఆడెపు కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గాన్ని శ్రీలక్ష్మి గణేష్ మండపం వద్ద వర్తక సంఘం సభ్యులు ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి కొండ కుమార్, కోశాధికారి ఏముల దేవేందర్ రెడ్డి,
సహాయ కార్యదర్శి గోక శ్రీనివాస్, ప్రచార ప్రతినిధి పరికిపండ్ల రాజు, గౌరవ అధ్యక్షులు పాలకుర్తి గంగాజలం,గౌరవ సలహాదారులు ఆడెపు లక్ష్మణ్, వెంగళదాసు సత్యనారాయణ, బత్తుల శ్రీనివాస్,ఆడెపు తిరుపతి, ఉపాధ్యక్షులు గుండా రమేష్ కేతుపల్లి నారాయణరెడ్డి కొక్కుల సతీష్ గడ్డం శ్రీనివాస్, బండి మల్లేష్ లను ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఆడెపు కృష్ణ మాట్లాడారు. బి జోన్ వర్తక సంఘం సభ్యుల సమస్యల పరిష్కారానికి తోడ్పడతానని,వర్తక సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-48-4.wav?_=2

గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ఓదెల (పెద్దపెల్లి జిల్లా) నేటిదాత్రి;

ఓదెల మండలం లోని మడక గౌడ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షులుగా రంగు కుమారస్వామి గౌడ్, ఉపాధ్యక్షులుగా గట్టు మహేష్ గౌడ్, సభ్యులు నల్లగోని నరేందర్ గట్టు వీరస్వామి సిరిసేటి కిరణ్ దేశిని రమేష్ మేడగొని చిరంజీవి మొగిలి గాజర్ల శ్రీనివాస్ గట్టు సురేష్ లను గౌడ కుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌడ సంఘ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ మజీద్ కమిటీ పై కలెక్టర్ కు పిర్యాదు..

అక్రమ మజీద్ కమిటీ పై కలెక్టర్ కు పిర్యాదు

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

తొర్రూరులో ఇటీవల ఎన్నుకున్న జామా మజీద్ కమిటీపై సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ముస్లిం నాయకులు తెలిపారు. పట్టణ కేంద్రంలో వారు మాట్లాడుతూ
గత 40 ఏళ్లుగా ప్రతి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయని,ఆ ప్రకారం 2020లో ఎన్నికలు జరిగి ముహమ్మద్ అబ్దుల్ అలీమ్ అధ్యక్షునిగా ఎన్నికై కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ కాలపరిమితి 2022లో ముగిసిందని. సాంప్రదాయ ప్రకారం 2022లోనే కొత్త ఎన్నికలు జరిగేదని, అధ్యక్షుడు ఎన్నికలు వాయిదా వేస్తూ గత 3 సంవత్సరాలుగా పదవిలో కొనసాగుతున్నారని అన్నారు. ఎన్నికలు జరపమని ప్రశ్నించగా జిల్లా వక్ఫ్ బోర్డు అధికారి ద్వారా నోటీసులు పంపించి బెదిరింపులకు గురిచేస్తున్నారని, దీంతో ఎన్నో శారీరక మానసిక ఇబ్బందులు పడ్డామన్నారు.ఈనెల 11న మాజీ అధ్యక్షుడు అబ్దుల్ అలీమ్ స్థానిక ముస్లింలకు తెలియకుండా, ముగ్గురు వ్యక్తుల సమక్షంలో ఏకగ్రీవ ఎన్నికల పేరుతో కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించుకున్నారని అన్నారు. ఈ విషయాన్ని శుక్రవారం మసీదులో ప్రశ్నించగా దిక్కున చోట చెప్పుకోమని భయబ్రాంతులకు గురిచేశారని వాపోయారు.మాకు నోటీసుల ద్వారా, మస్జిద్ లో గొడవలు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని
దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో సానుకూలంగా స్పందించి వచ్చే శుక్రవారం మస్జిద్ కి అధికారులను పంపించి ముస్లింల అభిప్రాయం మేరకు ఎన్నికల నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ అంజూమ్, అబ్దుల్ రెహమాన్, ముహమ్మద్ సాబేర్, యాకుబ్ పాషా, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ బరిలో ఉంటాడని తెలిసే మహేష్ పై దాడి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T175746.314.wav?_=3

సర్పంచ్ బరిలో ఉంటాడని తెలిసే మహేష్ పై దాడి.

తీన్మార్ మల్లన్న బిసి జేఏసీ రవి పటేల్.

