పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్.

పేదింటి అడబిడ్డలకు కళ్యాణలక్మి షాదీముభారక్ పథకాలు ఒక వరం లాంటివి .

◆ -పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్

◆ – ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పట్టణం లోని గౌరి ప్యాలెస్ లో కళ్యాణలక్మి/షాదీముభారక్ సంబంధిత నియోజకవర్గ లోని 925 మంది లబ్దిదారులకు గాను ₹.92,607,300 /- విలువ గల చెక్కులను పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ గారితో కలిసి పంపిణీ చేసిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పథకాలు పేదింటి అడబిడ్డలకు వరప్రదాయినిలని .దేశంలో ఏ రాష్రంలో కూడా కళ్యాణలక్మి, షాదీముభారక్ లాంటి పథకాలు లేవని, పేదింటి అడబిడ్డలను కన్న తల్లిదండ్రులు పడే బాధలు తెలిసి సీఎం కేసీఆర్. ఈ పథకాలు ప్రవేశపెట్టారని, వారికి ఎప్పటికి రుణపడి ఉంటామని తెలిపారు.అలాగే ఇటీవలే ముఖ్య మంత్రి గారి జహీరాబాద్ పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల కొరకు నిధులను కేటాయిస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేశాం అని, కానీ ముఖ్యమంత్రి గారు ఎలాంటి నిధులను వరాలను ఇవ్వలేదు అని పువ్వు ఇవ్వక పోయినా కనీసం పత్రి అయినా ఇవ్వలేదు అని అన్నారు మోసపూరిత హామీలతో గద్దెను ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తూ కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక పథకం లో 1,00,116 తో పాటుగా తులం బంగారం ఇస్తాం హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండలల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,సంజీవ్ రెడ్డి,వెంకటేశం,పాక్స్ చైర్మన్ మాచెందర్, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​.!

కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​ ఇన్​చార్జి వెలిచాల రాజేందర్​ రావు
నేతృత్వంలో పురుమళ్ల శ్రీనివాస్​పై పీసీసీ అధ్యక్షునికి-కాంగ్రెస్​ ముఖ్యనేతల ఫిర్యాదు

పెద్ద సంఖ్యలో హైదరాబాద్​ తరలివెళ్లిన కాంగ్రెస్​ నాయకులు

కరీంనగర్ నేటిధాత్రి:

