ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు కొత్త అకౌంట్ తీసుకోవాలి
నిజాంపేట్ ,నేటి ధాత్రి
గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు తప్పనిసరిగా కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవాలని నిజాంపేట్ ఎంపీడివో రాజిరెడ్డి తెలిపారు అలాగే ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలలో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లలో కొత్త అకౌంట్ ప్రారంభించి అందులో నుండి మాత్రమే ఎన్నికల ఖర్చులు జరపాలని సూచించారు.