చిట్యాల, నేటిధాత్రి :

 


 

 

సోమవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో
తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్చార్జ్ రవి పటేల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూచిట్యాల మండలం కల్వపల్లి గ్రామానికి చెందిన పంచిని మహేష్ యాదవ్ పైన ఆగస్టు 15 రోజున అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్ భార్య పిల్లలు వారి మామ ఇతరులపై దాడి చేశారని బిసి పొలిటికల్ జేఏసీ నీ కలవడం జరిగింది, మహేష్ పై భౌతిక దాడులు సమంజసం కాదని ఒక బీసీ యాదవ బిడ్డను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కొట్టడం బీసీ పొలిటికల్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నాం
గుడికి సంబంధించింది గానీ ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలి గాని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు
మహేష్ యాదవ్ కాల్వపల్లి గ్రామానికి సర్పంచిగా పోటీ చేస్తాడని అక్కస్సుతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అగ్రవర్ణాలు అని మా దృష్టికి రావడంతో మహేష్ ను తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ నుండి సర్పంచి అభ్యర్థిగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబెట్టడానికి మేము కార్యచరణ తీసుకొని కాల్వపల్లి లో మహేష్ యాదవ్ ను గెలిపించుకుంటామని
రవి పటేల్ అన్నారు ఈ కార్యక్రమంలో
రోడ్డ శ్రీను ప్రణీత్ వెంకటేష్ అఖిల్ సమిరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు పెడితెనే పంచాయతీలకు ఫండ్స్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-1-5.wav?_=4

ఎన్నికలు పెడితెనే పంచాయతీలకు ఫండ్స్

ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం కొర్రీలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

చిన్న పంచాయతీల పరిస్థితి దారుణం..

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఇటు కేంద్రం, అటు ఎస్ఎఫ్సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధులు ఆగిపోయాయి. నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు, డ్రైనేజీల నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్, ట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలు వంటి వాటి కోసం ఇబ్బందిగా మారింది. వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతులు, తాగునీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు వస్తున్నాయని సెక్రటరీలు వాపోతున్నారు. ఆదాయ వనరులు లేని చిన్న పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. అసలే వర్షా కాలం.. గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతాయని, పారిశుధ్య చర్యలు ఎలా చేపట్టాలో తెలియడం లేదని సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీలు నిధుల లేమితో సతమతమ వుతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో పల్లెల్లో అభివద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.3,600 కోట్లు రావాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులుని లిచిపోయాయి. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసినా… రూల్స్ ఒప్పుకోవని చెప్పిన్న ట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశం కారణంగా

◆:- మంత్రి సీతక్క విన్నవించినా ససేమిరా

◆:- కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ.3,600 కోట్లు

◆:- ఎస్ఎఫ్సీ నుంచి మరో రూ.1,500 కోట్లు

◆:- రూ.70 కోట్లకుపైగా స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీల సొంత నిధులతో గ్రామాల్లో పనులు

◆:- బీసీ రిజర్వేషన్ల ఆలస్యంతో స్థానిక ఎన్నికలు ఆలస్యం

స్థానిక ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కార్ కసరత్తు చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో నిధులివ్వాలని మంత్రి అడగగా, నిబంధనల ప్రకారం గ్రామాల్లో పాలక వర్గాలు కొలువుతీరితేనే నిధులు చెల్లిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 15 నెలలుగా స్టేట్ ఫైనాన్స్ ఫండ్ (ఎస్ఎఫ్సీ) రూ.1,500 కోట్లపైనే రావాల్సి ఉండగా.. ఆ నిధులు కూడా పల్లెలకు అందలేదు. దీంతో పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు తమ సొంత నిధులతో పల్లెల్లో అభివద్ధి పనులు చేప డుతున్నారు.

రూ. 3,600 .. కోట్లు పెండింగ్

రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసి 18 నెలలు దాటింది. 2024 ఫిబ్రవరిలో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. అప్పటి నుంచి పాలక వర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను ఆపేసింది. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ప్రతి నెలా రూ.180 కోట్లు రావాల్సి ఉండగా.. 18 నెలలకు మొత్తం రూ.3,600కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయి పాలక వర్గాలు ఏర్పాటు చేస్తేనే ఈ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఢిల్లీ వెళ్లి నిధులు విడుదల చేయాలని పలుమార్లు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. పం చాయతీల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సన్నాహాలు చేస్తోందని, 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం కసర త్తు చేస్తుందని చెప్పారు. త్వరలో స్థానిక ఎన్నికలపై సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులివ్వాలని కోరినా.. కేంద్రం నిరాకరించింది.