పీసీసీ అధ్యక్షునితో గాంధీభవన్​లో భేటి, శ్రీనివాస్​ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చ గత నెల 28 వతేదీ నాటి ఘటనపై నివేదిక తెప్పించుకొని శ్రీనివాస్​పై
చర్యలు తీసుకుంటామని నేతలకు పీసీసీ అధ్యక్షుని హామీ. సానుకూలంగా స్పందించిన మహేశ్​కుమార్​ గౌడ్​. గత నెల 28వ తేదీన కరీంనగర్​లో కాంగ్రెస్​ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా నిర్వహించిన సన్నాహాక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్​పై కరీంనగర్​ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్​చార్జి పురుమళ్ల శ్రీనివాస్​ పరోక్షంగా దూషణలకు దిగిన అంశంపై ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్​, పార్టీ పరిశీలకులు, ముఖ్యనేతల నుంచి నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షులు మహేశ్​ కుమార్​ గౌడ్​ కరీంనగర్​ కాంగ్రెస్​ పార్టీ ముఖ్య నేతలకు హామీ ఇచ్చారు. పార్టీ పరువు తీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. పార్టీ పరువు బజారుకు ఈడ్చే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్​లో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, బీజేపీ, బీఆర్​ఎస్​తో లోపాయికార ఒప్పందం చేసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్​పై దూషణలకు దిగుతూ, పార్టీ పరువు తీస్తున్న పురుమళ్లను శ్రీనివాస్​ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్​ చేయాలని కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​ ఇన్​చార్జి వెలిచాల రాజేందర్​ రావు నేతృత్వంలో కరీంనగర్​ జిల్లాకు రెండు వందల మంది కాంగ్రెస్​ ముఖ్యనేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్​ ముఖ్యనేతలు రెండు వందల మంది స్వచ్ఛందంగా మూకుమ్మడిగా సంతకాలు సేకరించి హైదరాబాద్ లోని గాంధీభవన్​కు​ తరలివెళ్లారు. వెలిచాల రాజేందర్​ రావు అధ్వర్యంలో కాంగ్రెస్​ ముఖ్యనేతలు గాంధీభవన్​లో పీసీసీ అధ్యక్షులు మహేశ్​కుమార్​ గౌడ్​ను కలిశారు. మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పురుమళ్ల శ్రీనివాస్​ను వెంటనే బహిష్కరించాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని విన్నవించారు. ఈసందర్భంగా పురుమళ్ల వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడితో సుదీర్ఘంగా చర్చించారు. గత నెల 28వ తేదీన జరిగిన సమావేశంలో పురుమళ్ల మంత్రి పొన్నంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దూషణలు, మంత్రిపై అక్కసు వెళ్లగక్కుతున్న వైనం, ఆయనతో పార్టీకి జరుగుతున్న నష్టం, తదితర అంశాలను ముఖ్యనేతలు మహేశ్​ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని విషయాలను పీసీసీ అధ్యక్షులు ఓపికగా విన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్​ నేతలతో పీసీసీ అధ్యక్షులు మాట్లాడారు. పురుమళ్ల వ్యవహారాన్ని పార్టీ నేతల నుంచి తెలుసుకున్నానని, వెలిచాల రాజేందర్​ రావు తన దృష్టికి తీసుకొచ్చారని, పూర్తి వివరాలతో నివేదిక తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. మీరు ఏలాంటి ఆందోళన చెందవద్దు, పార్టీలో అధిష్టానమే సుప్రీం, వారి ఆదేశాలను పాటించాలని సూచించారు. బహిరంగంగా విమర్శలు చేస్తూ పార్టీ పరువు తీసే వారిని ఉపేక్షించమని, సీనియర్​ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్​పై శ్రీనివాస్​ వ్యక్తిగతంగా దూషణలకు దిగడం పద్దతి కాదని, ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి సానుకూలంగా చర్చించుకుంటే బాగుంటుందని తెలిపారు. ఇలా వ్యవహరించడం బాగా లేదని, శ్రీనివాస్​ తీరు సరిగా లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, మరో వైపు కాంగ్రెస్​ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పీసీసీ అధ్యక్షులు నేతలకు సూచించారు.
పురుమళ్ల పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు-కాంగ్రెస్​ ముఖ్యనేతలు
పురుమళ్ల శ్రీనివాస్​ వ్యవహారం రోజు రోజుకు శృతిమించుతున్నదని, బీజేపీ, బీఆర్​ఎస్​తో మ్యాచ్​ ఫిక్సింగ్​ చేసుకొని పార్టీలోనే ప్రతిపక్ష నేతలాగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలుగుతున్నదని పీసీసీ అధ్యక్షుని దృష్టికి కాంగ్రెస్​ నేతలు తీసుకొచ్చారు. కరీంనగర్​లో కాంగ్రెస్​ పరిస్థితి దారుణంగా మారిందని, శ్రీనివాస్​ వ్యవహరిస్తున్న తీరుతో పార్టీ పెద్దలే తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గత నెల 28వ తేదీ సోమవారం కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్​ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సన్నాహాక సమావేశం జరిగిందనీ, దీనికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్​, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, పార్టీ పరిశీలకులు, ఇతర ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని వివరించారు. పురుమళ్ల శ్రీనివాస్​ కుట్రపూరితంగా అలజడి సృష్టించేందుకు హాజరై మంత్రి పొన్నంపై పరోక్షంగా దుర్భాషలాడారని పేర్కొన్నారు. సమావేశానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి, పరిశీలకులు, పార్టీ పెద్దల ముందే పార్టీ లైన్​ దాటి తమరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలే శ్రీనివాస్​పై తిరగబడ్డారని తెలిపారు. ఇప్పటికే పార్టీ పెద్దలు ఆయనకు రెండు సార్లు షోకాజ్​ నోటీస్​ అందించారని, అయినా ఆయనపై ఏలాంటి చర్య మాత్రం తీసుకోలేదనీ, పట్టపగ్గాల్లేకుండా నీచంగా పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని విన్నవించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్​ అభ్యర్థి గంగుల కమలాకర్​కు శ్రీనివాస్​ అమ్ముడుపోయారని ఫిర్యాదు చేశారు. బీజేపీ, బీఆర్​ఎస్​తో లోపాయికార ఒప్పందం చేసుకొని పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని, ఇలాంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి తక్షణం సస్పెండ్​ చేయాలని కోరారు. లేకపోతే కరీంనగర్​లో పార్టీకి భవిష్యత్​ ఉండదని పేర్కొన్నారు. ఈసమావేశంలో కాంగ్రెస్​ పార్టీ కరీంనగర్​ పార్లమెంట్​ ఇన్​చార్జి వెలిచాల రాజేందర్​ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనద్ రహమాత్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మడుపు మోహన్, తుమ్మనపల్లి శ్రీనివాస రావు, కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ పురం రాజేశం, జిల్లా గౌడ్ సంఘ అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్​, తాజా మాజీ కార్పొరేటర్లు, నాయకులు ఆకుల నరసన్న నర్మదా, కోటగిరి భూమా గౌడ్, గంట కళ్యాణి శ్రీనివాస్, మల్లికార్జున రాజేందర్, పడిశెట్టి భూమయ్య, పత్తెమ్​ మోహన్, మాచర్ల ప్రసాద్, మాజీ ఎంపీపీ సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, జక్కని ఉమాపతి బొమ్మ ఈశ్వర్ గౌడ్, బోనాల మురళి, గడ్డం శ్రీరాములు, మాచర్ల అంజయ్య గౌడ్, చెప్యాల శ్రీనివాస్ గౌడ్, తాళ్ల పెళ్లి సంపత్ గౌడ్, బత్తిని చంద్రయ్య, అనరాసు కుమార్, కుంబాల రాజ్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి పార్లమెంటు రహదారి సమస్యలకి.

