పూర్తిగా మారిపోతున్న జమ్ముాకశ్మీర్‌

గణనీయంగా తగ్గిన ఉగ్రవాదం

 ప్రజల ప్రాధాన్యత ఉపాధిపైనే

మతఛాందసవాదం స్థానంలో సెక్యులరిజం

గణనీయంగా తగ్గిన ఉగ్రసంఘటనల వల్ల మరణాలు

డెస్క్‌,నేటిధాత్రి: 

గత ఏప్రిల్‌ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిపై ఒక మాజీ సైనికుడు ఒకరు పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావాన్ని కలిగించే ఇటువంటి వ్యూహాత్మక దాడులను పాకిస్తాన్‌ ఏవిధంగా నిర్వహిస్తున్నది వివరించారు. ఇదే సమయంలో అంతర్జాతీయ స మాజం ఇటువంటి దాడులను ఖండిస్తున్నప్పటికీ ఒక వ్యూహం ప్రకారం అమలు చేస్తున్న ఈ దాడులను పాకిస్తాన్‌ ఆపడంలేదు. అయితే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత మన ప్రభుత్వం జమ్ము`కశ్మీర్‌లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోంది. వీటిని ఏదోవిధంగా అడ్డుకొని ప్రపంచానికి కశ్మీర్‌ను ఒక పెద్ద సమస్యగా చూపాలనుకుంటున్న పాకిస్తాన్‌ చర్యలను మనదేశం ఏవిధంగా కట్టడి చేస్తుందనేదే ఇక్కడ కీలకాంశం. ముఖ్యంగా ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ప్రతి దేశపౌరుడిలో దీనిపై ఆందోళన వ్యక్తం కావడం సహజం. ఈనేపథ్యంలో జమ్ము`కశ్మీర్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిస్థితి ఎట్లా వుంటుందనేది ఇప్పుడు ప్ర ధానంగా చర్చించాల్సిన అంశం. 

ప్రకృతి సౌందర్యం, ఎండ వెలుగుల్లో వెండిలా మెరిసే విస్తరించిన హిమాలయాలు, సమున్నత సాంస్కృతిక వైభవంతో పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లే జమ్ము`కశ్మీర్‌ గత మూడు దశా బ్దాలుగా ఉగ్రవాదం రూపంలో భౌగోళిక సంఘర్షణకు లోనవుతూనే వుంది. ఇంత జరుగుతున్నా పర్యాటకులను తనవైపు ఆకర్షించడంలో జమ్ము`కశ్మీర్‌ తన ప్రత్యేకతను అన్నివేళల్లో నిలుపుకుంటూనే వచ్చింది. 370 అధికరణం రద్దు తర్వాత పర్యాటకులకు స్వర్గధామంగా మరిన్ని సొబగులతో ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, తన సౌందర్యాన్ని మరింత ఆకర్షణీ యంగా తీర్చిదిద్దుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఉగ్రవాదం శిథిలమయం చేస్తున్నా, తన ది వ్యమైన సౌందర్యం ఎక్కడా చెక్కుచెదరలేదు. నేటి మారిన పరిస్థితుల్లో ఇప్పటివరకు ప్రాకృతిక సౌందర్యంతో అలరారిన ఈ ప్రాంతంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే, ఆభరణాలతో మెరిసిపోయే సౌందర్యవతిలా, మనదేశానికి అద్భుత మణికిరీటంగా మారగలదు. 

370 అధికరణం రద్దుకు ముందు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా అన్నీ అడ్డంకులే. ఒకవైపు ఉగ్రవాదం మరోవైపు, జమ్ముాకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకు న్నాయి. మిగిలిన దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతుంటే, జమ్ముాకశ్మీర్‌ ఉగ్రవాద గాయాలతో నిరంతరం బాధపడాల్సి వచ్చేది. అన్నింటికి సైంధవుడిలా అడ్డుపడుతున్న ఈ 370 అధికరణాన్ని రద్దు చేయడంతో రాష్ట్రం దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు సమానంగా మారిపో యింది. రాజ్యాంగం ఇక్కడ కూడా అమలు కావడంతో అన్ని రకాల అవకాశాలకు ద్వారాలు తెరచుకున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి జమ్ముాకశ్మీర్‌ రాష్ట్రాన్ని ఇప్పుడు జమ్ముాకశ్మీర్‌ మరియు లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విడగొట్టింది.

ఇప్పటివరకు అంతర్లీనంగా మరుగున పడిన ఆధునికత క్రమంగా జమ్ము`కశ్మీర్‌లోకి ప్రవేశించ నుంది. డేటా సెంటర్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెక్‌ పార్క్‌లు, రక్షణరంగ స్టార్టప్‌లు, తయారీ రంగ ప్రవేశం వంటివి ఒకప్పుడు కల! కానీ నేడవి వాస్తవరూపం దాల్చడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను కేంద్రం రూపొందించి అమలు చేసేదిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డేటాసెంటర్లకు పెద్దఎత్తున డిమాండ్‌ వుంది. జమ్ము`కశ్మీర్‌లోని చల్లని వాతావరణం వీటికి ఎంతో అనుకూలం. మిగిలిన దేశంతో పోలిస్తే ఇక్కడి అనుకూల వాతావరణం కారణంగా డేటా సెంటర్ల నిర్వహణకు అవసరమైన విద్యుత్‌ ఖర్చు దాదాపు 40% వరకు తగ్గుతుంది! సరిగ్గా ఇటువంటి శీతల వాతావరణం ఉన్న పోలెండ్‌లో మైక్రోసాఫ్ట్‌ ఒక పెద్ద డేటాసెంటర్‌ కేంద్రాన్ని నెలకొల్పింది. మారిన పరిస్థితుల్లో ఇటువంటి డేటా సెంటర్లను శ్రీనగర్‌ మరియు జమ్ము`కశ్మీర్‌లోని ఇతర అనుకూల ప్రాంతాల్లో ఎందుకు నెలకొల్పకూడదన్న పశ్న్ర సహజంగానే ఉదయిస్తుంది. ఇక్కడి హైడ్రోఎలక్రిక్‌ ప్రాజెక్టులనుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ వల్ల చౌకధరలోనే ఇది లభ్యమవుతుంది. 

జమ్ముాకశ్మీర్‌లో వ్యవసాయం కూడా ఆధునిక రూపాన్ని సంతరించుకుంటోంది. సంద్రాయంగా సాగుచేసే ఉద్యానవన పంటనలనుంచి ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం వైపునకు మారే అవకా శాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మాత్రమే ఉత్పత్తి అయ్యే పండ్లు, కుంకుమ పువ్వుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్‌ ఉన్న సంగతి తెలిసిందే. సేంద్రీయ విధానంలో వీటి ఉత్పత్తులను చేపట్టవచ్చు. వీటికి తోడు కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, ప్రత్యక్ష మార్కెట్‌ లింకేజ్‌, ఆ గ్రోాప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు వంటివి రైతుల ఆదాయాన్ని బాగా పెంచడమే కాదు, అను బంధ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందడానికి దోహదం చేయగలవు.

ఇక రక్షణరంగానికి చెందిన స్టార్టప్‌లు, రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, సాంకేతికపరమైన ఎకోసిస్టమ్‌తో పాటు ప్రత్యేక డిఫెన్స్‌ కారిడార్లను అభివృద్ధి పరచినట్లయితే, అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో పనిచేసే మన సైనిక దళాలకు అవసరమైన వాటిని దేశీయంగా ఉత్పత్తి చేయవచ్చు. ఎంతో సంక్లిష్టమయంగా వుండే భౌగోళిక పరిస్థితుల్లో జవాన్లు పనిచేయడానికి అనువైన సామ గ్రిని సమకూర్చవచ్చు. ఇక ప్రత్యేక ఆర్థిక మండళ్లు సహజంగానే ఐ.టి./ఐటీఈ మరియు ఎల క్ట్రానిక్‌ పరిశ్రమలను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన యువకు లకు ఆవసరమైన నైపుణ్య శిక్షణను వేర్వేరు కార్యక్రమాల ద్వారా అందిస్తే, అత్యంత విలువైన హ్యూమన్‌ కేపిటల్‌ తయారవుతుంది. విద్యుత్‌ వాహనాలకు బ్యాటరీలు తయారుచేసే యూనిట్లు, సెమికండక్టర్‌ తయారీ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా జమ్ము`కశ్మీర్‌లో పారిశ్రామిక దృశ్యమే సమూలంగా మారిపోతుంది. గత జనగణన ప్రకారం జమ్ము కశ్మీర్‌ జనాబా 12.3 మిలియన్లు. అద్భుతమైన మానవ వనరులు కలిగిన ప్రాంతం. దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానత వల్ల యువకులకు మంచి అవకాశాలు లభిస్తాయి. 

అభివృద్ధి అవకాశాలు సరే. జమ్ముాకశ్మీర్‌లో భద్రత, సుస్థిరత అనేవి ఇప్పుడ ప్రధానాంశాలుగా వున్నాయి. ఇప్పటివరకు జమ్ముాకశ్మీర్‌ ‘‘సున్నితమైనాసైన్యం గుప్పిట్లో’’ వుండే ప్రాంతమన్న అభి ప్రాయం బలంగా నాటుకుపోయింది. అటువంటి అభిప్రాయం కలిగినవారు ఇప్పుడు తమ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్‌, జమ్ముాకశ్మీర్‌ పోలీసులు ఇప్పుడు అనుక్షణం డేగకళ్లతో భద్రతా వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. మరింత విస్తరించిన భద్రతా వ్యవస్థ కారణంగా నేడు జమ్ముాకశ్మీర్‌ ఒక స్థాయి భద్రత కలిగిన ప్రాంతంగా వుంది. 9/11 దాడుల తర్వాత దేశీయ విమానసర్వీసుల్లో భద్రతను మరింతగా పెంచారు. పలితంగా దేశీయ విమానయానం మ రింత భద్రంగా మారింది. ఉగ్రవాద సంఘటనలు రాష్ట్రంలో కనీసస్థాయికి తగ్గిపోయాయి. రాళ్లు విసరడం, మాటిమాటికి బంద్‌లు, హర్తాళ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి. అన్నింటికంటే ముఖ్య మైన అంశమేంటంటే స్థానికంగా ఉగ్రవాద నియామకాలు తగ్గిపోవడం. 2018లో ఇవి 119గా వుండగా, 2023 నాటికి కేవలం 12కు పడిపోవడం గమనార్హం. 2018 నుంచి భద్రతాసిబ్బంది, సాధారణ పౌరులు, సైనిక చర్యలు గణనీయంగా తగ్గిపోయాయి. ఉదాహరణకు 2018లో 271 మంది ఉగ్రవాదులు హతం కాగా, 2023 నాటికి ఈ సంఖ్య 87కు పడిపోయింది. 2024లో ఈ సంఖ్య మరింతగా తగ్గిపోయింది. ఇక సాధారణ పౌరుల మరణాల విషయానికి వస్తే 2018లో వీరి సంఖ్య 86 కాగా, 2022 నాటికి 30కి, 2023లో 12కు పడిపోయింది. అదేవి ధంగా భద్రతా జవాన్ల మరణాలు 2018లో 95 వుండగా 2022 నాటికి 30కి, 2023 నాటికి 4కు పడిపోయింది. ముఖ్యంగా మరింత విస్తరించిన భద్రతా వలయం, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చే మూలాలను ధ్వంసం చేయడం, కేంద్రపాలిత ప్రాంతంగా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ ప్రత్యక్ష పాలన కింద వుంచడంతో కేంద్ర ప్రభుత్వం తన పథకాలను నేరుగా అమలు చేయగలుగుతోంది.

అయితే జమ్ముాకశ్మీర్‌ ఆర్థికంగా మరింతగా నిలదొక్కుకోవడానికి మరింత సమన్వయ సహకారాలు అవసరం. కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి ప్యాకేజీలను చిత్తశుద్ధితో అమలుచేస్తున్నది. 370 అధికరణం రద్దు తర్వాత 106 కేంద్ర చట్టాలను అమల్లోకి తీసుకురాగా, అమల్లోవున్న చాలా రాష్ట్ర చట్టాలను రద్దుచేశారు. 2023 డిసెంబర్‌ 11న సుప్రీంకోర్టు తన అతి కీలకమైన తీర్పులో 370 అధికరణం రద్దును సమర్థించింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఆర్థిక పురోగతిలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నారు. దీనివల్ల రా ష్ట్రంలో శాంతి సుస్థిరతలు దీర్ఘకాలం చెక్కుచెదరకుండా కొనసాగగలవు. 

జమ్ముాకశ్మీర్‌లో కేంద్రం డీలిమిటేషన్‌ ప్రక్రియను చేపట్టడంతో జమ్ము ప్రాంతంలో అసెంబ్లీ సీ ట్లు 37 నుంచి 42కు పెరగ్గా, కశ్మీర్‌ లోయలో 46 నుంచి 47కు పెరిగాయి. రాష్ట్రంలో మొట్ట మొదటిసారి 9 సీట్లను గిరిజన తెగలకు కేటాయించం విశేషం. డీడీసీ మరియు పంచాయతీ ఎన్నికల్లో కొత్త పార్టీలు పాల్గనడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతోందనడానికి గొప్ప ఉదాహరణ. ప్రజలు వేర్పాటువాదం నుంచి, జాతీయ రాజకీయాలవైపు మరలడం శుభపరిణా మం. అన్ని వ్యవస్థలతో పాటు ఆర్థిక సంస్కరణలు కూడా అమల్లోకి తీసుకురావడం వల్ల జమ్ముాకశ్మీర్‌ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా వుండబోతున్నదన్న విశ్వాసం కలుగుతోంది. ఈ పరిణా మాల నేపథ్యంలో ‘‘ప్రత్యామ్నాయ పెట్టుబడుల ప్రపంచం’’ జమ్ముాకశ్మీర్‌నుంచి ఇక ఎంతోకాలం దూరంగా వుండలేదు. పెట్టుబడిదార్లు, ఎంటర్‌ప్రెన్యూర్లు, ఇతర భాగస్వాములు ఇక్కడ తమ పెట్టుబడులను విస్తరించడం ద్వారా భారత్‌ మణికిరీటంగా భావించే జమ్ముాకశ్మీర్‌ ఆర్థిక పునరభివృద్ధికి దోహదకారులు కావాలి. 

 జమ్ముాకశ్మీర్‌లో ఇప్పటివరకు తాండవమాడిన మతఛాందసవాదం, వేర్పాటువాదం స్థానాలను సెక్యులరిజం, నేషనలిజంలు ఆక్రమించాయి. హింస స్థానంలో శాంతి సుస్థిరమవుతోంది. అయితే ఇంకా ఉగ్రవాద మూలాలు సమూలంగా నాశనం కాలేదన్నది వాస్తవం. కానీ ఇప్పటి చర్యలే కొనసాగితే, త్వరలోనే ఈ మహమ్మారినుంచి రాష్ట్రం పూర్తిగా బయటపడగలదనడంలో ఎంతమా త్రం సందేహం లేదు.

సైద్ధాంతిక హింసలో సామాన్యులే సమిధలు

ప్రపంచంలో హింసకు దారితీస్తున్న మతచాందసవాదం

`మత ఛాందసవాదానికి పుట్టిల్లు పాకిస్తాన్‌

`అభివృద్ధి ఏమాత్రం పట్టని పాక్‌ పాలకులు

`ఉపాధిలేక ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్న ప్రజలు

`ఆభివృద్ధిని వదలి, మతాన్ని పట్టుకు వేలాడుతున్న వైనం

`పతన పథంలో పయనిస్తూ, అహంకారం వీడని పాక్‌ పాలకులు

`భారత్‌ను ఇబ్బంది పెట్టడానికి ఇంకా యత్నాలు

`చావుదెబ్బతిన్నా బుద్ధి మార్చుకోని పాక్‌

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

గత ఏప్రిల్‌ నెలలో పహల్గామ్‌ దాడి సైద్ధాంతిక హింసకు నిదర్శనమని కొందరు నిపుణులు స్ప ష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి ఉగ్రదాడులను పరిశీలించినప్పుడు కొన్ని ప్రత్యేక వర్గాలకు చెందిన సామాన్య పౌరులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని హత్యాకాండ కు పాల్పడటం కనిపిస్తుంది. జమ్ము`కశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత ఏప్రిల్‌ నెలలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది అమాయకులైన పర్యాలకుల్లో ప్రథానంగా హిందువులు ఒక క్రైస్తవుడు మరో ముస్లిం వ్యక్తి వున్న సంగతి తెలిసిందే. మాజీ యు.ఎస్‌. అధికారి, మరో భాషావేత్త, జర్నలిసు ్టఅవతాన్‌ కుమార్‌ల ప్రకారం పహల్గామ్‌ సంఘటన చూడటానికి ఒకచోట జరిగిన సంఘటనగా కనిపిస్తున్నప్పటికీ, దీని ప్రతిస్పందనలు ఆమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా వున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. పహల్గామ్‌ దాడి సంఘటన పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తొయ్య బా సంస్థకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌కు సంబంధించిన ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనేది స్పష్టమైంది. ముఖ్యంగా వీరు ముస్లిమేతరులు ప్రధానంగా హిందువుల ను లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడి ఇది. దాడికి పాల్పడేముందు ఉగ్రవాదులు ప్రశ్నించడమే కాకుండా ఇస్లామిక్‌ కలీమాను చదవమని ఆదేశించి, ఆవిధంగా చదవలేనివారిపై కాల్పులు జరిపి మరీ హత్యచేసారనేది ప్రత్యక్ష సాక్షుల కథనం.

ఉగ్రవాదులు ముందుగా హిందువులను, క్రైస్తవుడిని వేరుగా నిలబెట్టి సమీపంనుంచి కాల్పులు జరిపి హతమార్చారు. ఇదే సమయంలో మహిళలను వారినుంచి వేరుచేసి, తాము చేస్తున్న ఈ హింసాకండను అధికార్లకు చెప్పాల్సిందిగా కోరడం గమనార్హం. ఈవిధంగా ఇతర మతంవారిని వేరుచేసి, హతమార్చడం కేన్యాకు చెందిన అల్‌షబాబ్‌ ఉగ్రవాద సంస్థ గతంలో చేసింది. ము ఖ్యంగా క్రైస్తవులను వేరుచేసి వారిపై దాడిచేసి హత్యాకాండకు పాల్పడిరది. ఈరకమైన హత్యా కాండకు గ్లోబల్‌ ఉగ్రవాద భావజాలంలో మూలాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘‘రెసిస్టెన్స్‌’’ లేదా ‘‘ఇంతిఫదా’’ పేరుతో స్థానిక ప్రాంతాల్లో ఇటువంటి దారుణాలకు పాల్పడటం కనిపిస్తుందని వారుపేర్కొన్నారు. దీని ద్వారా ఇజ్రాయిల్‌`పాలస్తీనా వంటి ప్రాంతీయ సంఘర్షణలు నిరంతరాయం గా కొనసాగుతుండటం వర్తమాన చరిత్ర! ఇటువంటి హత్యాకాండకు బలైనవారిలో నైజీరియాకుచెందిన యూదులు, క్రైస్తవులున్నారు. వీరేకాదు యాజ్దిలు, ద్రుజ్‌, అల్‌వైట్‌, అహమ్మదీయ ము స్లింలు, కాప్ట్‌లు, సిక్కులు, బహాయీలు కూడా ఇటువంటి సైద్ధాంతిక హింసాకాండకు బలవుతు న్నారు. 2023, అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు చేసిన దాడితో పహల్గామ్‌ సంఘటనను పోలుస్తున్నారు. ఇటువంటి దాడుల్లో బాధితులను దుర్మార్గులుగా చూపుతూ, తాముచేసే హత్యాకాండను సహేతుకంగా చూపడానికి యత్నించడం కనిపిస్తుంది. పహల్గామ్‌ దాడికి ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ తాను బాధ్యురాలిగా ప్రకటించింది. 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత జమ్ము`కశ్మీర్‌లో జనాభాపరమైన మార్పుకోసం చేపడుతున్న చర్యలను నిరసిస్తూ ఈ దాడులకు పాల్పడినట్టు పేర్కొంది. ఇది కేవలం తన హంతకకృత్యాన్ని సమర్థించుకోవడానికి చేసిన ఒక అసంబద్ధ వాదనగా ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. 2008 ముంబయి దాడుల తర్వాత సామా న్యులపై జరిపిన అతి తీవ్రమైన దాడి ఇది. ఈ దాడి భారత్‌`పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను రగల్చమే కాదు, ఈ ప్రాంతంలో భద్రతాపరమైన వైఫల్యాలను కూడా ఎత్తిచూపింది. ఊహించని రీతిలో అకస్మాత్తుగా జరిగిన ఈ ఘాతుకం ప్రజలను ఒక్కసారి భయభ్రాంతులకు గురిచేసింది. ఎక్కడివారక్కడ పారిపోవడమే కాదు, తక్షణం కశ్మీర్‌కు పర్యాటకుల రాక నిలిచిపోవడంతో, టూరిస్టులతో కళకళలాడిన ప్రదేశాలు వెలవెలపోయాయి. ఈ పర్యాటకంపై ఆధారపడి జీవించే కొ న్ని వేలమంది కశ్మీరీలు తమ జీవనోపాధిని కోల్పోయారు. ఈ సైద్ధాంతిక హింసాకాండకు స్థానికుల మద్దతు లభించలేదన్నది సత్యం. స్థానిక కశ్మీరీలు బాధితుల పక్షమే వహించారు. ఉగ్రవాదుల దమనకాండను ఖండిరచడమే కాదు, తమ జీవనోపాధిని పూర్తిగా దెబ్బతినడంతో తీవ్రవాదుల పై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవిధంగా సైద్ధాంతిక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బాధిత వర్గాలన్నీ ఏకం కావాలల్సి అవసరం వున్నదని ఆయా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీరు జరిపే పోరాటం ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా కాకుండా, సామాన్య పౌరులపై హింసను చట్టబద్ధం చేస్తున్న సిద్ధాంతాన్ని నిరసిస్తూ కొనసాగాలన్నది వీరి అభిమతం. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఈ హింసాత్మక భావజాలాన్ని నిరోధించడానికి బహుళజాతి సమాజాలు ఏకంకాకపోతే, మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతున్నదని వీరు హెచ్చరిస్తున్నా రు. అందువల్లనే ఇటువంటి ఉగ్రవాదంపై వ్యూహాత్మక వ్యతిరేకత అవసరమని వారు స్పష్టం చే స్తున్నారు. 

మనదేశం కూడా కచ్చితంగా ఇటువంటి విధానాన్నే అనుసరిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాదంపై దాడులు జరపడం ఇటువంటి వ్యూహాత్మక వ్యతిరేకతలో భాగమే. ఏప్రిల్‌ 22 పహల్గామ్‌ దాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై కచ్చితమైన రీతిలో భారత్‌ జరిపిన దాడులు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముందచెత్తడమే కాదు, హింసను ప్రేరేపించే ఏభావజాలాన్ని సహించబోమన్న బలమైన హెచ్చరికను జారీచేసినట్లయింది. ప్రపంచంలోని అత్యధిక దేశాలు నేడు ఈ హింసాత్మక ఉగ్రవాదంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, భారత్‌ జరిపిన దాడులకు అన్ని వైపులనుంచి మద్దతు లభించడం గమనార్హం. కేవలం నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్‌ను మట్టికరిపించి ప్రపం చంలో అప్పటివరకు తనపై వున్న అభిప్రాయాన్ని సమూలంగా మార్చుకునేలా చేసింది. అయితే ఉగ్రవాదమే ఊపిరిగా ఉన్న పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌, ఈనెల 9వ తేదీన పాక్‌లోని ఫార్వర్డ్‌ పోస్టులను సందర్శించి అక్కడి జవాన్లను పొగడిన తీరును పరిశీలిస్తే, భారత్‌ చేపట్టిన సైని కచర్య వారిలో మార్పును తీసుకొస్తుందని భావించడం ఒక భ్రమేనన్న సత్యాన్ని వెల్లడిచేసింది. మనదేశం చేతిలో చావుదెబ్బలు తిని, తానే గెలిచానని చెప్పుకోవడం పాకిస్తాన్‌కే చెల్లింది. ఇప్పు డు తాజాగా ఆసిం మునీర్‌ ఫార్వర్డ్‌ పోస్లును సందర్శించడం ద్వారా పరోక్షంగా భారత్‌ను సవా లు చేస్తున్నట్టే భావించాలి. 

బుద్ధి మార్చుకోని పాక్‌

ఉగ్రవాద ఫ్యాక్టరీగా పేరు సుస్థిరం చేసుకున్న పాకిస్తాన్‌ ఐక్యరాజ్య సమితిలో తన మొండి వైఖరి, అహేతుక డిమాండ్లతో ఇతర దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. భద్రతా మండలిలో ఆంక్షల కమిటీ, తాలిబన్‌ కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీలకు అధ్యక్షపదవి కావాలని డిమాండ్‌ చే స్తోంది. గత జనవరిలోనే ఐక్యరాజ్య సమితి కమిటీల నియామక ప్రక్రియ పూర్తికావాల్సి వుండగా, పాకిస్తాన్‌ మొండి వైఖరివల్ల ఇప్పటివరకు వాటి ఏర్పాటు ఆలస్యమైంది. మండలిలోని ఇతర సభ్యదేశాలు పాక్‌ వ్యవహారశైలితో విసిగిపోయారనే చెప్పాలి. చివరకు భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్‌ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టి మమ అనిపించారు. ఈ పదవి నామమాత్రమే అయినప్పటికీ, సాటి సభ్యదేశాలు ఇందుకు తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్నాయి. ఏదోవిధంగా ఈ పదవులు చేపట్టి, ఉగ్రవాదంపై భారత్‌ను లక్ష్యం చేసుకునేందుకు అది తీవ్రంగా యత్నిస్తోంది. గతంలో కూడా కొందరు హిందువులను ఉగ్రవాదులుగా ప్రకటించాలని తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఏదోవిధంగా ఉగ్రవాద సంబంధిత కమిటీలకు అధ్యక్ష పదవి సాధిస్తే ఒకవైపు భారత్‌ను వేధించడమే కాకుండా మరోవైపు తాలిబన్లను బెదిరించి తమ దారికి తెచ్చుకోవాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే ఉగ్రవాదంపై భారత్‌ను లక్ష్యంగా చేసే యత్నాలకు మద్దతిచ్చేందుకు ఏ ఇతర దేశమూ సిద్ధంగా లేదు. తాను పెంచి పోషించిన తాలిబన్లు తనకు వ్యతిరే కంగా, భారత్‌కు అనుకూలంగా మారడాన్ని పాకిస్తాన్‌ ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నది. అందుకనే తాలిబన్లను ఏదోవిధంగా భయపెట్టి, ఆఫ్ఘనిస్తాన్‌ను తన నియంత్రణలో వుంచుకోవాలన్నది పాక్‌ ఆకాంక్ష. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ రెం డూ మతవాదానికే కట్టుబడి వున్నప్పటికీ, తాలిబన్‌ ప్రభుత్వం మతం తిండిపెట్టదన్న సత్యాన్ని గుర్తించింది. ఫలితంగా ప్రజలకు తిండి, నిత్యావసరాలు, దేశాభివృద్ధికోసం భారత్‌సహకారం అవసరమన్న వాస్తవ ధోరణితో ముందుకెళుతోంది. పాకిస్తాన్‌ను నమ్ముకుంటే మతచాందసం తప్ప ఒరిగేదేమీ వుండదన్న సత్యం దానికి బాగా తెలిసొచ్చి దూరంపెడుతోంది. దీనికితోడు పాకిస్తాన్‌ తీసుకున్న ఆఫ్ఘన్‌ వ్యతిరేక చర్యలు కూడా తాలిబన్ల వ్యతిరేకతకు ప్రధాన కారణం. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం హింసాత్మక భావజాలంతో, మతఛాందసవాదంలో మునిగిన దేశాలేవీ అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. వాటి ప్రస్థానం పాతాళంవైపునకే కొనసాగింది. పాకిస్తాన్‌ ఇప్పు డు ఇదే బాటలో నడుస్తోంది.

కన్నేయ్‌…కమ్మేయ్‌!?

`ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా లో మాజీ ‘‘మున్సిపల్‌ చైర్మన్‌’’ నిర్వాకం.

`ఆక్రమించుడు…అమ్ముకునుడు!

`నాయకుడు రియల్‌ వ్యాపారి అవతారమెత్తాడు.

`అడిగే నాధుడు లేకుండా అన్ని సంతకాలు పెట్టే కుర్చీలో కూర్చున్నాడు.

`కనిపించిన భూములన్ని మింగేశాడు.

`ప్రభుత్వ భూములపై కన్నేయాలే..వెంచర్లు చేసి అమ్మేయాలే!

`వందల కోట్లు తెచ్చిపెట్టిన అక్రమ ఆదాయం.

`ఆ మున్సిపాలిటీలో ఆ లీడర్‌ ఆడిరది ఆట..పాడిరది పాట.

`గత ప్రభుత్వ పెద్దల అండదండలో ఆక్రమించుకున్న భూములకు లెక్కే లేదు.

`ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మార్చి, వెంచర్‌ వేసిన ఘనుడు.

పేద దళితులకు 2005 లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కోట్ల రూపాయల మొరం కొల్లగొట్టిన నాయకుడు.

దళితులకిచ్చిన భూమిని బొందల గడ్డ చేసిండు

దళితులకిచ్చిన భూమిలోకి వెల్లాల్సిన రోడ్డును మాయం చేసి వెంచర్‌ లో కలిపేసిండు.

`ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అంతటా భూములను చుట్టేసిండు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

భూ మాయ అంటే ఇది. ఓ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నిర్వాకమది. కనిపించిన భూములపై కన్నేయడం, వాటిని కమ్మేయడం కొంత మంది అక్రమ రియల్‌ వ్యాపారులకు భూ దందాతో నేర్చుకున్న విద్య. అదే రియల్‌ వ్యాపారులు రాజకీయ నాయకులైతే, అధికార పార్టీ అండదండలు పుష్కలంగా వుంటే, అదే వ్యాపారి ఏకంగా ప్రజా ప్రతినిధి అయితే ఎలా వుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడా అదే జరిగింది. ఆ ప్రజా ప్రతినిధి తన పరిధిలో వున్న ప్రభుత్వ భూములను గుర్తించడం, ఆ పక్కనే వున్న ప్రైవేటు భూములను అడ్డికి పావుసేరుకు కొనేయడం, రెండూ కలిపి వెంచర్లు చేయడం మొదలైంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రియల్‌ దందా దండిగా చేశాడు. కనిపించిన భూములపై కన్నేశాడు. కొనేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆక్రమించుడు…అమ్ముకునుడు! మొదలుపెట్టిండు. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రజా ప్రతినిధికి అండగా పార్టీ పెద్దలు అండగా నిలిచారు. సహకరించారు. పైగా గత పాలకుల కులం కూడా కలివచ్చింది. వేలు విడిచిన చుట్టరికం తోడైంది. ఇక అడ్డే ముంది. ఆగేదే ముంది. దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకున్నాడు. పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల విలువైన భూములకు సున్నం పెట్టేశాడు. ఆ మున్సిపల్‌ పరిధిలో కొంత భూమి కొనుగోలు చేశాడు. ఆ పక్కనే గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న సమయంలో దళితులకు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలానికి వెళ్లడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొవ్వ వుంది. ఆ తొవ్వను ఆక్రమించుకున్నాడు. సదరు చైర్మన్‌ కొనుగోలు చేసిన స్థలానికి సమీపంలో ప్రభుత్వ పార్కు స్థలం వుంది. ఏ రియల్‌ వ్యాపారి అయిన వెంచర్‌ చేసే సమయంలో కచ్చితంగా కాలనీకి అవసరమైన పార్క్‌ ఏర్పాటు చేయడం తప్పని సరి. ఆ మున్సిపల్‌ పరిధిలో చైర్మన్‌ ఏర్పాటు చేసిన వెంచర్‌ కు ప్రభుత్వ పార్కు స్థలం కూడా కలిసి వచ్చింది. ఆ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చేసిన వెంచర్‌ లో పార్కును ఏర్పాటు చేయలేదు. పైగా ప్రభుత్వ పార్కును తన వెంచర్‌ కు కలిపేసుకొని అదే పార్కుగా వ్యాపారం చేసి ప్లాట్లు అమ్మేసుకున్నాడు. అలా కూడా ప్రభుత్వాన్ని నిండా ముంచేశాడు. నాయకుడు రియల్‌ వ్యాపారి అవతారమెత్తడంతో అడిగే వారు లేకుండా పోయారు. ఏదైనా కంప్లైంట్‌ ఇవ్వాల్సి వచ్చినా ఆ చైర్మన్‌ కే ఇవ్వాలి. ఒకవేళ అధికారులకు పిర్యాదు చేసినా అది చైర్మన్‌ టేబుల్‌ పైకి చేరాలి. ఇంకేముంది ఆ చైర్మన్‌ది ఆడిరది ఆట పాడిరది పాట అయ్యింది. అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ మరో ఘనకార్యం కూడా వుంది. దళితులకు గతంలో ఇచ్చిన ప్రభుత్వ భూమి వుండడం కూడా వెంచర్‌కు కలిసొచ్చింది. ఆ వెంచర్‌కు అవసరమైన మొరం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ ఖర్చు కూడా మిగిలిపోయింది. వెంచర్‌ కోసం అవసరమైన మొరం మొత్తం పక్కనే వున్న దళితుల భూమి నుంచి తరిలించాడు. అలా సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన మొరం తవ్వుకుపోయాడు. దళితుల భూమిని బొందల గడ్డ చేశాడు. పెద్ద ఎత్తున తీసిన గుంతలు వర్షం పడితే చెరువులను తలపిస్తున్నాయి. అంటే ఎంత పెద్ద గుంతలు తీశాడో అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క గుంత చిన్నపాటి చెరువులా తాడి చెట్టు లోతున మొరం తవ్వించాడు. వర్షాకాలంలో అటు వైపు ఈత రాని వాళ్లు పడితే ప్రాణాలతో బతికే అవకాశం కూడా వుండదు. ఇక ఆ భూమిలో దళితులు సాగు చేసుకోలేరు. ఇండ్లు కట్టుకోలేరు. ఆ గుంతలను పూడ్చుకోవాలంటే ఆ దళితులకు కోట్ల రూపాయలు కావాలి. సదరు చైర్మన్‌ ఆ దళితులు తమ భూమి వద్దకు వెళ్లడానికి ఓ దారి వుండేది. ఆ దారిని చైర్మన్‌ మాయం చేసి వెంచర్‌ లో కలిపేసుకున్నాడు. దళితులకు దారి లేకుండా చేశాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వెంచర్‌ లో ప్లాట్లు కొనుగోలు చేసి, బిల్డింగ్‌లు కట్టుకున్న వాళ్లంతా అగ్ర కులాలకు చెందిన వాళ్లు. అగ్ర కులాల కుటుంబాలున్న ఇండ్ల ముందు నుంచి దళితులు వెళ్తారా? అని వారిని బెదిరించినట్లు కూడా సమాచారం. అడిగే నాధుడు లేకుండా అన్ని సంతకాలు పెట్టే కుర్చీలో కూర్చున్నాడు. కనిపించిన భూములన్ని మింగేశాడు. వందల కోట్లు తెచ్చిపెట్టిన అక్రమ వ్యాపారంతో కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకున్నాడు. గత ప్రభుత్వ పెద్దల అండదండలో ఆక్రమించుకున్న భూములకు లెక్కే లేదనే మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. దళితులకిచ్చిన భూమిని బొందల గడ్డ చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం లేకుండా దళితులకు అన్యాయం చేసిండు. ఏకంగా రోడ్డును మాయం చేసి వెంచర్‌ లో కలిపడమంటే తనకు ఎదురులేదు తిరుగులేదనుకున్నాడు. మళ్ళీ వాళ్ల పార్టీయే అధికారంలోకి వస్తుందన్న ఆశలతో ఈ ఒక్క చోటే కాదు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వెంచర్లు అనేకం చేశాడు. వాటిపై త్వరలో వరుస కధనాలు నేటిధాత్రి లో వస్తాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా అంతటా భూములను చుట్టేసిండని ఈ చైర్మన్‌ పేరు మారుమ్రోగిపోయింది. చైర్మన్‌ అక్రమాలను చాలా మంది అడ్డుకునే ప్రయత్నం చేసినా అధికారులు సహకరించలేదు. ప్రజల మాట వినిపించుకోలేదు. పైగా అన్ని రకాలుగా చైర్మన్‌ ను సహకరించారు.

దేశంలో వేగంగా శరవేగంగా రైల్వే ప్రాజెక్టులు

బహుళ ప్రజామోదం పొందిన వందేభారత్‌ రైళ్లు

గత పదేళ్లలో విస్తృతంగా మౌలిక సదుపాయాల వృద్ధి

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద 1300 స్టేషన్ల పునరభివృద్ధి

98 శాతం బ్రాడ్‌గేజ్‌ విద్యుదీకరణ పూర్తి

కశ్మీర్‌ను దేశంతో అనుసంధానించిన చీనాబ్‌ వంతెన

రైల్వే స్టేషన్లలో ప్రధానమంత్రి జన ఔషది కేంద్రాలు

డెస్క్‌,నేటిధాత్రి:
జార్ఖండ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైలు అనుసంధానతను పెంచేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేందమ్రోదీ నేతృత్వంలోని ఆర్థికవ్యవహారాల మంత్రిమండలి కమిటి (సీసీఈఏ) రూ.6405 కోట్ల విలువైన రెండు ప్రధాన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బుధవారం ఆమోదం తెలిపింది. కమిటీ ఆమోదించిన ప్రాజెక్టులు కొడెమా`బర్కాఖానా (133కి.మి)డబ్లింగ్‌ మరియు బళ్లారి`ఛిగ్జాజూర్‌ డబ్లింగ్‌ (185కి.మి).
కొడెమా`బర్కాఖానా డబ్లింగ్‌:
ఇది పాట్నారాంచీ మధ్య మరింత వేగంగా సమర్థవంతమైన రైల్‌ లింక్‌ను ఏర్పరుస్తుంది. ఈ మార్గంలో రద్దీని తగ్గించడమే కాకుండా, సరుకు రవాణాతో పాటు ప్రయాణికుల రైళ్లు ఎటువంటి ఆలస్యం లేకుండా గమ్యాలను చేరుకోవడానికి ఈ లైన్‌ దోహదం చేస్తుంది.
బళ్లారి`ఛిగ్జాజూర్‌ డబ్లింగ్‌
ఈ రైల్వేలైన్‌ బళ్లారి నుంచి కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపు రం జిల్లాల మధ్య అనుసంధానతను పెంచుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు రaార్ఖండ్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఏడు జిల్లాలను కవర్‌ చేస్తాయి. అంతేకాదు భారతీయ రైల్వేలు మరో 318 కిలోమీటర్ల దూరం విస్తరించడమే కాదు, 1408 గ్రామాలకు రైలు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ మొత్తం గ్రామాల జనాభా 28.19లక్షలు! బగ్గు, ముడి ఇనుము, ఉక్కు, సిమెంట్‌, రసాయన ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మరింత శీఘ్రంగా కొనసాగ గలదు. అంతేకాదు ఈ ప్రాజెక్టుల వల్ల ఏటా మరో 49 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సాధ్యం కాగలదు. ఇదే సమయంలో తక్కువ ఖర్చు, పర్యావరణ హితంగా రవాణా కొనసాగడం ఈ ప్రాజెక్టులో ప్రధానాంశం. ఈ ప్రాజెక్టుల వల్ల 52కోట్ల లీటర్ల డీజిల్‌ వినియోగం రైల్వేలకు తగ్గడమే కాదు, 264 కోట్ల కిలోల కర్బన ఉద్గారాలను నిరోధించవచ్చు. అంటే ఇది 11కోట్ల మొక్కలను నాటినదానికి సమానం.
తిరుపతి` పాకాలాకాట్పాడి రైల్వేలైన్‌
104 కిలోమీటర్ల దూరం వుండే ఈ రైల్వే లైన్‌కు 2025, ఏప్రిల్‌ 9న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ లైన్‌ నిర్మాణానికి రూ.1332కోట్లు ఖర్చు కాగలదని అంచనా. అయితే ఇదే నెల 4వ తేదీన కేంద్ర కేబినెట్‌, రూ.18,658 కోట్ల విలువైన మౌలిక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన 15 జిల్లాలను కవర్‌ చేస్తాయి.
ఈ ప్రాజెక్టులను ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ కింద చేపడుతున్నారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా బహుళ విధాల రవాణావ్యూహాలను అమలు పరచడం ద్వారా, నిరంతర అనుసంధాన కలిగించడం ప్రధాన ఉద్దేశం. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ఆత్మనిర్భర భారత్‌ను సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఇటువంటి ప్రాజెక్టులను దేశవ్యాప్తంగా చేపడుతోంది.
గత పదేళ్లలో మౌలిక సదుపాయాల వృద్ధి
గత పదేళ్ల కాలంలో భారత్‌లో మౌలిక సదుపాయాల వృద్ధి అద్భుతమైన రీతిలో కొనసాగిందనే చెప్పాలి. వీటివల్ల దేశంలో భౌతిక అనుసంధానత పెరగడంతో పాటు, తక్కువ ఖర్చు, పర్యావరణ హితమైన రీతిలో రవాణా సదుపాయాలను కల్పించడం జరుగుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రగతి, ప్రధానమంత్రి గతిశక్తి, నేషనల్‌ లాజిస్టిక్‌ పాలసీ, భారత్‌మాల, సాగరమాల మరియు ఉడాన్‌ వంటి ప్రాజెక్టులు దేశంలో అనుసంధానతను మరింతగా పెంచాయి. వీటిల్లో ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను 2021, అక్టోబర్‌ 13న కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశంలోని ఆర్థిక జోన్లను బహుళ నమూనా మౌలికసదుపాయాల ద్వారా అనుసంధానత పెంచడం ప్రధాన లక్ష్యం. ఈ సమీకృత వేదిక కింద ఇప్పటివరకు రూ.100 లక్షల కోట్లను సమర్థవంతంగా వినియోగించగలిగారు. ఈ పథకం కింద రైల్వేలు, రోడ్లు, పోర్టులు, నీటి ప్రయాణమార్గాలను అభివృద్ధి చేస్తున్నారు.
రైల్వేల్లో ఇటీవలి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి చీనాబ్‌ వంతెన. ఇది ప్రపంచంలోనే అతి ఎతైౖన వంతెన. ఇక రెండది అంజిఖడ్‌ బ్రిడ్జి. ఇది మొట్టమొదటి రైల్వే కేబుల్‌ వంతెన. ఈ రెండిరటిని జూన్‌ నెలలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. చీనాబ్‌ వంతెన ఎత్తు 359 మీటర్లు కాగా, దీనికోసం 1315 మీటర్ల పొడువున నిర్మించిన ఆర్క్‌ బ్రిడ్జిని ఉక్కుతో నిర్మించారు. ఇది పెనుగాలులను, పెద్ద విస్ఫోటాలను తట్టుకోగలదు. వీటి తర్వాత చె ప్పుకో దగింది కొత్త పంబన్‌ వంతెన. ఇది భారత్‌లో నిర్మించిన మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ కలిగిన సముద్ర రైలు వంతెన. ఇది రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతుంది. చెప్పు కోవాల్సిన మరో పెద్ద రైలు ప్రాజెక్టు కోసి రైల్‌ మహాసేతు. 2020, సెప్టెంబర్‌ 18న ప్రధాని న రేంద్రమోదీ దీన్ని ప్రారంభించారు. ఇది భారత్‌`నేపాల్‌ సరిహద్దులో అత్యంత కీలకమైన వంతెన!
వందేభారత్‌ రైళ్లు
ఇవి అత్యాధునిక సదుపాయాలతో కూడిన సెమీ హైస్పీడ్‌ రైళ్లు. ప్రస్తుతం ఇవి దేశంలోని 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 333 జిల్లాలను అనుసంధానిస్తున్నాయి. ప్రస్తుతం దే శంలో 68 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు (136 సర్వీసులు) నడుస్తున్నాయి. మొత్తం 400 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను తయారుచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక నాన్‌`ఎసి కేటగిరీకి చెందిన అమృత్‌ భారత్‌ రైళ్ల నిర్మాణం ప్రస్తుతం చెన్నైలోని ఐ.సి.ఎఫ్‌.లో జరుగుతోంది. ప్రస్తుతం దేశంలో మూడు అమృత్‌భారత్‌ రైళ్లు (ఆరు సర్వీసులు) నడుస్తున్నాయి. నమోభారత్‌ ర్యాపిడ్‌ రైళ్లు తక్కువ దూరాల్లో వుండే నగరాల మధ్య నడుపుతారు. వీటినే ఇంటర్‌`సిటీ నెట్‌వర్క్‌ కింద పరిగణిస్తా రు. ఇవి కపుర్తలాలోని ఆర్‌సీఎఫ్‌లో తయారవుతున్నాయి. ప్రస్తుతం రెండు నమోభారత్‌ రైళ్లు (రెండు సర్వీసులు) నడుస్తున్నాయి. రాబోయే రెండు మూడు సంవత్సరాల కాలంలో 200 కొత్త వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు, వంద ఆమృత్‌భారత్‌ రైళ్లు, 50 నమోభారత్‌ ర్యాపిడ్‌ రైళ్లు, 17500 జనరల్‌ నాన్‌`ఏసీ కోచ్‌లు దేశవాసులకు అద్బుతమైన ప్రయాణానుభవాన్ని ఇవ్వనున్నాయి.
ఇప్పటివరకు దేశంలో 98శాతం బ్రాడ్‌గేజ్‌ మార్గాల్లో ఎలక్ట్రిఫికేషన్‌ పూర్తయింది. రెండువేల రై ల్వే స్టేషన్లలో సోలార్‌ విద్యుత్‌ సదుపాయం కల్పించారు. రైల్వే స్టేషన్లు, ఇతర భవనాల్లో వంద శాతం ఎల్‌ఇడీ బల్బులను వాడుతున్నారు. ఇక కోచ్‌ల విషయానికి వస్తే 2014 నుంచి ఇప్పటివరకు 37వేల ఎల్‌.హెచ్‌.బి. కోచ్‌ల నిర్మాణం జరిగింది. ఇవి ప్రయాణికులకు మరింత భద్రత కల్పిస్తాయి. 2024`25 ఆర్థిక సంవత్సరంలో 7,134 కోచ్‌ల ఉత్పత్తి జరిగింది. గతంతో పోలిస్తే ఇది 9శాతం అధికం! రైళ్ల భద్రతకు ‘కవచ్‌’ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇది దేశీయంగా తయారైన వ్యవస్థ. రైలు ప్రమాదాలను అరికట్టడంతో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
దేశంలో వంద గతిశక్తి కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది లాజిస్టిక్‌ ఖర్చులను తగ్గించడ మే కాకుండా, మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు ఇది అనుకూలం. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశంలో 1300 స్టేషన్లను పునరభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 68 రైల్వేస్టేషన్లలో ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో తక్కువ ధరకే మందులు అందుబాటులో వుంటాయి.

కొలువుకన్నా..విరమణ మిన్న! కొలువు వద్దు..విరమణ ముద్దు!

-ఐదేండ్ల బాండ్లైనా తీసుకుంటాం.

-రిటైర్మెంట్‌ దగ్గరలో వున్న ఉద్యోగుల మనోగతం.

-లంచాలు తీసుకోకుండా వుండలేం?

-రేవంత్‌ ఏసీబీ దాడులు తట్టుకోలేము.

-ఇరుక్కొని ఇబ్బందులు పడలేం.

-మొదటికే మోసం తెచ్చుకోలేం.

-బలవంతంగా కొలువు చేయలేం.

-రాజకీయాల ఒత్తిడి భరించలేం.

-చే జేతులా ముదిమి వయసులో కష్టాలు కొని తెచ్చుకోలేం.

-హాయిగా రిటైర్మెంట్‌ మెంటు కోరుకుంటున్నాం.

-రాజకీయ నాయకులు చెప్పినట్లు వినలేం

-కాదనుకొని ఈ వయసులో ట్రాన్స్‌ఫర్లకు బలి కాలేం.

-అనేక రకాల అనారోగ్యాల బారిన పడి వున్నాం.

-కుటుంబానికి దూరంగా వుండి బతకలేం.

-ట్రాన్స్‌ఫర్ల బారిన పడి ఈ వయసులో ఒంటరి జీవితాలు అనుభవించలేం.

-కనికరించండి..విముక్తి ప్రసాదించండి.

-రిటైర్మెంట్‌ దగ్గరలో వున్న ఉద్యోగుల వేడుకోలు.

-ఇప్పటికే చాలామంది నిజాయితీగల ఉద్యోగులు నిరవదిక సెలవల్లో ఉన్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి
ఈ కొలువులు మాకొద్దు మహా ప్రభో అని కొంత మంది ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రిటైర్మెంట్‌కు దగ్గరగా వున్న ఉద్యోగులు కొందరు తమ ఆంతరంగికుల వద్ద చెప్పుకుంటున్నారు. రిటైర్‌ మెంటు దగ్గరగా వున్న ఉద్యోగులు చాల మందిది ఇదే అభిప్రాయం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడు రిటైర్మెంట్‌వయసు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయన్న వార్త వారిలో కొంత కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వం పెంచింది. అదే పెద్ద భారమనుకుంటే, మళ్లీ ఈ ప్రభుత్వం మరింత పెంచే ఆలోచనలు చేస్తుందన్న వార్తలు వారిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఆందోళణకు గురి చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న సమయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా మొదటికే మోసం వస్తుంది. పైగా ఇంత కాలం అదీ ఇదీ తీసుకోవడానికి అలవాటు పడిపోయిన వారు కూడా వున్నారు. ఇప్పుడు కూడా ఏదీ లేకుండా పనిచేయలేకపోతున్నాం. మరో వైపు రాష్ట్ర సర్కారు ఏసిబి దాడుల నేపధ్యం కూడా తోడౌతుంది. మరో వైపు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. పని చేసినా కష్టమే..చేయకపోయినా కష్టమే! చేస్తే ఊరికే చేయొద్దని అంటారు. చేస్తే తప్పంటారు. రాజకీయ నాయకులు తెచ్చే పనుల్లో ఎంత నిజాయితీ వుంటుందో అందరికీ తెలిసిందే. చేయకపోతే వారు ఊరుకోరు. చేయమని చెప్పే ధైర్యం మాకు లేదు. ఇచ్చింది తీసుకొని పనిచేయాలంటే భయమేస్తోంది. ఎక్కడ ఏసిబికి చిక్కి చిక్కుల్లో పడతామేమే అన్న భయం వెంటాడుతోంది. ఈ వయసులో లేని పోసి సమస్యలు తెచ్చుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేని పనులు చేయలేక, నాయకులకు ఎదురు చెప్పలేక ఓ వైపు సతమతమౌతున్నాం. ప్రతి వారు వచ్చిన పని చేయమని బెదిరించేవారు తయారయ్యారు. నీతిగా పనిచేయాలంటే కొన్ని పనులు కావు. అవినీతికి పాల్పడితే ఎప్పుడు పట్టుబడతామో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఏసిబికి మరింత పవర్స్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిబ్బందిని పెంచే కసరత్తు కూడా జరుగుతోంది. ఏ క్షణానికి ఏం జరుగుతుందో అర్దం కాకుండా వుంది. బాదితుల పక్షాన నిలిస్తే నాయకులు ఊరుకోరు. నాయకుల పక్షాన తప్పు చేస్తే బాధితులు సహించరు. ఇద్దరి మధ్య నలిగిపోతూ పనిచేయలేని పరిస్దితి ఎదురౌతోంది. నాయకులు చెప్పినట్లు వినకపోతే ట్రాన్స్‌ఫర్లు తప్పని సరి. ఇప్పుడున్న పరిస్దితుల్లో ట్రాన్స్‌ఫర్లను ఆహ్వానించలేం. ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌ చేస్తే వెళ్లలేం. కుటుంబాన్ని వదిలేసుకొని వెళ్లే పరిస్దితి లేదు. రకరకాల అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నాం. కుటుంబ సభ్యుల్లో కూడా ఏదో రకమైన అనారోగ్య సమస్యలు వుంటున్నాయి. ఎక్కడికో ట్రాన్స్‌ఫర్‌ చేస్తే అక్కడికి కుటుంబంతో వెళ్లే పరిస్దితి కనిపించడం లేదు. ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్లి వుండే అవకాశంలేదు. ఏ క్షణం ఎలా వుంటుందో ఆరోగ్య పరిస్దితులు అనే భయం కూడా వెంటాడుతోంది. దాంతో పనులు చేయలేకపోతున్నాం. కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా భార్యభర్తల వయసు ఎలాగూ 55 దాటివుంటుంది. భర్త ఉద్యోగి అయితే అతని వెంట కుటుంబాన్ని వదిలేసి వెళ్లలేని పరిస్థితి. భర్త ఉద్యోగం చేసే స్ధలాలకు భార్య వెళ్తే పిల్లలను చూసుకోవడం కష్టంగా మారుతుంది. ఎక్కడికో మారు మూల మండలాలకు ట్రాన్స్‌ఫర్‌ అయితే ఆ నరకం చెప్పనలవి కానిది. ఇన్ని సమస్యల మధ్య ఉద్యోగం చేయడం అవసరమా? అనే పరిస్దితుల్లో వున్నామని చాల మంది ఉద్యోగులు తెలిసిన వారి ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారు. పరిస్ధితులను బట్టి మెదులుకోవాలి. నాయకుల తీరును బట్టి మసలుకోవాలి. ఉద్యోగ వర్గాలపై రాజకీయ నాయకుల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. రియల్‌ వ్యాపారం పెరిగిన తర్వాత మా కష్టాలు మాకు వున్నాయి. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు వుంటుంది. ఆ సమయంలో ఇచ్చే దాన్ని తీసుకోకుండా వుండలేం. నాయకులు వచ్చిన పుణ్యానికి చేయకు? అంటారు. తీసుకుంటే పుణ్యానికి చేస్తున్నావా? అని నిలదీస్తారు. బాధితులు వచ్చి నానా బూతులు తిడుతుంటారు. అన్యాయం చేస్తున్నారని కేసులు పెడుతుంటారు. వాటన్నింటినీ ఈ వయసులో ఎదుర్కొనే శక్తి లేదు. పొరపాటో, గ్రహపాటో ఎదురైతే, పుసుక్కున ఏసిబికి చిక్కితే జైలు జీవితం అనుభవించలేం. అలాగని బలవంతంగా కొలువులు చేయలేకపోతున్నాం. వయసు మీద పడుతోంది. ఒత్తిడితో మానసిక ఆందోళలకు గురయ్యే పరిస్తితి వుంటోంది. రాజకీయ నాయకులు తర్వాత ఆదుకోవడం అంటూ ఏమీ వుండదు. వాళ్ల పని వారు చేయించుకొని వెళ్తారు. చేతులు దులుపుకుంటారు. పొరపాట్లు చేయించి, మాకేం సంబందం అంటారు. ఉద్యోగులను ఇరికిస్తుంటారు. వారికి ఆ స్వేచ్చ వుంది. ఉద్యోగులకు ఆస్వేచ్చ లేదు. చేతులు దులుపేసుకుంటా? చట్టం వదిలిపెట్టదు. ఎరక్కొపోయి, ఈ వయసులో ఇరుక్కోవడం ఎందుకు? అన్న ప్రశ్నలే వారి మెదల్లోలో మెదులుతున్నాయి. రిటైర్‌ మెంటు ఇచ్చేయండి. ఇప్పటికిప్పుడు ప్రబుత్వ ఇవ్వాల్సిన నిదులు ఇవ్వకపోయినా బాండ్లు ఇచ్చినా తీసుకుంటాం. అది ఐదేళ్లకు ఇచ్చిన సరిపెట్టుకుంటాం. కాని ఈ ఉద్యోగాలు మేం చేయలేం. పని ఒత్తిడి నుంచి విముక్తి కల్పించండని కోరుతున్నారు. హాయిగా రిటైర్‌ మెంటు తీసుకొని ముదిమి వయసులో ఎంతో కొంత సంతోషంగా వుంటామంటున్నారు. నాయకులు చెప్పే ప్రతి పనిని చేయలేకపోతున్నాం. కనికరించండి. విముక్తి ప్రసాదించండి? అని కొంత మంది అదికారులు కోరుతున్నారు. ఇలాంటి పరిస్దితులను తాళలేక చాలా మంది రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న ఉద్యోగులు లాంగ్‌ లీవ్‌లు పెట్టుకొని ఇంటి వద్ద వుంటున్నారు. ఎప్పుడు రిటైర్‌ మెంటు ఇచ్చినా సంతోషమే అంటున్నారు. ఇప్పటికిప్పుడు ప్రకటించినా ఆనందంగా తప్పుకుంటామంటున్నారు. చాలా మంది రిటైర్‌ మెంటుకు దగ్గరగా వున్న ఉద్యోగులు లాంగ్‌ లీవుల్లో వుండడం వల్ల, చాలా కార్యాలయాల్లో ఇన్‌చార్జిలు బాద్యతలు నిర్వహిస్తున్నారు. రెండు మూడేళ్ల సర్వీసు వున్న ఉద్యోగులు కొలువులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పదేళ్ల కాలంగా గత ప్రభుత్వ పార్టీ నాయకులు చెప్పినవి చేయాల్సి వచ్చింది. పదేళ్లుగా అదికారంలో లేకపోవడంతో ఈ పార్టీ నాయకుల పనులు మళ్లీ చేయాలంటే చేయలేకపోతున్నారు. గతంలో ఏమేం చేశారో మాకు తెలుసంటూ ఈ పార్టీ వాళ్లు బెదిరిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు చేసినప్పుడు మేం చెప్పినట్లు ఎందుకు చేయరంటూ కోపం ప్రదర్శిస్తున్నారు. కాదంటే మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఒత్తిళ్లను తట్టుకోవడం కన్నా, నాలుగు రోజులు హాయిగా బతకాలంటే రిటైర్‌మెంటు ఒక్కటే దారి అని నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇది అందరి ఉద్యోగుల మనోగతం మాత్రం కాదు. కొంత మంది రిటైర్‌మెంటుకు అతి సమీపంలోవున్న ఉద్యోగుల ఆవేదన మాత్రమే. వారి ఆందోళనలో న్యాయం వుందా? లేదా? అనేది వారు తేల్చుకోవాలి. ఇంత కాలం పనిచేసి, ఇప్పుడు తప్పుకుంటామని చెప్పడం ఎంత వరకు న్యాయమో కూడా వాళ్లే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా వ్యవస్ధలను అందరూ కలిసి భ్రష్టు పట్టించారన్నది మాత్రం ముమ్మాటికీ నిజం. తమ దాకా వస్తే ముఖం చాటేస్తారన్నది వాస్తవం. తప్పుకొని తాము మంచి వాళ్లమని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుందన్నది మరింత నిజం.

మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలు: కమిషనర్‌ చౌహాన్‌

`రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదు

`ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమిషనర్‌ చౌహాన్‌

`అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శం

`ఉద్యోగులకు కర్తవ్య నిర్వహణ ముఖ్యం

`అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదు

`ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదు

`నిజాయితీ మిల్లర్లను వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు

`అక్రమార్కల చిట్టా అంతా నా దగ్గర వుంది

`త్వరలో అక్రమార్కుల పని కాలం ముందుంది

`అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే మొదటి సారి

`ఈ విషయం ప్రపంచానికి చెప్పిన నేటిధాత్రికి కృతజ్ఞతలు

`తెలంగాణలో ఎక్కడ రైతుకు అన్యాయం జరిగినా సహించడం జరగదు

`చిన్న మిల్లర్లు తమకు ఏ సమస్య వున్నా నేరుగా కలవొచ్చు

`తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోవచ్చు

`మిల్లర్‌కు సమయమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధం

`మధ్యాహ్నం తర్వాత అప్పాయిమెంట్‌ పొందొచ్చు

`ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు

`నేటిధాత్రి దిన పత్రిక కు కమీషనర్‌ ప్రత్యేక ధన్యవాదాలు

`రైతుల పక్షాన అక్షర పోరాటానికి అభినందనలు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
రైతుల వడ్లను మాయం చేసినట్లు ఆరోపణలున్న హన్మకొండ జిల్లాకు చెందిన మిల్లర్‌ జగన్‌పై త్వరలోనే చర్యలుంటాయని సివిల్‌ సప్లయ్‌ శాఖ కమీషనర్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఆయన మాట్లాడుతూ ఎప్పటికైనా రైతులను మోసం చేసిన వారికి శిక్ష తప్పదన్నారు. త్వరలోనే చర్యలుంటాయన్నారు. నీతిగా చేయాల్సిన వ్యాపారంలో కొంత మంది అక్రమాలకు పాల్పడుతుంటారన్నారు. గతంలో పెద్దగా పట్టించుకోకపోవడంతో,పై స్థాయి దాక వివరాలు అందకపోవడంతో వారి ఆటలు సాగాయి. దురదృమేమంటే కొంత మంది అధికారుల ప్రోద్బలం కూడా అక్కడక్కడ తోడవ్వడంతో అక్రమాలకు అవకాశం కలిగింది. కాని పరిస్థితులు మారాయి. ఎప్పటిలాగే ఇప్పుడూ తమ ఆటలు చెల్లుతాయనుకుంటే పొరపాటు. ఇప్పుడు చేసిన తప్పులే కాదు, గతాన్ని కూడా తవ్వి తీసే పని మొదలౌతుంది. హన్మకొండ జిల్లానే కాదు, రాష్ట్రంలో ఏఏ జిల్లాలలో ఇలాంటి వ్యవహారాలు సాగుతున్నాయో కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరుగుతోందన్నారు. ఇకపై రైతులను, ప్రభుత్వాన్ని మోసం చేసే మిల్లర్‌ను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. అంతేకాకుండా అక్రమార్కులకు సహకరించిన అధికారులకు కూడా శిక్ష తప్పదు. రైతులను మోసం చేయడం చిన్న తప్పు అనుకుంటున్నారు. కానీ పెద్ద నేరమని తెలియక చేసినా? తెలిసి చేసినా శిక్షార్హులౌతారు. రైతులను మోసం చేసిన జగన్‌ను గుర్తించిన ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ను అభినందించిన కమీషనర్‌ చౌహాన్‌ అభినందించారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లాంటి అధికారులుంటే ఒక్క వడ్ల గింజ కూడా మోసం జరగదన్నారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సునిశిత పరిశీలనా జ్ఞానాన్ని కమీషనర్‌ చౌహాన్‌ అబ్బురపడిపోయారు. అధికారులకేం తెలుసు అని కొంత మంది అక్రమ మిల్లర్లు ఇలాంటి దుష్ట పన్నాగాలు పన్నుతుంటారు. కానీ ఉద్యోగ నిర్వహనలో శాఖల్లో మెలకువలు తెలుసుకొని ముందుకెళ్లే అధికారులు కూడా వుంటారని రుజువైంది. ఏది ఏమైనా ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చూపిన చొరవ అభినందనీయమన్నారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులందరినీ కమీషనర్‌ చౌహాన్‌ అభినందించారు. అధికారులు సమిష్టిగా, నీతి వంతంగా, కార్యదక్షత చూపిస్తే ఎంతో బాగుంటుందన్నారు. ఖమ్మం జిల్లా అధికారుల టీం వర్క్‌ భేష్‌ అన్నారు. అందరికీ ఖమ్మం జిల్లా అధికారులు ఆదర్శమయ్యారని కొనియాడారు. ఏ శాఖ ఉద్యోగులైనా సరే తమ కర్తవ్య నిర్వహణ ముఖ్యమని సూచించారు. ఇకపై అధికారులెవరైనా సరే అక్రమార్కులకు సహకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత పెద్ద స్థాయిలో వున్నా ఉపేక్షించేది లేదన్నారు. ఇక నీతి, నిజాయితీ వ్యాపారం చేసే మిల్లర్లను అధికారులు ఎవరైనా వేదిస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వానికి అలాంటి మిల్లర్‌ తోడే అవసరమన్నారు. రైతులను మోసం చేసే వారిని పక్కన పెట్టుకొని, నీతిగా వ్యాపారం చేసే మిల్లర్లను ఇబ్బందుల పాలు చేయొద్దని హెచ్చరించారు. ఎవరైతే అక్రమ మిల్లర్లు ముద్రపడ్డారో, వారికి సహకరిస్తున్నారో అలాంటి వారి చిట్టా అంతా నా దగ్గర వుందన్నారు. త్వరలోనే కార్యచరణ వుంటుందన్నారు. అక్రమ మిల్లర్‌ నుంచి రికవరీ దేశంలోనే మొదటి సారి అనే విషయాన్ని వెలులోకి తెచ్చిన నేటిధాత్రి దిన పత్రికను చౌహాన్‌ అభినందించారు. ఈ విషయం ప్రపంచానికి చెప్పిన నేటిధాత్రికి కృతజ్ఞతలు అన్నారు. ఇకపై తెలంగాణలో ఎక్కడ రైతుకు అన్యాయం జరిగినా సహించడం జరగదు. ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా చిన్న చిన్న మిల్లర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని నేటిధాత్రి దృష్టికి వచ్చినా వివరాలు అందించాలని కోరారు. అంతే కాకుండా నా వద్దకు నేరుగా రాలేక, ఇబ్బందులు పడుతున్న వారిని మీరు చొరవ తీసుకొచ్చినా సరే అని నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుకు విజ్ఞప్తి చేశారు. మిల్లర్లు ఇకపై తమకు ఏ సమస్య వున్నా నేరుగా కలవొచ్చు అని కూడా కమీషనర్‌ స్పష్టం చేశారు. తన కార్యాలయానికి తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోవచ్చన్నారు. తెలంగాణలో వున్న మిల్లర్లందరికీ సమయమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పారు. అయితే మధ్యాహ్నం తర్వాత అప్పాయిమెంట్‌ పొందవచ్చని సూచించారు. అధికారులెవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం నేటిధాత్రి దిన పత్రిక కు కమీషనర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ,
రైతుల పక్షాన అక్షర పోరాటానికి అభినందనలు తెలిపారు.