రూ. 70 కోట్లకు పైగా సొంత నిధులు..

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎఫ్సీ నిధులు సైతం 18 నెలలుగా విడుదల కావడం లేదు. మొత్తం రూ.1,560 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. నిధులు రాకపోవడంతో పల్లెల్లో వివిధ పనులకు
తామే సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత నిధులు రూ.70 కోట్లకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని వాపోయారు. కొన్ని నిధులు స్థానిక రాబడి (పన్నులు, ఫీజులు) నుంచి సమకూరుతున్నా.. అభివృద్ధి పనులకు సరి పోవడం లేదని పేర్కొంటున్నారు. నిధుల కొరత కారణంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టలేని పరి స్థితి నెలకొందని చెప్పారు. పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర నిధులు కీలక మని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పల్లెలకు వచ్చే నిధులను గ్రామాల్లో విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు. ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు. నిధులు ఆగిపోవడంతో ఈ చె లింపులు నిలిచిపోయాయి. తాము సొంతంగా ఖర్చు చేసిన వాటికి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు కోరుతున్నారు.

బిట్స్ కళాశాలలో మాక్ ఎలక్షన్ ల సందడి..

బిట్స్ కళాశాలలో మాక్ ఎలక్షన్ ల సందడి

ఓటు హక్కుతో సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలి

పాఠశాల ప్రిన్సిపాల్ పిండి.యుగేందర్

పరకాల నేటిధాత్రి
పట్టణంలోని బిట్స్ పాఠశాలలో ప్రిన్సిపల్ పిండి యుగేందర్ ఆధ్వర్యంలో మాక్ ఎలక్షన్ల సందడి బిట్స్ పాఠశాలలో విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించి తద్వారా ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించారు.విద్యార్థులు ఉత్సాహంగా మాక్ పోలింగ్ లో పాల్గొన్నారు.పాఠశాల ఎస్పీఎల్,ఏఎస్పీఎల్ గా విద్యార్థులు నామినేషన్లు దాఖలు చేశారు.ఉపాధ్యాయులు ఎన్నికల అధికారులుగా ఉంటూ అభ్యర్థులకు గుర్తులను కేటాయించి విద్యార్థులందరినీ ఉత్సాహంగా మాక్ పోలింగ్ లో పాల్గొనేటట్లు చేశారు.విద్యార్థులు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయడం చాలా బాగుందని తెలియజేశారు.మాక్ ఎలక్షన్ లో భాగంగా గెలుపొందిన ఎస్పీఎల్ గా సూర.చాందిని,ఏ ఎస్పీఎల్ గా తంగళ్ళపల్లి,యశస్విని అభ్యర్థులను బిట్స్
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తూ ఓటు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని భవిష్యత్తులో ఓటును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని తెలియజేశారు.పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థ ఎన్నికల్లో భాజపా పార్టీ సత్తా చాటుతుంది.

స్థానిక సంస్థ ఎన్నికల్లో భాజపా పార్టీ సత్తా చాటుతుంది. మెట్ పల్లి బీజేపి కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు..
మెట్ పల్లి ఆగస్ట 1 నేటి దాత్రి
రాబోయే స్థానిక సర్పంచ్,ఎంపీటీసి ఎన్నికల్లో బిజెపి పార్టీ సత్తా చాటుతుందని అధికార కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బుద్ధి చెబుతారని బిజెపి రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు అన్నారు .మెట్పల్లి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పడకేసిందని, వర్షాకాలం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో దోమల బెడదతో పాటు ఇతర సమస్యలతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో సర్పంచ్,ఎంపీటీసి ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాల్లో బిజెపికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉండడంతో పోటీ చేసిన ప్రతి వద్ద గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు, అధికార పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ సంవత్సర కాలంలోనే వ్యతిరేకత వచ్చిందని అందుకు ఉదాహరణ గాని రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు దీంతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇప్పుడు కాంగ్రెస్ బిజెపి మధ్యనే పోటీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలు గమనిస్తున్నారని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత ఎంతో ముందు చూపుతో బిజెపి ఎన్నికలలో గెలిపిస్తారని అన్నారు స్థాయి నాయకులు భాజపా పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని, నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆధ్వర్యంలో పసుపు బోర్డు రావడం రైతుల్లో ఆనందం వెల్లులిసిందని రానున్న రోజుల్లో ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా అటు ప్రజలకు రైతులకు అందిస్తామని ఆయన అన్నారు అత్యధిక మెజార్టీలతో అత్యధిక స్థానాలు భాజపాటి స్వాధీనం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బిజెపి నాయకులు సుఖేందర్ గౌడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

