రేవంత్ పాలనలో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు

· స్పష్టంగా కనిపిస్తున్న ఆంధ్ర ప్రభావం

· రేవంత్ ద్వారా తెలంగాణలోకి ప్రవేశించాలనుకుంటున్న బాబు

· ఒక “అంతులేని వింతకథ”లా మారిన టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ

· అంతులేని భేతాళ ప్రశ్నలకు, విక్రమార్క సమాధానాలు

· ఇది రాజకీయ కక్షగా ప్రచారం జరిగే ప్రమాదం

· అదే జరిగితే కాంగ్రెస్‌కు నష్టం

· ఇప్పటికే బీఆరఎస్‌కు పెరుగుతున్న సానుకూలత

హైదరాబాద్, నేటిధాత్రి: 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో క్రమానుగత మార్పులు చోటుచేసుకోవడం వర్తమాన పరిణామం. ఇందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య వున్న అత్యంత సన్నిహిత సంబం ధం. ఒకరకంగా చెప్పాలంటే ఇద్దరిదీ గురుశిష్యుల అనుబంధమన్న సంగతి రెండు తెలుగు రా ష్ట్రాల్లో ఎవరినడిగినా ఇట్టే చెప్పేస్తారు. అంతవరకు బాగానేవుంది. మొన్నటివరకు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా పాలన సాగించినంతకాలం ఆంధ్ర రాజకీయాల ప్రభావం తె లంగాణపై పడలేదు. ముఖ్యంగా కేసీఆర్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డిల మధ్య సయోధ్య నెలకొన్నప్పటికీ ఎవరి పాలన వారు చేసుకున్నారు. పెద్దగా వివాదాలు వచ్చింది కూడా లేదు. కానీ ఇప్పుడు రేవంత్ పాలన వచ్చిన దగ్గరినుంచి తెలంగాణలో ఆంధ్ర రాజకీయం ముఖ్యంగా చంద్రబాబు ప్రభావం కొ{£్టచ్చినట్టు కనిపిస్తోంది. ఒక ఉద్యమకారుడిగా కేసీఆర్ కాంగ్రెస్ నాయకులపై వి రుచుకు పడటం చూశాం. ఇందుకు ప్రతిగా ఆయనపై ఎవరూ పెద్దగా స్పదించింది లేదు. కానీ ఇప్పుడు రేవంత్ కూడా అదేమాదిరి తిట్లపురాణం యదేచ్ఛగా వాడటం మొదలుపెట్టడంతో, ఇ ప్పుడు తెలంగాణలో గతంలోలేని “పరస్పర తిట్ల రాజకీయ సంస్కతి” మొదలైంది. ఇటువంటి సంస్కతి ఆంధ్రలో బాగా కనిపిస్తుంది. 

ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీడీపీ కానీ వైసీపీ కాని తెలంగాణ లో కోలుకోలేని స్థాయికి పడిపోయాయి. మొదట్లో చంద్రబాబు, టీఆరఎస్‌ను చీల్చే ప్రయత్నాల ను కేసీఆర్ సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా, రాష్ట్రంలో తెలుగుదేశం లేకుండా చేస్తాననిపట్టుపట్టి మరీ ఆపార్టీ మూలాలను పూర్తిగా దెబ్బతీశారు. విచిత్రమేమంటే ఆయన వచ్చిందీ తె లుగుదేశం నుంచే. అందువల్ల కేసీఆర్ అధికారంలో వున్నంతకాలం చంద్రబాబు కిమ్మనలేదు. ఇప్పుడు తన “శిష్యుడు” రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీని ఏదోవిధంగా పునరుద్ధరించుకోవడానికి ఇది అనుకూల సమయంగా ఆయన భావిస్తుండవ చ్చు. రేవంత్‌రెడ్డి కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లో చేరినవారు కావడం, ఆయన తెలుగు దేశంలో తన మూలాలను మరచిపోవకపోవడం కూడా చంద్రబాబుకు కలిసొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వచ్చే జీహెచఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టి పార్టీకి ఊపిరిపోయాలన్న తలంపుతో వున్నట్టు తెలుస్తోంది. ఆవిధంగా చంద్రబాబు`రేవంత్‌ల మధ్య వున్న సమన్వయం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ దశ్యాన్ని మార్చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పడిన సరిహద్దులు ఇప్పుడు క్రమంగా చెరిగిపోతున్న దశ్యం ఆవిష్కతమవుతోంది. ముఖ్యంగా ఏ జలవివాదాలను చూపి తెలంగాణకు నష్టం వాటిల్లుతున్నదని కేసీఆర్ వాదించి, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారో, అంతటి కచ్చితత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపించడంలేదు. కాంగ్రెస్ లో సీనియర్లలో రాష్ట్రవ్యాప్త ఛరిష్మా కొరవడటం, రేవంత్ వన్ మ్యాన్ షో వెరసి చంద్రబాబుకు సానుకూలతకు దోహదం చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు అనుకున్న విధంగా పార్టీ అభ్యర్థులను జీహెచఎంసీ ఎన్నికల్లో నిలబెడితే, కచ్చితంగా అది బీజేపీ, బీఆరఎస్ ఓట్లకు గండికొట్టడం ఖా యమన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే ఇదే సమయంలో చంద్రబాబు`రేవంత్ ద్వయా న్ని గతంలో ఓటుకు నోటు కేసు వెన్నాడుతుండటం గమనార్హం.

తెలంగాణ ఉద్యమ కాలంనుంచి కూడా రెండు రాష్ట్రాల్లో సమైక్యవాదులున్నారు. ఉమ్మడి తెలుగు సంస్కతి, ఉమ్మడి అభివద్ధికే తమ మద్దతిచ్చేవారు ఇప్పటికీ వున్నారు. అటువంటి వారు చంద్ర బాబు యత్నాలకు కచ్చితంగా సానుకూలంగా వుంటారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో పోలిస్తే 2001 నుంచి కేసీఆర్ నేతత్వంలో సాగిన రెండో తెలంగాణ ఉద్యమం నాటికి, రెండు ప్రాంతాల మధ్య సాంస్కతిక, ఆర్థిక సంబంధాలతో పాటు, బంధుత్వాలు కూడా బాగా విస్తరిం చాయి. పెద్ద సంఖ్యలో ఆంధ్ర ప్రాంతం తెలుగువారు తెలంగాణలో సెటిలయ్యారు కూడా. ఫలి తంగా రెండు ప్రాంతాల సంస్కతులు విడదీయరాని రీతిలో కలిసిపోయాయి. కేసీఆర్ కూడా ఉద్యమ సమయంలో ఆంధ్రకు వ్యతిరేకంగా మాట్లాడినా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతం వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. ఉద్యమకాలంలో భయపడినా, తర్వాతి కాలంలో ఆంధ్ర ప్రాంత ప్రజలు హాయిగా ప్రశాంతంగా పూర్తి భద్రతా భావంతో మనుగడ సాగిస్తున్నారు. విచిత్ర మేమంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో, పనులకు ఇబ్బందులు పడిన ఆంధ్రప్రాంత వాసులు, తెలుగుదేశం నాయకుల పనులు తెలంగాణలో వేగంగా పూర్తికావడంతో కేసీఆర్‌పై అభిమానం పెంచుకున్నారు కూడా! ఉద్యమం నాటి ఉధతిని, ప్రతికూలతను తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కనుమరుగుచేసి, ఇక్కడి తెలుగువారందరినీ ఒక్కటిగా భావించి పాలన కొనసాగించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. లక్ష్య సాధన వరకు ఏం చేసినా, ఏం మాట్లాడినా, అనుకున్న గ మ్యం చేరిన తర్వాత అన్నీ మరచి సాధారణ పరిస్థితులు కల్పించి ఎవ్వరూ బాధపడని రీతిలో పాలన కొనసాగించిన గొప్పతనం కూడా కేసీఆర్‌కే దక్కుతుంది.