మార్కెట్‌ డిమాండ్‌ ఘనం…విమానాల సంఖ్య స్వల్పం

నత్తకు పోటీపడుతున్న పౌర విమానయాన రంగం విస్తరణ

చిన్న ఎయిర్‌ క్రాఫ్ట్‌లే దేశీయ అవసరాలకు ఉత్తమం

పెద్ద విమానాలకోసం సంక్లిష్ట డిజైన్లకోసం ఇప్పుడే కుస్తీపట్టనవసరంలేదు

తక్షణావసరాలపై దృష్టిపెట్టాలి

‘ఉడాన్‌’ లక్షం నెరవేరాలంటే చిన్న విమానాలే శ్రేయస్కరం

నమ్మకమైన సాంకేతిక పరిజ్ఞానం, సామర్థ్యమున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌లే ఘనం

ప్రపంచంలో ఇప్పటికి వాణిజ్య విమానాలు తయారుచేసే కంపెనీలు ఏవని ప్రశ్నిస్తే బోయింగ్‌, ఎయిర్‌బస్‌ అని ఎవరైనా ఇట్టే సమాధానం చెబుతారు. ఆ రెండు కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగాఅంతటి ప్రాచుర్యాన్ని పొందాయి. మరి ప్రపంచంలో ఈ కంపెనీలు మాత్రమేనా? మరే ఇతర కంపెనీలు ఇదేమాదిరిగా వాణిజ్య విమానాలను తయారుచేయడానికి ఎందుకు ముందుకు రావడంలేదన్నది సహజంగానే ఉదయించే ప్రశ్న. ఇదిలావుండగా భారత్‌, చైనా వంటి దేశాల్లో విమానయాన రంగంలో విస్తృత మార్కెట్‌ అవకాశాలున్నప్పటికీ, అవి విస్తరించలేకపోవడానికి ప్రధాన కారణం, వాణిజ్య విమానాల తయారీ సంస్థలు కేవలం పై రెండు మాత్రమే కావడం! ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆర్డర్లకు తగిన వేగంతో వీటి ఉత్పత్తి జరగకపోవడం వల్ల దశాబ్దాల పాటు ఆర్డర్‌ ఇచ్చిన విమానం సరఫరాకోసం వేచివుండాల్సిన పరిస్థితి వల్ల విమానయాన రంగంవిస్తరణ నత్తకు అన్నమాదిరిగా వుంటోంది. మరి దీనికి పరిష్కారం లేదా? వాణిజ్య విమానాల తయారీకి ఇతర దేశాలు ఎందుకని పూనుకోవడంలేదన్న సందేహం వ్యక్తమవడం కూడా సహజమే. చైనా ఇందుకు ముందుకు వచ్చింది. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రస్తుతం అమెరికా ఆంక్షల పుణ్యమాని అది ముందుకు కదలలేక చతికిలబడిరది. ఎందుకంటే విమాన తయారీకి అవసరమైన సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్‌ వంటికి ఇంకా పశ్చిమదేశాల చేతుల్లోనే వున్నాయి. ఒక దేశం విమానం తయారుచేయాలంటే అందుకవసరమైన సంక్లిష్టమైన సాంకేతిక వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడక తప్పదు. అంటే వాటి దయాదాక్షిణ్యాలపైనే దీని అభివృద్ధి ఆధారపడివుంటుంది. అంతేకాదు వాణిజ్య విమానాల తయారీ అంత తేలిక కాదు. ఇదో సుదీర్ఘ సంక్లిష్ట ప్రక్రియ. ఇది కూడా ఇతర దేశాల్లో విమానాల తయారీ జరగకపోవడానికి కారణం. 

డిమాండ్‌కు తగ్గ విమానాల్లేవు

మనదేశంలో పౌరవిమానయాన మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. విమాన ప్రయాణికుల డిమాండ్‌అధికంగా వున్నప్పటికీ, అందుబాటులో ఉన్న విమానాల సంఖ్య చాలా తక్కువగా వుండటం పెద్ద అవరోధంగా మారింది. విమానాలను దిగుమతి చేసుకోవాల్సి రావడం, ఇప్పటికీ దేశీయంగా ప్రయాణికుల విమానాలు తయారుకాకపోవడం దేశీయంగా వైమానికరంగం విస్తరణను అడ్డు కుంటోందనే చెప్పాలి. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఇండిగో వంటి సంస్థలకు తమ వాణిజ్య పరిధిని విస్తరించాలనుకున్నా, విమానాలు అందుబాటులో లేకపోవడం వాటి కాళ్లకు సంకెళ్లు వేసినట్టవుతోంది. కేవలం 2023`24 మనదేశీయ వైమానిక సంస్థలు 1359 విమానాలకోసం బోయింగ్‌,ఎయిర్‌బస్‌ సంస్థలకు ఆర్డర్లు ఇచ్చాయంటే, ఈ రంగంలో డిమాండ్‌ ఏవిధంగా వున్నదీ అర్థం చేసుకోవచ్చు. కానీ వీటి డెలివరీలు వచ్చేసరికి కొన్నేళ్లు పడుతుంది! ఫలితంగా మార్కెట్‌ విస్తరణకుసంస్థల ఉత్సాహంపై ఇది నీళ్లు చల్లినట్లవుతోంది. దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీ యంగా పెరుగుతోంది. 2024`25లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 7.5% వృద్ధి న మోదు చేయడం ఇందుకు ఉదాహరణ. అంటే వీరి సంఖ్య 165.7 మిలియన్లకు చేరుకుంది. మరి పెరుగుతున్న డిమాండ్‌కు మనదేశంలో విమానాల తయారీ జరుగుతున్నదా? అంటే లేదనే చెప్పాలి. అసలు ప్రయాణికుల విమానాల తయారీ మనదేశంలో ఇంకా శైశవస్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో చైనా ఈ రంగంలో చేసిన కృషి ఎదుర్కొన్న ఎత్తుపల్లాలను దృష్టిలో వుంచుకొని బలీయంగా అడుగులు ముందుకేయక తప్పదు. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా ఆధారపడటం వల్ల చైనా విమాన తయారీరంగా ఎటువంటి కష్టనష్టాలు ఎదుర్కొంటున్నదీ అవగాహన చేసుకొని మరీ మనం ముందుకు సాగాల్సిన అవసరం వుంది.

చైనా విమాన తయారీరంగం ప్రస్థానం

చైనాలో కమర్షియల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (సీఓఎంఏసీ) ప్రయాణికుల విమానాలను తయారుచేయడానికి ఎంతో కృషిచేస్తున్నది. అయితే ఇందుకు అవసరమైన ఇంజిన్లు, సాంకేతిక సహకా రం అమెరికానుంచే రావాలి. ఇప్పుడు రెండుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో, యు.ఎస్‌. విధించిన ఆంక్షల తెబ్బ ఈ సంస్థ చేపట్టే కార్యక్రమంపై పడిరది. అంటే ఒక వాణిజ్య లేదా ప్రయాణికుల విమానం తయారుచేయడానికి అవసరమైన ముఖ్యమైన భాగాలపై విదేశాల పై ఆధారపడటం వల్ల కలిగే ఇబ్బందులకు చైనా ఉదాహరణగా నిలుస్తోంది. నిజానికి గత రెండు దశాబ్దాలుగా ప్రయాణికుల విమానాలను తయారుచేసే పనిలో తలమునకలుగా వున్నప్పటికీ, నూటికి తొంభయిశాతం వైఫల్యాలే ఎదురయ్యాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది షాంఘై`వై10 జెట్‌లైనర్‌ గురించి. ఇది అచ్చం బోయింగ్‌`707 విమానం మాదిరిగానే వుండేది. ఇందులో అమెరికా తయారీ ‘ప్రాట్‌ Ê విట్నీ జెటి3డి’ ఇంజిన్లు వాడారు. 1980లో తొలివి మానం ఆకాశంలోకి అట్టహాసంగా ఎగిరింది. కానీ ఈ ప్రాజెక్టు కేవలం మూడు విమానాల త యారీతో మూతబడిరది. ఇందుకు కారణం వుంది. ఇందులో ఉపయోగించింది అప్పటికి 25 సంవత్సరాల పురాతన సాంకేతిక పరిజ్ఞానం! అప్పటికే పశ్చిమ దేశాల తయారీ విమానాల్లో అ త్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పుడు, ఈ పాత చింతకాయపచ్చడి లాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టుకొని వేలాడటమేంటన్న ప్రశ్నలు ఉదయించడంతో, ఈ విమానాల తయారీని పక్కన పెట్టేశారు. అయితే చైనా తన ప్రయత్నాలను మానలేదు. 1980`90 మధ్యకాలంలో అనటోన్‌ ఎన్‌`24 రకం విమానానికి ప్రతికృతిగా జియాన్‌ ఎంఏ`60 విమానాన్ని, హర్బిన్‌ వై`12 అనే 17 సీట్ల విమానాన్ని తయారుచేసింది. వీటిని ఎక్కువగా సైనిక, రవాణా, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు, కొన్ని సందర్భాల్లో ప్రయాణికుకోసం కూడా ఉపయోగించారు కానీ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఆ తర్వాత 2008లో కమర్షియల్‌ ఎయర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (సీఓఎంఏసీ) స్థాపన జరిగింది. గతంలోని అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఏఆర్‌జే21 అనే రీజినల్‌ జెడ్‌ను తయారుచేసింది. తర్వాత దీన్ని సి909గా పేరు మార్చారు. విమాన సర్టిఫికేషన్‌ సాధించడంలో సంక్లిష్టతలను అధిగమించడానికి అవసరమైన అనుభవం కోసమే ఏఆరర్‌జే21 ప్రాజెక్టుపై దృష్టిపెట్టారు. ఇందుకోసం మెక్‌డోనెల్‌ డగ్లస్‌ ఎండి`80, యుక్రెయిన్‌కు చెందిన ఆంటోనోవ్‌ సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు జనరల్‌ ఎలక్ట్రిక్‌ సిఎఫ్‌`34 ఇంజిన్లను వాడారు. చివరకు 2016 జూన్‌లో ఏఆర్‌జే21ను వాణిజ్యపరంగా చెంగ్డూ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తొలిసారి ఉపయోగించింది. అంటే ఈ కార్యక్రమం మొదలుపెట్టిన 14 సంవత్సరాల తర్వాత కానీ ఇది పట్టాలెక్కలేదు!!

ఏఆర్‌జే21 విమానాన్ని తయారుచేసిన అనుభవంతో, సీఓఎంఏసీ సి919 ప్రోగ్రామ్‌ను ప్రారం భించింది. బోయింగ్‌`737, ఎయిర్‌బస్‌ఎ`320లకు పోటీగా దీన్ని తయారుచేసింది. విమానాలతయారీలో చైనాకు గొప్ప ముందడుగుగా చెప్పినప్పటికీ ఇందులో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం అత్యధికం పశ్చిమదేశాలదే! అదీకాకుండా ఇందులో వాడిన ఉపకరణాల్లో 3/5వ వంతుఅమెరికానుంచి దిగుమతి చేసుకున్నవే! మొట్టమొదటి సి919 విమానాన్ని 2022లో డెలివరీ ఇ వ్వగా 2023లో వాణిజ్యసేవలు ప్రారంభించింది. ఇప్పుడు సీఓఎంఏసీ ఏటా 50`75 యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంతో ముందుకెళుతోంది. దేశీయంగా వున్న డిమాండ్‌కు తట్టుకునేరీతిలో వీటి ఉత్ప త్తిని మరింత పెంచాలన్నది కూడా సంస్థ లక్ష్యం. ఇప్పటికి ఈ విమాన తయారీలో 60శాతం వరకు భాగాలు చైనాలోనే తయారవుతున్నాయి. మిగిలిన 40శాతం సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికానుంచి దిగుమతి చేసుకున్నదే. సీఓఎంఏసీ సంస్థ ఈ స్థాయి విజయానికి ప్రధాన కారణం, 2020లో ప్రభుత్వం నుంచి 49 నుంచి 72 బిలియన్‌ యు.ఎస్‌. డాలర్ల సబ్సిడీ, గ్రాంట్ల రూపంలో మద్దతు లభించింది. వీటితో పాటు ఆర్‌Ê డి సహకారం కూడా అందింది. దీంతో పాటు ప్రభుత్వ ఆధీనంలోని ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఆర్డర్లు ఇవ్వడం కూడా సంస్థ నిలదొక్కుకోవడానికి కారణమైంది. నిజం చెప్పాలంటే సీఓఎంఏసీ అభివృద్ధికి సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌, జీఈ, హానీవెల్‌, సోఫ్రాన్‌, కోలిన్స్‌ ఏరోస్పేస్‌ వంటి పశ్చిమదేశాల సంస్థల నుంచిఅందిన సరఫరాలు ఎంతో దోహదం చేశాయి. ఇప్పుడు చైనా దేశీయ ఉపకరణాలపై దృష్టి పె ట్టింది. సి919 విమానంకోసం దేశీయంగా సీజే`1000జె ఇంజిన్‌ తయారుచేస్తోంది. అయితే దీని తయారీకి కూడా ఇప్పుడు విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడుతోంది. ఇంత వేగంగా ముందుకెళుతున్నా, ఈరంగంలో పూర్తి స్వయం సమృద్ధి సాధించడానికి దశాబ్దాల కాలం వెనుకబడే వుందని చెప్పాలి. ప్రస్తుతం అమెరికా ఆంక్షల పుణ్యమాని ఈ రంగం కుదేలయ్యే పరిస్థితి ఏర్పడిరది. 

భారత్‌ నేర్చుకోవాల్సిన పాఠాలు

స్వాతంత్య్రం వచ్చిన దగ్గరినుంచి పౌరవిమాన తయారీపై ఏ ప్రభుత్వం కూడా పెద్దగా దృష్టిపె ట్టింది లేదు. చైనాలో మాదిరిగా కమర్షియల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (సీఓఎంఏసీ), లేదా పాశ్చాత్య దిగ్గజ సంస్థలైన బోయింగ్‌, ఎయిర్‌బస్‌ వంటి సంస్థల ఏర్పాటు గురించి ప్రభు త్వాలు ఆలోచించకపోవడం విచిత్రం! అయితే పూర్తిగా ప్రయత్నించలేదని చెప్పడం కూడా తప్పే.ఎందుకంటే ఈదిశగా యత్నించినప్పటికీ, పూర్తిస్థాయి నిబద్ధతతో అవి కొనసాగలేదనేది సత్యం. మనదేశం మొట్టమొదటగా 1991లో ‘సరస్‌’ పేరుతో వాణిజ్య విమానాల తయారీరంగంలోకి అడుగుపెట్టింది. దీని కింద మొట్టమొదటి ఫ్లైట్‌ 2004లో ఎగిరింది. అయితే ఈ రంగంలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటివరకు విమానతయారీకి అవసరమైన డిజైన్‌ ఇప్పటివరకు రూపొందలేదు. నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబరేటరీస్‌ (ఎన్‌ఏఎల్‌), హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)లు సంయుక్తంగా ఇప్పుడు 90సీట్ల సామర్థ్యమున్న ప్రాంతీయ రవాణా విమానాన్ని (ఆర్‌టీఏ) అభివృద్ధి చేస్తున్నాయి. ఆర్‌టీఏ డిజైన్‌ మరియు అభివృద్ధికి రెండు బిలియన్లఅమెరికన్‌ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. అయితే ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ (ఎస్‌పీఎల్‌) తయారీపట్ల మొగ్గు చూపుతోంది.

‘సరస్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఎన్‌ఏఎల్‌. ఇదే కార్యక్రమం కింద ఈ సంస్థ సరస్‌`ఎంకె2 రకం విమానాల రూపకల్పనలో తలమునకలుగా వుంది. ఈ విమానం 19 సీట్ల సామ ర్థ్యం కలది. 2017లో కేంద్రం ఈ ప్రాజెక్టుకోసం రూ.6వేల కోట్లు కేటాయించింది. దీనికి సం బంధించిన తొలి విమానం 2027 డిసెంబర్‌లో ఎగురుతుందని అంచనా. ఆలస్యమైనా ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు.

చైనాకు చెందిన సీఓఎంఏసీ సంస్థ అనుభవాలను పరిశీలిస్తే, చిన్న పరిమాణంలోని ప్రాంతీయ జెట్‌ల తయారీపై దృష్టి పెడితే ప్రయోజనకరంగా వుండవచ్చు. ఎందుకంటే దేశీయ అవసరాల రీత్యా ఇటువంటి చిన్న విమానాల తయారీ మనకు ఉపయుక్తంగా వుండగలవు. సరికొత్త విప్లవాత్మక డిజైన్లకోసం కుస్తీ పట్టేకంటే, అందుబాటులోని సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విశ్వసనీయత కలిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారుచేయగలిగితే ప్రస్తుతానికి మనదేశీ య విమానరంగం డిమాండ్లను అందుకోవచ్చు. వీటికి అవసరమైన సంక్లిష్ట సాంకేతిక వ్యవస్థలను పశ్చిమ దేశాలనుంచి దిగుమతి చేసుకోక తప్పదు. పశ్చిమదేశాలపై ఆధారపడక తప్పకపో యినప్పటికీ విమానయాన రంగంలో మనం ప్రవేశించగలుగుతాం కదా! అదీకాకుండా వీటిని దేశీయంగా వివిధ రూట్లలో తేలిగ్గా నడపవచ్చు. దేశవ్యాప్తంగా 90G విమానాశ్రాయాలను కలి 

 పేవిధంగా 625 రూట్లతో రూపొందించిన ‘ఉడాన్‌’ అవసరాలు తీరతాయి. ఉడాన్‌ కింద టుటైర్‌, త్రీటైర్‌ పట్టణాలకు విమాన సదుపాయం కల్పించాలన్నది కేంద్రం లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సా ధించడంలో ‘ఆర్టీఏ`90’, ‘సరస్‌ ఎకె`2’ రకం విమానాలు ఎంతగానో దోహదం చేయగలవు. నూటికి నూరుశాతం స్వదేశీ పరిజ్ఞానంతో విమానాలు తయారుచేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. పశ్చిమదేశాల సాంకేతిక సహకారంతో వేగంగా ఈ చిన్న విమానాల తయారీ చేపట్ట వచ్చు. 

ప్రస్తుతం భారత్‌ మల్టిపుల్‌ ఫైటర్‌ జెట్‌ల తయారీపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా వడోదరలో టాటాఎయిర్‌బస్‌, సి295 సైనిక రవాణా విమానాన్ని తయారుచేస్తోంది. ఇటువంటిప్రాజెక్టులకు అవసరమైన ఎరోస్పేస్‌ కాంపోనెంట్స్‌ తయారుచేసి ఎప్పటికప్పుడు అందించే చిన్న సంస్థలు మనదేశంలో పుష్కలంగా వున్నాయి. సి295 సైనిక రవాణా విమానానికి సంబంధించిన13వేల విడిభాగాలను దేశీయంగా 37 సప్లయర్స్‌ తయారుచేస్తున్నారు. ఈ నైపుణ్యాలు, ప్రయాణికుల విమానాల తయారీకి కూడా ఉపయోపడగలవు. అదేవిధంగా టాటా సంస్థ కర్నాటకలోని కోలార్‌లో ఎయిర్‌బస్‌ హెచ్‌125 హెలికాప్టర్‌ అసెంబ్లీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. ఈవిధం గా ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ తయారీ ఎకోసిస్టమ్‌ మనదేశంలో వృద్ధి చెందడం, వీటి ఎగుమతులకు దోహదం చేయగలవు. ప్రస్తుతం మన ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ ఎగుమతుల విలువ రెండు బిలియన్‌ డాలర్లుగా వుంది. ఈ ఎగుమతులను పదిరెట్లు పెంచడం ద్వారా, అంతర్జాతీయ ఏరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ మార్కెట్‌లో 10శాతం చేజిక్కించుకోవాలన్నది మనదేశ లక్ష్యం. ప్రస్తుతం గ్లోబల్‌దిగ్గజ సంస్థలైన ఎయిర్‌బస్‌, బోయింగ్‌, రోల్స్‌రాయిస్‌ వంటి సంస్థలు తమకు కావలసిన కాంపొనెంట్స్‌కోసం అధికంగా భారత్‌పైనే ఆధారపడుతున్నాయి. ఆవిధంగా ఔట్‌సోర్సింగ్‌ను మనకు ఇవ్వడం వల్ల వాటి తయారీ ఖర్చు 15ా20 శాతం తగ్గడమే కాదు, అత్యంత నాణ్యమైన ఉత్పత్తు లు మననుంచి వారు పొందగలుగుతున్నారు. ఈనేపథ్యంలో రోల్స్‌రాయిస్‌ సంస్థ మనదేశానికిచ్చే ఔట్‌సోర్సింగ్‌ను రెట్టింపు చేయాలన్న ఆలోచనలో వుంది. ప్రస్తుతం ప్రతి వాణిజ్య ఎయిర్‌ బస్‌ విమానంలో మనదేశంలో తయారీ కాంపొనెంట్స్‌ పెద్దమొత్తంలోనే వుంటున్నాయి! ఇప్పటికే నా ణ్యమైన ఎరోస్పేస్‌ కాంపొనెంట్స్‌ తయారీలో గ్లోబల్‌ మార్కెట్‌లో మనదేశానికి మంచిపేరుంది. ఇందులో సాధించే నైపుణ్యం మనదేశం పౌర విమానాల తయారీకి ఎంతగానో ఉపయోగపడగలదు. నైపుణ్యం విషయంలో మనం చైనా అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకోవాలి. విమానాలకు సంబంధించి ఉపావ్యవస్థలను స్వల్పకాలం పాటు మనం దిగుమతి చేసుకున్నా, వీటికి ప్రత్యా మ్నాయాలను దేశీయంగా అభివృద్ధి చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఇప్పుడు సీఓఎంఏసీ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యే మనకూ పునరావృతం కాగలదు. చైనానుంచి మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం ఏమంటే, ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్టుకు సుస్థిరంగా, దీర్ఘకాలం పాటు నిధులను సమ కూర్చడం తప్పనిసరి. ఉదాసీనంగా కొనసాగించిన సరస్‌ ప్రాజెక్టు మాదిరిగా మరే ఇతర ప్రాజె క్టు వుండకూడదు. దానివల్ల ప్రయోజనం వుండదు. ప్రతి విమానం తయారీ వెనుక ప్రభుత్వం సంపూర్ణ మద్దతివ్వాలి. ఉదాహరణకు ఎయిర్‌బస్‌ సంస్థకు యూరోపియన్‌ యూనియన్‌ నుంచి 22 బిలియన్‌ డాలర్ల సబ్సిడీ లభించింది. ఫలితంగా ఎ380, ఎ350 విమానాలను తయారుచేయగలిగింది. ఇదే సమయంలో ప్రైవేటు రంగానికి కూడా సముచిత ప్రాధాన్యం ఇవ్వాలి. మొ త్తంమీద చెప్పాలంటే విమానాల తయారీరంగంలో ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో వుంచుకొని వీటి తయారీలో మన కంటూ ఒక వ్యూహాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాల్సి వుంటుంది.

`తెలంగాణ సొమ్ముతో ఆంద్రాలో రిజర్వాయర్లు?

`తెలుగు దేశం పార్టీ వచ్చాక మరింత దోపిడీ.

`మద్రాసుకు నీళ్లిచ్చారు.

`తెలంగాణను ఎండబెట్టారు.

`పోతిరెడ్డిపాడు పొక్క పెట్డి, తెలుగు గంగ పారించారు.

`రాయలసీమలో అడుగడుగునా ఎత్తిపోతల రిజర్వాయర్లు కట్డుకున్నారు.

`పెద్ద ఎత్తున ఎత్తిపోతల పథకాలు?

`తెలంగాణ ప్రాజెక్టులకు ఆనాడు చేతులు రాలేదు.

`ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చేసిన అన్యాయానికి సాక్ష్యాలు.

`తెలంగాణలో ఎత్తిపోతలు ఖర్చన్నారు.

`అంత ఖర్చు సాద్యం కాదన్నారు.

`ఆంద్రాలో పదుల సంఖ్యలో రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు.

`ఆనాడు నోరు మెదపని తెలంగాణ నాయకులు.

`తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్నారు.

`నీళ్లన్నీ కిందకు వదిలేసి ఆంద్రాకు న్యాయం చేస్తున్నారు.

`తెలంగాణ ఎండబెట్టి ఆంద్రాకు నీళ్లు వదిలేస్తున్నారు.

`కేసిఆర్‌ హయాంలో రాజమండ్రికి నీటి కరువొచ్చింది.

`కాంగ్రెస్‌ హయాంలో ఇప్పుడు ధవళేశ్వరం కళకళలాడుతోంది.

`తెలంగాణకు ఉమ్మడి పాలకులు ఎప్పటికీ శత్రువులే!

`ఉమ్మడి పాలకులకు తెలంగాణ బాగుపడడం ఇష్టం లేదు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాటి ఆంద్రా పాలకులు తెలంగాణ నీళ్లను తరలించుకుపోయారు. నిధులు ఆంద్రాకు మళ్లించుకున్నారు. నియామకాలన్నీ కట్టబెట్టుకున్నారు. తెలంగాణకు తీరని అన్యాయంచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు ఇంకా ఎలా అన్యాయం చేయాలన్న ఆలోచనలే చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని బనకచర్లను తెరమీదకు తీసుకొచ్చారు. వెంటనే దాని పనులు మొదలుపెట్టారు. సముద్రంలో కలిసే నీటిని వృధాగా పోకుండా, వరద జలాల మీద ఆధారపడి బనకచరర్ల నిర్మాణం చేపడతామని ఏపి ప్రభుత్వం అంటోంది. నిజానికి వరద పోటేత్తే సమయంలో వాడుకునే పరిస్థితి వుంటుందనేది శుద్ద అబద్దం. ఎప్పుడైతే ప్రవాహ ఉదృత్తి మోతాదులో వున్నప్పుడే నీటిని వాడుకుంటారు. కాని మాటలకు మాత్రం వరద జాలలను మాత్రమే వినియోగించుకుంటామని చెప్పడం ఏపి పాలకులకు అలవాటైంది. ఉమ్మడి రాష్ట్ర్రంలో కూడా అదే చెప్పేవారు. పోతిరెద్డి పాడు విషయంలోనూ అదే చేశారు. దాంతో ఏపిలో నిర్మాణం చేసిన అనేక ఎత్తిపోతల ప్రాజెక్టుల రిజర్వాయర్లకు అదే సమాదానం చూపించారు. కాని నికర జలాలు మాత్రమే ఎత్తుకుపోతున్నారు. అది గత అరవై సంవత్సరాలుగా సాగుతూనే వుంది. ఇంకా సాగిస్తూనే వున్నారు. ఏ నదికైనా కింది రాస్ట్రానికి ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం వుంటుందన్న సాకుతో పరిమితికి మించి నీటిని వాడుకోవడానికే ఏపి ఆనాటి నుంచి అలవాటు చేసుకున్నది. రాష్ట్రం విడి పోయిన తర్వాత ఆ వాదన మరింత ఎక్కువగా చేస్తోంది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, బిజేపి నాయకులు ఏపి ప్రభుత్వం బనకచర్లకు నీళ్లు తరలించుకుపోతున్నా స్పందించడం లేదని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. పోలవరం నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసుకునేందుకు రాయలసీమను సస్యశ్యామలం చేయాలని తెలంగాణపై కుట్రలు చేస్తున్నారు. ఓ వైపు శ్రీశైలం నుంచి ఇప్పటికే రాయలసీమకు పోతిరెడ్డిపాడు మొదలుపెట్టి, చెన్నైకి తెలుగు గంగ కాలువ ద్వారా మంచినీటిని అందిస్తున్నారు. కాని తెలంగాణకు మంచినీటిని అందించేందుకు కూడా ఏనాడు ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలైనా సరే గోదావరి నీటిని బనకచర్లకు వందల టిఎంసిల నీటిని తరలించుపోయే కుట్ర చేస్తున్నారు. కేంద్రం ఆశీస్సులతో మళ్లీ తెలంగాణకు తీరని అన్యాయంచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్‌ ఫ్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకు నోరు రావడం లేదానే అని ఆరోపణలు వి నిపిస్తున్నాయి. తెలంగాణ నుంచి 8 లోక్‌సభ సీట్లు గెలిచిన బిజేపి బనకచర్ల మీద సమర్ధవంతంగా మాట్లాడితే ఆపార్టీకే ఎంతో మేలు జరుగుతుంది. తెలంగాణలో బిజేపికి మరింత మద్దతు దొరికే అవకాశముంది. పైగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బనకచర్లకు కేంద్రం ఎలాంటి అనుమతులివ్వలేదంటున్నారు.. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొని, కేంద్ర ప్రభుత్వ సంస్ధ వ్యాప్కో సూచనలతో కట్టిన కాళేశ్వరాన్ని తప్పు పడుతున్నారు. కేంద్రం ఆశీస్సులతో తెలంగాణ అన్యాయం చేసే బనకచర్లపై మాత్రం మాట్లాడేందుకు రెండు జాతీయ పార్టీల నాయకులు పూర్తి స్ధాయిలో ఎందుకు స్పఏదించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బనకచర్ల లాంటి అతి పెద్ద ప్రాజెక్టు కేంద్రం అనుమతులు లేకుండా నిర్మాణం సాద్యమౌతుందా? ఇంత హడావుడిగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన సమయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు. తెలంగాణను ఎండబెట్టే కుట్ర తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌, బిజేపి నాయకులు ప్రశ్నించపోవడాన్ని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోంది. ఇది మన కళ్లముందు కనిపిస్తున్నదే అయినా పెద్దగా స్పందన రావడం లేదు. గెలిపించిన తెలంగాణ రైతుల నోట్లో మట్టికొట్టే ప్రమాదాన్ని అడ్డుకోవాల్సిన అవసరం వుంది. పదేళ్లపాటు పచ్చగా, కాళేశ్వరం ద్వారాకోటి ఎకరాల మాగాణగా మారిన తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందనేది జల ఇంజనీర్ల అభిబ్రీపాయం. దశాబ్దాల పాటు కరువుతో అల్లాడిన తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడానికి ఉమ్మడి పాలకులు ఇష్టపలేదు. ఏపి పాలకులు, పార్టీలు తెలంగాణకు మరోసారి తీరని అన్యాయంచేస్తున్నాయి. తెలంగాణను అరవైఏళ్లు పీల్చి పిప్పి చేశారు. గతంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్మాణంచేయలేదు. ఎన్నికల ముందు పునాది రాళ్లు వేయడం, తర్వాత మర్చిపోవడం అలవాటు చేసుకున్నారు. పదవుల కోసం మాత్రమే రాజకీయాలు చేసిన తెలంగాణ నాయకులు ఏపి నాయకులకు తొత్తులుగా మారిపోయారు. దాంతో తెలంగాణలో ప్రాజెక్టు అనే పేరు వినిపించకుండా చేశారు. తెలంగాణ అనే పదాన్ని నిషేదించేదాకా తెచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జై తెలంగాణ అనేందుకు ధైర్యం చాలడం లేదు. ఇలాంటి పాలకుల వల్ల ఇప్పటికే తెలంగాణ మళ్లీ పదేళ్లు వెనక్కిపోయింది. ఇంకా ఇలాగే వుంటే యాభై ఏళ్లు వెనక్కి పంపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేమన్నారు. నిధులు ఇవ్వలేమన్నారు. ఎత్తిపోతల సాద్యం కాదన్నారు. కాని ఏపిలో మాత్రం అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మాణంచేసుకున్నారు. అందులో రాయలసీమలోనే వందల టిఎంసిల నీళ్లతో కూడిన ఎత్తిపోతల ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నోరు మెదపలేదు. తెలంగాణ ప్రజలు అదికారం కట్టబెట్టినా ఆంద్రా నాయకులకు ఎదురు మాట్లాడడం లేదు. తెలంగాణ ప్రాజెక్టులకు నిదులు లేవని చెప్పిన ఉమ్మడిపాలకులు ఏపిలో కండలేరు నిర్మాణం చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం అదికారంలోకి వచ్చిన తర్వాత ఆసియాలోనే అతి పెద్ద మట్టి నిర్మాణంతో జలాశయం నిర్మాణం చేశారు. పదకొండు కిలోమీటర్ల పొడవు కట్ట నిర్మాణం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధులతో కండలేరు కట్టుకున్నారు. తెలంగాణలో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను 50 టిఎంసిలో నిర్మాణం చేస్తే భూకంపం వస్తుందని భయపెట్టిన తెలంగాణ ద్రోహులకు, కండలేరు కనిపించలేదు. 1985లోనే కండలేరును 68 టిఎంసిల నీటి సామర్ధంతో నిర్మాణంచేశారు. ఎప్పుడూ 50 టిఎంసిల నీటికి తక్కువ కాకుండా నింపుకుంటూ వచ్చారు. తిరుపతి నగరమేకాదు, ఆఖరుకు తమిళనాడు రాజదానికి చెన్నైకి మంచినీటిని సరఫరా చేశారు. అమ్మకు అన్నం పెట్టని వాళ్లు పినతల్లికి గాజులు చేయించినట్లు చేశారు. తెలంగాణకు మంచినీరు ఇవ్వడానికి ఇష్టపడని తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు చెన్నై నగర ప్రజల మంచినీళ్ల కోసం ఆలోచించారు. ఉమ్మడి రాష్ట్ర నిధులతో చెన్నైదాకా నీళ్లు తరలించుకున్నారు. ఇలా సాగు, తాగు నీటి అవసరాలు తీర్చుకున్నారు. తెలంగాణలో ఎత్తిపోతల సాద్యం కాదని చెప్పిన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఏపిలో ఎత్తిపోతల పధకాలు వేలాది కోట్లు ఖర్చు చేసి కడుతుంటే కళ్లు మూసుకున్నారు. ఇదే కాకుండా పదుల సంఖ్యలో పెద్ద పెద్ద రిజర్వార్లు నిర్మాణం చేసుకున్నారు. అందులో ప్రధానమైనవి వెలింగొండ ప్రాజెక్టు. సుమారు 43 టిఎంసిల సామర్ధ్యంతో తెలంగాణ నిదులను వాడుకొని నిర్మాణం చేసుకున్నారు. దాని కింద అనేక చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మాణంచేసుకున్నారు. ఊరకళ్లు రిజర్వాయర్‌ 10 టిఎంసిల సామర్ధ్యంతో కట్టారు. బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌ను 17 టిఎంసిల సామర్ధ్యంతో చేపట్టారు. పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర నిధులను ఇలా దోచుకెళ్లారు. అలుగునూరు ప్రాజెక్టుకు 10 టిఎంసిలతో నిర్మించుకున్నారు. అవుకు 9 టిఎంసిలతో రిజర్వాయర్‌ పూర్తి చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం వున్నాయి. వీటి కింద కొన్ని వందల చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నారు. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిదులతో చేపట్టారు. ఆఖరుకు రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ తూములు పగుల గొట్టి మరీ నీళ్లను దోపిడీ చేసుకున్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా సాగునీటి అవసరాలకోసం నిర్మాణం జరిగిన రాజోలి బండ తూములు పగలగొట్టి మరీ నీళ్లు తీసుకెళ్లారు. నిజం చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులకు చేసిన ఖర్చుల సగం ఖర్చు చేసినా తెలంగాణ పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. తెలంగాణలో ఒక్క ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టినా తెలంగాణ అంతా సస్యశ్యామలమయ్యేది. అయినా ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. నీళ్లిచ్చి తెలంగాణ బాగు పడడం చూడాలనుకోలేదు. తెలంగాణను ఎడారిగా మార్చి, తెలంగాణ నిధులతో ఆంద్రా ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు. ఏపిని అన్నపూర్ణ అని పిలిపించుకున్నారు. తెలంగాణను ఆకలి కేకలు వింటూ ఆనందపడ్డారు. అలాంటిది ఇప్పుడు కూడా మరో సారి బనకచర్ల పేరుతోమరో పెద్ద జలదోపడీ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ వాదులు మేలుకోకపోతే, నీటి పంపకాల సమయం వచ్చినప్పుడు మరోసారి తెలంగాణకు తీరని అన్యాయం జరిగే అవకాశం వుంది.