భీమారం స్థానిక ఎన్నికల బీజెపి కార్యచరణ…

భీమారం స్థానిక ఎన్నికల బీజెపి కార్యచరణ

జైపూర్,నేటి ధాత్రి:

భీమారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్ అధ్యక్షతన స్థానిక ఎన్నికల కార్యచరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే మండల అధ్యక్షుడు కాసెట్టి నాగేశ్వర్ రావ్ ఈసందర్భంగా మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్,ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని,అభ్యర్థుల గెలుపుకోసం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిదిగా జాడి తిరుపతి,భీమారం మండల ఎన్నికల కన్వీనర్ మాడెం శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్ యాదవ్,ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్,కొమ్ము దుషాంత్,కత్తెరసాల కార్యదర్శి తాటి సమ్మగౌడ్,దుర్గం జేనార్ధన్,అవిడపు సురేష్, మంతెన సుధాకర్,మేడి విజయ కామెర జెనార్ధన్, కొమ్ము కుమార్ యాదవ్,వేల్పుల సతీష్ పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది ఎవరో!

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది ఎవరో!

స్థానిక సమరం.. ఎవరికి అనుకూలం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T162915.948.wav?_=5

శాయంపేట నేటిధాత్రి:

తెలంగాణలో 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలన తర్వాత గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కొలువు దీరి 20 నెలల పాటు పాలన పూర్తయింది. ఇక ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాం టి అంచనాలు ఉన్నాయని చర్చ ఆసక్తికరంగా నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తు న్నారు. పదేండ్ల టిఆర్ఎస్ పాలనలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడితే గెలిచిన అనం తరం తమను పట్టించుకో కుండా పార్టీ ఫిరాయింపు దార్లకే పెద్ద పీట వేస్తున్నారని చాలా రకాలుగా పార్టీ నాయకులు మండిప డుతున్నారు.

పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డాం

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలను కాదని గత బిఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్ద అనేక పైరవీలు ఎమ్మెల్యేని భ్రష్టుపట్టిన వ్యక్తులు మళ్లీ తాజా ఎమ్మెల్యే వద్ద చేరినారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీ జెండా మోసిన అసలు సిసలు కార్యకర్తలను పట్టించు కోకపో వడం లేదని తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి.

ముందుగా సొంత పార్టీ నేతలకు భరోసా కల్పించాలి

ముఖ్యమంత్రి పదవి ప్రమాణం చేసిన నాటి నుండి నేటి వరకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు మరికొన్ని ప్రజలకు మేలు చేసేదిగా ఉన్నాయి. ప్రభుత్వం కొలువుదీరిన సమయం చాలా తక్కువగా ఉంది. అనేక సంక్షేమ పథకాల అమలుకు ప్రయత్నిస్తున్న మాట నిజమే. మండల కేంద్రంలో ఉన్న పలు రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల సంక్షేమా నికి పెద్దపీట.అయితే అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకమైన బిజెపి అధికా రంలో ఉందిరానున్న ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కాంగ్రె స్ పార్టీ ముందున్న లక్ష్యం. మండలం లోని పలు గ్రామాల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుని ఏ రాజకీయ పార్టీకి వరిస్తుందోనని ప్రజల ఆలోచ నలు! అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం వ్యూహ రచనలు చేస్తున్నారా!

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి..

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

డా వన్నాల వెంకటరమణ

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు నాయిని అనూష అశోక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకటరమణ హాజరయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటికి సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ వన్నాల వెంకటరమణ పిలుపునిచ్చారు.
ఈ సమావేశానికి మండల ఎన్నికల ప్రభారి కుడికాల శ్రీధర్ హాజరైనారు.ఈ సందర్భంగా డాక్టర్ వన్నాల వెంకటరమణ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుండి మండల అధ్యక్షుల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన అద్భుతమైన పాలన, అమృత కాల సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమ పథకాలు, అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
నరేంద్ర మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని వన్నాల వెంకటరమణ అన్నారు. ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎన్నికల్లో సైనికుడిలా పనిచేయాలని, నెక్కొండ మండలంలో ప్రతి బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు కష్టపడాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దామచర్ల రామారావు, సుధానపు సారయ్య, ప్రధాన కార్యదర్శి రాంపల్లి రాజగోపాల్, కార్యదర్శులు సూత్రపు శీను, మల్లం మల్లేష్, సీనియర్ నాయకులు శ్రీరంగం శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు సింగారపు సురేష్, సురేతాలూరి లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ పింగిలి మోహన్ రెడ్డి, లౌడియా శ్రీనివాస్, భరతం రాజు, ఉల్లెంగుల రాజు, కందుకూరి వెంకన్న, బొమ్మనపల్లి జయప్రకాష్, తౌడుశెట్టి శ్రీనివాస్, గుగులోతు వెంకన్న, అనిల్, యువ నాయకులు కుడికాల సుధీర్, తేజావత్ వంశీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