కేసీఆర్ ఇప్పుడు అధికారంలో లేరు కనుక, చంద్రబాబు రేవంత్ ద్వారా తెలంగాణలోకి అరంగేటట్రం చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఇందుకు మొదటగా ఆయన చేసిన పని కాంగ్రెస్‌లో రేవంత్‌ను సుస్థిరం చేయడంలో భాగంగా ఇక్కడి తెలుగదేశం మీడియా రూపంలో అండగా నిలవడం. అయితే గత రెండేళ్ల కాలంలో ఈ అవకాశం రాలేదు. మొన్న సింగరేణి బ్లాక్‌ల టెండర్ల విషయంలో బయటపడ్డ విభేదాల్లో రేవంత్‌ను సుద్దపూసలా చిత్రీకరించేందుకు తెలుగుదేశం మీడియా శతధా ప్రయత్నించింది. ఇదే సమయంలో సీనియర్ మంత్రుల మధ్య విభేదాలు న్నాయని, పాపాల భైరవులు వాళ్లేనన్న ప్రచారాన్ని కూడా విజయవంతంగా చేశారు. రేవంత్, భట్టి విక్ర మార్కలు పైకి ఎటువంటి విభేదాలు లేవని ప్రకటిస్తున్నా పచ్చ మీడియా మాత్రం తన పాత్రను చాపకింద నీరులా పోషిస్తూనే వుంది. సందట్లో సడేమియా మాదిరిగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేపై వార్తలు రాసే సమయంలో కాళేశ్వరంను బాగా హైలైట్ చేసి, బీఆరఎస్‌పై వ్యతిరేక వార్తలు రాసాయి. ఇదే సమయంలో ఆర్థిక సర్వే పేర్కొన్న తెలంగాణ అభివద్ధి, సాగు విషయంలో సాధించిన విజయాలకు ఇవి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే చిన్నగా బీఆరఎస్‌పై కూడా వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టినట్టు భావించాల్సి వుస్తున్నది. ఇంత చేస్తున్నా నిన్న ఢిల్లీలో జరిగిన జలమండలి సమావేశంలో పోలవరం`నల్లమల లింక్ ప్రాజెక్టును ఆంధ్ర ప్రభు త్వం అజెండాగా చేర్పించలేక పోవడం గమనార్హం. ప్రత్యర్థి రాజకీయాలు బాగా తెలిసిన హరీష్, కేటీఆర్‌లు ఎప్పటికప్పుడు విరుచుకుపడు తుండటం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎటూ మెసలనీయకుండా చేస్తున్నారు. 

చంద్రబాబు ఏదోవిధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కాళ్లూనుకునే దశకు తీసుకొస్తే బీఆరఎస్ దెబ్బతినడం ఖాయం. కానీ ఇప్పటికీ తెలంగాణ గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా వుంది. రేవంత్ కూడా ఈ సెంటిమెంట్‌ను కాదని ముందుకెళ్లడం కష్టం. అయితే హైదరాబాద్ పరిస్థితి వేరు. ఇక్కడ ఆంధ్రప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో వుండట మే కాదు, కొన్ని వార్డుల్లో గెలుపును నిర్దేశించే స్థాయిలో వుండటం చంద్రబాబుకు అనుకూలం. బీఆరఎస్ అధికారంలో వుండగా చంద్రబాబును హైదరాబాద్‌లో ప్రచారం చేయనీయకుండా కేసీఆర్ సమర్థవంతంగా నిరోధించగలిగారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు హైదరాబాద్‌ను తానే అభివద్ధి చేశానని, హైటెక్ ఈ స్థాయికి రావడానికి తానే కారణమని, ఫ్లెí ఓవర్ల నిర్మాణం అంతా తన పుణ్యమేనని గట్టిగా ప్రచారం చేసుకోవచ్చు. ప్రచార ీVAరు తో ప్రజల్లో మరో ఆలోచన లేకుండా చేసే సామర్థ్యమున్న పచ్చ మీడియా వుండనే వున్నది. అ యితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. హైటెక్ సిటీ, హైదరాబాద్ అభివద్ధికి కాంగ్రెస్ పునాది వేస్తే, చంద్రబాబు దాన్ని కొనసాగించారు, తర్వాత వైఎసఆర్ మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆరఎస్ ప్రత్యేక దష్టి పెట్టి మరీ అభివద్ధి చేసింది. హైదరాబాద్ అభివద్ధి వెనుక అందరి పాత్ర వున్నదన్న సంగతి మరువరాదు.  

చంద్రబాబు, రేవంత్‌ల ఆలోచనలను పసిగట్టలేనంత అమాయకుడు కేసీఆర్ కాదు. ఇప్పటికే రేవంత్‌ను ఆంధ్రా ఏజెంట్‌గా, చంద్రబాబు శిష్యుడిగా, తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రకు తాక ట్టుపెట్టే వాడిగా కేటీఆర్, హరీష్‌లు ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా నదీ జలాల విషయంలో వారు రేవంత్‌ను ఎటూ మెసలనీయడంలేదు. కష్ణా, గోదావరి జలాల విషయంలో ఏమాత్రం అటూ ఇటూ అయినా, కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం. కేసీఆర్ రగిల్చిన నీళ్ల సెంటిమెంట్ తెలంగాణలో ఇంకా బలంగా వుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బీడుగా వున్న పొలాలు సుక్షేత్రాలు గా మారిన నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు కేసీఆర్‌పై అభిమానాన్ని వదులుకో వడం కష్టం. నిజం చెప్పాలంటే సరిహద్దు ఆంధ్రప్రాంతంలో కూడా కేసీఆర్ పేరు చెప్పుకునే వారు ఎందరో వున్నారు. వారి భూముల రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడమే అందుకు కారణం. 

తాను అధికారంలో వున్నప్పుడు రేవంత్‌ను అరెస్ట్ చేయించి ఇబ్బందులకు గురిచేయడం కేసీఆర్ చేసిన ఘోర తప్పిదం. ఇది ఆయనకు సానుభూతి పెంచేందుకే దోహదం చేసింది. ఇప్పుడు రే వంత్ కూడా ఫోన్ ట్యాపింగ్‌ల పేరుతో, సిట్ విచారణంటూ “అంతులేని వింతకథ” మాదిరిగా ఎపిసోడ్లను నడపడం, ఎప్పటికీ ఎటూ తేల్చకపోవడం, ప్రజల్లో బీఆరఎస్ పట్ల సానుభూతిని పెంచక మానదు. గతంలో తనకు జరిగిన అనుభవమే, ఇప్పుడు కేసీఆర్‌కు పునరావతం కాగలదు. అందువల్ల కేసీఆర్ తప్పిదాన్ని, రేవంత్ మళ్లీ చేయకుండా వుంటేనే మంచిది. ప్రతీకారం దావానలం లాంటిది, అది నిరంతరం ప్రజ్వరిల్లుతూనే వుంటుంది తప్ప, చల్లారదు.

జమిలికి జై.. 2027 నవంబర్ లోనే సై?

`దేశమంతా ఒకేసారి ఎన్నికల జాతరే?

`50 ఏళ్ల తర్వాత మళ్ళీ జమిలి ఎన్నికలు?

`ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో నిర్ణయం?

`ప్రతిపక్షాలు కూడా జమిలికి సన్నద్ధం?

`ప్రతిపక్షాలలో కూడా కనిపిస్తున్న ఉత్సాహం?

`అభ్యంతరం ఏదైనా వుంటే ఎన్ డి ఏ పక్షాళనుంచే వుండాలి?

`అయినా ప్రధాని మోడీ వినిపించుకుంటారన్న నమ్మకం లేదు?

`చంద్రబాబు, నితీష్ లు అభ్యంతరం పెట్టే అవకాశం?

`ప్రధాని మోడీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే ఎవ్వరి మాట వినే రకం కాదు?

`ఏప్రిల్ నుంచి జన గణన మొదలు!

`మూడు నుంచి ఆరు నెలల్లో అంతా ఓ కొలిక్కి?

`ఆరు నెలల్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి?

`2027 నవంబర్ లో జమిలి ఎన్నికలు?

`బీజేపీ పార్టీ నేతలు చెబుతున్న మాట?

`ఈ మధ్య రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ జమిలి ఖాయమే అన్నారు?