‘‘నేటిధాత్రి’’కి ‘‘గుమస్తా’’ నోటీసులు!

`నిజానికి, నిర్భయానికి నిదర్శనం ‘‘నేటిధాత్రి’’.

`ఈ పిట్ట బెదిరింపులు ‘‘నేటిధాత్రి’’ చాలా చూసింది.

`రైతు ప్రయోజనాలే నేటిధాత్రి’’కి ముఖ్యం.

`రైతులను మోసం చేసిన వారెవరైనా వదిలిపెట్టం.

`2016 లో ‘‘నేటిధాత్రి’’ రాసిన వార్తకు రాష్ట్రానికే కేంద్రం సబ్సిడీ ఆపేసింది.

`‘‘నేటిధాత్రి’’ చేసింది ఇన్వెస్టిగేషన్‌ జర్నలిజం.

`ఆహార భద్రతా చట్టాలు తెలియక జగన్‌ ఆటలాడుతున్నాడు!

`వ్యవసాయ చట్టాల మీద అవగాహన లేక జగన్‌ వడ్లు మాయం చేస్తున్నాడు!

`చిన్నా, చితక వ్యవహారం అనుకుంటున్నాడు

`కేంద్ర ప్రభుత్వం అన్ని గమనిస్తోంది.

`కేంద్రం రంగంలోకి దిగితే అసలు సినిమా అప్పుడు తెలుస్తోంది.

`కిలాడి జగన్‌ ను ఉసిగొల్పుతున్న జగత్‌ కిలాడీలు ఎవరో ‘‘నేటిధాత్రి’’ కి తెలుసు.

`మిల్లర్‌ జగన్‌ చేసిందే అన్యాయం, ఘోరం.. నేరం.

`నేరం చేసి బరితెగిస్తామంటే మీడియా ఊరుకుంటుందా?

`ప్రభుత్వం కళ్లు మూసుకుంటుందా?

`పాపం పండే సమయం చట్ట పరంగా రాకుండా వుంటుందా?

`‘‘నేటిధాత్రి’’ కథనంతో యంత్రాంగం కదలకుండా వుంటుందా?

`సివిల్‌ సప్లైలో ఎంత మందిని మేనేజ్‌ చేయగలరు.

`ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లాంటి వారు ఒక్కరు చాలు.

`ఇంతకాలం తిన్నదంతా కక్కించే రోజు త్వరలోనే వస్తుంది.

`‘‘నేటిధాత్రి’’ ఎప్పుడూ తప్పుడు వార్తలు రాయదు.

`21 సంవత్సరాల ట్రాక్‌ రికార్డులో మచ్చ లేదు.

`తప్పు చేసిన వారిని వదిలిపెట్టిన సందర్భం అసలే లేదు.

`బట్టలుతికినట్లు ఉతికి అక్షరాలతో ఆరేస్తుంది.

`ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జగన్‌ మిల్లులకు నోటీసులిచ్చింది నిజం కాదా?

`2 వేల బస్తాలు మాయమైన సంగతి వాస్తవం కాదా?

`ముగ్గురు బలమైన మంత్రులున్న ఖమ్మం రైతులను మోసం చేయడం అంత సులువనుకున్నావా?

`జగన్‌ మిల్లుల నుంచి మురుగు నీరు ఇరిగేషన్‌ కాలువలో కలుస్తున్నది నిజం కాదా?

`ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నది నిజం కాదా?

`అనవసరంగా జగన్‌ ఆటలో అరటిపండౌతున్నాడు.

`జగత్‌ కిలాడీల బాగోతం బైటకు రాకుండా జగన్‌ను ముందు పెట్టి ఆడిస్తున్నారు.

`‘‘నేటిధాత్రి’’కి నోటీసులిచ్చి జగన్‌ మరింత ఇరుక్కున్నాడు.

`తెలంగాణలో మిల్లర్లు మింగిన వడ్ల లెక్కలు వెయ్యి కోట్లౌతుంది.

`రైతులను మోసం చేసిన వారి బండారం బైట పెట్టడం ‘‘నేటిధాత్రి’’ కర్తవ్యం.

`రైతుల వడ్లు జగన్‌ మాయం చేయడం నేరం.

`ఈ రెండిరటికీ తేడా తెలియక ఎగిరితే జగన్‌ ఎల్లెలుకల పడడం ఖాయం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

  రైతుల వడ్లు మాయం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న గుమస్తా జగన్‌ అలియాస్‌ మిల్లర్‌ జగన్‌ నేటిదాత్రి దినపత్రికకు నోటీసులు పంపించారు. జగన్‌ వ్యవహారం ఎలా వుందంటే దొంగే దొంగ అన్నట్లుంది. ఆరు గాలం కష్టించి రైతులు పండిరచిన వడ్లును అన్యాయంగా మాయం చేసినప్పుడు తాను తప్పు చేస్తున్నానని గుర్తురాలేదా? తాను చేసేది పెద్ద నేరమన్న సంగతి తెలియదా? పొరపాట్లు చేసుకుంటూ పోయే వ్యక్తిని నేటిధాత్రి జగన్‌ చాలా గొప్ప పని చేశాడంటూ కీర్తించాలనుకుంటున్నాడా?ఏమిటి? చేసిందే పాడు పని. పాపిష్టి పని. పాపపు పని. రైతులను అన్యాయం చేయడమే పెద్ద ఘోరమైనపని. అంతా చేసి తన పరువుకు భంగం కలిగిందని నేటిధాత్రికి నోటీసులు పంపితే బెదిరిపోతుందనుకున్నాడో ఏమో? మిల్లర్‌ జగన్‌ చేసినపని అందరికీ తెలుసు. జిల్లా అధికారులకు తెలుసు. జగన్‌ చేసిన పని ఖమ్మం జిల్లా సివిల్‌ సప్లయ్‌ యంత్రాంగానికి తెలుసు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఏకంగా జగన్‌కు చెందిన మిల్లులకు నోటీసులు జారీ చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ అదికారులకు సూచించారు. ఖమ్మం జిల్లానుంచి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అయినా జగన్‌ మేకపోతు గాంభీర్యం ఎక్కడో ప్రదర్శించాల్సిందిపోయి, నేటిదాత్రికి నోటీసులు పంపించి మరింత తప్పు చేసినట్లైంది. నేటిధాత్రి ఇలాంటి పిట్ట బెదిరింపులు గత 24ఏళ్లలో అనేకం చూసింది. జగన్‌ అనేవ్యక్తి తప్పు చేయకుంటే నేటిధాత్రిలో వార్త అయ్యేదే కాదు. హన్మకొండ జిల్లాల్లో ఏ మిల్లర్‌ చేయని నీచమైనపని చేసి, తాను సచ్చీలుడినని చెప్పుకునే ప్రయత్నం చేస్తే సమాజం కూడా హర్షించదు. ఇప్పుడిప్పుడే జగన్‌ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు ఖమ్మం జిల్లా నుంచి ఇది వరకు వచ్చినా, ఇప్పుడు వచ్చిన వడ్ల వివరాలు కూడా అన్నీ త్వరలో పూర్తి వివరాలు రానున్నాయి. పెద్దఎత్తున రైతులను జగన్‌ చేసిన ఘరానా మోసం వెలుగులోకి వస్తోంది. జగన్‌ మీద వర్తాల పరంపర ఆగిపోలేదు. ఇప్పుడే మొదలైంది. ముందు ముందు మరిన్ని కథనాలున్నాయి. జగన్‌ చేసిన తప్పుల లెక్కలు అన్నీ బైటకు వస్తాయి. ఎందుకంటే నేటిధాత్రికి రైతుల ప్రయోజనాలే ముఖ్యం. రైతులను మోసం చేసిన వారు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తిలేదు. ఉదారత ప్రదర్శించే అవకాశం లేదు. రైతులను మోసం చేసిన వారు ఎంత పెద్ద వాళ్లైనా సరే నేటి ధాత్రి వదిలిపెట్టదు. పైగా చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా, జగన్‌ తాను చేసిన సుద్దపూస పని గొప్పగా వుందనుకుంటున్నాడో ఏమో? నేరం చేసి కూడా ఇంకా బరితెగిస్తామంటే నేటిధాత్రి ఊరుకోదు. తప్పులు, మోసాలు చేసిన వారికి పాపం పండే సమయం ఎప్పుడో అప్పుడు వస్తుంది. నేరం చేసిన వారికి శిక్ష తప్పకుండా పడుతుంది. నేటిధాత్రిలో వచ్చిన కథనాలలో తప్పు వుంటే జగన్‌ మీడియా ముఖంగా వివరాలు వెల్లడిరచవచ్చు. పూర్తి వివరాలు బైట పెట్ట వచ్చు. ఖమ్మం జిల్లా నుంచి జగన్‌కు చెందిన మిల్లులలో 2వేల వడ్ల బస్తాల మాయాజాలంపై నోటీసులు అందిన మాట వాస్తవం కాదా? తనకు నోటీసులు రాలేదని జగన్‌ చెప్పగలరా? ఈ వివరాలు ఎందుకు బైట పెట్టడం లేదు. అదికారులు ఎంత మందిని జగన్‌ మేనేజ్‌ చేయగలడు. ఎంత కాలం వారు కాపాడగలరు. శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సినసమయంలో తప్పకుండా వారు స్పందించాల్సిందే. జగన్‌పై కేసులు నమోదు చేయాల్సిందే. లేకుంటే అధికారులు తమ ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోవాల్సిందే. జగన్‌ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లలేదన్న భ్రమల్లో వున్నట్లున్నాడు. రెండు మూడు రోజుల్లో అంతా తేలుతుంది. అప్పుడే తొందరెందుకు? పిల్లికండ్లు మూసుకొని పాలు తాగినట్లు, తన మిల్లులో వడ్లు మాయమైతే గుర్తించేదెవరు అని అనుకున్నాడు. కాని ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వడ్ల బస్తాల మీద లెక్కలు రాయిస్తారని పసిగట్టలేపోయాడు. రాత్రికి రాత్రి వడ్లు తరలించి, లేవని చేతులు దులుపుకుంటే సరిపోతుందనుకున్నాడు. కాని ఒక సమర్ధవంతమైన ఐఏఎస్‌ అధికారి సరిగ్గా పని చేస్తే ఎలా వుంటుందో జగన్‌కు ముందు ముందుతెలుస్తుంది. జగన్‌ లాంటి అక్రమార్కుల పని పట్టాలంటే ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ లాంటి ఉన్నతాదికారి ఒక్కరు చాలు. ఇంత కాలం తిన్నదంతా కక్కించేందుకు పెద్దగా సమయం పట్టదు. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లైలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం కూడా కమీషనర్‌కు వెళ్తూనే వుంది. కమీషనర్‌ చౌహాన్‌ అన్నీ గమనిస్తూనేవున్నారు. నేటిధాత్రికి సుద్దపూసలాగా జగన్‌ నోటీసులు పంపడం కూడా వారి దృష్టికి వెళ్లింది. నేటిధాత్రి అనేది ఒక బ్రాండ్‌. మీడియా రంగంలో నేటిధాత్రికి ఒక ప్రత్యేకమైన గుర్తింపే కాదు, స్ధానం వుంది. రెండున్న దశాబ్ధాల కాలంలో తప్పుడు వార్తలు రాయడం అన్నది జరిగింది లేదు. ఇప్పటి వరకు తప్పుడు వార్తలనే మచ్చ లేదు. తప్పుల మీద తప్పులు, మోసాల మీద మోసాలు, నేరాలు చేస్తున్న జగన్‌ తన పరువు గురించి ప్రస్తావించడమే విచిత్రంగా వుంది. నేటిధాత్రికి పంపిన నోటీసుల్లో వడ్ల ప్రస్తావన చేసిన జగన్‌ తన మిల్లుల నుంచి వెలువడుతున్న కెమికల్‌ నీరు గురించి ఎందుకు ప్రస్తావించలేదు. తమ మిల్లుల నుంచి వెలువడుతున్న కెమికల్‌ నీటి ప్లాంట్ల గురించి ఎందుకు చెప్పలేదు. ఆ నీరుంతా ఇరిగేషన్‌ కాలువలో కలవడం లేదని నిరూపించగలడా? కాలువల్లో పారుతున్న మురుగునీటికి మిల్లుల నుంచి వెలువడుతున్న నీరు కాదని రుజువు చేసుకోలగడా? ఇటు ఇరిగేషన్‌ శాఖకు నష్టం చేస్తూ, అటు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును మోసం చేస్తూ, ప్రజల ప్రాణాలకు హాని తలపెడుతున్న జగన్‌ కూడా నీతులు వల్లించడమంటే దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. తెలంగాణలో ముగ్గురు మంత్రులున్న ఏకైక జిల్లా ఖమ్మం. అలాంటి జిల్లాకు చెందిన రైతులు మోసం చేస్తే వదిలేస్తారని జగన్‌ ఎలా అనుకుంటున్నాడో? ఎవరు రక్షిస్తారనుకుంటున్నాడో? ఎందుకంటే జగన్‌కు పూర్తిగా రైతుల చట్టాలు తెలియనట్లున్నాయి. ఇంత కాలం నేటిధాత్రిలా చెప్పిన మీడియా లేకపోవడం కూడా జగన్‌కు కలిసొచ్చినట్లుంది. ఆహార భద్రతా చట్టాలు ఎంత పకడ్భందీగా కేంద్రం అమలు చేస్తుందో ఎప్పుడూ విననట్లుంది. 2019కి మందు తెలంగాణలో సివిల్‌ సప్లైలో జరుగుతున్న అక్రమాలపై నేటిధాత్రి రాసిన వరుస కధనాలతో కదిలిన కేంద్రం సబ్సిడీలు అప్పుడు ఆపేసింది. ఇంత వరకు వాటిని విడుదల చేయలేదు. అంతటి ట్రాక్‌ రికార్డు నేటిధాత్రి సొంతం. తప్పులు చేసి కూడా పరువు, ప్రతిష్ట అని జగన్‌ చెప్పుకోవడమే సిగ్గు చేటు. అలాంటి వారిని వదిలిపెట్టిన చరిత్ర నేటిధాత్రికి లేదు. బట్టలుతికినట్లు ఉతికి అక్షరాలతో ఆరేసిన చరిత్ర నేటిధాత్రిది. ఆ సంగతి తెలిసి కూడా జగన్‌ చేసిన తప్పు సరిదిద్దుకోకుండా నోటీసులు ఇవ్వాలనుకోవడం మరో తప్పుకు కారణమైంది. నేటిధాత్రి చేసేదే ఇన్‌వెస్టిగేషన్‌ జర్నలిజం. ఆ సంగతి జగన్‌కు తెలియకపోవడం విచారకరం. జగన్‌ చేసింది చిన్నా చితకా వ్యవహారంకాదు. దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులను మోసం చేసిన మిల్లర్లు ఎంత మందిపై కేసులు నమోదయ్యాయో తెలుసుకుంటే మంచిది. అనేక రాష్ట్రాలలో బస్తా వడ్లు మాయం చేసిన మిల్లర్లపై కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. ఇక్కడ అదికారుల ఉదాసీనతతో మిల్లర్లు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అయినా కిలాడీ జగన్‌ వెనుక వున్న జగత్‌ కిలాడీలు ఎవరో కూడా నేటిధాత్రికి తెలుసు. జగన్‌కు ఉసిగొల్పి ఆట లాడిస్తున్నవారి మాటలతో మొదటికే జగన్‌ మోసం తెచ్చుకుంటున్నాడు. ఆఖరుకు ఆటలో అరటి పండు కావడమే తరువాయి అన్న సంగతి జగన్‌ తెలుసుకోలేకపోతున్నాడు. అనసవరంగా సివిల్‌ సప్లైతో సమస్యలు తెచ్చుకుంటున్నాడు. ఎగదోసే వాళ్లు ఎగదోస్తారు? ఒక్కరిని ముందు పెట్టి ఆడిరచాలనుకుంటారు? కారణం ఇతరులు చేసే తప్పుల మీద చర్చలు రాకుండా చూసుకుంటారు. వడ్ల మాయం సంగతి ఒక్క జగన్‌కే సొంతం కాదు. తెలంగాణ వ్యాప్తంగా చాల మంది జగన్‌ లాంటి మిల్లర్లు సాగిస్తున్నారు. అవన్నీ బైటకు వచ్చే సమయం ముందు ముందు వుంది. ఆ లెక్కలన్నీ తేలిస్తే వేల కోట్లవుతున్నాయి. రైతులను ఏఏ మిల్లర్‌ ఎంత మోసం చేశాడన్నది కమీషనర్‌ స్ధాయిలో అన్ని లెక్కలున్నాయి. అవి కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయి. అప్పుడు జగన్‌కే కాదు, అందిరకీ వుంటుంది?

భూభారతి సద్వినియోగం చేసుకోవాలి

భూభారతి సద్వినియోగం చేసుకోవాలి..

తహసిల్దార్ రజనీకుమారి.

రామాయంపేట జూన్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

 

రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి అన్నారు. బుధవారం రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించారు.

 

 

We should take advantage of the land.Tehsildar Rajnikumari.

ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఇది చక్కని అవకాశం అని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు.

వేశ్యలంటూ వెర్రి వాగుళ్లు!మేధావుల ముసుగులో వెదవలు?

`నాలుగు రోజులు జర్నలిస్టులుగా పని చేస్తే మేధావులు కారు.

`సమాజాన్నే కించ పర్చే వ్యాఖ్యలు చేస్తే గొప్ప వారు కారు.

`అమరావతి దేవతల రాజధాని!

`కనిపించే తల్లి కన్నా గొప్ప దైవం విశ్వంలో ఎవరూ వుండరు.

`అమరావతి అంటే ఇది కాదు అనడానికి సిగ్గు పడాలి.

`మన కళ్ల ముందు కనిపించేదే అమరావతి అనుకోవాలి.

`అదే దేవతల రాజధానిగా భావించాలి.

`అమరావతి పరిసర ప్రాంతాలు వేశ్యల రాజధాని అన్న వాడికి శిక్ష పడాలి.

`అమరావతి ప్రాంతాన్ని అవమానించడమే!

`ముఖ్యంగా మహిళల ఆత్మాభిమానం దెబ్బతీయడే!

`రాజధాని ప్రాంతాన్ని ఈ రకంగా చిత్రీకరించడం నేరమే!

`వేశ్య చేసేది కూడా కాయకష్టమే!

`మన సమాజంలో అలాంటి పరిస్థితులపై వ్యవస్థ సిగ్గుపడాలి.

`శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో వేశ్య పన్ను అమలు చేశారు.

`వేశ్య వృత్తి తప్పే..వారు తప్పుడు మహిళలు కాదు.

`పొట్ట కూటి కోసం తప్పని పరిస్థితులలో గడిపే కాలం!

హైదరాబాద్‌,నేగిధాత్రి:

తమదే జర్నలిజం..తాము చెప్పిందే సుభాషితం అనుకునేవాళ్లు చాల మంది మోపయ్యారు. ముఖ్యంగా ఎలక్రానిక్‌ మీడియా వచ్చిన తర్వాత వారి పైత్యం మరీ ఎక్కువైంది. నోరుంది కదా? అని ఏది పడితే అది వాగకు..అన్నది తెలుసు. అయినా తాము సత్యాలే చెబుతాం…ప్రజలకు నిజాలే అందిస్తామన్నట్లు కొన్ని దుష్టపర్వాలు ఉచ్చరిస్తుంటారు. ఇలాంటి వాళ్లను సమాజం కూడా వెలివేయాలి. ఇక్కడ అసలు విషయాన్ని ముందు తెలుసుకుందా. ఈ మధ్య ఓ ఆంగ్ల దినపత్రికలో ఆరోగ్యపరమైన అంశాలను వివరించే క్రమంలో ఓ ఆర్టికల్‌ వచ్చింది. అందులో వ్యభిచారం ఎక్కువగా జరుతున్న రాష్ట్రాల క్రమాన్ని వివరించారు. దానికి లేనిపోనివి ఆపాదించి, సాక్షి టీవిలో అసందర్భ చర్చను చేపట్టారు. నిజానికి అలాంటి విషయాలను చర్చించాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎన్నో దారుణాలున్నాయి. సమస్యలున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలున్నాయి. వాటిని వెలుగులోకి తెస్తే,ప్రజలకు మేలు జరుగుతుంది. అంతే కాని వ్యభిచారం గురించి సోది మొదలు పెట్టి ఏకంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిపై నిందలు మోపడం అన్నది సరైంది కాదు. పైగా మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడం అసలే మంచిది కాదు. ప్రపంచంలో వ్యభిచారం అనేది ఎక్కడలేదు? అమెరికా లాంటి దేశాల నుంచి చాలా పేద దేశాల్లో కూడా వుంది. వేశ్యా వృత్తి రాజుల కాలం నుంచి వుంది. అదేమీ తప్పు కాదు. మన దేశంలో చట్ట పరంగా నేరం. దానిని ఏ ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. మన సమాజంలో అనాదిగా అవలంభిస్తున్న వృత్తుల్లో వ్యభిచారం కూడా వుండేది. ఇప్పుడు మన సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఆ వృత్తిని ఎప్పుడో వదిలేశారు. కాని ఏకంగా ఏపి రాజధాని ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అంటూ సీనియర్‌ జర్నలిస్టు అనే ముసుగులో వున్న కృష్ణం రాజు అనే వ్యక్తి మాట్లాడడం తప్పు. నేరం కూడా. అంతే కాకుండా సాక్షి టివీలో యంకర్‌గా పనిచేసే సీనియర్‌ జర్నలిస్టు కృష్ణం రాజును మాటలను అడ్డుకోకపోవడం, తప్పని చెప్పకపోవడంతోపాటు, సమర్ధించినట్లే వ్యవహరించడమే అసలు సమస్యకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఏపిలోని అమరావతి ప్రాంతానికి ప్రత్యేకమైన విశిష్టత వుంది. అది బుద్దుడు నడయాడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి బుద్దుడు వచ్చి అక్కడ చాలా కాలం పాటు వున్నట్లు కూడా చరిత్ర చెబుతోంది. పైగా బుద్దిజం విలసిల్లిన ప్రాంతం. అంతే కాకుండా ఆ ప్రాంతాన్ని ధాన్య కటకము అనికూడా చరిత్రచెబుతోంది. తెలుగు మొట్టమొదటి రాజులైన శాతవాహనుల తొలి రాజధాని అమరావతి అయితే, రెండో రాజదాని దాన్య కటకము అని చరిత్రలో వుంది. అయితే మరో అమరావతి ప్రస్తుతం మహారాష్ట్రలో వుంది. అది శాతవాహనుల రాజదాని. తర్వాత రెండో రాజధాని అయిన ధాన్యకటకము. అది గుంటూరు జిల్లాలో వుంది. తర్వాత కాలంలో ధాన్యకటకాన్ని అమమరావతి అని పిలుస్తూ వచ్చారు. అంతే కాకుండా అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం కృష్ణా నది ఒడ్డున వుంది. అందుకే అమరావతి అనే పేరు అలా కూడా వచ్చింది. అంతటి పవిత్రమైన ప్రాంతాన్ని గురించి నోరుంది కదా? కృష్ణంరాజు వెర్రి వాగుడు వాగి ఇరుక్కుపోయాడు. అయితే తాము క్షమాపణ చెప్పాం..అర్దం చేసుకోకలేపోతే మేమేం చేయలేమంటూ మళ్లీ కొమ్మినేని శ్రీనివాస్‌ రావు మళ్లీ గిల్లాడు. దాంతో ప్రజలకు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 40 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో వుండి తాము రాసిందే వార్త అనే దుర్మార్గపు పైత్యం వారిలో నిండిపోయింది. అందుకే ఇలాంటి మాటలు వదిలేశారని చెప్పకతప్పదు. అమరావతి దేవతల రాజధాని. దానికి దేవేంద్రుడు రాజు. కాని ఇది మన రాష్ట్రంలో అమరావతి. దానికి దీనికి సంబంధం లేదంటూ నోటి దూలను ప్రదర్శించారు. దాంతో ఇరుక్కున్నారు. అయినా వేశ్యా వృత్తిని ప్రోత్సహించిన రాజుల కాలం కూడా వుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వేశ్య పన్ను కూడా విధించిన సందర్భాలున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వేమన శతకాలు. వేమన పద్యాలు తెలియని వారు ఎవరూ వుండదు. వేమన కూడా ఒక వేశ్యను ఆరాదించిన సంగతి తెలిసిందే. ఆమె పేరు మీదనే పద్యాలు కూడా రాశారు. వృత్తి తప్పుకావొచ్చు కాని వారి మనసు తప్పని ఎలా చెప్పగలం. ఒక మహిళ వేశ్యగా మారడానికి ఎవరు కారణం? మన సమజం కాదా? సమాజంలో వున్న హెచ్చు తగ్గులు కాదా? కుల వ్యవస్ధ కాదా? ఎప్పుడో దాసి అనే సినిమా వచ్చింది. రాజుల కాలంలో వేశ్యా నర్తకిలు వుండేవారు. నాడైనా, నేడైనా సమాజంలో వున్నారు. అది తప్పుకాదు. కాలే కడుపుకు తిండి దొరకాలంటే కొన్నిసార్లు తప్పు కాదు. ఏదైనా పని చేసుకొవచ్చు కదా? అని నీతులు చెప్పేవారు కూడా వున్నారు. సగటు మహిళ పది మంది మధ్య పని చేయాలంటే ఆ చుట్టూ వుండే చూపులు చేసే గాయం ఎంత ప్రమాదరకమో తెలియందా? ఇంత విద్యా, విజ్ఞానవంతమైన సమాజంలోనే నిత్యం అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు జరుగున్నాయి. చెప్పలేనటు వంటి దారుణాలు జరుగుతున్నాయి. మగాడి కోరికకు బలౌతున్న ఎంతో మంది అబలల జీవితాలు ఆగమౌతున్నాయి. వేశ్య వృత్తిని స్వీకరించిన వారిని సమాజం దూరం కొడుతుంది. రోడ్డు మీద కనిపిస్తే చీత్కరించుకుంటారు. రాత్రి పూట వాళ్ల దగ్గరకు సుఖానికి వెళ్తాడు. మగాడిలోనే రెండు రకాల వేశ్య దాగివున్నాడు. అలాంటి మగాడికి వేశ్య గురించి మాట్లాడే అర్హత లేదు. అయినా వేశ్య అని ముద్ర వేసి, వారిని కించపర్చే హక్కు ఎవరికీ లేదు. వారిని నీచంగా మాట్లాడే హక్కు లేదు. ఎవరి వృత్తి వారిది. వారి వృత్తిని శంకించే హక్కు ఎవరికీ లేదు. మేధావుల ముసుగులో కృష్ణం రాజు వాగడం, దాన్ని కొమ్మినేని ఆపకపోవడం రెండూ నేరాలే. గత ఐదేళ్ల కాలంలో అమరాతిని ఏ కొంచెం పట్టించుకున్నా, ఇప్పుడు ఎంతో గొప్ప రాజదానిగా అడుగులు పడేవి. అమరావతిని అభివృద్ది చేస్తే సిఎం. చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందో అని మూడు రాజధానులంటూ నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు లేనిపోని కూతలు కూస్తున్నారు. ఆ ప్రాంత మహిళలపై అభాండాలు వేశారు. ఇది మన్నించలేంత ఘోరం. ఎట్టకేలకు కొమ్మినేని అరెస్టు చేశారు. కృష్ణం రాజును అరెస్టు చేస్తామంటున్నారు. ఏ మీడియా అయినా సరే మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడానికి ఈ సంఘటనతో భయపడాలి. అంతే..