భారతీయ జనతా పార్టీ మద్దూర్ మండలం, అధ్యక్షులు మోకు ఉదయ్ రెడ్డి

మద్దూరు నేటిధాత్రి

జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం లో నిర్వహించిన “స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల” లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్ . పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మద్దూరు మండల అధ్యక్షుడు మోకు ఉదయ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. అని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్ అన్నారు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోంది. అన్నారు బిజెపి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి. అని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుండి, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బిజెపి కైవసం చేసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాపాక బుచ్చిరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబెర్ కూరెళ్ల కిరణ్ గౌడ్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కొండా నాగమణి, ప్రధాన కార్యదర్శులు బొంగోని బాలు, బియ్య రమేష్,సోగాలా మనోజ్,కృష్ణా రెడ్డి, మేక సుదర్మ, చింతల రాజు, చందు, శ్రీకాంత్, బాలకృష్ణ, రాజు మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

స్థానిక ఎన్నికలతో పాటు చేనేత సహాకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి.

స్థానిక ఎన్నికలతో పాటు చేనేత సహాకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి

అఖిల భారత పద్మశాలి యువజన సంఘ మండల అధ్యక్షులు బాసాని సాయితేజ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని చేనేత సహకార సంఘం స్థానిక ఎన్నికల్లో పాటు చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించాలి. అఖిలభారత పద్మశాలి యువజన సంఘం మండల అధ్యక్షుడు బాసని సాయితేజ మాట్లాడుతూ గత 7 సంవత్స రాల నుండి చేనేత సంఘము ఎన్నికలు జరుగకా ఇంచార్జి లతో సంఘము నడుస్తుంది. సంఘలో సరైన ఉపాధి లేక చేనేత వస్త్ర పరిశ్రమ మరు గున పడుతుందని నాడు వస్త్ర పరిశ్రమల్లో అగ్రగామిగా ఉన్న శాయంపేట వస్త్ర పరిశ్రమనేడు మరుగున పడటం బాధాకరo ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించి పద్మశాలి కార్మికు లకు అండగా ఉండాలి. ఇప్ప టికైనా వెంటనే ఎన్నిక జరిగితే శాయంపేటను రాష్టంలో అగ్ర గామి వస్త్ర పరిశ్రమగ తీర్చిది ద్దచ్చు .త్వరగా ఎన్నికలు నిర్వ హించి పద్మశాలి కార్మికులను ఉపాధి కలిపించాలి అలాగే సంఘలో నూతన సభ్యతలు ఇవాలి మరియు పద్మశాలి యువతకి ఉపాధి కల్పిం చాలని కోరడమైనది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటి చెబుతాం…