హైదరాబాద్, నేటిధాత్రి:

జమిలీ ఎన్నికలు అసాద్యమైన ముచ్చటేమీ కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా సార్లు జమిలీ ఎన్నికలు దేశంలో జరిగాయి. అంతే కాదు ఆ రోజుల్లో ఒకే రోజు ఎన్నికలు జరిగిన సందర్భాలు వున్నాయి. అయితే అప్పటి జనాభా వేరు. ఇప్పటి జనాభా వేరు. గణనీయంగా మన దేశ జనాభా పెరిగింది. 145 కోట్లకు చేరుకున్నది. దాంతో జమిలీ ఎన్నికల నిర్వహణ కొంత కష ్టసాద్యంగా మారుతుందన్న సందేహాలు కూడా వున్నాయి. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలే విడతల వారిగా మూడు నెలల పాటు కూడా జరుపుకుంటున్న సందర్భం చూస్తున్నాం. అయితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఏక కాలంలో తేవడం వల్ల పెద్ద నష్టమేమీ లేదు. కాకపోతే జమిలీ ఎన్నికలు ఏక కాలంలో చేపట్టినా, సమయం ఎంత తీసుకుంటుందన్నదికూడా లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. సాదారణంగా రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలే రెండు మూడు విడతలుగా చేపడుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు అనేక విడతలుగా నెలల తరబడి నిర్వహిస్తున్నారు. ఇప్ప్పుడు జమిలీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఏక కాలంలో నిర్వహించాలంటే కూడా సమయం ఎంత పడుతుందన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికలే మూడు నెలల కాలం పాటు సాగితే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిపితే ఎంత కాలం పడుతుందో అని ఆలోచిస్తున్నారు. ఇలా జమిలీని కూడా విడతలవారిగా కాలం సాగదీస్తూ నిర్వహించడం వల్ల ప్రజల ఆలోచనలు మారే అవకాశం కూడా వుంది. పాలÅ£పక్షాలకు అనుకూలమయ్యే అంశాలు కూడా వుంటాయంటున్నారు. ఏది ఏమైనా మరోసారి జమిలీ ఎన్నికల చర్చ తెరమీదకు వచ్చింది. ఈ పార్లమెంటు సమావేశాలలోనే ఆ నిర్ణయం తీసుకుంటారనే వార్తలు ఊపందుకున్నాయి. నిజానికి జమిలీ మీద 2019 నుంచి ప్రతి ఆరు నెలలకోసారి చర్చకు రావడం చూస్తూనే వున్నాయి. ఇప్ప్పుడు మళ్లీ జాతీయస్దాయిలో చర్చ మొదలైంది. బీహార్ ఎన్నికల్లో బిజేపి గెలుపు తర్వాత ఈ చర్చకు ఊపు వచ్చింది. గతంలో 2034 తర్వాతే జమిలి అంటూ ప్రభుత్వం చెప్పింది. కాని పదే పదే జమలి ఎన్నికల ప్రస్తావన వచ్చేలా బిజేపి చేస్తోంది. 2027 నవంబర్ లోనే జమిలి ఎన్నికలు జరపాలని బిజేపి శ్రేణునలు బలంగా కోరుకుంటున్న ట్లు పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. జనాభా లెక్కలు ఈ ఏడాది ఎప్రిల్‌లో మొదలు కానున్నాయి. వాటిని సుమారు మూడు నెలల నుంచి ఆరు నెలలోపు పూర్తి చేయనున్నారు. ఆపై నియోజకవర్గాల పునర్విభజన కూడా ఆ వెంటనే పూర్తి చేస్తారని సమాచారం. ఆ తర్వాతే జమిలి అని గతంలో వినిపించింది. వాటి కంటే ముందే జమిలి పూర్తి చేయాలని బిజేపి యోచిస్తోందని సమాచారం. ఇంకా ఆగితే దేశంలో బ్యాలెట్ ఎన్నికలు కావాలని ఉద్యమాలు వచ్చే అవకాశం వుంది. ఇప్పటికే ఈవీఎం వల్ల తమకు నష్టం జరుగుతోందని ప్రతిపక్షాల ఆందోళన రోజు రోజుకు ఉదతం చేస్తున్నారు. ఇదే విషయంలో కాంగ్రెస్‌పార్టీ ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకురావాలని అనుకుంటోంది. ఆది నుంచి బిజేపి కోరుకునే ప్రధాన ఎజెండాలలో కొన్ని పూర్తయ్యాయి. రామజన్మ భూమిలో గుడి కట్టేశారు. కశ్మీర్‌కు వున్న ప్రత్యేక ప్రతిపత్తి తొలగించారు. ఆర్టికల్ 370 రద్దు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేశారు. దేశమంతా జిఎస్టీ ఒకే విదానం తెచ్చారు. ఇక మిగిలింది జమిలీ ఎన్నికలు. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు జమిలి ఎన్నికలు 2027లోనే జరిపే యోచన చేస్తున్నట్లు డిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోడీ ఒక్కసారి అనుకుంటే తన హయాంలోనే జమిలీ చేపట్టాలని అనుకుంటారు. ఈ చర్చకు బలం చేకూరేలా ఆ మధ్య కాలంలోనే సిఎం.రేవంత్‌రెడ్డి కూడా ప్రస్తావించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ఈ విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి జమిలి ఎన్నిÅ£లు వుండొచ్చన్న సూటిగానే చెప్పారు. కాని ఆ రోజు మీడియా ఆయన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. మీడియా దష్టి అంతా ఆ రోజు జూబ్లీ ఎన్నికల మీదే వుంది. ఆ ఎన్నికకు సంబందించిన వార్తలే ప్రసారం చేశాయి. సిఎం. రేవంత్ రెడ్డి నోట వినిపించిన ఆ మాటకు మీడియా పెద్దగా ప్రాదాన్యతనివ్వలేదు. ఈ మధ్య రాష్ట్రానికి చెందిన బిజేపి సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా జమిలీ ఎన్నికలు వస్తాయన్నారు. ఈ మధ్య జరిగిన బిహార్ ఎన్నికల్లో బిజేపి విజయ దుందిబి మోగించింది. దాంతో మళ్లీ జాతీయ స్దాయిలో అప్పటి నుంచి చర్చ ఊపందుకున్నది. నిజానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగానే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. కాని కొన్ని అభ్యంతరాలు నేపధ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు మాత్రమే ప్రకటించింది. గతంలో 2034 తర్వాతే జమిలి అంటూ చెప్పడం జరిగింది. కాని పదే పదే జమలి ఎన్నికల ప్రస్తావన వచ్చేలా మాత్రం చేస్తున్నారు.. 2027లోనే జమిలి ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం బలంగానే కోరుకుంటున్నట్లుంది. అయితే జనాభా లెక్కలు 2027లో పూర్తి చేయాలి. ఆపై నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఆ తర్వాతే జమిలి అని గతంలో చర్చ జరిగింది. కాని అవన్నీ పూర్తయ్యేదాక జమిలిని వాయిదా వేయకూడదని కేంద్రం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాటి కంటే ముందే జమిలి పూర్తి చేయాలని బిజేపి యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాన సమస్యలు సషించే అవకాశం వుందని బిజేపి భావిస్తోంది. ఎందుకంటే జనాభా నియంత్రణలో దక్షిణాది ముందుంది. కాని ఉత్తరాదిలో మాత్రం జనాభా గణనీయంగా పెరిగింది. జనాబా ప్రాతిపదికన నియోజకర్గాల విభజన జరుగుతుంది. దాంతో దక్షిణాదిన చాలా సీట్లు తగ్గిపోతాయి. ఉత్తరాది సీట్లు పెరుగుతాయి. అప్ప్పుడు దక్షిణాది మీద ఉత్తరాది పెత్తనం మరింత పెరుగుతుంది. దీనిని భరించేందుకు దక్షిణాది రాష్ట్రాలు సిద్దంగా లేవు. ఇక దేశమంతా పౌరులందరికీ ఒకే విదమైన హక్కులుండాలి. ఇక ఆఖరుకు మిగిలింది జమిలీ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 400 సీట్లు సంపాదించుకోగలమని బిజేపి నమ్మకం. అందుకే ముందు జమిలీ ఎన్నికలు నిర్వహించి, మరోసారి కేంద్రంలో అదికారంలోకి రావాలని కోరుకుంటోంది. అదే జరిగితే దేశమంతా ఎన్నికల జాతరే అవుతుంది. జమిలీ ఎన్నికలు జరిగి మన దేశంలో సుమారు 50 సంవత్సరాలౌతోంది. అప్పటి నుంచి జమిలీ ఎన్నికల నిర్వహణ వీలు కాలేదు. ఎమర్జెన్సీ తీసుకొచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాల హక్కులను కాలరాసిందనే అపవాదు ఇప్పటికీ మోస్తూనే వుంది. మళ్లీ జమిలీ ఎన్నికల పేరుతో ఆ రోజుల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టి, మళ్లీ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొనేందుకు ధైర్యం చేయలేదు. కాని తమ హాయాంలో ఒక్కసారైనా జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్నది బిజేపి ఆలోచన. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని మోడీ ఆశయం. దానికి అనుగుణంగా ముందుకు వెళ్లడానికి అన్నీ సమాయత్తం చేస్తున్నట్లే కనిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో బిజేపి అనుకున్నట్లుగా 400 సీట్లు వస్తే జమిలీ ఎన్నికలు 2034లోనే నిర్వహించేవారు. అంత పెద్ద మెజార్టీతో ప్రజలు గెలిపిస్తే, మళ్లీ ఎన్నికలంటూ ప్రజల ముందుకు వెళ్తే బిజేపికి ఆశనిపాతమే ఎదురయ్యేది. కాని ఇప్ప్పుడు బిజేపి ఒంటరిగా కాకుండా ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం ప్రధాని మోడీకి సుతారం ఇష్టం లేదని బిజేపి నేతలే అంటుంటారు. ఒక వేళ తెలుగుదేశంపార్టీ చంద్రబాబు నాయకుడు, జేడీయూ నితీష్‌కుమార్‌లు వ్యతిరేకించినా సరే ప్రధాని మోడీ జమిలీకి వెళ్లడానికే సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ ఇద్దరు నేతలు తమ మద్దతును ఉపసంహరించుకున్నా, ఎలాగూ ఎన్నికలకు వెళ్లాల్సిందే. అదేదో వారి నుంచి ఎలాంటి బెదిరింపు సంకేతాలు రాకముందే జమిలీకి వెళ్లడం వల్ల బిజేపికి లాభమని అనుకుంటున్నారు. ఇకపోతే ప్రతిపక్షాలు కూడా జమిలీ ఎన్నికలకు సిద్దంగా వున్నారు. జమిలీ ఎన్నికలు వద్దని ప్రతిపక్షాలు కూడా చెప్పడం లేదు. దాంతో జమిలీ ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుందనే అనుకుంటున్నారు. అన్నీ అనుకుంటున్నట్లు జరిగితే 2027 నవంబర్‌లో జమిలీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరిగే అవకాశముంది.