ఎవడైతే నాకేంటి!?

`దొంగ మిల్లర్‌ జగన్‌ ‘‘బడివె’’ మాటలు!

`నా మిల్లులను టచ్‌ చేసే దమ్ముందా!

`అందరూ నా సొమ్ము తిన్నోళ్లే!

`ఎవడొస్తాడో రాని చూస్తా!

`500000 వడ్ల బస్తాలు లెక్కకున్నాయా?

`28 వేల బస్తాలల్లో 2000 పైచిలుకు బస్తాలు మాయం! మరి 500000 బస్తాలలో ఎన్ని బస్తాలు మాయం చేసినట్లు!

`ఆ రెండు మిల్లులకు కేటాయించిన 500000 బస్తాల లెక్కలు తేల్చండి!

`జగన్‌ బండారం బైట పెట్టండి.

`రైతులను మోసం చేసిన మిల్లులను మూసేయండి!

`అధికారులు, నా సొమ్ము తిన్న వాళ్లకు అంత ధైర్యముందా? అని సవాలు విసురుతున్నాడు.

`హనుమకొండ ‘‘జెసి’’ కోరిన రిపోర్ట్‌పై ఇప్పటివరకు స్పందించని, డీఎస్‌ఓ కొమురయ్య,సూపరిండెంట్‌ రోజారాణి,డిటి నాగేంద్ర ప్రసాద్‌..

`వరంగల్‌ మిల్లర్ల అవినీతిపై ఖమ్మం జెసి సివిల్‌ సప్లై కమిషనర్‌ కి సమర్పించిన ఆధారాలు.

`ఆ మహిళా అధికారికి గుణం కన్నా కులమే ముఖ్యమట? 

`మిల్లర్‌ జగన్‌ను కాపాడే తీరుతుందట?

`హనుమకొండ అధికారుల తీరుపై విస్తుపోతున్న ఖమ్మం అధికారులు.

`తనపై చర్యలు తీసుకుంటే అందరి గుట్టు బయట పెడతానంటున్న జగన్‌.

`జగన్‌ మిల్లుల్లో ఉన్న లక్షల వడ్ల బస్తాలని ఇతర మిల్లులకు తరలించాలని ఖమ్మం జేసి. ఆదేశాలు.

`అధికారులను అమ్మనా బూతులు తిడుతున్న జగన్‌?

`ఆ విషయం తెలిసినా చీమ కుట్టినట్లు కూడా లేని అధికారులు?

`ఖమ్మం జేసి ఎంక్వౌరీకి ఆదేశించి 15 రోజులకొస్తోంది?

`ఇంత వరకు హనుమకొండ ‘‘జెసి’’ కి ట్రక్‌ షీట్లు కూడా అందించని అధికారులు.

`5 లక్షల బస్తాల లెక్కలెప్పుడు తేల్చుతారు! జగన్‌ బండారం ఎప్పుడు బైట పెడతారు!

`జగన్‌ అక్రమ సంపాదన ఎప్పుడు వెలికితీస్తారు?

`రైతులకు న్యాయం ఎప్పుడు చేస్తారు?

`ఒక్క ఐకేపి సెంటర్‌ నుంచి వచ్చిన వడ్లతోనే రూ.20 లక్షల మోసం చేసిన జగన్‌?

`20 ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో ఎంత మాయం చేసి వుంటారు?

`ఎన్ని కోట్లు వెనకేసుకొని వుంటాడు?

`అంతా బహిరంగ రహస్యమే అయినా అధికారులంతా గప్‌ చుప్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:  

తవ్వుతున్నా కొద్ది హన్మకొండలోని ఓ అక్రమ మిల్లర్‌ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లై అధికారుల అండదండలతో విచ్చలవిడిగా ఆ అక్రమ మిల్లర్‌ సాగిస్తున్న అక్రమ దందాలన్నీ వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన మిల్లర్‌ బాగోతాలపై నేటి దాత్రి వరుస కథనాలు ప్రచురిస్తూనేవుంది. ఆ వార్తలు వాస్తవాలను అంగీకరిస్తూ ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హన్మకొండ అదికారులకు సూచిస్తూ నోట్‌ కూడా పంపించారు. ఆ నోట్‌ హన్మకొండ జిల్లా అధికారులకు చేరి కూడా సుమారు 15 రోజులౌతోంది. అయినా హన్మకొండ జిల్లా యంత్రాంగం కదిలింది లేదు. ఉలుకు లేదు. పలుకులేదు. పైగా అక్రమ మిల్లర్‌కు జగన్‌కు వంతపాడుతున్నారు. అండగా వుంటున్నారు. అతనికి తప్పించుకునేందుకు సూచనలు,సలహాలు ఇస్తున్నారు. ఆఖరుకు ఖమ్మం జిల్లా జేసినే బురిడీ కొట్టించాలని చూస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అంటే జగన్‌ వద్ద నుంచి లెక్కలేనంతసొమ్ము అదికారులు ఎప్పటికప్పుడు అందుకున్నారు. జగన్‌తో లాలూచీ పడ్డారు. అందుకే జగన్‌ ఇటీవల ఓ ఫంక్షన్‌లో అధికారులపై బూతులు సందించినట్లు కూడా విశ్వసనీయ సమచారం. ఆ ఫంక్షన్‌లో జగన్‌ మీద వస్తున్న ఆరోపణలపై చర్చకు వచ్చినప్పుడు ఎవడైతే నాకేంటి? ఎవడొచ్చి నన్ను ఏం చేస్తారు? అంతా నా గుప్పిట్లో వున్నారు. నా చేతిలో వున్నారు. నేను చెప్పింది మాత్రమే వాళ్లు వినాలి. లేకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు కూడా తెలుసు. అంటూ అదికారులన్న మర్యాద కూడా లేకుండా బూతులు సందిస్తూ ఆ ఫంక్షన్‌లో జగన్‌ హంగామా చేసినట్లు కూడా విశ్వసనీయ సమాచారం. నన్ను..నా మిల్లును టచ్‌ చేసే దమ్ము ఎవరికి వుంది? నా మిల్లు దగ్గరకు వచ్చిన మాట్లే ధైర్యం వాళ్లకు వుందా? అంటూ సవాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి, కింది నుంచి పై స్దాయి దాక అందరూ నా సొమ్ము తిన్నవాళ్లే..నేను వేసే బిస్కట్లకు ఆశపడేవారే..అలాంటి వాళ్లు నా జోలికి వస్తారా? సివిల్‌ సప్లైకి చెందిన విజిలెన్స్‌ అయినా, ఎవరైనా సరే నా మిల్లుల కాంపౌండ్‌లోకి రాలేరు. ఎవడొస్తారో..రాని చూస్తా? అంటూ జగన్‌ అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు జగన్‌కు కేవలం 28వేల బస్తాల వడ్లే వచ్చినట్లు అనుకుంటున్నారు. కాని నిజానికి 2024`25 తొలి సీజన్‌లోనే సుమారు 5లక్షల వడ్ల బస్తాలు వచ్చినట్లు తెలుస్తోంది. అవన్నీ ఖమ్మం జిల్లాలకు చెందిన వడ్లు కావడం విశేషం. ఎందుకంటే హన్మకొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన రైతులు ఎవరూ మిల్లర్‌ జగన్‌కు వడ్లు ఇవ్వడానికి ఒప్పుకోరు. ఒక వేళ ఇచ్చినా ముందు మురిపెంగా మాట్లాడే జగన్‌ తర్వాత ఎంత కోతలు కోస్తాడో..రైతులను ఎంత ముంచేస్తాడో అందరకీ తెలుసు. అందుకే జగన్‌ మిల్లులకు ఏ ఒక్క ఐకేపి సెంటర్‌ నుంచి కూడా జగన్‌కు వడ్లు ఇవ్వడానికి రైతులు అసలే ఒప్పుకోరు. అందుకే మిల్లర్‌ జగన్‌ ఖమ్మం జిల్లాకు చెందిన ఐకేపి సెంటర్ల నుంచి వడ్లు తెచ్చుకుంటాడు. ఖమ్మం జిల్లాకుచెందిన ఒక్క ఐకేపి సెంటర్‌ నుంచి వచ్చిన 28వేల బస్తాలలో సుమారు 2వేల బస్తాలు మాయం చేసినట్లు ఆరోపలు ఎదుర్కొంటున్నారు. అది నిజమే అని ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్‌ కలెక్టర్‌ నిర్దారణ చేశారు. ఆ బస్తాలు ఏమయ్యాయో? వెంటనే రిపోర్టు కావాలని కోరిన సందర్భం కూడా వుంది. అయినా హన్మకొండ జిల్లా అధికారులు ఇప్పటి వరకు కదల్లేదు. అయితే జగన్‌ అక్రమ దందాలపై నేటిధాత్రి మరింత దృష్టిపెట్టడంతో ఖమ్మం జిల్లాలోని సుమారు 20 ఐకేపి సెంటర్ల నుంచి ఇప్పటి వరకు 5లక్షల వడ్ల బస్తాలు జగన్‌ మిల్లులకు చేరినట్లు సమాచారం. 28వేల బస్తాలతోనే సుమారు 2వేల బస్తాలు మాయం చేసిన జగన్‌, 5లక్షల బస్తాలలో ఎంత మాయి చేసి వుంటాడో అర్ధం చేసుకోవచ్చు. 28వేల బస్తాలలో మాయం చేసిన 2వేల బస్తాల మూలంగా జగన్‌ 20లక్షల రూపాయలు రైతులను మోసం చేశాడు. అంటే 5లక్షల వడ్ల బస్తాలలో జరిగిన మాయంతో ఎన్ని కోట్లు కొట్టేశాడన్నది ఇప్పుడు లెక్క తేలాల్సి వుంది. ఇలా జగన్‌ చేస్తున్న మోసాలన్నీ హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర మిల్లులకు, రైతులకు పూర్తిగా తెలుసు. అయినా ఎవరూ మాట్లాడానికి ముందుకు వచ్చేవారు కాదు. జగన్‌ అరచకాలు అలా వుండేవి. గత ప్రభుత్వ హాయాంలో కులం పేరు చెప్పుకొని ప్రాపకం పొందేవాడు. ఇప్పటికి కూడా అదే సాగిస్తునాన్నాడు. ఆనాటి నుంచి జగన్‌ కనుసన్నల్లో వున్న అధికారులే ఇప్పటికీ వుండడంతో ఆయన ఆటలకు అడ్డు కట్ట పడడం లేదు. జగన్‌ మోసాలను ఎవరూ బైట పెట్టడం లేదు. పైగా జగన్‌ను వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ఖమ్మం జేసిని బురిడీకొట్టించాలని చాల ప్రయత్నం చేశాడు. కాని కుదరలేదు. ఖమ్మం జేసి చేసిన స్కెచ్‌ జగన్‌, హన్మకొండ అదికారులు పసిగట్టకపోవడంతో అసలు బండారం బైట పడిరది. అయితే రెండు వేల బస్తాలకు సంబందిచిన సొమ్ము అందడంతో కాస్త ఆలస్యమైంది. అందుకు సంబంధించినవి గుర్తించడం జరిగింది. త్వరలోనే వాటికి సంబంధించిన సొమ్ము రైతులకు అందజేయడం జరుగుతుందని చెప్పమని జగన్‌కు హన్మకొండ అదికారులు సూచనలు చేస్తున్నట్లు కూడా సమాచారం. అంటే ఇంత జరుగుతున్నా జగన్‌ది అక్రమమని అనేందుకు కూడా హన్మకొండ అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. పైగా ఖమ్మం జేసి రిపోర్టునే తొందరపాటు చర్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మొత్తం ఖమ్మం జిల్లా నుంచి జగన్‌కు చెందిన రెండుమిల్లలకు ఎన్ని బస్తాల వడ్లు చేరాయో లెక్కలు తేల్చే పనిలో ఖమ్మం జిల్లా అదికారులు నిమగ్నమైవున్నారు. ఇప్పటి వరకు అందినసమాచారం మేరకు జగన్‌కు చెందిన మిల్లులకు ఇప్పటికే 5లక్షల బస్తాలు చేరినట్లు ప్రాధమిక సమచారం. ఇంకా లోతుగా తవ్వితే ఎంత చేరిందనేదానిపైకూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది. జగన్‌కు ఇప్పుడు అసలైన భయం మొదలైంది. హన్మకొండ అదికారులను గుప్పిట్లోపెట్టుకొని ఆడినట్లే ఖమ్మం జిల్లా అధికారులను కూడా కొనేయాలనిచూశాడు. కాని కుదరలేదు. ఖమ్మం జేసి నిక్కచ్చిగా తన నిజాయితీని నిరూపించుకున్నారు. జరిగిన అక్రమ దందాలన్నీ బైట పెట్టాలనే చూస్తున్నారు. జగన్‌ వల్ల రైతులు ఎంతో మోసపోయారని గుర్తించారు. ఆ సొమ్ముంతా రైతులకు చేరేలా చూడాలనుకుంటున్నారు. అయితే ఇటు ఖమ్మం జిల్లా అధికారుల నుంచి ఒత్తిడి, కమీషనర్‌ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే హన్మకొండ అధికారులు కూడా రంగంలోకి దిగక తప్పదు. జగన్‌ బండారం బైట పెట్టక తప్పదు. ఎందుకంటే అప్పుడు వారి ఉద్యోగాలకే ఎసరు వస్తుంది. అలాంటి పరిస్ధితి వస్తే జగన్‌ను దోషిని చేయడం ఖాయం. కాకపోతే హన్మకొండ జిల్లాలో పనిచేస్తున్న ఓ మహిళా అదికారి జగన్‌కుచెందిన సమాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. దాంతో జగన్‌ను కాపాడే బాద్యత ఆమె భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ అదికారికి జగన్‌ గుణం, వ్యవహారం, అక్రమ దందాలకన్నా, మోసాలకన్నా కులమే ముఖ్యమట? జగన్‌కు కాపాడి తీరుతుందట? ఈ విషయాన్ని ఆమె కార్యాలయంలో ఇతర ఉద్యోగులతో బాహంటానే చెబుతున్నారట? హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ అదికారుల తీరుతో ఖమ్మం జిల్లా అదికారులు విస్తుపోతున్నారు. ఇదేం పద్దతని తప్పుపడుతున్నారు. రైతులకు మేలు చేయాల్సిన అధికారులు మిల్లర్లకు మేలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారట? రోజు రోజుకూ మితిమీరిపోతున్న జగన్‌ వ్యాఖ్యలు తెలిసిన ఖమ్మం జేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. జగన్‌కు చెందిన మిల్లుల్లో ఖమ్మం జిల్లా రైతులకు చెందిన 5లక్షల వడ్ల బాస్తాలున్నాయా? లేవా? వుంటే లెక్కంత? ఎన్ని మాయమయ్యాయి? ఎలా మయ్యామయ్యాయి? అనే వివరాలు కావాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యదావిధిగా ఇతర మిల్లులకు చెందిన వడ్ల ఖమ్మం వడ్ల లెక్కలో కలపడమో? లేక ఇతర మిల్లుల గోడౌన్లలో వున్న వడ్లు జగన్‌వి అని తేల్చితే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా తేల్చి చెప్పారట. దాంతో ఇంత దూరం వచ్చేదాకా అదికారులు ఏం చేస్తున్నారు? తానిచ్చిన సొమ్ములు తిని, తనకు అన్యాయం జరిగే పరిస్ధితి వచ్చేదాకా అదికారులు నిద్ర పోతున్నారా? అంటూ జగన్‌ అదికారుల మీద కూడా చిందులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అదికారులు కదులుతారా? లేక జగన్‌కే వత్తాసు పలుకుతారా? కోట్లలో రైతులను ముంచేస్తున్న జగన్‌పై చర్యలు తీసుకుంటారా? వేచి చూడాలి.

గుండె గుడిలో ఇందిరమ్మ గూడు.

`శీనన్న చొరవతో పేదవారి ఇంటి కలకు మోక్షం.

`రేవంత్‌ సర్కారులో పల్లెకు కొత్త దనం.

`తెలంగాణకు సరికొత్త నిండుదనం.

`తెలంగాణ పల్లెల్లో ఇందిరమ్మ సంబురం!

`శీనన్న చొరవతో పేద వారి ఇంటి కలకు మోక్షం.

`ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల పండుగ

`పేదలందరి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో గుండె గుడిలో వేడుక.

`ఇప్పటికే మొదలైన ఇండ్ల నిర్మాణం.

`పేదవారి కళ్లలో ఆనందం.

`పదేళ్ల ఎదురుచూపులకు మోక్షం.

`గతంలో పదేళ్ల కాంగ్రెస్‌ లోనే ఇందిరమ్మ ఇల్లు సొంతం.

`పదేళ్ల బిఆర్‌ఎస్‌ కాలమంతా ఆశల మేఘం.

`ఇప్పుడు మళ్ళీ పల్లెల్లో మళ్ళీ ఆనాటి వాతావరణం.

`పేదలందరికీ కాంగ్రెస్‌ అందిస్తున్న వరం.

`జీవిత కాలం గుర్తుండిపోయేలా ఇందిరమ్మ గూడు నిర్మాణం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ పల్లెల్లో పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల వేడుక మొదలైంది. పల్లె సంబురపడుతోంది. దశబ్ధానికి పైగా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ప్రజలు సంతోషపడుతున్నారు. పదేళ్లపాలు రెండు పడకల గదులు ఇల్లు అంటూ ఊరించి, ఊరించి బిఆర్‌ఎస్‌ ఉసూరుమనిపించింది. ఎన్నికలెప్పుడొచ్చినా రెండు పడకల ఇల్లు ముచ్చట చెప్పుడు తప్ప తీర్చింది లేదు. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కేసిఆర్‌ ఇచ్చింది లేదు. ఎన్నొన్నో చెప్పాడు. ఆఖరుకు కేసిఆర్‌ చేతులెత్తేశాడు. మాయ మాటలు చెప్పి ఓట్ల మూటలు కొల్లగొట్టుకొని పదేళ్లు పాలించి, పట్టుమని పది ఇండ్లుకూడా ఇవ్వలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీ మాటంటే మాటే. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్సే. సొంత ఇల్లు అనేది అందిరకీ కల. నిన్నటి తరం వరకు పల్లెల్లో అందరికీ ఇండ్లు వుండేవి. కాని తరం మారుతున్న కొద్ది ఆ ఇండ్లు పాతబడిపోవడం. కూలిపోవడం జరుగుతోంది. పైగా పెరుగుతున్న జనాభాతో కుటుంబాలు పెరుగుతూ వచ్చాయి. కుటుంబ సభ్యులు పెరుగుతుండడంతో ఇండ్ల అవసరం పెరుగుతూ వచ్చింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఎందుకన్నారో గాని, ఆ సామెత ఇప్పటి రోజులకు సరిగ్గా సరిపోతోంది. గత యాభైఏళ్ల క్రితం వరకు ఎంతటి పేదవారైనా సరే ఏదో ఒక గుడిసె వేసుకొని బతికేవారు. కాని ఈ రోజుల్లో గుడిసే వేసుకునేందుకు స్ధలం లేదు. కట్టుకునే స్ధోమత లేదు. దాంతో ప్రభుత్వం ఎప్పుడు ఇల్లు ఇస్తుందా? అని ఎదురుచూసే రోజులు వచ్చాయి. పేదలు మరింతగా ప్రభుత్వం మీద ఆధారపడి ఇల్లు కట్టుకునే స్ధితికి చేరింది. అందుకే తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు అనే పేరు వినిపిస్తేనే పేదల కళ్లలో ఆనందం నిండుతుంది. ఇక మంజూరైన వారి ఆనందానికి అవదులు వుండవు. కాంగ్రెస్‌ అంటేనే పేదల రాజ్యం. ఇందిరమ్మ రాజ్యమని దేశమంతా అందుకే ఇప్పటికీ ప్రజలు కొనియాడుతుంటారు. ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ప్రధాని కావడం వల్ల పేదలుకు ఎంతో మేలు జరిగింది. పేదలను ఒక స్దాయికి తీసుకురావాలన్న ప్రగతికి బాటలు పడిరది. ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపడం మొదలైంది. అయితే అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కసారి మొదలైందంటే అది నిరంతర ప్రవాహంగా సాగాల్సిందే. ఒకప్పుడు దేశంలోని భూములున్నీ అగ్రవర్ణాల చేతుల్లో వుండేవి. ప్రభుత్వం ఆదీనంలో వుండేవి. వాటన్నింటిలో నూటికి తొంబైశాతం మేర ఆ రోజుల్లోనే ఎస్సీ, ఎస్టీలు ఇందిరాగాంధీ భూములు పంచారు. ఆ భూములను సాగుయోగ్యం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు భూముల ఇవ్వడమే కాకుండా, వాటిని సాగుయోగ్యం కోసం పక్క బావులు తివ్వించారు. అలాంటి బావులు ఇప్పుడు తవ్వించాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అయినా ఆరోజుల్లో ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా ఎస్సీ, ఎస్టీలకు భూముల ఇవ్వడమే కాకుండా, బావులు తొవ్వించి రైతులను చేశారు. కుల వృత్తులకు పరిమితైన ఆ వర్గాలను రైతులను చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుంది. అంతే కాకుండా దేశంలోని ప్రతి పల్లెలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం అప్పుడే మొదలైంది. అలా దేశంలో కొన్ని కోట్ల మందికి ఇండ్లు నిర్మాణం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీ వల్లనే సాధ్యమైంది. పల్లె పట్టణాలు అనే తేడాలేకుండా గర్‌ కుల్‌ అనే కాలనీలు పెద్దఎత్తున వెలిసిన రోజలవి. తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే దేశంలోని అనేక పట్టణాలల్లో పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణం చేసి, ప్రజలకు నీడ కల్పించారు. తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడిరాష్ట్రంలో 2004 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల కాలంలో అటు రైతులకు, ఇటు పేదలకు అనేక రకాలమేలు చేశారు. అర్హలైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను అందించారు. ప్రతి ఊరిలోనూ, పట్టణాల్లోనూ ప్రభుత్వ భూములనే సేకరించి, ప్రజల చేతికి రూపాయి ఖర్చు లేకుండా, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేశారు. ప్రతి పల్లెల్లో కనీసం 50 నుంచి వందకు తక్కువ కాకుండా ఇందిరమ్మ కాలనీలు వచ్చాయి. ప్రతి పట్టణంలో వేలాది ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇండ్ల కాలనీలు అనేకం వున్నాయి. అంతే కాకుండా ప్రజలు ఉపాధి హమీ అమలు చేసి, ఆర్ధిక ప్రగతికి తోడ్పాటు కల్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వనటు వంటి పధకం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న ఆలోచనతో కేసిఆర్‌ రెండు పడకల గదుల ఇండ్లు అనికొత్త ప్రచారం మొదలుపెట్టారు. ప్రభుత్వం తల్చుకుంటే ఇవ్వడం పెద్ద సమస్య కాదని ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రుజువైంది. అందుకే తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌ను నమ్మారు. అదే సమయంలో కాంగ్రెస్‌పార్టీనే గెలిపిస్తే ఇప్పటి వరకు మరో ఇరవై లక్షల ఇండ్లకు పైగా నిర్మాణం జరిగేవేమో? కేసిఆర్‌ అధికారంలోకి రాగానే ఉమ్మడి రాష్ట్రంలో వున్న గృహ నిర్మాణ శాఖను రద్దు చేసినప్పుడే కేసిఆర్‌ నైజం బైట పడిరది. డబుల్‌ బెడ్‌ రూంల ఇండ్లు అనేవి మిధ్యఅనేది తేలిపోయింది. కాని జనం కేసిఆర్‌ ఇస్తారన్న నమ్మకాన్ని రెండోసారి కూడా పెట్టుకున్నారు. కాని కేసిఆర్‌ ఇండ్లు ఇవ్వడానికి సుముఖతచూపలేదు. డబుల్‌ బెడ్‌ రూంలు ఇవ్వలేదు. డబుల్‌ బెడ్‌ రూంలు ఇస్తామని నమ్మించి, గృహనిర్మాణ శాఖను వదిలించుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి ఆ శాఖను మూసేయించారు. దాని మనుగడ లేకుండా చేశారు. ఈ వాదన ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలైంది. ఆ సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు చిన్న పొరపాట్లు జరిగడం సహజం. అయినా ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకుంటామా? అని కూడా అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్‌ లక్ష్యమని చెప్పి, అప్పటి ప్రతిపక్షాల నోరు మూయించారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ ఇండ్లు ఇచ్చారు. కాని బిఆర్‌ఎస్‌కు సాద్యం కాలేదు. ఇవ్వాలన్న మనసు కేసిఆర్‌కు రాలేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్‌ హయాంలో కనిపించిన పండుగ మళ్లీ మొదలైంది. పల్లెల్లో పెద్దఎత్తున పండుగ వాతారణం కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఎక్కడిక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మానం మొదలైంది. త్వరలోనే ఆ ఇండ్లు పూర్తయ్యే దశకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతంవున్న పరిస్ధితుల్లో ఊరుకి పది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా లక్షల ఇండ్లు అవుతాయి. తెలంగాణలో సుమారు 14వేల గ్రామాలున్నాయి. పట్టణాలు 600లకు పైగా వున్నాయి. పల్లెలు పట్టణాలన్నీ కలిపితే కనీసం రెండు లక్షలకు పైగా ఇండ్లు ఏక కాలంలో పూర్తయ్యే అవకాశం వుంది. ఇంకా మూడేళ్ల కాలం ముందుంది. వచ్చే ఏడాది నుంచి పూర్తి స్దాయిలో ఇందిరమ్మ ఇండ్ల పధకం అమలు జరిగితే మూడేళ్లలో కనీసం 15లక్షలకు పైగా ఇండ్లు నిర్మాణం జరగొచ్చని అంచనా. తొలి దఫాలో ఇందిరమ్మ ఇండ్లు దక్కని వారికి మిగిలిన విడతల్లో తప్పకుండా అందే అవకాశం వుంది. ప్రతి పల్లెలోనూ కనీసం రెండు నుంచి మూడు వందల కొత్త ఇండ్లు నిర్మాణం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్లనే సాద్యమని మరోసారి రుజువైంది. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడుగా ప్రజలకు హమీ ఇచ్చారు. అదికారంలోకి వచ్చిన తర్వాత రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎంతో పట్టుదలతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశమేమిటంటే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు గత ఏడాదినుంచే మొదలయ్యాయి. ఆ ఖమ్మం నియోజకవర్గంలో ఎప్పుడో ఇందిరమ్మ ఇండ్లు వెలిశాయి. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి నాయకత్వ నిబద్దతకు నిరద్శనమని చెప్పొలి. పైలెట్‌ ప్రాజెక్టు కింద మొదలైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రతినియోజకవర్గంలో ఊపందుకున్నాయి. నియోజకవర్గానికి సుమారు 4వేల ఇండ్ల నిర్మాణం మొదలైంది. మరో రెండు నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయి, ప్రజలు గృహ ప్రవేశాలు చేసుకునే సమయంకూడా ఆసన్నమౌతోంది. నిజంగా తెలంగాణకు ఇది అసలైన పండుగ చెప్పకతప్పదు.

తప్పిస్తే ఎంతిస్తావ్‌? తూకమెంత తూగుతావ్‌??

-అడిగినంత ఇస్తే అన్నీ మేం చూసుకుంటాం?

-అవసరమైతే ఖమ్మం జేసి రిపోర్ట్‌ తప్పని నోట్‌ పంపిస్తాం!

-జగన్‌ తప్పేం లేదని తేల్చేస్తాం?

-సమస్య నుంచి పూర్తిగా బైట పడేస్తాం?

-కేసులు నమోదు కాకుండా చూసుకుంటాం!

-మిల్లర్‌ జగన్‌తో అధికారుల బేరసారాలు?

-నేటిధాత్రి కథనంతో నీ పని ఔట్‌..? అంటూనే తూకమెంత అంటున్నారు?

-అన్ని శాఖ అధికారులు నేటిధాత్రి పేపర్‌ చూపించి జగన్‌ తో మంతనాలు?

-నేటిధాత్రి వార్త ఒక్కటి చాలు!

ఖమ్మం జేసి చేసిన పని అందరూ హర్షిస్తుంటే హన్మకొండ అధికారులు బేరాలు చేసుకుంటున్నారు?

-నా ఒక్కడి వల్ల కాదు..మిగతా మిల్లర్లతో కలిపి ఇస్తానని జగన్‌ హామీ.

-సివిల్‌ సప్లయ్‌ హన్మకొండ అధికారుల దిగజారుడు తనానికి పరాకాష్ట!

-రైతులను మోసం చేసిన జగన్‌కు వత్తాసు పలుకుతున్నారు.

-జగన్‌ బేరం ఒప్పుకుంటే ఖమ్మం జేసిదే తప్పని నిరూపిస్తాం?

-ఆదర్శంగా వుండాల్సిన అధికారులు ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు.

-రైతులను మోసం చేసిన జగన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.

-మిల్లర్లు, అధికారులు కుమ్మక్కైతే ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు.