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటి చెబుతాం… కాషాయ జెండా ఎగరవేస్తాం – బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ లోగడ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడం కోసం ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని, నేడు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం మళ్లీ కొత్త రాజకీయ డ్రామాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టిందని బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బిజెపి రామడుగు మండలశాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాశాల సమావేశం రామడుగు మండలం షానగర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్ నందు జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆరు గ్యారంటీలతో, 420 హామీలతో ప్రజలను ఆదుకుంటామని కాంగ్రెస్ మాయమాటలు, అబద్ధాలు చెప్పి ప్రజానీకాన్ని మోసం చేసిందన్నారు. పథకాల అమలు కోసం దాదాపు రెండేళ్ల కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజా పాలన పేరిట ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి చేతులు దులుపుకోవడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. అరకోరపథకాలను అమలు చేస్తూ, ఇష్యూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి సక్రమంగా అమలైంది తప్ప, మిగతా ఏఒక్కటీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. రైతు రుణమాఫీ అరకోర చేసిందని, పింఛన్లు అందించడం లేదని, నిరుద్యోగ భృతిని అటకెక్కించిందని, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ చెప్పిన లెక్కలేనన్ని హామీలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీవన్నీ ఉద్దెర ముచ్చట్లనే విషయం ప్రజలందరికీ అర్థమైందని, మాటల గారడితో ప్రజలను మోసగించడం కాంగ్రెస్కే చెల్లిందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసానికి ప్రతిఫలం లభించిందని , అందుకే లోగోడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆప్రభుత్వానికి ఉద్యోగులు, పట్టభద్రులు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మళ్లీ కాంగ్రెస్ సర్కార్ లబ్ధి పొందడానికి కుటిలప్రయత్నాలు, రాజకీయాలు మొదలుపెట్టిందన్నారు. బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ అంశంతో రాజకీయ నాటకాలు మొదలుపెట్టిందని ఆయన విమర్శించారు. పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు వర్తించే విధంగా బీసీ రిజర్వేషన్ ను చేపట్టిందన్నారు. దీనివల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. జరగబోయే జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు దిమ్మదిరిగే ఫలితాలు అందిస్తారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి జరగబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం లభిస్తుందన్నారు. ప్రజలంతా బిజెపి మోదీ కేంద్ర ప్రభుత్వ పనితీరుపై విశ్వాసంతో ఉన్నారన్నారు. గ్రామాల్లో మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతుందనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. అందుకే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటేలా తగిన కార్యాచరణలతో ముందుకు కొనసాగడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండలశాఖ అధ్యక్షులు మోడీ రవీందర్, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, ఎన్నికల ప్రభరి జాడి బాల్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, బండ తిరుపతి రెడ్డి,వివిధ మోర్చాల అధ్యక్షులు, నాయకులు, శక్తి కేంద్రం ఇంఛార్జిలు, బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు హాజరయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి.

స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-64.wav?_=6

నర్సంపేట,నేటిధాత్రి;

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ పిలుపునిచ్చారు.మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఎంపీటీసీ పరిధి బిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షులు కందిపల్లి శంకర్ అధ్యక్షతన నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్,ఎంపిటిసి పరిధి ఇన్చార్జ్ శానబోయిన రాజ్ కుమార్ పాల్గొని ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ప్రాంతానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను నెమరువేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ జిల్లాఆసుపత్రిగాఏర్పాటు అలాగే జిల్లా కేంద్రంలో ఉండే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయించారని అన్నారు.మండల కేంద్రాలకు లింకు రోడ్లు వేయడం ప్రతి గ్రామంలో ఇంటర్నల్ రోడ్లు 100 శాతం నిర్మించడం,రైతులకు సరిపడ యూరియా, రైతు బందు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీలో అందించడంలో నర్సంపేట ముందు వరుసలో ఉందన్నారు.కేసీఆర్ హామీలు ఇవ్వని అనేక సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేశారని గుర్తుకు చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పాలన
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పట్ల ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు నాయకులకు సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల పట్ల ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాజ్ కుమార్ తెలిపారు. వచ్చే స్థానిక జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలలో గ్రామంలో అభ్యర్థి గెలుపు కొరకు అందరు కంకణ బద్దులమై ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహమ్మదాపురం పిఎసిఎస్ చైర్మన్ ఊరటి మహిపాల్ రెడ్డి,డైరెక్టర్లు నాంపల్లి సుధాకర్,వ్యవసాయ కమిటీ అధ్యక్షులు రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయ మోహన్,మండల నాయకులు ఊరటి రవి,తాళ్లపల్లి వీరస్వామి,మాజీ సర్పంచ్ దారావత్ రాజు, మాజీ ఉపసర్పంచ్ ఉరటి జయపాల్ రెడ్డి, గుండెబోయిన రవి, కక్కర్ల సాంబయ్య, ఏడాకుల రమణరెడ్డి,దుగ్గొండి మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొర్కటి రాజు కుమార్, గ్రామ పార్టీ సభ్యులు ఉప అధ్యక్షులు ఊరటి రామచంద్రు,మంద రాజు,అదర్ సండే రాజు, గోర్కటి రఘుపతి,కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలు.!

ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?