గులాబీకి ఎదురు లేదు..కాంగ్రెస్ కు చోటు లేదు!?

`దూసుకుపోతున్న కారును ఆపేదెవరు?

`కాంగ్రెస్ ను కాపాడేదెవరు? ఒడ్డుకు చేర్చేది ఎవరు?

`మున్సిపాలిటీలలో గులాబీ రెపరెపలు?

`డీలా పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు?

`కాంగ్రెస్ లో కనిపించని పోటీ పోట్లాటలు?

`మున్సిపాలిటీ లో ముందుకు రాలేకపోతున్న కాంగ్రెస్ నాయకులు?

`ప్రజల ముందుకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు?

`ప్రచారానికి చాలా చోట్ల ముఖం చాటేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు?

`కాంగ్రెస్ లో ఎన్నికల కోలాహలం ఎక్కడా కనిపించడం లేదు?

`సొమ్ములు లేక తిప్పలు పడుతున్న నాయకులు?

`ఖర్చులు తడిసిమోపెడౌతాయని కాంగ్రెస్ లో నెలకొన్న దిగులు?

`ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బీఆరఎస్ కు కలిసివచ్చే అవకాశం?

`ఇప్పటికే ప్రచారం లో దూసుకుపోతున్న గులాబీ దళం?

`పెద్ద ఎత్తున మున్సిపాలిటీ లలో గులాబీ లోకి పెరుగుతున్న వలసలు?

`చాప కింద నీరులా బలపడిన బీఆరఎస్ పార్టీ?

`బీఆరఎస్ లో కనిపిస్తున్న విపరీతమైన పోటీ?

`సారే రావాలన్న పాటలతో మారుమొగుతున్న ప్రచారం?

హైదరాబాద్, నేటిధాత్రి:

ఆలస్యం అమతం విషమని కాంగ్రెస్ నాయకులకు, పాలకులకు తెలియందికాదు. కాని ఇప్ప్పుడు తప్పదు. ఇప్ప్పుడు కాకపోతే మరీ విషయమౌతుందని గ్రహించి, హడావుడిగా ఎన్నిÅ£లు నిర్వహిస్తున్నారు. మార్పు మార్పు అంటూ చెప్పిందే చెప్పి, జనం మదిలో నింపి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలవి కాని హమీలను గుప్పించింది. కేసిఆర్ ప్రభుత్వం మీద నీలాపనిందలు వేసింది. ఒక అబద్దం ఒకటికి పదిసార్లు, పదులకు వందలు, వేల సార్లు చెప్పడంతో అది నిజమని నమ్మే పరిస్తితి వుంటుంది. అయినా జనం బలహీనత కూడ అదే కావడం గమనార్హం. నిజం చెబితే ఎవ్వరూ నమ్మరు. నమ్మడానికి ఎంత ప్రయత్నం చేసినా వెంటనే నమ్మరు. కాని అదే అబద్దం చెప్పడం పూర్తికాకముందే అర్ధమైందంటారు. అంత గొప్పది అబద్దం. అదే రాజకీయ పార్టీలకు వరం. అది గత ఎన్నికల్లో కాంగ్రెస్ వరమైంది. కాంగ్రెస్ గెలిచింది. అంత మాత్రానా ఆ అబద్దం నిజం కాని ఎప్పటికైనా తెలియాల్సిందే! జనం తెలుసుకోవాల్సిందే!! ఇప్ప్పుడే కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే తెలుసుకున్నారు. కాని కొంత ఓపిక పట్టారు. ఇక జనంలో కూడా ఆ ఓపికకు టైమ్ అయిపోయింది. దేనికైనా ఒక హద్దు వుంటుంది. ఆ హద్దు కూడా దాటిపోయింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు బిఆరఎస్ ప్రభుత్వం అప్ప్పుల కుప్ప చేసిందని అబద్దమాడింది. అటు అప్ప్పుల కుప్ప వుందంటున్నారు? ఇటు అలవికాని హమీలు ఇస్తున్నారు? ఎలా భర్తీ చేస్తారంటే మాకు ఆర్ధిక వ్యవస్దను ఎలా గాడిలో పెట్టాలో తెలుసు. సంపద ఎలా సష్టించాలో తెలుసు. సష్టించిన సంపద ఎలా ప్రజలకు పంచాలో తెలుసు అన్నారు. కాని ఏమైంది. అదికారంలోకి వచ్చిన వెంటనే లంకెబిందెలున్నాయనుకొని వస్తే, మట్టికుండలు కూడా లేవని చేతులెత్తేశారు. కేసిఆర్ ఫ్రభుత్వం చేసిన అప్ప్పులకే రాష్ట్ర ఆదాయం మిత్తీలకు సరిపోతుందని మళ్లీ కొత్త అబద్దాలు మొదలు పెట్టారు. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే నిజమనుకుందాం? కేసిఆర్ అటు అప్ప్పులకు మిత్తీలు చెల్లిస్తూనే, సంక్షేమ పధకాలు కూడా అందించారు. రైతు బంధు వేశారు. అన్ని రకాల సదుపాయల కల్పన చేశారు. అభివద్ది, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా ఈమలు చేశారు. అవే కాకుండా తెలంగాణలోని ప్రజలందరికీ కంటి వైద్యం చేయించారు. ఇలా అనేక రకాల కొత్త కొత్త కార్యక్రమాలు అమలు చేశారు. కాంగ్రెస్ రైతు బంధు ఒక్కసారి ఇచ్చి చెతులు దులుపుకున్నది. కల్యాణ లక్ష్మి వంటికి పెళ్లికి ముందే అందిస్తామన్నారు. అందులో లక్ష రూపాయలతోపాటు, తులం బంగారమన్నారు. ఇవ్వాల్సిన లక్ష కూడా పెళ్లి జరిగి, పిల్లలను పట్టుకొని వచ్చి చెక్కులు తీసుకుంటున్నారు. ఇంకా అనేకం పెండింగ్‌లే వున్నాయి. ఇలా చెప్ప్పుకుంటూ పోతే ఎన్నికల హమీలన్నీ అటకెక్కించారు. మహిళలకు ఉచిత బస్తు ఎక్కించి, అదే గొప్ప పధకం అన్నట్లు ప్రచారం చేసుకున్నారు. మీడియా ముందుకు వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేశామని ఏ మాత్రం శషబిషలు లేకుండా చెప్ప్పుకుంటున్నారు. అమలు చేస్తామని చెప్పడం కాదు, ఏకంగా చేసేశామనే చెబుతున్నారు. జనాన్ని ప్రభుత్వ పెద్దలు బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వం చెప్పేది శుద్ద అబద్దమని ప్రజలకు తెలియదా? తెలుసు. ఖజానాలో చిల్లి గవ్వలేదు. నన్ను కోసినా రూపాయి లేదు? అని సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుంటే ఇవ్వమని అడగడం ఎందుకు? సమయం వచ్చినప్ప్పుడు దించితే సరిపోతుందని జనం గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఏ ఎన్నిక వచ్చినా తమ తడాఖా చూపించేందుకు జనం సిద్దింగా వున్నారు. ఇప్పటికే పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక దక్కా ఇచ్చారు. అయినా కాంగ్రెస్ ప్రబుత్వంలో మార్పు రాలేదు. రైతులకు సకాలంలో అందాల్సినంత యూరియా అందలేదు. అయినా యాసంగి పంటకు అవసరం వుండదు. సరిగ్గా పంచాయితీ ఎన్నికల ముందు ఎదరైన ఇబ్బందిన రైతులు తమ ఓటుతో చూపించారు. కాంగ్రెస్‌ను హాండిచ్చారు. ఇప్ప్పుడు హడావుడిగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నారు. సర్పంచ్ ఎన్నికలంటే భిన్నంగా ఎన్నికల పలితాలు వుంటాయన్న ఆశ లేదు. ఇంకా కాలయాపన చేస్తే కాంగ్రెస్ నాయకుల్లో కూడా అసహనం పెరిగే అవకాశం వుంది. వారిలో ఆక్రోశం పెరిగితే మొదటికే మోసం వస్తుందని గ్రహించి, మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నారు. కాకపోతే కాంగ్రెస్‌కు ప్రజా క్షేత్రంలో ఇబ్బందికరమైన పరిస్దితులే వున్నాయని అంటున్నారు. సహజంగా ఎన్నికýంటే కాంగ్రెస్‌లో సొంత పార్టీ నేతలతోనే కొట్లాటలు, పోట్లాటలు కనిపిస్తాయి. టికెట్ మాకంటే మాకు అని రచ్చ రచ్చ చేసే నాయకులు వుంటారు. కాని మున్పిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు పెద్దగా ముందుకు వస్తున్నట్లు లేదు. పార్టీయే పిలిచి పిలిచి టిక్కెట్లు ఇస్తున్నట్లు చెప్ప్పుకుంటున్నారు. అయినా నాయకులు సుముఖత వ్యక్తం చేయడంలేదనితెలుస్తోంది. ఎన్నికల ఊపు కాంగ్రెస్ నాయకుల్లో లేదంటున్నారు. ప్రభుత్వ వి దానాలు చెప్ప్పుకోవడానికి ఏమీలేవు. ఆర్ధిక పరిపుష్టి వుంటే ఓటర్లను ప్రలోభ పెట్టి గెలవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రచారానికి వెళ్లేంత దైర్యం కూడా నాయకుల్లో లేదు. కార్యకర్తలకు ఆ తీరిక లేదు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా నాయకులకు,కార్యకర్తలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. వారికి వచ్చిన పనులు లేవు. పదవులు లేవు. కాంట్రాక్టులు లేవు. ప్రభుత్వ పరిపాలనా తీరుపై చెప్ప్పుకుందామంటే నిజాలే లేవు. గొప్పలకు తావేలేదు. ఆరు గ్యారెంటీలలో అమలౌతున్న వాటి గురించి కూడా స్పష్టంగా చెప్ప్పుకోలేకపోతున్నారు. చెప్ప్పుకోవాలంటే కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. అర్హలైన వాళ్లందరికీ సిలిండర్ లో సబ్సిడీ అందడం లేదు. అందుతుందని చెబుతున్న వారు కూడా పెద్దగా లేరు. కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్ప్పుకోవడానికి తప్ప ఆ పధకం పూర్తి స్దాయిలో అమలు జరగడం లేదు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా సక్రమంగా అమలు జరుగుతున్నది లేదనే అంటున్నారు. ఇక మిగతా హమీలేవీ అమలు జరిగింది లేదు. ఆ ఆలోచన ప్రభుత్వంలో లేనే లేదు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇచ్చే పరిస్తితి కనిపించడం లేదు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. వి ద్యార్తులందరకీ రూ.5లక్షల కార్డు ఇస్తామన్నారు. ప్రభుత్వపై ఆదారపడకుండా విద్యార్దుల అకౌంట్లో వేసే సొమ్ముతో ఫీజులు చెల్లించుకోవచ్చన్నారు. కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం అన్నారు. ఇవేవీ సమీప భవిష్యత్తులో కూడా అమలు చేసే పరిస్దితి లేదు. దాంతో మున్పిసల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కాంగ్రెస్ నాయకులు జంకుతున్నారు. అదే సమయంలో బిఆరఎస్ పార్టీ మంచి దూకుడు మీద వుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు జోష్ మీద వున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మున్పిపల్ ఎన్నికల్లో బిఆరఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా సాగుతోంది. ఎందుకంటే మున్సిపాలిటీలలో గత బిఆరఎస్ హాయంలో జరిగిన అభివద్ది తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందేమీ లేదు. ప్రస్తుతం బిఆరఎస్ గతంలో చేసిన అభివద్ది గురించి చెప్ప్పుకుంటే చాలు. కొన్ని దశాబ్దాలుగా మంచినీటి కోసం తహతహలాడిన మున్సిపాలిటీలు మిషన్‌భగీరదతో నీటి కటకట అనేది లేకుండాపోయింది. రూపాయికే నల్లా క నెక్షన్ ఇచ్చారు. మున్పీపాలిటీలలో అంతర్గత రోడ్లు, సిసి రోడ్లు, పారిశుద్యం వంటి వాటిని ఎంతో గొప్పగా చేశారు. కాని ఇప్ప్పుడు ఎక్కడ చూసినా అస్తవ్యస్ధంగా వున్న రోడ్లు, కాలనీలు, అపరిషతంగా వున్న సమస్యలు, పారిశుధ్య విధానంలో లోపాలు బిఆరఎస్ పార్టీకి అనుకూలంగా మారే పరిస్తితి వుంటుంది. కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో వెళ్తే అడిగే ప్రశ్నలకు ఎలాగూ వారి వ ద్ద సమాధానం వుండదు. బిఆరఎస్ నాయకులకు ఏలాంటి విషయాల మీద సమాదానం చెప్ప్పుకోవాల్సిన అసవరం వుండదు. ఈ చిన్న గీతనే బిఆరఎస్‌కు పెద్ద మెజార్టీలు సాదించేందుకు కూడా ఆస్కారం వుంటుంది. మెజార్టీ మున్సిపాలిటీలు బిఆరఎస్ కైవసం చేసుకునేందుకు మార్గం పడుతుంది. కాంగ్రెస్‌కు బేజార్ మొదలైంది. హస్తం హతవిదీ అనుకోవాల్సిన పరిస్దితి ఎదురుకానున్నది అని సాక్ష్యాత్తు కాంగ్రెస్ నాయకులే అంటున్నారు.

గట్టికేసా..లోట్టపీసా?

”కేసీఆర”ను పిలవడం అంత “ఆశ మాసి కాదు”?

`సహజంగా కేసుల విషయంలో ప్రభుత్వ వాదన బలంగా వుంటుంది?

`ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రతి పక్షం గట్టిగా వుంది?

`ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం సహజమే అని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా

అన్నారు?

`తన ఫోన్లు గత ప్రభుత్వం ట్యాప్ చేసిందని పదే పదే చెప్పారు?

`అప్పట్లోనే ఎందుకు కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టలేదు?

`అధికారం లోకి వచ్చిన నాటి నుంచి సాగదీస్తున్నారు?

`ప్రభాకర్ రావు రాగానే అంతా అయిపోతుందన్నారు?

`ప్రభాకర్ రావు ను అనేక సార్లు విచారించారు?

`ఇప్పుడు బాండ్స్ ట్యాపింగ్ ఆధారంతో వసూలు చేసారంటున్నారు?

`తమను భయపెట్టి బాండ్స్ తీసుకున్నట్లు ఒక్కరైనా చెప్పారా?

`కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ నాయకులు ఇదే మాట అంటున్నారు?

`అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు అవే కంపెనీలు ఇచ్చాయి?

`అందులో దాపరికం లేదు, వుండదు?

`తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు బీజేపీ నాయకులు అనేక మంది చెప్పారు?

`వారిలో ఒక్కరైనా కంప్లైంట్ ఎందుకివ్వలేదు?

`ఫోన్ ట్యాప్ లో రెండో సిట్ వేశారు?

`హరీష్ రావును నిందుతునిగా విచారణకు పిలువలేదు?

`కేటీఆర్ ను,సంతోష్ రావు ను పిలిచారు?

`వారిని కూడా సాక్షలుగానే పిలిచారు?

`నెక్స్ట్ మాజీ సీఎం “కేసీఆర” ను పిలుస్తారని మీడియా లో వార్తలు వస్తున్నాయి?

`అవగాహన లేని వ్యక్తులు మీడియాలో తయారయ్యారు?

చట్టం మీద కనీస అవగాహన వారిలో శూన్యం?

మాజీ సీఎం “కేసీఆర” ను పిలవడం అంత ఆశమాషి కాదు?

`ఫోన్ ట్యాప్ విషయంలో “కెసిఆర” ను ఏరకంగా పిలుస్తారు?

`నిందితునిగా పిలిచే అవకాశం లేదు?

`సాక్షులుగా పిలిచే సందర్భం అసలే కాదు?

”కేసీఆర” ను పిలిస్తే అప్పటి డీజీపీని పిలవాల్సి ఉంటుంది?

అప్పటి హోం సెక్రటరీని పిలవాల్సిన అవసరం ఉంటుంది?

`ఇంటెలిజెన్స్ ఐజీని కూడా పిలిచి “కేసీఆర” ముందు కూర్చో బెట్టాలి?

`ఇప్పటి వరకు అప్పటి అధికారులు సిఎం చెబితేనే చేశామని ఎక్కడా చెప్పలేదు?

`మాజీ సీఎం “కేసీఆర” ను సాక్షిగా పిలిచి ఫోన్ ట్యాప్ మీద అనుమానం ఉందా అని

అడుగుతారా?

`కాళేశ్వరం వంటి అంశం మీద నోటీస్ అనేది సాహెతుకం?

`ఫోన్ ట్యాప్ లో మాజీ సీఎం “కేసీఆర” ను పిలవడం సాధ్యమా?

`”కేసీఆర” ను ముందు కూర్చో బెట్టుకొని ప్రశ్నలు అధికారులు అడగ గలరా?

`ఇప్పటి వరకు సాక్షులుగా వెళ్లిన వారితో ఇన్ని ఫోన్ నెంబర్లు ఎక్కడివి అని అడిగినట్లు

మీడియాలో వచ్చింది?

`సామాన్యుల ఫోన్ లోనే వేలాది నంబర్లు ఉంటున్నాయి?

`హరీష్,కేటీఆర్,సంతోష్ వద్ద వేలాది నెంబర్లు ఉండడం విచిత్రమా?

`నిజం కానీ అబద్దం లో సాగదీత తప్ప ఏమీ లేదు?

`ఇంకా తెలంగాణా ప్రజలను మాయ చేయడం సాధ్యం కాదు?

`ట్యాప్ విషయంలో కొండను తవ్వినా ఎలుక కూడా దొరకదు?

`ప్రతిపక్షం మీద పగ సాధిస్తా అనేలా ఉన్నా నెరవేరడం కనిపించడం లేదు?