-మిల్లర్‌ జగన్‌ దోపిడీని ఎవరూ ఆపలేరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
హన్మకొండలోని సివిల్‌ సప్లయ్‌ అధికారులు అవినీతిలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. శాఖ సాక్షిగా తప్పులుచేస్తారు. మిల్లర్లచేత తప్పులు చేయిస్తారు. తమ తప్పు లేని నిరూపించే ప్రయత్నం చేస్తారు. తప్పు చేసిన మిల్లర్లను తప్పిస్తారు. ప్రతిసారి మాకేమిస్తారని మోసం చేసిన మిల్లర్లకు అండదండలందిస్తారు. అందిన కాడికి దోచుకుంటారు. ఇదీ ప్రస్తుతం హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ శాఖకు చెందిన అదికారుల ఘనకార్యమని అందరూ చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ పెద్ద సంఘటన జరిగింది. తెలంగాణలో ఈ సీజన్‌లో సన్న వరి రకాలను రైతులు రికార్డు స్ధాయిలో పండిరచారు. అందులో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏకంగా 92శాతం సన్న వడ్లు పండిరచారు. దాంతో ఐకేపి సెంటర్లకు పెద్దఎత్తున వడ్లు వస్తున్నాయి. వాటిని మిల్లులకు పంపించడానికి ఆ జిల్లా అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో పొరుగున వున్న హన్మకొండ జిల్లా రైస్‌ మిల్లులకు ఆ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఓ యాభై లారీల వడ్లను పంపించారు. వాటిని జాయింట్‌ కలెక్టర్‌ సూచించిన మిల్లులకు ఆ లారీలు చేరాలి. కాని ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పంపిన మిల్లులకు ఆ వడ్లు చేరలేదు. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లై అదికారులకు అనుంగుడైన, అత్యంత సన్నిహితుడైన జగన్‌ అనే మిల్లులకు చేరాయి. ఇంత వరకు బాగానే వుంది. కాని ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పంపిన వడ్ల బస్తాలకు, రైతులకు అందిన సొమ్ముకు మధ్య ఏదో తేడా కనిపించింది. దాంతో ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆరా తీశారు. ఖమ్మం నుంచి వచ్చిన 50 లారీల బస్తాలలో సుమారు 2000వేల బస్తాలను హన్మకొండ జిల్లాకు చెందిన మిల్లర్‌ జగన్‌ మాయం చేశాడు. ఈ విషయం పసిగట్టిన జాయింట్‌ కలెక్టర్‌ బస్తాల మాయంపై సంబందిత జగన్‌కు చెందిన మిల్లులకు తఖీదులు జారీ చేశారు. దాంతో జగన్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. జగన్‌ మాయం చేసిన వడ్ల బస్తాల గురించి ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌కు ఎలా తెలిసిందని ఆరా తీశాడు. అసలు విషయం తెలుసుకున్నాడు. ఇరుక్కున్నానని అర్ధం చేసుకున్నాడు. ఇక్కడ జరిగిందేమిటంటే ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ ప్రతి బస్తామీద దాని బరుకు చెందిన తూకం రాయించారు. ఈ విషయాన్ని మోసం చేసిన మిల్లర్‌ జగన్‌ పసగట్టలేదు. హన్మకొండ జిల్లాకుచెందిన సివిల్‌ సప్లయ్‌ అదికారులు గుర్తించలేదు. వచ్చిన లారీల నుంచి వడ్లు దించుకున్నామా? అందులో నుంచి 2వేల బస్తాలు మాయం చేశామా? అన్నట్లు జగన్‌ ఆత్రపడ్డారు. అడ్డంగా ఇరుక్కున్నాడు. ఇప్పుడు లబోదిబో మంటున్నాడు. తన బాధను హన్మకొండ సివిల్‌ సప్లయ్‌ అదికారుల ముందు పెట్టాడు. వెతకబోయిన తీర కాళ్లకు తగిలినట్లు హన్మకొండ సివిల్‌ సప్లై అదికారులు జగన్‌ను నేటిదాత్రి దినపత్రిక వుంచారు. ఈ విషయాన్ని నేటి దాత్రి దినపత్రిక ఎప్పుడో ప్రచురించింది. ఓ తరాజులో నేటి దాత్రి దినపత్రిక పెట్టినట్లు, మరో తూకంలో ఎంత ఇస్తావ్‌ అన్న ప్రశ్నలు పెట్టేశారు. తప్పు జరిగింది. జగన్‌ తప్పుచేశాడు. కాని మాకేం తెలియదు. జగన్‌కు వడ్లు ఇవ్వడం వరకే చూసుకున్నాం. కాని జగన్‌ వడ్లు మాయం చేసిన సంగతి మా దృష్టికి రాలేదని అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కేసు తమ మీదకు రాకుండా పూర్తిగా జగన్‌ మీదకు తోసేసే స్కెచ్‌ వేశారు. దాంతో జగన్‌ అదికారుల కాళ్లా వేళ్లా పడే పరిస్దితి వచ్చింది. ఇదే సరైన అవకాశం అనుకున్నారు. తప్పిస్తే ఎంతిస్తావ్‌ అనే బేరానికి వచ్చారు. తూకమెంత తూగుతామని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మేం అడిగినంత ఇస్తే తప్ప నిన్ను రక్షించలేమంటూ జగన్‌కే తెగేసి చెప్పేశారు. మేం అడిగింది తూకంలో వేస్తే అన్నీ మేం చూసుకుంటామని జగన్‌కు అదికారులు భరోసా ఇచ్చారు? హన్మకొండకు చెందిన అదే సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఖమ్మం జేసి ఇచ్చిన రిపోర్టు తప్పని తాము నోట్‌ చేస్తామని, సమాదానం పంపిస్తామని జగన్‌కు చెప్పారు. ఈ విషయంలో జగన్‌ తప్పేం లేదని తేల్చేస్తాం. ఎలాంటి కేసు జగన్‌ మీదకు రాకుండా చూస్తామని హమీ ఇచ్చారు. ముఖ్యంగా నేటిధాత్రి దినపత్రికలో వచ్చిన కథనంతో జగన్‌ ఇక నీపని ఔట్‌ అంటూ బెదించారు. కేసులు ఎదొర్కొక తప్పదని భయపెట్టారు. నిన్ను లోపలికి పంపించేందుకు నేటి దాత్రి ఒక్క వార్త చాలంటూ జగన్‌కు చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలిసి అటు పొల్యూషన్‌ డిపార్టుమెంటు అధికారులు కదిలారు. ఇరిగేషన్‌ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఏక కాలంలో మూడు శాఖల అధికారులు జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలు ఊరుకుంటాయా? వాటి పని అవి మొదలు పెట్టాయి. దాంతో ఇంత మంది అధికారులకు ఏక కాలంలో సమర్పణలు అంటే నా ఒక్కడి వల్లకాదని జగన్‌ అధికారులకు తేల్చి చెప్పాడు. నాతో పాటు వున్న అన్ని మిల్లులపై కూడ చర్యలుంటాయని అదికారులు సహకరిస్తే, వసూలు చేసి ఇస్తానని జగన్‌ హమీ ఇచ్చాడు. ఇది సివిల్‌ సప్లై శాఖతోపాటు, పొల్యూషన్‌, ఇరిగేషన్‌శాఖల దిగజారుడు తనానికి ఇది పరాకాష్ట అని ప్రజా సంఘాలు అంటున్నాయి. జగన్‌ బేరం ఒప్పుకుంటే ఏకంగా ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ దే తప్పని నిరూపిస్తామని అధికారులు అంటున్నారంటే ఎంతగా దిగజారి పోయారో అర్ధం చేసుకోవచ్చు. ఆదర్శంగా వుండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అడ్డమైన దారులు తొక్కుతున్నారు. అడ్డంగా సంపాదనకు ఎగబడ్డారు. తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారిని కాపాడి సంపాదన పెంచుకుంటున్నారు. రైతులను నిండా మోసం చేసిన జగన్‌ను కాపాడే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. మిగతా మిల్లర్లతో మాట్లాడి అదికారులు చెప్పిన మూట సమర్పించడానికి జగన్‌ ఒప్పుకున్నట్లు సమాచారం. దాంతో హన్మకొండ అదికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మిల్లర్లు, అధికారులు కలిసి కుమ్మక్కైతే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా కాపాడలేడన్న సామెతను నిజం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా మిల్లర్‌ జగన్‌ను ఎవరూ ఆపలేరు. ఈ విషయం ఖమ్మం అధికారులు తెలుసుకొని, వెంటనే రంగంలోకి దిగితే అసలు మోసగాళ్లంతా బైటకు వస్తారు. ఖమ్మం జేసి పంపిన రిపోర్టు తప్పని నిరూపించే ప్రయత్నం చేయకముందే అసలు నిజాలు బైట పెట్టి, చర్యలు చేపడితే అందరి బండారం బైటకొస్తుంది. హన్మకొండ సివిల్‌ సప్లై అదికారుల చేతి వాటమే కాదు, పొల్యూషన్‌, ఇరిగేషన్‌ అధికారుల అవినీతి బాగోతం అంతా బైటపడుతుంది.

మామూళ్ల మత్తు వదలరా! 

లంచాలు తీసుకోకుండా బతకరా!!

`పట్టుబడిన వారిపై చర్యలేవి!

`కొలువులు పోకపోతే భయమెక్కడిది!

`శాఖ పరమైన చర్యలు అని చేతులు దులుపుకోవడమేమిటి!

`ఉద్యోగానికి ముందు పోలీసు కేసులుంటే పనికి రారు.

`ఉద్యోగంలో పట్టుబడి కేసులైనా కొలువు పోదు.

`ఇవేం చట్టాలు…చచ్చు బండలు.

`తప్పు చేశాడని కళ్ల ముందు కనిపించినా చర్యలు వుండవు.

`లంచం నేరమైనా శిక్షలుండవు.

`కేసు ఫైల్‌ చేసి అధికారులు చేతులు దులుపుకుంటారు.

`నాయకులు జోక్యం చేసుకొని కొలువులిప్పిస్తారు.

`దర్జాగా లంచావతారి మళ్ళీ కుర్చీలో కూర్చుంటాడు.

`అంతకు మించి లంచాలు లేకుండా కొలువే చేయడు.

`తప్పు చేసి దొరికిన రోజే శిక్ష ఖరారు చేయాలి.

`వెంటనే విచారణ జరిపించి చర్యలు చేపట్టాలి.

`వేల మంది ఉద్యోగులు పట్టుబతున్నా భయం లేదు.

`పట్టుబడినా నష్టమేమీ లేదన్న ధైర్యం ఉద్యోగులలో పెరిగిపోయింది.

`అత్తారింటికి వెళ్లొచ్చినట్లు నాలుగు రోజులు జైలు..తర్వాత బెయిలు.

`ఉద్యోగం కోసం మరునాటి నుంచి ప్రయత్నం.

`లంచాన్ని నమ్ముకొని మళ్ళీ కొలువులో చేరడం.

`లంచావతారులకు శిక్ష అంటే ఇంతేనా!

`ఏసిబికి మరిన్ని అధికారాలు కట్డబెట్టలేరా?

`పట్టుబడిన వెంటనే చర్యలు తీసుకునే అధికారం ఇవ్వలేరా!

`వందల మంది పట్డుబడుతున్నా లాభం ఏముంది?

`కోట్లు సంపాదించుకున్న ఉద్యోగులకు భయం ఎందుకుంటుంది.

`ఒకప్పుడు నాయకులైతే చాలు తరతరాల సంపాదన అనుకునే వారు.

`ఇప్పుడు చిన్న ప్రభుత్వ ఉద్యోగి అయితే చాలు.

`కోట్లు సంపాదించుకోచ్చనుకుంటున్నారు.

`ప్రజలను రూపాయి అడగడానికి నోరు రానంత భయం కలగాలి.

`లంచం తీసుకొని దొరికిన వారి ఆస్థులన్నీ జప్తు చేయాలి.

`కఠినమైన చట్టాలు తీసుకు రావాలి.

`ఉద్యోగులంటే ప్రజలకు సేవకులు అని తెలిసి రావాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 మామూళ్ల మత్తు వదలరా? లంచాలు తీసుకోకుండా బతకలేరా? అంటూ తెలంగాణ సమాజం లంచాలవతారులైన కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రశ్నిస్తోంది. నిలదీస్తోంది. నిందిస్తోంది. తూతూ అంటూ ఉమ్మెస్తోంది. ఉందుకా బతుకులు పాడుగానని శపిస్తోంది. అయినా మారరు. మారితే ఉద్యోగులెందుకౌతారు? మారితే కోట్లు ఎలా కూడబెట్టుకుంటారు. ఎవరెన్ని తిట్టినా మారం..ఎవరెంత బాధపడినా వదిలిపెట్టం. ఇదే ప్రభుత్వ ఉద్యోగుల అనుసరిస్తున్న ధోరణి. అసలు ఇంతగా ప్రబుత్వ ఉద్యోగులు భరితెగించడానికి కారణం కూడా రాజకీయ పార్టీలు, పాలకులు. అది ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏం లేదు. అన్ని పార్టీల అలుసు..వారి అవసరాలే ఉద్యోగులను అవినీతి పరులుగా మారేందుకు కారణమయ్యాయని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల మందు అవినీతికి తావు లేని సమాజం నిర్మాణం చేస్తామని రాజకీయ నాయకులు , పార్టీలు ప్రతిసారి గొప్పగా చెబుతాయి. గెలిచిన తర్వాత అదే ఉద్యోగులచేత అవినీతి పనులు చేయిస్తుంటాయి. దొంగ చేతికి తాళమిచ్చి సొమ్ము పోవొద్దంటే ఊరుకుంటారా? ఇది కూడా అంతే..ప్రజలను పీడిరచకుండా, వేదించకుండా, సేవకులైన పని చేయాలని ఏ పాలకులు ఉద్యోగులను బెదించడం లేదు. అందులో చిత్త శుద్ది వుండడం లేదు. ఎందుకంటే మేం తిట్టినట్లు చేస్తాం..మీరు పడినట్లు నటించండి? అన్న దోరణితో సాగుతోంది. లేకుంటే అదికారులు ఇంత విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటున్నారు? ఏ దైర్యంతో తీసుకుంటున్నారు. ప్రజల నుంచి చిన్న, చితకా పైనైనా సరే లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. అవి పైసాల..లేక పెంకాసులనుకుంటున్నారా? జీతాలు లక్షల్లోకి పెరిగిన తర్వాత ఉద్యోగులు లంచాల రేట్లు కూడా పెంచేశారు. వెలల్లో వున్నప్పుడు వేలల్లో వసూలుచేసేవారు. ఇప్పుడు సగటు ఏ ఉద్యోగికి లక్షకు తక్కువ జీతం లేదు. అందుకే లంచాలు కూడా లక్షలు వసూలు చేస్తున్నారు. జీతం నెలకొక్కొసారి తీసుకంటే, లంచం రోజూ తీసుకుంటున్నారు. నెలలోనే కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా కొన్నిశాఖల్లోని ఉన్నతాధికారులు మాత్రం వాళ్ల సంపాదన వాళ్లెకే తెలియనంతగా పోయింది. వాళ్లేం వ్యాపారం చేసి సంపాదించడం లేదు. కష్టం చేసి చెమటోడ్చడం లేదు. ఏసిలో కూర్చోని సంతకం చేసేందుకు లక్షలు తీసుకుంటున్నారు. ఇంత అన్యాయమా? రైతులను వేదించుకుతింటున్నారు. వేపుకు తింటున్నారు. పీడిరచుకుతింటున్నారు. ఆఖరుకు చచ్చిన రైతు పిండాకుడు కూడా తినడానికి వెనుకాడడంలేదు. ఇంతగా ఉద్యోగులు దిగజారి పోవడం తెలంగాణ సమాజపు దౌర్భాగ్యం. అయినా ఈ రోజు భూముల ధరలు పెరిగాయంటే అది ఉద్యోగుల పుణ్యం కాదు. కష్టం వచ్చినా సరే అప్పులు చేసుకున్నారు. కష్టపడి రూపాయి,రూపాయి సంపాదించి తీర్చుకున్నారు. కాని భూములు అమ్ముకోలేదు. అలా దాచుకున్నదే భూమి. ఆ భూమి నుంచి బుక్కెడు బువ్వ రాని సమయంలో మట్టి తిని రైతులు బతికారు. మంచినీళ్లతో కడుపు నింపుకున్నారు. ఆకలి దహించివేయకుండా నడుము చుట్టూ కడుపును గుడ్డతో బిగించి కట్టుకున్నారు. కడుపు డొక్కలీడ్చుకుపోయినా సరే ఎవరి వద్ద చేయి చాచకుండా బతికారు. అడుక్కొని బతకడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి, అడ్డకూలీలుగా నైనా బతికారే గాని, ఎక్కడా చేయి చూపి బతకలేదు. పల్లెను వదిలి పొట్ట చేత పట్టుకొని, పట్నం వచ్చి ఎంతో మంది రైతులు హోటళ్లలో ఎంగిలి గ్లాసులు కడిగారు. ప్లేట్లు తోమారు. పల్లెలో తలబిరుసుతో బతికిన రైతు తల దించుకొని పని చేశాడు. తలెత్తి చూడకుండా కన్నీటిని మింగుతూ కాలం గడిపారు. భూమి తల్లిని నమ్ముకొని బతికారు. ఇల్లూ, వాకిలి వదిలేసి, ముసలి, ముకతకు ఇంటి కావాలి పెట్టి పొట్ట చేత పట్టుకొని వలసలు పోయారు. కంటికి నిద్రలేని రాత్రులు గడిపారు. బతికుండగా మళ్లీ పల్లెను చూస్తామా? అని దిగులుతో దిన దిన గండంగా బతికారు. కాలం కలిసి వచ్చింది. తెలంగాణ వచ్చింది. భూముల ధర వచ్చింది. సాగుకు నీరొచ్చింది. రైతులో మళ్లీ ఆశ చిగురించింది. వలస బతుకులకు ఓదార్పు దొరికింది. వలస జనమంతా పల్లెకు చేరింది. అయితే భూముల ధరలు పెరిగింది అదికారులకు లంచాలిచ్చేందుకు అన్నట్లుగా తయారైంది. తమ భూములను తమ పిల్లల పేరు మీద మార్చాలన్నా లక్షలు లంచాలివ్వాల్సిందే. అమ్ముకోవాలన్నా లంచమే.కొనుక్కొవాలన్నా లంచమే. అధికారులు తప్పులు చేసి, సరిదిద్దాలనుకున్నా లంచమే..పల్లె పట్నం అనే తేడా లేదు. ఎక్కడ విన్నా గోవింద నామం లెక్క లంచం..లంచం అనే మాట వినిపిస్తోంది. వినీ వినీ జనానికి విసుగొస్తోంది. అధికారులకు మాత్రం మరింత బలుపొస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులకు కూడా విపరీతంగా జీతాలు పెరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత జీతాలు తెలంగాణలో వున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతాలున్నాయని తెలుస్తోంది. పైగా ప్రమోషన్లు కూడా వచ్చాయి. ఇంకే కావాలి. ఇంకా ఇంకా కావాలి. లంచాలు తీసుకునే బుద్ది మారడం లేదు. ఉద్యోగుల దుర్భుద్ది మారడం లేదు. లంచాలు తీసుకొని దొరుకుతామన్న భయం లేదు. దొరికిన వారిలో కూడా ఆ భయం కళ్లల్లో కనిపించడం లేదు. లంచం తీసుకున్న ఓ అధికారి ఇటీవల సోఫాలో కూర్చొని ముసిముసి నవ్వు నవ్వుతున్నాడు. ఏసిబికి పట్టుబడిన భయం ఒక్క శాతం కూడా లేదు. ఏం చేస్తారు? మహా అయితే కోర్టుకు తీసుకెళ్తారు. నాలుగు రోజులు జైలులో పెడతారు. ఎందుకంటే ఆ జైలులో కూడా క్రిమినల్స్‌ గా చూడరు. గౌరవంగా చూస్తారు. కాకపోతే నాలుగు రోజులు ఇంటికి దూరమౌతాము. తర్వాత బైటకొస్తాం…కొంత కాలం హాయగా కాలం గడుపుతాం..మళ్లీ కొలువు తెచ్చుకుంటామన్న ధీమా అవినీతి అదికారులలో పెరిగిపోయింది. సహజంగా ఎవరికైనా సరే ఉద్యోగానికి ముందు ఎలాంటి కేసులు లేవని సర్టిఫికెట్లు సమర్పించుకోవాలి. పోలీసు కేసులుంటే ఉద్యోగం రాదు. కాని ఉద్యోగం చేస్తూ ఎన్ని సార్లు పట్టిబడినా ఉద్యోగం పోదు. పోలీసులు కేసులైనా లెక్కలేదు. జైలు జీవితం అనుభవించినా కొలువు మళ్లీ రాకుండాపోదు. ఇదెక్కడి న్యాయమో అర్దం కాని పరిస్దితి. అవినీతి నిరోధక శాఖ అధికారులుకు రెడ్‌ హాండెడ్‌గా దొరికినా సరే , తమను అన్యాయంగా ఇరికించారని వాదించుకుంటున్నారు. మళ్లీ కొలువులు తెచ్చుకుంటున్నారు. అంటే ఇక్కడ మళ్లీ ఏసిబితో ప్రమేయం లేకుండా సంబందిత శాఖల పెద్దల చేత జరిగే విచారణలో అబద్దాలు రాసుకుంటున్నారు. న్యాయస్దానాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అదికారులను లంచాలతో కొడుతున్నారు. కొలువులు తెచ్చుకుంటున్నారు. అలా ఉద్యోగం పోతోంది. ఇలా వస్తోంది. ఇక అవినీతి ఉద్యోగులకు భయం ఎందుకంటుంది. తప్పు చేసిన దొరికినా చర్యలు లేనప్పుడు ఇక పట్టుకోవడం ఎందుకు? మళ్లీ వదిలేయడం ఎందుకు? అసలు ఎందుకు పట్టుకుంటున్నట్లు. ఎందుకు వదిలేస్తున్నట్లు? ఈ ఏడాది ఎంత లేదన్నా కనీసం ఓ వెయ్యి మందికి తక్కువ కాకుండా లంచాలు తీసుకొని దొరికి వుంటారు. వాళ్లలో కొలువులు పోయిన వారు ఎంత మంది వున్నారు. మళ్లీ కొలువుల్లో చేరిన వారు మాత్రం వున్నారు. అసలు ఈ మధ్య రోజుకు ముగ్గురు నుంచి నలుగురు, ఐదురుగు పట్టుబడుతున్నారు. ఇలాంటి అవినీతి అదికారుల మూలంగా సామాన్యుడు తన జీవితంలో సొంతిళ్లు కట్టుకోలేదు. వంద జగాల స్థలం కొనుగోలు చేసుకోలేడు. అప్పులు చేసి, చిన్న గుడిసె కట్టుకోవాలన్నా దాని పర్మిషన్‌కు లక్షలు ఇస్తే గాని పర్మిషన్‌ రానంత దౌర్భాగ్యపు రోజులు దాపురించాయి. పెళ్లిళ్లు పేరంటాలకు ఎవరైనా బ్యాండు మేళం మాట్లాడుకుంటారు. ఉద్యోగులు,పోలీసుల కుటుంబాలలో పెళ్లి, పేరంటాలైనా వారిని మాట్లాడుకుంటారు. అలాంటి బ్యాండు మేళం వారి వల్ల పర్యావరన నష్టం జరగుతుందని పోలీసులు వాయిద్యాలు తీసుకెళ్లిన ఘటనలో వాటిని వదిలేయాలంటే లంచం అడిగిన దౌర్భాగ్యులు కూడా వున్నారంటే ఈ సమాజం బాగుపడుతుందా? ఏడాదిలో ఇతర సమయాల్లో కూలీ పనులు చేసుకంటూ, పెళ్లిళ్ల సీజన్‌లో బ్యాండు వాయిస్తూ పొట్ట పోసుకునే వారి నుంచి కూడా వేలకు వేలు లంచాలు తీసుకున్నారంటే వాళ్లను ఉద్యోగులంటారా? రాక్షసులంటారా? ఇంతగా లంచం కోసం దిగజారి బతకాలా? ఒక్కసారి ఆలోచించండి.

ఎవర్రా ఆ కూత కూసింది! ఎక్కడ రా ‘‘రియల్‌ భూమ్‌ తగ్గింది!?

 

`కార్పోరేట్‌ బిల్డర్ల మాయాజాలం.

`రియల్‌ హల్‌ చల్‌..సామాన్యులు బెంబేల్‌.

`కొనాలనుకుంటే గుండె గుబేల్‌!

`రియల్‌ తగ్గిందన్న ప్రచారమంతా ఫేక్‌.

`రియల్‌ వ్యాపారులాడుతున్న నాటకం.

`గత ఏదాడితో పోలిస్తే పెరిగిన ధరలు.

`వ్యాపారం పడిపోయిందని దొంగేడుపులు.

`బడా కంపెనీలు ఎక్కడా రూపాయి తగ్గించింది లేదు.

`హైదరాబాద్‌లో సంపన్నులే ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి.

`ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి మరీ దీన స్థితి.

`అప్పార్టుమెంట్ల ధరలే ఆకాశాన్నంటుతున్నాయి.

`సొంత ఇల్లు కొనుగోలు చేయాలంటే మరో జన్మకు కూడా సాధ్యం కాదు.

`లక్ష ఇండ్లు ఖాళీ అనేది శుద్ధ అబద్దం.

`బ్యాంకర్లకు కుచ్చు టోపీ పెట్టే వ్యవహారం.

`హైదరాబాద్‌లో బిల్డర్లు వేలల్లో వున్నారు.

`వాళ్లు ఇస్తున్న ధరలకు కార్పొరేట్‌ కంపెనీలు ఇవ్వడం లేదు.

`మునిగిపోతున్నామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.

`ఇతర బిల్డర్లు స్వేర్‌ ఫీట్‌కు రూ.6 వేలు చార్జ్‌ చేస్తున్నారు.

`కార్పొరేట్‌ బిల్డర్లు రూ. 20 వేలకు పైగా వసూలు చేస్తున్నారు.

`మధ్య తరగతి ప్రజలు కిరాయిలకు వుండలేరు. ఇల్లు కొనుక్కోలేరు.

`హైదరాబాద్‌లో పేక మేడల్లా పెరుగున్న బిల్డింగులు.

`ఆకాశాన్నంటుతున్న అప్పార్టుమెంట్ల ధరలు.

తెలంగానలో రియల్‌ వ్యాపారం కుదేలైందంటూ మొసలి కన్నీరు కారుస్తున్న వాళ్లుంతా జనం రక్తం మరిగిన వాళ్లే. అమ్మకాలు లేకుండా దివాళా తీస్తున్నామంటూ దొంగేడుపులు ఏడుస్తున్న వారంతా మోసగాళ్లే..అవును ఇది ముమ్మాటికీ నిజం. వ్యాపారం అంటే లాభాపేక్ష కోసమే చేసినా, కొంతైనా న్యాయంగా, ధర్మంగా చేయాలి. కాని ప్రజల నుంచి అడ్డగోలుగా వసూలు చేసి, రూపాయి విలువైన భూమిని వంద రూపాయలకు అంటగట్టినప్పుడు తెలియదా? ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని కోట్లకు కోట్లు, వందల వేల కోట వ్యాపారం చేసింది నిజంకాదా? రియల్‌ వ్యాపారం పేరుతో బ్యాంకులను నమ్మించి అప్పులు తీసుకున్నది నిజం కాదా? సామాన్య ప్రజలకు అందమైన బ్రోచర్లు చూపించి, అసలు ప్లాట్‌ ఎక్కడుందో చూపించకుండా వేధించిన సంస్ధలులేవా? ఇప్పటికీ రియల్‌ వ్యాపారలు వేసిన వెంచర్లలో తమ ప్లాట్‌ ఎక్కడుందో కూడ తెలియకుండా, లక్షలకు లక్షలు చెల్లించిన బాధితులు హైదరాబాద్‌ పరిసరాల్లోనే కొన్ని వేల మంది వున్నారు. చూపించిన ప్లాట్లనే వందల మందికి చూపించి, అమ్మిన ప్లాట్లనే పది మందికి అమ్మిన దొంగ వ్యాపారులేరా? ఏదో ఆగమైపోతున్నామంటూ లేనిపోని లెక్కలు చెప్పి ఇంకా ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు. బ్యాంకులను ముంచేద్దామని చూస్తున్నారా? వ్యాపారాలు పడిపోయాయి. నిర్మాణంలో వున్న ప్లాట్లు అమ్మకాలు జరడం లేదు. కట్టిన విల్లాల్లో గబ్బిలాలు చేరుతున్నాయంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఏ వ్యాపారమైనా సక్కగా చేస్తే ఏ నష్టం వుండదు. ఎక్కడా ఆగిపోదు. కాని రియల్‌ వ్యాపారం పేరుతో జనం సొమ్మును మంచినీళ్లలా తాగారు. జనం దగ్గర డబ్బులు లేకుండా చేశారు. భూమి మీద పెట్టుబడి పెడితే పదింతలౌతుందని నమ్మించారు. జనం చేతిలో చిల్లి గవ్వ లేకుండా చేశారు. పది రూపాయలకు కొన్న భూమిని వెయ్యి రూపాయలకు అమ్మారు. ఆ వెయ్యి నుంచి మరిన్ని కొని లక్షకు అమ్మి కోట్లకు పడగలెత్తారు. చిన్న చిన్న కార్యాలయాల్లో అద్దెలకు రూంలు తీసుకొని వ్యాపారం మొదలుపెట్టిన వాళ్లు ఎక్కడైనా కిరాయలు కడుతున్నారా? అంతస్దుల మీద అంతస్దులు కట్టి కార్యాలయాలు చేసుకున్నారు. వాటిని కూడా చూపించి మరింత జనాన్ని దోచుకుంటున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్‌ వ్యాపారం పడిపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆ మధ్య ఓ బిఆర్‌ఎస్‌ నాయకుడే భహిరంగంగానే చెప్పాడు. రియల్‌ వ్యాపారులు ప్రభుత్వాన్ని దించేయమంటున్నారు. అవసరమైన సొమ్ము ఇస్తామని కూడా చెబుతున్నారని అన్నాడు. అంటే ప్రభుత్వాలనే మార్చేంత శక్తివంతులయ్యారు. ఒకప్పుడు అనామకులుగా వున్న వారు రియల్‌ పేరుతో కోట్లకు పడగలెత్తారు. ప్రభుత్వాలనే శాసించే స్ధాయికి చేరుకున్నారు. అయినా హైదరాబాద్‌లోనే కాదు, పరిసర ప్రాంతాలతోపాటు, తెలంగానలో ఎక్కడైనా సామాన్యుడు ఓ వంద గజాల స్దలం కొనుక్కునే పరిస్టితి వుందా? భూములన్నీ కొని, చేతుల్లో పెట్టుకొని అమ్ముపోతలేవు. వ్యాపారాలు సాగడం లేదంటూ మాట్లాడేవారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్లు కొన్నప్పుడు భూమి విలువ ఎంత? ఇప్పుడు రియల్‌ వ్యాపారులు పెంచి అమ్ముతున్న ధరలుఎంత? ఇప్పటికీ రియల్‌ వ్యాపారులు కొన్న ధరలకు సగం దరలు పెంచి అమ్మినా తెలంగాణలో ఎంతో మంది ఇంటి స్ధలాలు కొనుగోలు చేసుకునేందుకు సిద్దంగా వున్నారు. కాని సొంతింటి కలను అందని ద్రక్షను చేసేశారు. అమ్మకాలు లేవంటూ సొల్లు పురాణం చెబుతున్నారు. నిజంగా హైదరాబాద్‌లో రియల్‌ వ్యాపారం ఆగిపోతే ఎక్కడా నిర్మాణాలు జరగొద్దు.కాని నగరశివారుతోపాటు, ముఖ్యమైన ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు సాగుతూనే వున్నాయి. అంతస్దుల మీద అంతస్ధులు కడుతూనే వున్నారు. అవన్నీ ఎందుకు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు. ఎవరు కట్టమంటున్నారు? చిన్న చిన్న నిర్మాణ సంస్దలు నడిపేవారు మహా అయితే నాలుగైదు అంతస్ధులు మాత్రమే నిర్మాణం చేస్తున్నారు. కాని కార్పోరేట్‌ శక్తులుగా మారి, ఎకరం, రెండెకరాల్లో అంతస్ధుల మీద అంతస్ధులు పెంచుకుంటూ, ముప్పై, నలభై అంతస్ధులు నిర్మాణం చేస్తున్నారు. హైరేజ్‌ అప్పార్టుమెంట్లు అని కలరింగులిస్తున్నారు. వాటి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగముందా? రియల్‌ వ్యాపారులకు డబ్బులు సమకూర్చే ఏటిఎం మిషన్లుగా నిర్మాణాలు మారుతున్నాయి. తప్ప కొనుగోలు చేసిన వారు నానా కష్టాలు పడుతున్నారు. ఒకప్పటి కన్నా ఇప్పుడే స్ధలాలు కొనాలన్నా, ఇండ్లు కొనాలన్నా సామాన్యుడు భయపడుతున్నాడు. బెంబేలెత్తిపోతున్నాడు. భూముల ధరలు గతంకన్నా మరింత పెంచి, అమ్ముడయ్యే ఒక్కదాని మీదే లాభాలన్నీ వచ్చేలా అమ్మకాలు సాగిస్తున్నారు. పైగా అమ్మకాలులేవని నాటకాలాడుతున్నారు. సామాన్యుడు హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కునే పరిస్దితి వుందా? రియల్‌ వ్యాపారం తగ్గిందని అంటున్నమాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆ ప్రచారమంతా ఫేక్‌ అని కూడాతెలుస్తోంది. గత ఏడాదితో పోలీస్తే ధరలు పెరిగాయే తప్ప ఎక్కడా తగ్గలేదు. కాకపోతే అమ్మకాలు తగ్గివుండొచ్చు. అయినా రియల్‌ వ్యాపారులకు వచ్చిన నష్టమేమీ లేదు. ఈ ఏడాది రియల్‌ వ్యాపారులు చాల మంది అత్యంత ఖరీదైన కార్లు కొన్నట్లు ఒక సర్వేలో తేలింది. వ్యాపారమే ఒడిదొడుకులు వున్నప్పుడు ఖరీదైన కార్లు ఏ వ్యాపారికొనుగోలు చేయడు. కాని ఒక్క హైదరాబాద్‌లోనే కొన్ని వందల ఖరీదైన కార్లు రియల్‌ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు లెక్కలున్నాయి. బడా కంపనీలు ఎక్కడా ఒక్క రూపాయ తగ్గించినట్లు దాఖలాలు లేవు. కొన్ని చిన్న కంపనీలు ఇస్తున్న ధరలకు, కార్పోరేట్‌ సంస్దలు ఇస్తున్న ధరలను పోల్చి చూస్తే, వ్యాపారం ఎక్కడా దిగిజారినట్లు లేదు. అవే ప్రాంతాలు. అక్కడే స్ధలాలు. అయినా చిన్న చిన్న కంపనీలకు, కార్పోరేట్‌ సంస్దల నిర్మాణాలలో వ్యత్యాసం ఎందుకుంటోంది. పైగా చిన్న చిన్న వ్యాపారులు నిర్మాణాలు చేసే అప్పార్టుమెంట్లలో స్ధలం కూడా ఎంతో ఎక్కువ వస్తుంది. అదే కార్పోరేట్‌ సంస్ధలు నిర్మాణం చేసే అప్పార్టుమెంట్లలో ధరలు ఎక్కువే. భవిష్యత్తులో వచ్చే స్ధలం చిన్నదే. అంటే ఏ రకంగా చూసినా కార్పోరేట్‌ సంస్ధలు చేసే నిర్మాణాల వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం వుండదు. ఇక హైదరాబాద్‌ నగరంలో ఉద్యోగం చేసే సామాన్యులకు ఇల్లు కొనుగోలు అనేది జీవితంలో జరిగే పని కాదు. నెలకు కనీసం ఓ రెండు లక్షల రూపాయల జీతం చేసే వారికి కూడా కొనడం భారమే. ఇక నెలకు రూ.30, 40 వేలు సంపాదించుకునేవారికి కిరాయలు కూడా చెల్లించడం కష్టంగానే మారుతోంది. జూబ్లీహిల్స్‌లో ఒకప్పుడు సీనియర్‌ ఎన్టీఆర్‌ లాంటి వారితోపాటు, సినీ రంగానికి చెందిన వాళ్లంతా రూ.10 రూపాయలకు గజం చొప్పున కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు అదే జూబ్లిహిల్స్‌ గజం ధర కనీసం 3లక్షల రూపాయలుగా అమ్మకాలు సాగుతున్నాయి. అసలు సంసన్నులే హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలుచేసుకోలేని స్ధితికి రియల్‌ వ్యాపారులు తెచ్చారు. ప్రైవేటు ఉద్యోగుల పరిసి ్ధతి మరీ దారుణమనే చెప్పాలి. అప్పార్టు మెంట్ల ధరలే ఆకాశాన్నంటుతున్నాయి. ఇదంతా కార్పోరేట్‌ వ్యాపారుల మాయా జాలం. ఎందుకంటే ప్రభుత్వ ధరలకు, వ్యాపారులు చెప్పే ధరలకు ఎక్కడా పోలిక లేదు. కోట్ల రూపాయలు తీసుకుంటూ ప్రబుత్వ ధరలకు టాక్స్‌లు చెల్లిస్తున్నారు. జనం సొమ్ముతోనే కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నారు. అటు ప్రజలను , ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. పేకమేడలు ఎన్ని పెరిగినా అక్కరకు రావు. సామాన్యులకు అందుబాటులో ఇల్లు లేనప్పుడు కొనుక్కునేవాడు కూడా కరువౌతారు. అంతే కాని వ్యాపారాలు ఏమీ ఆగలేదు. ధరలు తగ్గించడానికి వ్యాపారులు సిద్దంగా లేరు. కొనుగోలు చేసేంత శక్తి సామార్దాలు ప్రజల వద్ద లేదు.