కార్మిక సంఘాల నాయకులను గనుల పైన నీలదీయండి

కార్మికులకు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం పిలుపు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలలు కాలం గడుస్తున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు ఎప్పుడు?అని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు నిలదీశారు. గురువారం నస్పూర్ కాలనీలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం బెల్లంపల్లి రీజినల్ సెక్రెటరీ సమ్ము రాజయ్య ఆధ్వర్యంలో టీఎస్ యుఎస్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ,సింగరేణిలో ఎన్నికలు జరిగి 18 నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికలలో గుర్తింపు పొందిన ఏఐటీయూసీ,ప్రాతినిత్య ఐఎన్టియుసి కార్మిక సంఘాలు ఎన్నికలలో పెద్ద పెద్ద మేనిఫెస్టోలలో కార్మిక సమస్య చేర్చి మా సంఘానికి ఓట్లు వేసి గెలిపించండి మీకు ఇస్తున్న హామీలు తూచ తప్పకుండా కంపెనీతో కొట్లాడి పోరాడి సమస్యలు పరిష్కరిస్తామని కార్మికుల ఓట్లు దండుకొని గెలుపొందిన ఏఐటీయూసీ,ఐ ఎన్ టి యు సి కార్మిక సంఘాల నాయకులు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని, కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పరిష్కరింపబడలేదని గుర్తింపు ప్రాదీనీత్య సంఘాలు కార్మిక హక్కులు సాధించడంలో విఫలం చెందాయని,కేవలం ఈ రెండు సంఘాలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని అన్నారు. కార్మికుల హక్కుల కోసం కాదని కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీల అమలకై కంపెనీతో గుర్తింపు ప్రాతీనిద్య సంఘాలు పోరాడాలని గత ఏడు సంవత్సరాల కాలం నుండి సింగరేణిలో మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని,కార్మికులకు 300 గజాల ఇంటి స్థలం పట్టణ ప్రాంతాలలో కేటాయించాలని,శరీరక శ్రమ మీద ఆధార పడి పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని అన్నారు.బొగ్గు గనుల ప్రాంతంలో బొగ్గు ఆదరిత పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సింగరేణిలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. డిపెండెంట్ ఉద్యోగాల ఇన్వల్యూషన్ విషయంలో కొనసాగుతున్న కుంభకోణంపై ధర్యాప్తి జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుల వారసునికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.బొగ్గు తట్ట పనిని కూడా సింగరేణి సంస్థ నిర్వహించాలి.ఎట్టి పరిస్థితులలో ప్రవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించరాదని డిమాండ్ చేశారు.సింగరేణిలో అక్రమంగా తొలగించిన డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనులను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను ఆపాలి.సింగరేణి పబ్లిక్ రంగ సంస్థల కొనసాగించాలి. కేంద్రం బొగ్గు గనులను బహిరంగంగా వేలం వేసే పద్ధతిని ఆపి తెలంగాణకే సింగరేణి సంస్థలను అప్పజెప్పాలి. 2024-2025 కంపెనీకి వచ్చిన లాభాల నుండి 40 శాతం లాభాలను కార్మికులకు పంచాలి.సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల కోసం ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి కుమారస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నీరేటి రాజన్న,గోదావరిఖని రీజినల్ కార్యదర్శి ఎం ఎఫ్ బేగు, పి.చంద్రశేఖర్,గుంపుల సారయ్య తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ.

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ

డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్

కరీంనగర్, నేటిధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉందని. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిపిఐ శ్రేణులు సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం జమ్మికుంటలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో సిపిఐ పోటీ చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే మండలాల వారిగా పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటూ కార్యాచరణను రూపొందించుకుంటూ ముందుకు వెళ్తామని స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలిపిదేయంగా ఎన్నికల బరిలో నిలుస్తామని హుజురాబాద్ నియోజకవర్గంలో ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలకు పోటీ చేస్తామని ఇందుకు అనుగుణంగా క్యాడర్ ను సన్నద్ధం చేస్తున్నామని ఆయన తెలియజేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నేటికీ అర్హులకు పంపిణీ చేయకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు వెచ్చించి డబుల్ బెడ్ రూమ్లు నిర్మించి పేదలకు పంచకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయని అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దేనమిది నెలలు గడుస్తుందని అటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయకపోవడం పేదల పట్ల ఆపార్టీలకు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుందన్నారు. తక్షణమే జమ్మికుంట మండలంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లలో ఇండ్లను పంపిణీ చేయాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకొని అర్హులైన వారందరికీ సిపిఐ ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. ఈవిలేకరుల సమావేశంలో జమ్మికుంట, ఇల్లందకుంట సిపిఐ మండల కార్యదర్శిలు గజ్జి ఐలయ్య, మాదారపు రత్నాకర్ నాయకులు బొజ్జం రామ్ రెడ్డి, సారయ్య, శంకర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయమని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కలిసి, మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మీడియాతో మాట్లాడారు.