నేటిధాత్రి:
రెండు సంవత్సరాలుగా జీడి పాకం సాగుతున్నట్లు నడుస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులు రకరకాల మలుపులు తిప్ప్పుతున్నారు. ఇంత కాలం సాగి, సాగి ఇప్ప్పుడు జోరుమీద వున్నట్లు మరో ప్రయత్నం గట్టినే చేస్తున్నారు. కాని అది గట్టి కేసా? లేక బిఆరఎస్ నాయకులు అంటున్నట్లు లొట్టపీసా? అనేది తేలడానికి కూడా ఇంకా సయమం తీసుకుంటారా? అనేది తేలాల్సి వుంది. ఇప్పటి వరకైతే బిఆరఎస్ నాయకులు చెబుతున్నదే నిజమౌతోంది? గత వారం రోజుల హడావుడిలో ముగ్గురు నాయకులను సిట్ పిలిచింది. అది కూడా సాక్ష్యులుగా మాత్రమే విచారించింది. ఇంత వరకు సరే..కాని ఇప్ప్పుడు తర్వాత పిలిచే ఏకంగా మాజీ సిఎం. కేసిర్? అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజంగా ఇలాంటి వార్తలు మీడియా సంస్దలు కూడా పనిగట్టుకొని చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇలాంటి కేసుల్లో పిలిచి విచారించడం అనేది అంత సులువైన పనికాదు. చట్టం తల్చుకుంటే ఏదైనా చేయొచ్చు? అనేది అన్ని విషయాలకు వర్తించదు. గత ప్రభుత్వాధినేతను ఇలాంటి కేసుల్లో పిలిచి విచారించాలంటే ఆశామాషీ కాదు? ఒక వేళ పిలిచారే అనుకుందాం? ఏ అంశాన్ని ప్రస్తావించి పిలుస్తారు? నిందుతుడిగా పిలిచే అవకాశం అసలే లేదు? సాక్షిగా పిలిచే సందర్భం అసలే ఉత్పన్నం కాదు? కేసిఆర్‌ను అందుకు బాధ్యుడిని చేయడం అంత సులువైన పని అసలే కాదు? ఇంకా ఎలా పిలుస్తారు? ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? కాకతాళీయంగా ఏ మీడియా ఇలాంటి వార్తలు రాయడానికి కూడా ముందుకు రాదు? ఎలాంటి సంకోచం లేకుండా రాస్తున్నారంటే అందులో ప్రభుత్వ ప్రోద్భలం లేకుండా వుండదు? ఎందుకంటే మీడియా పెద్దలకు చట్టం గురించి తెలియంది కాదు? చట్ట పరిధిని దాటి మీడియా వార్తలు రాసే అవకాశం లేదు? ఒక వేళ రాస్తే వారికి ఎలాంటి అవగాహన లేదన్న సుస్పష్టం. చట్టం మీద ఎలాంటి అవగాహన లేకుండా వార్తలు రాస్తే చిక్కుల్లో పడతామన్న కనీస జ్ఞానం లేని వాళ్లు మాత్రమే అలాంటి వార్తలు రాస్తారు. సిట్ అధికారులు తాము ఎ మీడియా సంస్ధకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని లిఖిత పూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు. అయినా లేని పోని వార్తలు ఎందుకు వస్తున్నాయి? అలా వార్తలు రాసే వారి మీద కూడా చర్చలు తీసుకునే అధికారం సిట్ అదికారులకు వుంది. అయినా ఎందుకు చూసి చూడనట్లు వుంటున్నారు? మీడియా ఊహాగానాలు రాస్తుంది? కాని కొన్ని విషయాల్లో ఊహాగానాలు అనేవి ఊరికే రావు? నిప్ప్పులేనిదే పొగ రాదన్న సామెత తెలియంది కాదు? అధికారులు లీకులు ఇవ్వకపోయినా పాలకపెద్దలు ఇచ్చే లీకులు కూడా వుంటుంటాయి? అదికూడా ఇలాంటి కేసుల్లో లీకులు సముచితం కాదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేద సామాన్యమైన విషయం కాదు. అలాంటి కేసుల్లో ఊహాగానాలకు తావుండదు. పక్కా సమాచారం వుంటే తప్ప కేసు నిలబడదు? సహజంగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వం చేస్తుందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అందుకు అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కేంద్రం అనుమతితో ఖచ్చితంగా వుంటుంది. కేంద్ర ఫ్రభుత్వానికి తెలియకుండా దేశ రక్షణ విషయంలో చీమ కూడా చిటుక్కుమనే అవకాశమే లేదు. పాలనలో ఫోన్ ట్యాపింగ్ అనేది సర్వసాదారణం అనేది కూడా అందరకీ తెలిసిందే. దాన్ని రాద్దాంతం చేస్తూ పోతే ఇలా జీడిపాకమే అవుతుందే తప్ప మరేం తేలదు. 1861 టెటీగ్రాఫ్ ఆక్ట్ ప్రకారం ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం. గతంలో కర్నాటక సిఎం.గా పనిచేసిన రామకష్ణ హెడ్డే పదవి పోగొట్టుకున్నారు. అప్పటి పరిస్ధితుల్లో పూర్తి సాక్ష్యాదారాలలో కేసులు నమోదు చేశారు. మరి తెలంగాణలో రెండేళ్లులో ఒక్క సాక్ష్యం లేదు. ఒక్క అధికారిక దవీకరణ లేదు. దానిపై ఎవరూ పిర్యాధు చేసింది లేదు? ఏ ఒక్కరు తమకు అన్యాయం జరిగిందని చెప్పింది లేదు? తమను బిఆరఎస్ పెద్దలు బెదిరించారన్నదానిపై కేసులు లేవు? కాని ఎన్నికల ముందు చేసిన రాజకీయ హడావుడిని వదిలేస్తే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ముందు వేసుకున్నది? ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్దితులు వస్తాయనుకున్నప్ప్పుడల్లా తెరమీదకు తెస్తున్నది అని అంటున్న బిఆరఎస్ వాదనలో నిజం కూడా కనిపిస్తోంది. నిజానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత పాలకపక్షంలో కీలకభూమిక పోషించిన కేటిఆర్, హరీష్‌రావు, సంతోష్‌రావులను నిందితులుగా పిలవలేదు. ఎందుÅ£ంటే వారి మీద కేసులు నమోదు కాలేదు. ఇక వారిని సాక్ష్యులుగా మాత్రమే పిలిచారు. వారి వంతు అయిపోయింది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ను పిలుస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక వేళ ఆ వార్తలే నిజమనుకుంటే కేసిఆర్‌ను పిలిచి విచారిచండం అంత సులువైన పని కాదు. అంత ఆశామాషీ వ్యవహరం కాదు. ఎందుకంటే గత పదేళ్లు ఆయనే పాలకుడు. నిత్యం ఇంటలిజెన్స్ అదికారులు అన్ని విషయాలు చెబుతారు. రాష్ట్రంలో ఏదైనా అశాంతి నెలకొనేలా వుందనుకున్నప్ప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందిన సమాచారాన్ని మాత్రమే కేసిఆర్‌కు వివరిస్తారు. ఇంతకు మించి కేసిఆర్‌కు కూడా అన్ని విషయాలు తెలిసే అవకాశమే వుండదు. ఒక వేళ వుందని అనుకున్నా.. ఆ సమయంలో పనిచేసిన డిజీపిలను కూడా కేసిఆర్‌ను విచారించే సమయంలో పిలవాల్సిన అవసరం వుంటుంది. ఫోన్ ట్యాపింగ్‌ను హాండిల్ చేసే ీVAం సెక్రెటరీలను కూడా కేసిఆర్‌ను విచారించే సమయంలో ఆయన ముందు హజరుపర్చాల్సివుంటుంది. ఇది సాధ్యమయ్యే పని కాదు? అయినా మాజీ సిఎం. కేసిఆర్‌కు నోటీసులు ఇస్తారంటూ వార్తలు రావడం విడ్డూరం. ఒక వేళ కేసిఆర్‌ను కూడా సాక్ష్యంగా పిలిస్తే ఏమని ప్రశ్నిస్తారు? మీ ఫోన్ ట్యాప్ అయ్యిందా? అని అడుగుతారా? ఏమని విచారిస్తారు? ఇప్ప్పుడున్న అదికారులు కేసిఆర్‌ను విచారించేంత ధైర్యం చేస్తారా? సాద్యమౌతుందా? ప్రభుత్వం చెప్పినట్లు చేసే సమయంలో కేసిఆర్‌కు నోటీసులిచ్చేంత సాహసం చేస్తారా? గతంలో ఎన్నికల ముందు పదే పదే తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందన్న అనుమానాలు వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే పోలీసులకు పిర్యాధు చేశారా? ఆఖరుకు హరీష్‌రావు మీద పిర్యాధు చేసిన వ్యక్తిలాగా కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎందుకు ధైర్యం చేయలేదు? పిర్యాధులు ఎందుకు చేయలేదు? తమ ఫోన్ ట్యాప్ అయ్యిందని పదే పదే చెప్పే బిజేపి నాయకులు కేంద్రంలో అదికారంలో వుండి ఆరోపణలు చేస్తే సరిపోతుందా? కేంద్ర ీVAం శాఖ సహాయ మంత్రిగా వున్న బండి సంజయ్ తన ీVAదాను మర్చిపోయి రాజకీయం చేస్తుండడం సమంజసమేనా? నిజంగా ఆయనకు అనుమానం వుంటే ఎందుకు ఇప్పటి వరకు పిర్యాదు చేయలేదు. కేంద్రం నుంచి ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదు? తన ఫోన్ ట్యాప్ అయ్యిందని పదే పదే చెబుతున్న కవిత ఎందుకు ఇ ంత వరకు పిర్యాధు చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రుల స్దాయిలో జరిగేది కాదు? అదికారులు మంత్రుల ఎంత సమర్దులైన వివరాలు చెప్పే ఆస్కారం వుండదు. అయినా చట్టం గురించి, చరిత్ర గురించి, పాలనా పరమైన విషయాల గురించి, పరిపాలనలో వుండే ఇబ్బందుల గురించి తెలిసిన కేసిఆర్ అలా ఫోన్ ట్యాపింగ్‌లు చేయిస్తారా? నిజంగానే ఆ ట్యాఫింగ్‌లు నిజమే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా? నాయకులు ఎన్నికల్లో గెలిచేవారా? బిఆరఎస్ పార్టీ ఓడిపోయేదా? ఇక తాజాగా బిఆరఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ తో పెద్దఎత్తున ఎలక్రోరల్ బాండ్లు సేకరించిందని కూడా కాంగ్రెస్ నాయకులు, బిజేపి నాయకులు అంటున్నారు. దేశంలో అత్యధిక ఎలక్రోరల్ బాండ్లు సేకరించిన పార్టీగా బిజేపి ముందు వరుసలో వుంది. ఈ పన్నెండేళ్ల కాలంలో సుమారు 13వేల కోట్ల రూపాయల ఎలక్రోరల్ బాండ్లు సేకరించినట్లు వివరాలున్నాయి? ఇదంతా బహరింగ రహస్యమే? ఇందులో ఫోన్ ట్యాపింగ్ ఏమి వుంటుంది? ఒక వేళ అదే నిజమైతే ఏ ఒక్క పారిశ్రామిక వేత్త అయినా బైటకు వచ్చి చెప్పారా? తమను బిఆరఎస్‌పార్టీ వేధించడం వల్లనే ఎలక్రోరల్ బాండ్లు ఇచ్చామని కేసులు పెట్టారా? దేశంలో అన్ని పార్టీలకు అందరు పారిశ్రామిక వేత్తలు ఎలక్రోరల్‌బాండ్లు ఇస్తారు. బిజేపికి , కాంగ్రెస్‌కు ఇచ్చిన వాళ్లే, బిఆరఎస్‌కు కూడా ఇచ్చారు. తలాతోక లేకుండా కొత్త కొత్త ఆరోపణలు తెరమీదకు తెచ్చి ఫోన్ ట్యాపింగ్‌ను రెండేళ్లుగా సాగి, మూడో ఏడుకు కూడా నడుస్తోంది. ప్రజా సమస్యలను చాలా పక్కాగా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని బిఆరఎస్ విమర్శిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అనే కేసుల లొట్టపీసు అని అందుకే అంటోంది!!

“జీఎం” అండగా ఉండగా..దిగులెందుకు దండగా?

”నేటిధాత్రి” వార్త ఢిల్లీలో సంచలనం?

ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బి!?

`మిల్లర్లకు కొత్త సలహా ఇచ్చిన “ఎఫ్ సిఐ.జీఎం?”

ఎఫ్ సిఐ.జీఎం ప్లాన్ ఏ “బంపర్ ఆఫర” బ్లాస్ట్?

`కేంద్ర మంత్రికి మెయిల్స్ మీద మెయిల్స్?

`ఆగిపోయిన బంపర్ ఆఫర్ ప్లాన్?

`”జీఎం” ఇచ్చిన కొత్త ఆలోచనకు ఎగిరి గంతేస్తున్న బాయిల్డ్ మిల్లర్లు?

`గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్ పట్టుకొని ఢిల్లీకి వెళ్ళండి?

కేంద్ర మంత్రితో మళ్ళీ మాట్లాడతా? అని “జీఎం” హామీ?