కేరళలో కమల వికాసానికి బీడీజేఎస్‌ అడ్డంకి?

`బీజేపీ సొంత ప్రయత్నాలు చేసుకుంటేనే మేలు

`బీడీజేఎస్‌తో పొత్తు వల్ల ప్రయోజనం శూన్యం

`కమ్యూనిస్టులను ఎదుర్కోవాలంటే వ్యూహం మార్చక తప్పదు

`వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గెలవాలంటే చెమటోడ్చక తప్పదు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పరశురాముడు నడయాడిన నేల కేరళ. దేవభూమిగా చెప్పుకునే ఈ రాష్ట్రంలో సనాతనధర్మం, హిందూత్వ సిద్ధాంతంతో భాజపా ఎందుకని చొచ్చుకొని లేకపోతున్నదని ప్రశ్నిస్తే అనేక కారణాలు చెప్పవచ్చు. ముఖ్యంగా వామపక్ష భావజాలం ప్రజల్లో బలీయంగా నాటుకొనివుండటం ఒకవైపు కాగా మరోవైపు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడీఎఫ్‌ కూటమి కూడా బలమైన పునాదులు కలిగివుండటమన్నది సాధారణంగా చెప్పే కారణం. మరో విషయమేంటంటే రాష్ట్రంలో క్రైస్తవులు, ముస్లింల జనాభా అధికంగా వుండటం, వీరిలో క్రైస్తవులు కాంగ్రెస్‌కు, ముస్లింలు వామపక్ష కూటమికి గట్టి మద్దతుదార్లుగా వుండటంతో బీజేపీ రాష్ట్రంలో వేళ్లూనుకోలేకపోతున్నదనేది సాధారణవిశ్లేషణ. వీటితోపాటు పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలు కూడా విస్తరణను అడ్డుకుంటున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు. ఇదిలావుండగా రాబోయే ఏడాదికాలం లోగా బీజేపీ కేరళలో ఎన్నికల పరంగా రెండు పరీక్షలను ఎదుర్కోబోతున్నది. మొదటిది వచ్చే డిసెంబర్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు కాగా, వచ్చే ఏడాది ఎండాకాలంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు ఎన్నికల్లో గట్టి ప్రభావశీలక పనితీరు ప్రదర్శించకపోతే, రానున్న కాలంలో పార్టీ విస్తరణఅవకాశాలు దెబ్బతినే ప్రమాదం వుంది. ప్రస్తుతం బీజేపీకి కేరళలో భారత ధర్మ జనసేన(బీడీజేఎస్‌) భాగస్వామిగా కొనసాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో (2024) ఈ రెండు పార్టీలు కలిపి రాష్ట్రంలో 19శాతం ఓట్లు సాధించాయి. ఇదే ఎన్నికల్లో త్రిస్సూర్‌ పార్లమెంట్‌ స్థానాన్ని గె లుచు కుంది కూడా. రాష్ట్రంలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో ఈ రెండు పార్టీలు గత ఎన్నికలకంటే కొంత మెరుగైన పరితీరు ప్రదర్శించిన మాట వాస్తవం. ఇదే సమయంలో అట్టింగళ్‌, అలప్పుజా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ మూడోస్థానంలో వుండటం గమనార్హం. ఇందుకు మురళీధరన్‌, బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ శోభా సురేంద్రన్‌ల ప్రచార సరళే కారణ మని చెప్పక తప్పదు. ఇదే లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో 19 కాంగ్రెస్‌ కూటమివిజయం సాధించగా, కమ్యూనిస్టుల కూటమి కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదే ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల కృషి కారణంగా ఆరు సెగ్మెంట్లలో పార్టీకి 40శాతం ఓట్లు పోలవడం గమనార్హం. ఇక నిమమ్‌ సెగ్మెంట్‌లో ఏకంగా 45శాతం వరకు ఓట్లు పోలయ్యాయి. మ రో 17 సెగ్మెంట్లలో 30శాతం వరకు ఓట్లు సంపాదించుకోగలిగింది. కాంగ్రెస్‌ వృద్ధనేత రమేష్‌ చెన్నితలకు కంచుకోటగా పరిగణించే హరిపాడ్‌ సెగ్మెంట్‌లో బీజేపీ సహచరి బీడీజేఎస్‌ వెయ్యి ఓట్ల లీడ్‌ సాధించింది. అయితే ఈస్థానాన్ని గతంలో బీజేపీ గెలుచుకుందన్న విషయం మరువరా దు. మరో 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో 25శాతం ఓట్లు బీజేపీకి అనుకూలంగా పోలవడం, లెఫ్ట్‌ రమరియు కాంగ్రెస్‌ కూటములను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సీట్లు గెలుచుకోకపోయినా క్రమం గా రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నదనడానికి ఇవి సంకేతం. గతంతో పోలిస్తే పార్టీ కొంత సానుకూల స్థితికి చేరుకునేదిశగా అడుగులు పడుతున్నాయని మాత్రం చెప్పవచ్చు. సరిగ్గా ఇదేసమ యంలో నూతన బీజేపీ సారథిగా రాజీవ్‌ చంద్రశేఖర్‌ను రాష్ట్ర రథసారథిగా పార్టీ నియమించడంగమనార్హం. ఇదిలావుండగా పార్టీకి మద్దతుగా వున్న బీడీజెఎస్‌ పనితీరు నిరాశాజనకంగా వుండటాన్ని ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం. 

గత లోక్‌సభ ఎన్నికల్లో చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీడీజేఎస్‌ ఓట్లశాతం సింగిల్‌ డిజిట్‌ను మించకపోవడం నిరాశను కలిగిస్తోంది. అదీకాకుండా ఆయా సెగ్మెంట్లలో పోలైన ఓట్లశాతం బీజేపీకిస్థానికంగా వున్న బలం వల్ల వచ్చినవేనని కూడా విశ్లేషణలో తేలింది. ఉదాహరణకు కయాంకు లం అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీడీజేఎస్‌ అభ్యర్థికి 33శాతం ఓట్లు పోలయ్యాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి పోలయిన ఓట్లు 26శాతం! అంటే ఇక్కడ బీడీజేఎస్‌ అభ్యర్థికి ఈమాత్రం ఓట్లు పోలయ్యాయంటే అందుకు బీజేపీకి స్థానికంగా వున్న బలమే కారణమన్నది స్పష్టమైంది. నిజానికి బీడీజేఎస్‌ 2015లో ఏర్పాటైంది. శ్రీ నారాయణ ధర్మపరిపాలన యోగం (ఎస్‌ఎన్‌డీపీ) కు రాజకీయ విభాగంగా, ఎజవా ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ)ను కూడగట్టే లక్ష్యంతో వెల్లప్పల్లి నటేషన్‌ నాయకత్వంలో ఇది ఆవిర్భవించింది. కమ్యూనిస్టులకు కంచుకోటగా వున్న ఎజవావర్గం ప్రజల ఓట్లను ఆకర్షించడం దీని ఏర్పాటు లక్ష్యం. ఇదే సమయంలో ఎజవా వర్గాల్లో క మ్యూనిస్టు కార్యకర్తల హింసాత్మక దాడులనుంచి రక్షణగా వుంటుందన్న లక్ష్యంతో కూడా ఈ బీడీజేఎస్‌తో భాజపా జతకట్టింది. లక్ష్యం ఏదైనా ఓట్ల విషయానికి వచ్చేసరికి ఎజవా వర్గంవారు కమ్యూనిస్టులకే సానుకూలంగా వ్యవహరించడంతో బీడీజేఎస్‌ నుంచి ఆశించిన ప్రయోజనాన్ని బీజేపీ పొందలేకపోయింది. ఎన్నికల్లో ఎజవా వర్గం ఓట్లు ఎన్నికల్లో అత్యంత కీలకం. ఈ వర్గా ల్లో ప్రాబల్యం పెంచుకోవడానికి బీడీజేఎస్‌తో కలిసి పనిచేయడం బీజేపీకి కలిసిరాలేదు. అదీకా కుండా ఎజవా వర్గ ప్రజల్లోకి తనకై తాను చొచ్చుకొని వెళ్లాలంటే బీడీజేఎస్‌ పెద్ద అడ్డంకిగా మారింది. అట్లాగని కమ్యూనిస్టు కార్యకర్తల దాడులు ఆగాయా అంటే అదీలేదు. ఈ నేపథ్యంలో బీడీజేఎస్‌ భాజపా ఎదుగుదలకు ఒక గుదిబండలా మారుతోందనేది క్రమంగా వెల్లడవుతున్న సత్యం. అదీకాకుండా ఈ వర్గాల్లో ఎస్‌ఎన్‌డీపీ, కమ్యూనిస్టు కార్యకర్తల మధ్య తరచుగా జరిగే సంఘర్ష ణలు బీజేపీ విస్తరణకు ప్రధాన అవరోధంగా మారాయి. ఈ సంఘర్షణలు ఎంతమాత్రం వాంఛనీయం కావనేదీ బీజేపీ నాయకత్వ ఉద్దేశమైనా, స్థానిక రాజకీయ పరిస్థితులు, మార్క్సిస్టుల దా డులు, స్వీయరక్షణకోసం ప్రతిఘటించక తప్పని పరిస్థితులున్నాయి. ప్రస్తుతం మార్క్సిస్టు కార్యకర్తల దాడులనుంచి రక్షణకోసం బీడీజేఎస్‌పై ఆధారపడుతున్నప్పటికీ, భాజపా తనకు తాను ఎజవా వర్గ ప్రజల్లో పలుకుబడిని పెంచుకోవాలంటే మరో తోవను ఎంచుకోక తప్పదు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్‌లో సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో, దీన్ని ఎదుర్కొనేందుకు భాజపాఅక్కడ తనకంటూ ఒక వ్యూహాన్ని అమలు చేసింది. అదేమాదిగా ఇక్కడ కూడా వ్యవహరించకపోతే తన ఉనికిని విస్తరించుకోవడం కష్టం కాగలదు. అట్లాగని ఎజవా వర్గాల్లో విస్తరించే ప్రయ త్నాలను కమ్యూనిస్టులు చూస్తూ ఊరుకుంటారనుకోవడం కూడా భ్రమే. అయితే ఇక్కడ గుర్తుం చుకోవాల్సిన అంశమేంటంటే బీజేపీ`బీడీజేఎస్‌ కూటమిగా వుండటం పార్టీ ఎదుగుదలను దెబ్బతీస్తున్నదనేది తిరుగులేని సత్యం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎస్సీ/ఎస్టీలకు రిజర్వ్‌ అయిన 14 అసెంబ్లీ స్థానాల్లో సీపీఎంకు తిరుగులేని ఆధిపత్యం వుంది. ఎట్లా అంటే, మహారాష్ట్రలో బీజేపీ`శివసేన కూటమిగా కొనసాగినంత కాలం మరాఠా ఓట్లను కోల్పోయారు. ఎప్పుడైతే విడిపోయారో అప్పుడు బీజేపీకి ఈ వర్గాల్లోకి చొచ్చుకెళ్లడానికి వీలైంది. అదేవిధంగా బీడీజేఎస్‌నుంచి విడిపోతే భాజపా సొంతంగా ఈ వర్గ ప్రజల్లో తన పలుకుబడి పెంచుకోవచ్చనేది ఒక విశ్లేషణ. ఇక్కడ ‘కులాలకతీతంగా’ అనే భావన ప్రతికూల ప్రభావానే చూపుతుంది తప్ప సానుకూల ఓట్లను రా ల్చదనేది సుస్పష్టం. 

ప్రస్తుతం ఎజవా కమ్యూనిటీలు అధికంగా వున్న ప్రాంతాల్లో ‘ఉద్రిక్త శాంతి’ కొనసాగుతున్నదంటే, ఇక్కడ బీజేపీ విస్తరణకు తన ప్రయత్నాలకు తాత్కాలిక విరామం ఇవ్వడమే. గత మార్చి 25 నుంచి రాజీవ్‌ చంద్రశేఖర్‌ పార్టీ సారథ్య బాధ్యతలు వహిస్తున్నారు. ఆయనకు ముందు పనిచేసినసురేంద్రన్‌ పార్టీ పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లా ను పాలనాపరంగా రెండుగా విభజించారు. బూత్‌ స్థాయివరకు సమన్వయ సహకారాలు కొనసా గేలా చర్యలు తీసుకున్నారు. రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇప్పటివరకు ఆయా జిల్లాల నాయకత్వాలతో రెండుసార్లు చర్చలు జరిపారు. ఇదే సమయంలో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. యాప్‌ ఆధారంగా నిర్వహించిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేవలం రెండు నెలల కాలంలో అప్పటివరకు 19వేలుగా వున్న సభ్యత్వం ఏకంగా లక్ష దాటింది!

ఇప్పుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ ప్రధానంగా వచ్చే డిసెంబర్‌లో జరిగే పంచాయతీ ఎన్నికలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకరిని అదేవిధంగా ప్రతి పట్టణ మున్సిపల్‌ వార్డుకు ఒకరిని చొప్పున ఇన్‌చార్జ్‌ నియామకాలు పూర్తిచేశారు. ‘వికసిత కేరళం’ కింద జిల్లాలో ఐదుగురితో కూడిన ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. పార్టీ అన్ని స్థాయిల్లో మరింత బలోపేతంగా పనిచేసేందుకు వీలుగా చేసిన సంస్థాగత ఏర్పాటిది. అయితే రాష్ట్రస్థాయిలో ఆర్గనైజేషనల్‌ సెక్రటరీ పోస్టు ఇంకా ఖాళీగానే వుంది. ఇదే సమయంలో మధ్యస్థాయి పోస్టులు కూడా చాలావరకు బర్తీ కాలేదు. ఉన్నతస్థాయి, క్షేత్రస్థాయి నాయకత్వాల మధ్య ప్రథానమైన అనుసంధానాన్ని ఏర్పచ డంలో ఇవి కీలకం. ఈ నియామకాల్లో జాప్యం జరిగేకొద్దీ పార్టీలో గ్రూపులు, రాజకీయాలు మరింత బలోపేతమవుతాయి. అందువల్ల ఈ పోస్టులు భర్తీ చేయకపోవడం పార్టీకి ఒక శాపం వంటిదనే చెప్పాలి. గ్రూపు రాజకీయాలు ఎదగడానికి యత్నిస్తున్న పార్టీకి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ గ్రూపురాజకీయాలు పెచ్చరిల్లితే రాజీవ్‌ చంద్రశేఖర్‌ వాటిని అరికట్టడంతో పరిమిత పా త్రనే పోషించగలరు తప్ప పూర్తిస్థాయిలో నియంత్రించలేరు. ఎందుకంటే ప్రస్తుతం పార్టీని ఏకతాటిపై నడిపించే సామర్థ్యమున్న రాష్ట్రస్థాయి నాయకుడు అత్యంత అవసరం. కొన్ని దశాబ్దాల క్రితం కె.జి.మారర్‌ ఆవిధంగా పార్టీని నియంత్రించగలిగారు. అటువంటి నాయకత్వం ఇప్పుడు పార్టీకి అత్యవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యంత బలంగా వున్న సీపీఐఎం మాదిరిగానే సంస్థాగతంగా పార్టీ అభివృద్ధి చెందాలంటే ప్రస్తుత విధానాల్లో కొన్ని మార్పులు తీసుకొనిరాక తప్పదు. వీటితో పాటు రాష్ట్రంలో అధికార కూటమికి అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే యంత్రాంగం ఇప్పుడు పార్టీకి అవసరం. బాహ్య సమస్యలను ఎదుర్కోవడానికి, అంతర్గత సమస్యల పరిష్కారానికి, పార్టీ సంస్థాగత నిర్మాణం బలోపేతం కావడానికి నిధులు కూడా అవసరమే. ఇన్ని సమస్యలను అధిగమించి రానున్న పంచాయతీ ఎన్నికల్లో మంచి పనితీరు ప్రదర్శించాలంటే చమటోడ్చక తప్పదు!

ప్రజా ప్రభుత్వం..తెలంగాణ రైతుకు వరం.

-మంత్రి ‘‘ఉత్తమ్‌’’ పర్యవేక్షణ.. కమీషనర్‌ ‘‘చౌహాన్‌’’ కార్యదక్షత.

-మిల్లర్‌ నుంచి వసూలు చేస్తున్న ఖమ్మం జేసికి ప్రశంసలు!

-జిల్లా అధికారులతో పాటు, కమీషనర్‌ చౌహాన్‌ను రైతులు ప్రశంసిస్తున్నారు.

-అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు?

-అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు.

-అధికారులకు ప్రభుత్వ స్వేచ్ఛ..తప్పు చేసే మిల్లర్లకు తప్పదు శిక్ష.

-ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్‌ నుంచి రికవరీ..

-వరి పండిరచే రైతులకు ఇక నుంచి లేదు వర్రీ.

-మిల్లర్‌ నుంచి ముక్కు పిండి వసూలు… రైతుల ఖాతాలో పైసలు.

-2 వేల బస్తాలు మింగిన మిల్లర్‌ జగన్‌కు చుక్కలు..

-టోపి పెట్టాలనుకున్న మిల్లర్‌…తాట తీసిన ఆఫీసర్‌.

-మరో సారి జగన్‌ మోసం బైట పడిరది!

-‘‘నేటిధాత్రి’’ ముందే పసిగట్టి చెప్పింది.

-రెండు వేల వడ్ల బస్తాల స్వాహా వెలుగులోకి వచ్చింది?

-అధికారులను గుప్పిట్లో పెట్టుకొని 50 లారీలు మళ్లించుకున్నాడు.

-2 వేల బస్తాలు కన్నం పెట్టాడు.

-ఖమ్మం జేసి వ్యూహం హన్మకొండ జిల్లా అధికారులు పసి గట్టలేకపోయారు.

-ప్రతి బస్తా మీద వడ్ల లెక్క రాయించారు.

-అది గమనించలేక హన్మకొండ అధికారులు బోల్తా పడ్డారు.

-మిల్లర్‌ జగన్‌ మోసం వెలుగులోకి వచ్చింది.

-దేశంలోనే ఇది మొదటి సారి అని అంటున్నారు.

-రైతులను వందల కోట్లు ముంచిన మిల్లర్లు?

-రైతులను నిలువుగా మిల్లర్‌ ముంచాలని చూశాడు.

-అధికారులు అప్రమత్తమై రికవరీ చేయిస్తున్నారు.

-ఖమ్మం జిల్లా అధికారుల బేష్‌.

-అన్ని జిల్లాల అధికారులకు ఆదర్శం.

-రైతుల వద్ద కోసిన వడ్లతో కోట్లు కూడబెట్టుకుంటున్నారు.

-ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో వేల బస్తాలు మాయం చేస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే ప్రజలకు మేలైన, మెరుగైన పనులు చేయొచ్చని తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిరూపించింది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన కొంత మంది అక్రమ మిల్లర్లు ఆడిరది ఆట పాడిరది పాట అయ్యింది. గత ప్రభుత్వ పెద్దలు కళ్లు చూసుకోవడం వల్ల మిల్లర్లు కొందరు రైతులను విపరీతంగా మోసం చేసే వారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే వారు. రైతులకు చెందాల్సిన సొమ్మును తమ ఖాతాల్లో వేసుకునే వారు. రైతుల గోస పుచ్చుకునే వారు. ఆ సమయంలో మిల్లర్లు చెప్పిందే వేదమన్నట్లు చేసే వారు. అప్పటి ప్రభుత్వం ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి మూలంగా రైతులు ఎంతో నష్టపోయే వారు. యధా రాజ, తదా ప్రజా అన్నట్లు అధికారులు మేమేం తక్కువ అన్నట్లు మిల్లర్లకే సాయపడేవారు. వారు కూడా రైతులను దోచుకునేందుకు పరోక్షంగా సహకరించే వారు. రైతుల ఆందోళన అరణ్య రోదనయ్యేది. పట్టించుకునే వారు కాదు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కూడా గత పాలకుల కాలంలో జరిగింది. కానీ ఇకపై మిల్లర్ల ఆట కట్‌ అనే విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు రూపాయి కూడా మోసానికి గురి కాకుండా చూసుకునే పరిస్థితి తెస్తున్నారు. సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్తి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆ శాఖ కమీషనర్‌ చౌహాన్‌ తీసుకుంటున్న చర్యల మూలంగా రైతులకు భవిష్యత్తులో నష్టం వాటిల్లకుండా చూసే రోజులు రాబోతున్నాయి. ఇది ఎంతైనా తెలంగాణ రైతుకు వరమనే చెప్పాలి. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పర్యవేక్షణతో కమీషనర్‌ చౌహాన్‌ కార్యదక్షతతో కూడుకున్న చర్యల వల్ల ఖమ్మం జిల్లా రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఏర్పడిరది. గతంలో ప్రభుత్వ పెద్దల ఆలోచనలు, అధికారులను కూడా తప్పు దోవ పట్టించేలా వుండేవి. పైకి మాత్రం రైతులకు ఎంతో మేలు చేస్తున్నట్లు ప్రకటనలు చేసే వారు. చేతులు దులుపుకునే వారు. దాంతో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకునే వారు అసలే కాదు. నేటిధాత్రి లాంటి మీడియాలో ఎన్ని కథనాలు రాసినా పట్టించుకునే వారు కాదు. స్పందించే విధానం వుండేది కాదు. ఇక రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తినప్పుడు మాత్రం నామ మాత్రపు స్పందన కనబర్చినట్లు నటించే వారు. అంతకు మించి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వాలు ఆ బాధ్యతలు పూర్తి స్థాయిలో అధికారులకు అప్పగించి, ఎలాంటి అవకతవకలు జరగొద్దని చెప్పడం గతంలో చూడలేదు. కానీ ప్రజా ప్రభుత్వం వడ్ల సేకరణలో అధికారులకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు. అది ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ తన కర్తవ్యాన్ని అంకిత భావంతో అమలు చేశారు. ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్‌ నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగా చర్యలు మొదలుపెట్టారు. తప్పు చేసిన మిల్లర్‌ కు చుక్కలు చూపిస్తున్నాడు. వరి పండిరచే రైతులకు ఇక నుంచి లేదు వర్రీ వుండాల్సిన అవసరం లేకుండా చూస్తున్నారు. అయితే ఆ కధ ఏమిటో తెలియాలి. ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వడ్లు హన్మకొండ జిల్లాలో వున్న కొన్ని మిల్లులకు జాయింట్‌ కలెక్టర్‌ సిఫారసు చేశారు. వాటిని ఖమ్మం జేసి సూచించిన విధంగా ఎంపిక చేసిన మిల్లర్లకు చేరలేదు. మధ్యలో హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఓ మిల్లర్‌ కు కొమ్ము కాసే పని పెట్టుకున్నారు. ఖమ్మం నుంచి వచ్చిన 50 లారీల వడ్లను జగన్‌ అనే మిల్లర్‌ కు మళ్లించారు. నిజానికి చెందాల్సిన మిల్లర్లకు చెందకుండా చేశారు. అధికారుల అండతో జగన్‌ అనే మిల్లర్‌ ఆ వడ్ల నుంచి ఏకంగా 2 వేల బస్తాలు మింగేశాడు. తప్పుడు లెక్కలు సృష్టించాడు. బస్తాకు కోసే వడ్ల విషయంలో తన ఇష్టానుసారం వ్యవహరించాడు. ఈ విషయం తెలిసిన ఖమ్మం జేసి సదరు మిల్లర్‌ జగన్‌కు చెందిన మిల్లులకు నోటీసులు జారీ చేశారు. ఓ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వార్తా కథనం నేటిధాత్రి మిల్లులకు ప్రచురించింది. అది ఖమ్మం జిల్లా జేసికి చేరింది. అంటే వెంటనే స్పందించారు. నివేదిక తెప్పించుకున్నారు. మిల్లర్‌ చేసిన మోసం పసిగట్టారు. రెండు వేల బస్తాలకు సంబంధించిన సొమ్ము కక్కాల్సిందే అని నోటీస్‌ జారీ చేశారు. ఇది సివిల్‌ సప్లయ్‌ శాఖ చరిత్రలోనే మొదటి సారి అంటున్నారు. గతంలో ఇలా స్పందించిన అధికారి ఎవరూ లేరని ప్రశంసిస్తున్నారు. రైతులకు ఎంతో ఊరట కలిగించడమే కాదు, మోసపోయిన సొమ్ము కూడా రైతుల ఖాతాలలో వేసేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి, రైతుల కష్టానికి టోపి పెట్టాలనుకున్న మిల్లర్‌ తాట తీసే పని ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ పెట్టుకున్నాడు. ఒక మిల్లర్‌ ప్రభుత్వం కళ్లు గప్పి, రైతులను మోసం చేసి, రెండు వేల వడ్ల బస్తాల స్వాహా చేయడం సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వ్యూహం హన్మకొండ జిల్లా అధికారులు పసి గట్టలేకపోయారు. ఏ పనైనా తూతూ మంత్రంగా చేసే అలవాటు హన్మకొండ అధికారులకు వుంది. లారీలు వచ్చాయా? వాటిని తమకు అనుకూలమైన మిల్లర్‌ జగన్‌కు అందించామా! లేదా!! అనేదే చూసుకున్నారు. కానీ బస్తాలపై వున్న మర్మం కనిపెట్ట లేకపోయారు. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎంతో తెలివిగా ప్రతి బస్తా మీద వడ్ల లెక్క రాయించారు. అది గమనించలేక హన్మకొండ అధికారులు బోల్తా పడ్డారు. ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. మొదటి నుంచి నేటిధాత్రి ఈ విషయం చెబుతూనే వుంది. అధికారులను హెచ్చరిస్తూనే వుంది. హన్మకొండ జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారులు నేటిధాత్రి అందిస్తున్న వార్తలను పెడ చెవిన పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో సాగినట్లే ఇప్పుడూ సాగుతుందనుకున్నారు. పదేళ్లు తిష్ట వేసుకొని తినడం అధికారులకు అలవాటైంది. రైతులను మోసం చేయడం మిల్లర్లకు సామాన్యమైపోయింది. రైతుల నెత్తిన కోత శఠగోపం పెట్టడం నిండా ముంచడం బాగా అలవాటైపోయింది. అదే ధోరణి విచ్చలవిడిగా సాగుతోంది. మమ్మల్ని అడిగేవారు ఎవరు? పట్టించుకునే వారు ఎవరు? నేటిధాత్రి రాస్తూనే వుంటుంది. అదంతా కామనే అనుకున్నారు. కానీ ఖమ్మం జిల్లా జేసి ఇచ్చిన రaలక్‌తో ఒక్క సారిగా హన్మకొండ సివిల్‌ సప్లయ్‌ అధికారుల్లో కూడా రైళ్లు పరిగెత్తే పరిస్థితి వచ్చింది. నిజానికి ఉన్నత స్థాయిలో వున్న అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఫలితాలు ఇంత అద్భుతంగా వుంటాయి. ప్రజలకు మేలు చేసేలా వుంటాయి. అని నిరూపనైంది. జిల్లా అధికారులతో పాటు, కమీషనర్‌ చౌహాన్‌ను రైతులు ప్రశంసిస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు. ఇలాంటి వ్యవహారాలు అన్ని జిల్లాలలోనూ సాగుతున్నాయి. అన్ని జిల్లాల అధికారులు ఖమ్మం జిల్లా అధికారులను ఆదర్శంగా తీసుకుంటే ఏ మిల్లర్‌ మోసానికి పాల్పడలేడు. రైతుల సొమ్ము అప్పనంగా దోచుకునే వెలుసుబాటు అసలే వుండదు. రైతులను కొట్టి కోట్లు మింగాలనుకుంటున్న మిల్లర్లు తప్పులు చేయడానికి అసలు ఆస్కారం వుండదు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా రైతులను వందల కోట్లు ముంచుతూనే వున్నారు మిల్లర్లు. వారికి సహకరిస్తూనే వున్నారు అధికారులు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు? జరగడం ఖాయం. ఈ ఖమ్మం జిల్లా అధికారుల బేష్‌. అన్ని జిల్లాల అధికారులకు ఆదర్శం. ఏటా రైతుల వద్ద కోసిన వడ్లతో మిల్లర్లు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో వేల బస్తాలు మాయం చేస్తున్నారు. దయచేసి ఇకనైనా మిల్లర్ల దోపిడీ ఆపండి. రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు మిల్లర్లకు సహకారం ఆపండి. 

బాక్స్‌.

ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్‌ విఫలం!

ఖమ్మం జిల్లా అధికారులు చూపిన చొరవతో రైతులకు ఎంతో మేలు జరిగింది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా ఏకతాటిపైకి వచ్చి మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులను మోసం చేసిన మిల్లర్‌ నుంచి రికవరీ వసూలు చేసిన సందర్భాలు లేవు. ఇంత మంచి విషయాన్ని, విజయాన్ని కాంగ్రెస్‌ క్రాడర్‌ ప్రచారం చేసుకోవడం లేదు. రైతులకు జరిగే మేలుపై కాంగ్రెస్‌ క్యాడర్‌ కదలకపోవడం కూడా పార్టీకి ఎంతో నష్టం జరుగుతోంది. ప్రతిపక్షాలు రైతులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అయినా కాంగ్రెస్‌ నాయకులకు అవగాహన లేకపోవడం విడ్డూరం. ఇప్పటికైనా కాంగ్రెస్‌ క్యాడర్‌ కళ్లు తెరవండి. ప్రతిపక్షాల నోరు మూయించండి.