Congress party.

సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని బలహీన వర్గాల హక్కుల కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రణాళికలో కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ తెర మీదకు తీసుకోవచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగన చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలోప పట్టణ అధ్యక్షుడు దేవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పం కిషన్ బుర్ర కొమురయ్య దాట్ల శ్రీను కురిమిళ్ళ శ్రీను రమణాచారి కోమల స్వామి కేతిరి సుభాష్ పద్మ చల్లూరు సమ్మయ్య కడారి మాలతి మాజీ కౌన్సిలర్లు, బిసి సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

◆: ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దాం

◆: జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు మహమ్మద్ షౌకత్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం తేద్దామని జహీరాబాద్ యువనాయకులు రాంజోల్ మండలం మహమ్మద్ షౌకత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చారిత్రాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ శ్రేణులు, నాయకులు సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బిఆర్ఎస్, బీజేపీల చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దామని, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో బలంగా ఉన్న ఆ పార్టీలను ఎదుర్కొనేందుకు నావంతు కృషి చేస్తానాని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, భూభారతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేద వర్గాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ 500 లకే వంట గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డుల మంజూరి, ఖాళీ పోస్టుల భర్తీ తదితర పథకాలు అమలుతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని, వారికి స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పిస్తునదని స్పష్టం చేశారు. త్వరలో సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించి పార్టీ శ్రేణుల కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిగా మంత్రి గారి మద్దతు ఉంటుందని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీదే గెలుపు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీదే గెలుపు

మాటేడు ఎంపీటీసీ పరిధి లో
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని బిఆర్ఎస్ తొర్రూర్ మండల పార్టీ ఇన్చార్జ్ శ్రీరామ్ సుధీర్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు మరియు మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ గార్లు అన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:

 

గౌరవ శ్రీ మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు* చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది
తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు చేసింది ఏమీలేదు అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలలో కోతలు ఎగవేతలు తప్ప చేసింది ఇచ్చింది శూన్యం అన్నారు..
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తగిన బుద్ధి చేపటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రైతు బంధు రెండు పంటలకు ఎగనామం పెట్టారని రైతు రుణమాఫీ 60% రైతులకు కూడా జరగలేదని తెలిపారు.
మహిళలకు తులం బంగారం మరియు 2500 రూపాయలు ఇస్తానని మోసం చేసారు. భూమి లేని పేదలకు 12000 ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు.
మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మొదలు పెట్టిన అభివృద్ధి పనులు ఎందుకు పూర్తి చేయలేదని స్థానిక ఎంఎల్ఏ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు..
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరింది.తప్ప పేద ప్రజలకు వచ్చింది శూన్యం అన్నారు…
ఈ కార్యక్రమంలో తొర్రూర్ పట్టణ పార్టీ అధ్యక్షులు బిందు శ్రీనివాస్ ,తొర్రూర్ పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్ ,తొర్రూర్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, కాలు నాయక్ ప్యాక్స్ డైరెక్టర్ జనార్దన్ రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు సముద్రాల శీను, బిక్షపతి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ మరియు సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం..

గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని మున్సిపాలిటీ

రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

 

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖామంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డులో 28 లక్షల నిధులతో సిసి రోడ్డు, చిల్డ్రన్ పార్క్, డ్రైనేజీ, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియాలకు శంకుస్థాపన చేశారు.

రైల్వే గేటు పై నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై 15 లక్షల నిధులతో నిర్మించిన మెట్లను ప్రారంభించారు.

అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.

 

Congress

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలనను అందిస్తున్నారని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మునిసిపాలిటీలో అభివృద్ధి శూన్యమని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు.

మున్సిపాలిటీ లోని ప్రతి వార్డును అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి 25 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకొచ్చానని గుర్తు చేశారు.

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.

దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అవకాశం కల్పించాలని పట్టణ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు మారేపల్లి నరేష్ మంత్రి కి వినతిపత్రం అందించారు.

Congress

 

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, మాజీ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, మహంకాళి శ్రీనివాస్, వేల్పుల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు పొలం సత్యం, పనాస రాజు, సంఘ రవి, మేకల రమేష్ మహిళా నాయకురాళ్ళు పుష్ప , నాయకులు, యూత్ లీడర్లు ,ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version