*తిరుపతి పార్లమెంటు రహదారి సమస్యలకి పరిష్కారం చూపండి..

*కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తిరుపతి ఎంపీ గురుమూర్తి బేటీ..

*త్వరలోనే తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభం..

*కేంద్ర మంత్రి
గడ్కరీ హామీ..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 27:

 

తిరుపతి పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారులకు సంబందించిన సమస్యలు, ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖా మాత్యులు నితిన్ గడ్కరీతో బేటీ అయ్యారు.

ఈ సందర్బంగా నాయుడుపేట, తూర్పు కనుపూరు జాతీయ రహదారి -71లో ప్యాకేజ్ 4, వరగలి క్రాస్, తూర్పు కనుపూరు జాతీయ రహదారి-516 డబ్ల్యూ ప్యాకేజ్ 2లో సర్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు మంజూరు చేసి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంపీ కోరారు.

ఈ రహదారుల్లో రూపొందించిన అండర్ పాస్ ల డిజైన్ కారణంగా ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రైతుల పొలాలలో రహదారులు నిర్మిస్తున్నందున వారికి కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని మంత్రిని కోరారు.

రైతులు ప్రదానంగా రహదారికి ఒక వైపు నుంచి మరో వైపుకు తమ వ్యవసాయ ఉత్పత్తులను తరలిచేందుకు, వ్యవసాయ సామగ్రిని తీసుకెళ్లేందుకు అనువుగా సర్వీస్ రోడ్లు, వెహికల్ అండర్ పాస్ లు అవసరం అని ఆయనకి వివరించారు.

ఆయా ప్రాంతాలలో రైతులు చేపట్టిన ఆంధోళన కార్యక్రమాల విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సర్వీసు రోడ్లు, అండర్ పాస్ లు కావాలని రైతులు అందించిన వినతి పత్రాలతోపాటుగా సమగ్రమైన వివరాలను ఆయనకు అందజేశారు.

ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ ఈ రహదారులకు సంబందించి మరోసారి పరిశీలన చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అదికారులను ఆదేశించారు.

తిరుపతి ఇంట్రా మోడల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరగా డిజైన్ లలో స్వల్ప మార్పుల కారణంగా ఆలస్యమైనదని త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకొంటామని ఆయన హామీ ఇచ్చారని ఎంపీ తెలియజేశారు.

రేణిగుంట, నాయుడుపేట మధ్య జాతీయ రహదారిపై నుండి సర్వీసు రోడ్లకు ప్రవేశం లేదని, ప్రస్తుత డిజైన్ స్థానిక ప్రజలకు అసౌకర్యంగా ఉందని ఆయనకి వివరించారు.

అలాగే ఈ రహదారిపై శ్రీకాళహస్తి నుండి ముచ్చువోలు, వెంకటగిరిల రోడ్డును కలిపేందుకు యాక్సెస్ రోడ్డు, చావలి నుండి గుర్రపుతోట జంక్షన్ వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ, చిల్లకూరు నుండి గుర్రపుతోట వరకు సర్వీస్ రోడ్డు విస్తరణ చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని అభ్యర్దించారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version