కుల రాజకీయ సాలెగూడులో దళపతి!!

 

కుల రాజకీయ సాలెగూడులో దళపతి!!

తమిళనాడులో కులం, పేదరికం ఒక విరోధాభాస

పదిశాతం ఓట్లు సాధిస్తే డీఎంకే అధికారానికి ముప్పు

విజయ్‌ వ్యూహాలు డీఎంకేను దెబ్బకొట్టే అవకాశం

కులాల కుంపట్ల సెగ అంటని బీజేపీ

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణలువేగంగా జరుగుతుండటం వర్తమాన పరిణామం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది సినీతెరవేల్పు విజయ్‌ (దళపతి) కొత్తగా స్థాపించిన తమిజగ వెట్రి కజగం (టీవీకే). తమిళనాడులో ద్రవిడ రాజకీయాలే బలంగా వుంటాయన్న సంగతి అదరికీ తెలిసిందే. ఈ నేప థ్యంలో ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఎఐడీఎంకెలను, విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ఏవిధంగా ఎదుర్కొని నెట్టుకు రాగలుగుతుందన్నది ప్రధాన ప్రశ్న. అయితే దళపతి రాబోయే ఎన్నికలకోసం ఇ ప్పటినుంచే చాపకింద నీరులా తన వ్యూహాలను అమలుపరచడం మొదలుపెట్టారు. వచ్చే ఆగస్టునుంచి ఆయన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వృధాచలం నియోజకవర్గం నుంచి తన రాష్ట్ర పర్యటనను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పట్టలి మక్కల్‌ కచ్చి (పీఎంకే), దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) పార్టీల స్టాండ్‌ ఏవిధంగా వుండబోతున్నది కూడా ఆగస్టు నాటికి స్పష్టమయ్యే అవకాశముంది. ముఖ్యంగా పీఎంకేకు ఓబీసీవర్గమైన వన్నియార్లలో మంచి బలముంది. దివంగత సినీ హీరో విజయకాంత్‌ నెలకొల్పిన డీఎండీకేకు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో గట్టిపట్టును కొనసాగిస్తోంది. ప్రస్తుతం గ్రామీణ, సెమీ`అర్బన్‌ ప్రాంతాల్లోని దళిత, ఓబీసీ వర్గాల ఓట్లపై టీవీకే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది.
పీఎంకే, డీఎండీకేల అసంతృప్తి
ప్రస్తుతం డీఎండీకేకు నాయకత్వం వహిస్తున్న ప్రేమలత ఏఐడీఎంకే పట్ల తీవ్ర అసంతృప్తితో వున్నారు. సీట్ల కేటాయింపులో తమకిచ్చిన హామీని తుంగలో తొక్కారంటూ ఏఐడీఎంకే నాయకుడుపళినిస్వామిపై ఆగ్రహంతో వున్నారు. ఇక పీఎంకే విషయానికి వస్తే దీని వ్యవస్థాపకుడు రామ్‌దాస్‌, ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా వున్న అంబుమని రామ్‌దాస్‌కు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. రామ్‌దాస్‌, ఏఐడీఎంకేతో నేరుగా చర్చలు జరపాలని భావిస్తుంటే, అంబుమని రామ్‌దాస్‌ ప్రస్తుతం కేంద్రమంత్రిగా వున్న నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇది వీరిద్దమధ్య నెలకొన్న విభేదాలకు కారణం. ఈ విభేదాలు పార్టీలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఉత్తర తమిళనాడుకు చెందిన పది జిల్లాల్లో ఈ పార్టీ ప్రభావం అధికం. ఈ అసంతృప్తి వీరిని పీఎంకేవైపుకు మొగ్గు చూపేలా చేస్తే అప్పుడు ఒక్క ఏఐడీఎంకేకు మాత్రమే కాదు డీఎంకేకు కూడానష్టం కలిగించక మానదు. ఎట్లా అంటే డీఎంకే కూటమిలో వున్న విడుత్తలై చిరుతైౖగలల్‌ కచ్చి (వీసీకే)కు ఈ ప్రాంతంలో దళితుల్లో మంచి బలం వుంది. పైరెండు పార్టీల ప్రభావంతో ఈ ఓ ట్లు కూడా చీలి టీవీకే ఖాతాలోకి వెళ్లకూడదనేం లేదు. క్రైస్తవుడైన విజయ్‌, వచ్చే ఆగస్టులో వృ ధాచలం నుంచి ప్రారంభించే యాత్రలో వన్నియార్లు (ఓబీసీలు), దళితులు, మత్స్యకార్లు, క్రైస్తవ వర్గాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. గతంలో వృధాచలం డీఎండీఏకేకు గట్టి పట్టున్న ప్రాంతం. డీఎండీకే, పీఎంకేలు ప్రస్తుతం ఏఐడీఎంకేతో జట్టుకట్టి వున్నాయి.
ప్రస్తుతం విజయ్‌ ‘టీవీ’ని తన పార్టీ గుర్తుగా చేసుకునే అవకాశముంది. ఈనేపథ్యంలోనే ‘టీవీ`కే’కు ఓటువేయండి నినాదంతో ముందుకెళ్లవచ్చు. అదీకాకుండా ‘టీవీ’ ప్రజలకు ఏవిధమైన కష్ట లేకుండా తేలిగ్గా గుర్తుండిపోతుంది కూడా. ప్రస్తుతం విజయ్‌ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలుహాజరవుతుండటాన్ని ఏవిధంగా తీసుకోవాలనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీవీకేకు ఇది సానుకూల పరిణామమని కొందరు వాదిస్తుంటే, మరికొందరు అభిమానం వేరు ఇది ఓటుగా మారడం వేరని చెబుతున్నారు. విజయ్‌కాంత్‌ వంటి స్టార్‌ హీరో పెట్టిన పార్టీకే దిక్కులేదు, ఇప్పుడు విజయ్‌ పార్టీ కూడా ఇదేబాటలో పయనిస్తుందని అంచనాలు కట్టే నిరాశా వాదులుకూడా లేకపోలేదు. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే విజయ్‌ తన ఛరిష్మాతో పదిశాతం ఓట్లు సాధించుకోగలిగితే డీఎంకే కొంప నిండా మునిగినట్టేనన్నది మాత్రం సుస్పష్టం.
యువకుల్లో మద్దతు
వర్తమాన పరిస్థితి పరిశీలిస్తే దళపతికి యువకుల్లో, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లో, ప్రధానంగా మైనారిల్లో పట్టు పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వర్గాలు సంప్రదాయికంగా డీఎంకే మద్దతు దార్లు. ఈ వర్గాలు దళపతిని కేవలం వెండితెరవేల్పుగా మాత్రమే కాదు, ఎంతోకొంత చేసిచూ పించే నాయకత్వ లక్షణాలు కలిగినవాడిగా పరిగణించడం మొదలైంది. మొదట్లో విజయ్‌ టీవీకేను స్థాపించిన తర్వాత, రాజకీయ పండితులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీవీ కే 5 నుంచి 6శాతం వరకు ఓట్లు సంపాదిస్తుందని అంచనాలు కడుతున్నారు. మరి గతంలో కమల్‌ పెట్టిన మక్కల్‌ నిధి మయమ్‌ (ఎంఎన్‌ఎం) 2021లో కేవలం 2.52శాతం ఓట్లు మాత్రమేసాధించింది. దీంతో పోలిస్తే టీవీకే చాలా ముందంజలో ఉన్నట్టే లెక్క! అంతేకాదు ఇతర పార్టీ లనుంచి 2`3శాతం ఓట్లు చీల్చగలడన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. తాను సొంతంగా 5శాతం ఓట్లు సాధించే అవకాశమున్న నేపథ్యంలో ఇప్పటికి మొత్తంమీద చూసుకుంటే గరిష్టంగా 8శాతం ఓట్లు సాధించగలడన్నది తమిళనాడు రాజకీయాలను పరిశీలించే వారి అంచనా. అయితే విజయ్‌ ‘వర్క్‌ ఫ్రం హోం’ రాజకీయాలు నడుపుతారన్న విమర్శకులు కూడా లేకపోలేదు. ఇదిలావుండగా ఎన్నికలు దగ్గరపడ్డే కొద్దీ ఈ అంచనాల్లో మార్పు కచ్చితంగా వుండి తీరుతుంది. ఎందుకంటే విజయ్‌ ప్రధానంగా దళితులు, ఆర్థికంగా అణగారిన వర్గాలు, శ్రామికులపై దృష్టి పెట్టి తన రాజకీయాన్ని నడుపుతున్నారు. ఇది ఓట్ల చీలికవల్ల సాధ్యమవుతుందని అనుకునేదాని కంటే, వివిధ వర్గాల ప్రజల ఆలోచనా శైలిలో వస్తున్న మార్పుల వల్ల అని చెప్పవచ్చు. మరి ఈ వర్గాలే డీఎంకేకు వెన్నెముకగా నిలుస్తున్నారు మరి!!
కులరాజకీయాలు అధికం
తమిళనాడులో కులరాజకీయాల ప్రభావం ఎక్కువన సంగతి తెలిసిందే! కులాభిమానం, పేదరికం అనే రెండు అంశాలు విరోధాభాస వంటివి. ఎందుకంటే పేదలు అన్నివర్గాల్లో వున్నారు. కాకపోతే దళితుల్లో వీరి సంఖ్య అధికం. వన్నియార్లు, గౌండర్లు, థెవరాల వంటి ఓబీసీ కులాలవా రు, ఇప్పుడు విజయ్‌కు దళితులు పూర్తి అండగా నిలుస్తున్నారన్న అభిప్రాయంతో వున్నారు. ఈ ఓబీసీలకు, దళితులకు ఎంతమాత్రం పొసగదు. ఇప్పుడు పట్టల్‌ మక్కల్‌ కచ్చి (పీఎంకే)కు వన్నియార్లలో బలం వుంది. అదే విడుత్తలై ఛిరుతైౖౖగల్‌ కచ్చి (వీసీకే)కు దళితుల్లోని పరైయార్‌ వర్గం మద్దతుంది. మరి ఈ రెండు పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకేలకు వ్యతిరేకం కానప్పటికీ, ఒకే కూటమిలో వుండటం సాధ్యంకాదు. ఇప్పుడు వెన్నియార్‌లు విజయ్‌కి అభిమానులుగా ఉన్నప్పటికీ, టీవీకేకు అత్యధికశాతం దళితుల మద్దతుండటంవల్ల, వారు పీఎంకేకు అనుకూలంగానే వుంటారుతప్ప దళపతివైపు మొగ్గు చూపరు.
ఏఐడీఎంకే `బీజేపీ కూటమి భవితవ్యం?
ఈవిధంగా ఓబీసీ లెక్కలు సంక్లిష్టమయంగా వున్న నేపథ్యంలో ఏఐడీఎంకాేబీజేపీ కూటమికి అను కూలంగా మారే అవకాశాలు ఎక్కువ. పశ్చిమ తమిళనాడులోని కొంగు వెల్లలార్‌ గౌండర్లు ఎప్పటికీ ఏఐడీఎంకేకు అనుకూలమే. ఎందుకంటే ఏఐడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఈ కులానికి చెందినవాడే! ఉత్తర తమిళనాడులో బలమైన వెన్నియార్ల మద్దతున్న పీఎంకే ఇప్పుడు ఏఐడీఎంకాేబీజేపీ అలయన్స్‌ వైపు చూస్తుండటం గమనార్హం. దక్షిణ మరియు డెల్టా ప్రాంతాల్లో థేవర్ల ప్రాబల్యం ఎక్కువ. గతంలో ఏఐడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్‌సెల్వం, ప్రస్తుత టీటీవీ నాయకుడు దినకరన్‌లు ఈ వర్గానికి చెందినవారే. వీరిద్దరూ తిరిగి ఏఐడీఎంకాేబీజేపీ కూటమిలోకి వచ్చే అవకాశాలున్నాయి. అదీకాకుండా ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నయనార్‌నాగేంద్రన్‌ థెవర వర్గానికి చెందినవాడు. పన్నీర్‌సెల్వం, దినకరన్‌లు ఎన్‌డీఏ కూటమిలోకి చేరి తే, అప్పుడు కూటమికి థెవర వర్గంలో తిరుగుండదు.
ఇక బీజేపీ విషయానికి వస్తే సైద్ధాంతిక ప్రాతిపదిక తప్ప, కులానికి ప్రాధాన్యత లేకపోవడంతో, దానికి ఇప్పటివరకు వున్న ఓట్లశాతంలో ఏవిధమైన మార్పు వుండదు. ఎందుకంటే దీని మద్దతుదార్లు సైద్ధాంతిక ప్రాతిపదికన వుండటం గమనార్హం. అందువల్ల విజయ్‌ ప్రభావం ఇతర పార్టీ లపై పడినంతగా భాజపాపై పడదు. విజయ్‌వల్ల బాగా దెబ్బతినేది సీమన్స్‌ నాయకత్వంలోని నామ్‌ తమిళర్‌ కచ్చి (ఎన్టీకే) తమిళనాడుకు మరింత స్వేచ్ఛ కావాలని పోరాడే పార్టీ ఇది. యువకులు ప్రధానంగా రాజ్యాన్ని వ్యతిరేకించే వారు ఇందులో సభ్యులు. వీరంతా ఇప్పుడు తమ అ భిప్రాయాన్ని విజయ్‌కి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక అధికార డీఎంకే పార్టీ విషయానికి వస్తే, ఒకటీ రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల అభిప్రాయాల్లో వచ్చిన మార్పులు ప్రభావం చూపవు. రాష్ట్రం మొత్తంమీద పరిశీలిస్తే తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలైన నియోజకవర్గాల్లోనే డీఎంకేకు అసలైన ప్రమాదం పొంచివుంది. ఉదాహరణకు 2021లో కువందంపాలయం నియోజకవర్గంలో ఏఐడీఎంకే అభ్యర్థికి 9,776 ఓట్ల మెజారిటీ వచ్చింది. విచిత్రమేమంటే ఇక్కడ కమల్‌ హసన్‌ పార్టీ ఎంఎన్‌ఎంకు 23527 ఓట్లు రాగా, ఎన్టీకే పార్టీకి 17897 ఓట్లు వచ్చాయి. మరి ఈ రెండు పార్టీల ఓట్లు కలిపితే ఏఐడీఎంకేకు వచ్చిన మెజారిటీ ఓట్లకంటే ఎక్కువ. ఇదే నియోజకవర్గంలో వ్యక్తిగతంగా పార్టీల ఓట్లశాతం గమనిస్తే, ఎంఎన్‌ఎం పార్టీకి వచ్చిన ఓట్లు 18శాతం. 2016 ఎన్నికల్లో ఓట్లశాతాన్ని పోల్చినప్పుడు డీఎంకే నుంచి చీల్చుకున్న 6శాతం ఓట్లున్నాయి. నాటి ఎన్నికల్లో డీఎంకే ఈ నియోజకవర్గం నుంచి 3శాతం ఓట్ల తేడాతో గెలవడం గమనార్హం!
ఇదేవిధంగా వచ్చే ఎన్నికల్లో దళపతి నేతృత్వంలోని టీవీకే మొత్తంమీద పదిశాతం ఓట్లు సాధిస్తే డీఎంకే తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమవుతుంది.
ఓటుబ్యాంకు రాజకీయాలు, కూటములు కట్టడంలో డీఎంకేకు తిరుగులేదు. దీంతోపాటు కుల రాజకీయాలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో దిట్ట! ఈ నేపథ్యంలో దళపతి పార్టీ రంగంలోకి వచ్చిన నేపథ్యంలో డీఎంకే అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయనేది వేచి చూడాల్సిందే. తమిళ రాజకీయాల్లో నేటి పరిణామం ఒక్క సత్యాన్ని వెల్లడిస్తోంది. సంప్రదాయికంగా తమిళ రాజకీయాల్లో వేసే ఎత్తుగడలు, పన్నే వ్యూహాలు ఏమీ తెలియని ఒక కొత్త నాయకుడు విజయ్‌ రాజకీయ అరంగేట్రం చేశారు. ఛరిష్మా ఓటుగా మారితే, అన్ని వ్యూహాలు, ఎత్తుగడలు సునామీలో కొట్టుకుపోయి, రాష్ట్రంలో కొత్త రాజకీయశకం ప్రారంభం కాగలదు.

`మల్టీ టాలెంటెడ్‌ మహా మాయగాడు గుమస్తా మిల్లర్‌ ‘‘జగన్‌’’ మరో కుంభకోణం!!

‘‘నేటిధాత్రి’’, ఎఫెక్ట్‌

`మల్టీ టాలెంటెడ్‌ మహా మాయగాడు గుమస్తా మిల్లర్‌ ‘‘జగన్‌’’ మరో కుంభకోణం!!

`కలెక్టర్‌ కళ్ళు కప్పి.. జగన్‌ కు అప్పజెప్పి.

`సన్నాలకు జగన్‌ కన్నం!

`వడ్లన్నీ జగనొక్కడే మింగుతున్నాడు!!

`అధికారులు ఆ ఒక్కడి మిల్లులోనే కుక్కుతున్నారు!!

`కిలాడీ జగన్‌ కనుసన్నల్లోనే అధికారులు కంపు కంపు చేస్తున్నారు

`జగన్‌ మోసాలను కళ్లు మూసుకొని చూస్తున్నారు

`రైతుల ‘‘ట్రక్‌ షీట్ల’’ లను సొమ్ము చేసుకుంటున్నాడు రైతులను ముంచి కోట్లు

మూటగట్టుకుంటున్నాడు

`మిల్లుల మురికి నీరు వరద కాలువల్లో కలుపుతున్నాడు

`పొల్యూషన్‌ అధికారుల నోరు నోట్లతో మూయిస్తున్నాడు

`ఇరిగేషన్‌ అధికారులను కనుసైగతో కమ్మేస్తున్నాడు

`‘‘జేసి’’ని కూడా చిటికెన వేలు మీద ఆడిస్తా అంటున్న జగన్‌

`అధికారులందినీ గుప్పిట్లో పెట్టుకున్నారు

`మిల్లింగ్‌లో మాయా ప్రపంచం సృష్టించుకున్నాడు

`గుమస్తా పని చేసి గూడుపుఠాణి నేర్చుకున్నాడు

`సన్నాలొద్దని గాయి గాయి చేశాడు

`ఇప్పుడు సన్నాలను రా మిల్లులకు కాకుండా చేస్తున్నాడు

`అటు రైతులను నిండా ముంచుతున్నాడు

`ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు

`కులం పేరు అడ్డం పెట్డుకొని కుటిల నీతికి పాల్పడుతున్నాడు

`మహా మాయగాడుగా వడ్లన్నీ మాయం చేస్తున్నాడు

`‘‘నేటిధాత్రి’’ కథనానికి ఖమ్మం అధికారులు స్పందించారు

`హన్మకొండ అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు

`ఖమ్మం జిల్లా వడ్లను కూడా గుమస్తా జగన్‌కే కట్టబెట్టారు

`ఎంక్వౌరీకి ఆదేశించినా హన్మకొండ అధికారులు కళ్లు తెరవడం లేదు

`ఖమ్మం జెసి నుంచి రికవరీ ఆర్డర్లు వచ్చినా హన్మకొండ అధికారులు మేలుకోవడం లేదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
కొందరికి కాలం కలిసి వస్తుంది. మరి కొందరికి అదృష్టం కలిసి వస్తుంది. మరి కొందరకి పేరు కలిసివస్తుంది. రాజపకీయం కలిసి వస్తుంది. కాని ఓ వ్యక్తికి మాత్రం అన్నీ కలిసి వస్తాయి. ఏక కాలంలో అన్నీ కలిసివస్తుంటాయి. అలా పుర్కర కాలం నుంచి సివిల్‌ సప్లయ్‌ శాఖను గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంచెలంచెలుగా కాదు, ఏకంగా ఒక్కసారే ఎదిగాడు. మోసాలకు వెన్నతో పెట్టిన విద్య అనే పదానికి నిర్వచనమయ్యాడు. అందరూ గుమస్తా జగన్మోహన్‌ రావు అంటుంటారు. పేరు ముందు వుండే కులం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. రాజకీయం వెన్నంటే వున్నట్లు చేసుకున్న ప్రచారం కలిసి వచ్చింది. అందుకు సివిల్‌ సప్లై శాఖ కూడా అండదండలు అందించింది. సహజంగా ఎవరికైనా వారి అదృష్టమే కలిసి వస్తుంది. కాని ఈ వ్యక్తికి ఇతరుల అదృష్టం కూడా లాక్కునేంత శక్తి వుంది. అందుకే మల్టీ టాలెంటెడ్‌ మాయగాడు అని అందరూ అంటుంటారు. ఒక గుమస్తా నుంచి ఏకంగా మిల్లర్‌గా ఎదగడమే కాదు, బినామీలతో మిల్లర్ల వ్యవస్ధను సృష్టించుకున్నాడు. మిగతా మిల్లర్ల నోరు కొడుతున్నాడు. ఇతర మిల్లర్లకు రావాల్సిన వడ్లను కొల్లగొడుతుంటాడు. అధికారులను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్నాడు. వారి బలహీనతలను తాను సొమ్ము చేసుకుంటున్నాడు. తోటి మిల్లర్లకు అన్యాయం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. రైతులను నిండా ముంచేస్తున్నాడు. పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బ తీస్తున్నాడు. సాగు నీటిని కలుషితం చేస్తున్నాడు. ఎన్ని రకాలా మోసాలు చేయాలో తెలుసుకున్నాడు. ఆచరించి చూపిస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన మరో మోసం, ఒక రకంగా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. హన్మకొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నెల రోజుల పాటు సెలవుల్లో వెళ్లారు. ఇదే అదునుగా సివిల్‌ సప్లై శాఖ ఉద్యోగులతో సహకారంతో ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన సన్నాలను తను సొంతం చేసుకున్నాడు. నిజానికి అవి హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర మిల్లులకు కేటాయించారు. ఆ మిల్లులకు కాదని, రాత్రికి రాత్రి తన చాణక్యం ప్రదర్శించి, వాటిని తన మిల్లులకు మళ్లించుకున్నాడు. కలెక్టర్‌కు తెలియకుండానే సివిల్‌ సప్లై శాఖ అధికారులు సహకరించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయమేమింటే ఈ జగన్‌కు వున్నవి బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు. గతంలో సన్నాలు తీసుకొమ్మని ప్రభుత్వం ఒత్తిడి చేసినా వద్దని వారించాడు. ప్రభుత్వాన్నే ఎదిరించాడు. మాకు దొడ్లు వడ్లు మాత్రమే కావాలిన మొండికేశాడు. సన్నాల వల్ల తాము ఎంతో నష్టపోతామని, తాము నష్టాల బారిన పడిపోతామని అనేవాడు. ఇదే విషయంలో ఒకటి, రెండు సార్లు జాయింట్‌ కలెక్టర్‌ సమావేశానికి హజరుకాలేదు. కొన్ని సార్లు హజరైనా తన నిరసన తెలియజేస్తూ వెళ్లిపోయేవాడు. తమకు సన్నాలు వద్దని సమావేశంలో మధ్యలోనే లేచి వెళ్లిపోయేవాడు. అలాంటి జగన్‌ ఇప్పుడు సన్నాలు మాత్రమే కావాలంటున్నాడు. ఆయనకు రా రైస్‌ మిల్లులు లేవు. కాని సన్నాలు కావాలంటున్నాడు. ఇతర రా రైస్‌ మిల్లులకు చెందాల్సిన సన్నాలను కూడా లాగేసుకుంటున్నాడు. ఖమ్మం నుంచి 50 లారీల వడ్లు హన్మకొండ జిల్లాకు వచ్చాయి. వాటిని ఇతర మిల్లుకు అదికారులు కేటాయించారు. అయినా వాటిని తన మిల్లులకు మళ్లించుకున్నాడు. ఇంత వరకు బాగానే వుంది. కాని ఖమ్మం జిల్లానుంచి వచ్చిన వడ్లలలో సుమారు 2వేల బస్తాలు మాయం చేశాడు. తప్పుడు లెక్కలు చూపించాడు. వడ్లు తీసుకొని, బియ్యం చేసే సరఫరాకు పెద్ద తేడాను తెలివిగా చూపించాడు. ఇది అధికారులు గమనించారు. దాంతో ఖమ్మం అధికారులు వెంటనే అలెర్టయ్యారు. ఇక్కడ ఖమ్మం జాయింట్‌ కలెక్టర్‌ ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. ఖమ్మం జిల్లా నుంచి పంపిన సన్నాల బస్తాల మీద తూకం రాయించారు. అక్కడ జగన్‌ దొరికిపోయారు. ఇచ్చిన సన్నాలుకు, జగన్‌ మిల్లులనుంచి వెళ్లిన బియ్యానికి పొంతన లేదు. దాంతో కమీషనర్‌ కార్యాలయానికి సమాచారం అందించి, ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. ఏఏ మిల్లు ఎంత మోసం చేసిందనే విషయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ స్పష్టంగా నోటీసులో పేర్కొన్నారు. అవి వసూలు చేస్తున్నారు. ఇలా సివిల్‌ సప్లైయ్‌ని పుష్కర కాలంగా మోసం చేస్తూ వస్తున్న జగన్‌ కిలాడీ వేషాలు అనేకం వున్నాయి. ఆయన చేస్తున్న ఘనకార్యాలు తక్కువేం కాదు. రైతులు తెచ్చే వడ్లకు ట్రక్‌ షీట్ల పేరుతో ప్రభుత్వం రవాణ చార్జీలు చెల్లిస్తుంది. అలా ప్రతి సీజన్‌లో కొన్ని మండలంలోని రైతులందరికీ ఆ సొమ్ము చేరాలి. కాని జగన్‌ ఆ వడ్లకు సంబందించిన ట్రక్‌ షీట్ల పేరుతో వచ్చే సొమ్మును మింగేస్తుంటాడు. ఆ సొమ్ము వెలల్లోనో, లక్షల్లోనో కాదు, ఏకంగా కోట్లలో వుంటుంది. అలా రైతులకు రావాల్సిన రవాణ ఖర్చులు మొత్తం తనఖాతాలోనే వేసుకుంటాడు. రైతుల చేత మాత్రం సంతాకాలు తీసుకుంటుంటుంటాడు. ఇలా ప్రతిసీజన్‌లో కోట్ల రూపాయల గోల్‌ మాల్‌ చేస్తున్నాడు. జిల్లాలో అందరికీ అందాల్సిన సన్నాలన్నింటినీ ఈసారి సివిల్‌ సప్లై అదికారులు జగన్‌ మిల్లులకే అప్పగిస్తున్నారు. మిగతా మిల్లర్లకు మొండి చేయి చూపిస్తున్నారు. అయినా ఆ మిల్లులను సక్రమంగా నడిపిస్తున్నాడా? అంటే అదీ లేదు. సహజంగా బాయిల్డ్‌ మిల్లులకు నీటి శుద్ద ప్లాంట్లు వుంటాయి. జగన్‌కు చెందిన మిల్లులకు కూడా వున్నాయా? అంటే వున్నాయన్నట్లు వున్నాయి. అవి పనిచేస్తున్నాయా? అంటే తూతూ మంత్రంగా పనిచేస్తాయి. కాని వాటి పనితీరుపై అధికారుల పర్యవేక్షణ ఎప్పుడూ వుండదు. కాని అంతా బాగుందనే అదికారులు రిపోర్టులిస్తుంటారు. మరి నిజమేనా? అని ఆరా తీసేవారే లేకుండాపోయారు. బాయిల్డ్‌ మిల్లులో వడ్లు ఉడకపెట్టడానికి పెద్దఎత్తున నీటిని వినియోగిస్తారు. ఆ నీటిలో కొన్ని కెమికల్స్‌ కూడా మిక్స్‌ చేస్తారు. వడ్లను ఉడకపెడుతుంటారు. ఆ తర్వాత ఆ నీళ్లను బైటకు వదిలేస్తారు. అలా బైటకు పంపే నీరు ఎంతో దుర్గంధంతో వుంటుంది. ముక్కు పుటాలు అదిరిపోయేంత ధుర్గంధం వెదజల్లుతుంది. అలాంటి నీటిని మిల్లు పరిసరాల్లో వుండే నీటి శుద్ది ప్లాంటులోకి పంపించాలి. ఆ నీటిని శుద్ధి చేసి, బైటకు వదిలేయాలి. కాని జగన్‌కు చెందిన మిల్లుల నుంచి వెలువడిన ఆ నల్లని రంగుతో, దుర్గంధంతో కూడిన నీటిని మిల్లుల వెనక నుంచి వెళ్లే సాగు నీటి కాలువలో కలిపేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. కాని అదికారులు అటు వైపు వెళ్లరు. చూడరు. మిల్లుపై చర్యలు తీసుకోరు. ఎందుకంటే మిల్లుల వెనక నుంచి సాగు నీటి కాలువ వెళ్తుందని వాళ్లకు తెలుసు. ఆ కాలువలోకి జగన్‌కు చెందిన మిల్లుల నీరు వెళ్లి ఆ కాలువలో చేరుతుందని తెలుసు. కాలువలో నీరంతా కలుషితమైపోతుందని తెలుసు. ఆ కాలువ ద్వారా వెళ్తున్న కెమికల్‌తో కూడిన మురుగునీరు పక్కనే వున్న చెరువులో చేరుతుందని తెలుసు. ఆ మిల్లుల వ్యర్దాల నీరు చెరువులోకి చేరడం వల్ల చేపలు చనిపోతున్నాయని తెలుసు. ఆ చెరువు నుంచి మరో చెరువుకు అదే నీరు వెళ్లి చేరుతుందని తెలుసు. అయినా అదికారులు కదిలింది లేదు. మిల్లుల మీద చర్యలు తీసుకున్నది లేదు. సరే ఇరిగేషన్‌ శాఖ అంటే పట్టించుకోలేదు. కాని పర్యావరణానికి హనీ కలిగే ఏ సంస్ధనైనా నిర్ధాక్షిణ్యంగా నిలిపివేసే శక్తి, హక్కు వున్న పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఏం చేస్తుందనేది కూడా ప్రశ్నగా మిగిలిపోయింది. ఒక రోజో, రెండు రోజులో కాదు, నెలలు అసలే కాదు. ఏకంగా సంవత్సరాల తరబడి ఆ మిల్లులనుంచి వ్యర్ధాలన్నీ సాగు నీటి కాలువలోకి పంపిస్తున్నారు. పర్యావరణం పాడౌతోంది. నీరు కాలుష్యమైపోతోంది. మిల్లుల పరిసరాల్లో పెద్దఎత్తున దుర్గంధం వెదజల్లబడుతోంది. కాని అధికారులు ముక్కు మూసుకుంటున్నారు. అప్పుడప్పుడు మిల్లుల తనిఖీకి వచ్చినప్పుడు కళ్లు కూడా మూసుకుంటున్నారు. మిల్లుల్లో వుండాల్సిన నీటి శుద్ది ప్లాంటు కళ్లముందు పని చేయడం లేదని కనిపిస్తున్నా..బాగుందనే రిపోర్టు రాసేస్తుంటారు. పక్కనే సాగు నీటి కాలువను తొంగి కూడా చూడరు. అందులో కలుస్తున్న నీటిని పట్టించుకోరు. ఇలా వ్యవస్ధలను, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని చేయాల్సినన్ని దర్మార్గాలు జగన్‌ చేస్తున్నాడు. జాయింట్‌ కలెక్టర్‌ ఏం చేయగలడని కూడా తోటి మిల్లర్ల ముందు సవాలు కూడా విసురుతుంటాడని విశ్వసనీయ సమాచారం. మరి ఇప్పుడు సెలవులు ముగించుకొని జాయింట్‌ కలెక్టర్‌ వస్తున్నారు. ఇప్పటికైనా జగన్‌ మీద చర్యలు తీసుకుంటారా? జగన్‌ చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తారా? అన్నది వేచి చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version