`యాసంగి వడ్లతో బకాయిలు పూడ్చుకున్నే పన్నాగం?

`15 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కేంద్రం తీసుకునేలా మరో దొడ్డి దారి ప్రయత్నం?

కేంద్రం ససేమిరా అంటున్నా ఒప్పిచేందుకు “ఎఫ్ సిఐ,జీఎం.” మరో రాయబారం?

`గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన ఉత్తరాన్ని అడ్డం పెట్టుకునే వ్యూహం?

`ఇప్పటికిప్పుడు బాయిల్డ్ రైస్ పెట్టమన్నా బియ్యపు గింజ మిలర్ల వద్ద లేదు?

ఒట్టి చేతులతోనే కేంద్రం, రాష్ట్రాన్ని నిండా ముంచే మిలర్ల దుర్మార్గం?

`యాసంగి పంట చేతికొస్తే గాని బియ్యం పెట్టలేరు?

`అయినా బియ్యం ఉన్నట్లు నాటకాలడుతున్నారు?

`బాయిల్డ్ మిల్లర్లు ఎప్పుడో బియ్యం అమ్ముకొని చేతులు దులుపుకున్నారు?

`ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుండడంతో కుడితిలో పడ్డ ఎలుకలవుతున్నారు?

`ఇప్పటికిప్పుడు బాయిల్డ్ రైస్ పెట్టమన్నా పెట్టలేరు?

`గత ఏడాది బియ్యం అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు? దాచుకున్నారు?

`ప్రభుత్వానికి ఎగనామం పెట్టేశారు?

`ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుందని బాయిల్డ్ మిల్లర్లు ఊహించలేదు?

`15 లక్షల టన్నుల బియ్యం లెక్కలు తేలడం తో తెలుకుట్టిన దొంగలయ్యారు?

`ఇప్పటికే “12 వేల కోట్ల రూపాయలు” ప్రభుత్వానికి బకాయిలు వున్నారు?

`యాసంగి వడ్లు తీసుకుంటే మరో “12 వేలకోట్లు” కొత్త బకాయిలు పేరుకుపోతాయి?

`గతంలో టెండర్ ప్యాడి బకాయిలు ఇంకా “4 వేల కోట్లు” పైచిలుకు పెండింగ్ లోనే వున్నాయి?

`ఇవన్నీ కలిపితే బాయిల్డ్ మిలర్ల బకాయిలు ఎంత లేదన్నా 20 వేల కోట్లు ఆవుతాయి?

ఈ బకాయిలు వసూలు చేస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్క దెబ్బతో అమలు చేయొచ్చు?

 

హైదరాబాద్, నేటిధాత్రి:                                                               

 శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలంటే ఇలానే వుంటాయేమో! ప్రభుత్వ సొమ్ము పక్కదారి మళ్లించి, అప్పనంగా బియ్యం అమ్ముకదొబ్బి, ఆస్దులు పెంచుకొని, కోట్లు కూడేసుకొని, ఇంకా ప్రభుత్వాన్ని ఎలా మోసం చేయాలా అని చూస్తున్నవారికి ప్రభుత్వ అదికారుల అండనా? వినడానికే విడ్డూరంగా వుంది. ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాద్యతలో వున్న అధికారులు లంచాలకు అలవాటు పడి, ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ మోసాలు చేస్తుంటే వ్యవస్ధ ఎక్కడ బాగుపడుతుంది. ఆరు గాలం రైతులంగా శ్రమించి, వడ్లు పండిస్తే, ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఆ వడ్లను బియ్యం చేసి ఇవ్వాల్సిన బాయిల్డ్ మిల్లర్లు అప్పనంగా బియ్యాన్ని అమ్ముకొని కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన బియ్యం దర్జాగా అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి మొండి చేయి చూపిస్తున్నారు. ప్రభుత్వం కొద్దిగా ఒత్తిడి చేస్తే, అక్రమ అదికారులతో కలిసి, ప్రభుత్వాన్ని మరింత మోసం చేయాలని చూస్తున్నారు. ఇదేనా వ్యవస్దల పనితీరు..ఇంతేనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారి కర్తవ్యం? అసలు ప్రభుత్వం ఇచ్చిన వడ్లను బియ్యం చేసి తిరిగి ప్రభుత్వానికి అందించాల్సిన మిల్లర్లు ఇష్టాను సారం అమ్ముకోవడమా? పైగా ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తుంటే అధికారులతో కలిసి మరింత మోసానికి తెగబడడమా? ఇదేనా మిల్లర్లు చేయాల్సిన పని? ప్రభుత్వాల మెతక వైఖరిని అలుసుగా చేసుకొని కొందరు మిల్లర్లు ఆటలాడుతున్నారు. ప్రభుత్వాన్ని నిండామోసం చేస్తున్నారు? ఇంతకీ ఏం జరిగిదంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాయిల్డ్ రైస్ మిల్లర్లంతా కలిసి సుమారు 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం బాకీ పడ్దారు. దాని విలువ వేల కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సిఐ శాఖ నుంచి అందాల్సిన రాయితీలు అనేకం పెండింగ్‌లో వున్నాయి. వాటిని విడుదల చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో తెలంగాణలో వున్న బాయిల్డ్ రైస్‌ను ఇస్తామని ప్రభుత్వం కేంద్రానికి విన్నవించుకున్నది. కేంద్రం బాయిల్డ్ రైస్ అవసరం లేదు! రా రైస్ వుంటే ఇవ్వండి. రా రైస్ మాత్రమే తీసుకుంటామని కూడా తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి కేంద్ర 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం బాయిల్డ్ మిల్లర్ల దగ్గర ఒక్క బియ్యం గింజ లేదు. అందులోనూ బాయిల్డ్ రైస్ కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ 15లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పూడ్చేందుకు కూడా కొంత సమయం కావాలి. అందుకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి రాకుండా చూసుకోవాలి. పైగా కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేలా ఒక దారి కావాలి. అందుకోసం తెలంగాణలోని మిల్లర్లంతా కలసి ఫుడ్‌కార్పోరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ జిఎంను కలిశారు? తమ పరిస్దితి విన్నవించారు? తనకు ఇరవై కోట్లు ఇస్తే పరిస్ధితి చక్కదిద్దుతానని చెప్పినట్లు కూడా సమాచారం. అందులో భాగంగా ముందు కోటి రూపాయలు అందజేయాలి. కేంద్ర మంత్రి నుంచి అనుమతి తెచ్చిన వెంటనే మిగతా సొమ్ము ఇచ్చేలా మిల్లర్లు, కాంట్రాక్టర్ల మధ్య డీల్ కుదిరింది? ఈ సంగతి నేటిధాత్రికి ఉప్పందింది. వెంటనే నేటిధాత్రి జరుగుతున్న విషయాన్ని వెల్లడించింది. ఎఫ్‌సిఐ జిఎం. బంపర్ ఆఫర్ అని వార్తను ప్రముఖంగా ప్రచురించింది. అది డీల్లీకి చేరింది. డీల్‌కు క్యాన్సలైంది. కేంద్రం సీరియస్ అయ్యింది. ఇక నేనేం చేయలేనని జిఎం. చేతులెత్తేశారు. కాని ప్లాన్ ఏ ఫెయిల్ అయినా ప్లాన్ బి చెబుతానని మిల్లర్ల చెవిలో వేశారు? గతంలో రాష్ట్ర ఫ్రభుత్వం కేంద్రానికి రాసిన ఉత్తరం తోనే పని పూర్తి చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. ఎందుకంటే గతంలోనే రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాశారు. తెలంగాణలో 15లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ వుందని, దానిని కొనుగోలు చేయాలన్నది ఆ లేఖ సారాంశం. కాని అప్ప్పుడు కేంద్రం ఒప్ప్పుకోలేదు. ఉప్ప్పుడు బియ్యం వద్దే వద్దని తెల్చి చెప్పేసింది. రా రైస్ వుంటే ఇవ్వండి తీసుకుంటామని చెప్పింది. ఎలాగైనా బాయిల్డ్ రైస్ మిల్లర్లను గట్టెంచాలని ప్రభుత్వం కూడా అనుకున్నది. కాని బాయిల్డ్ రైస్ మిల్లర్ల బాగోతం ప్రభుత్వానికి తెలియలేదు. ప్రభుత్వాన్ని బాయిల్డ్ రైస్ మిల్లర్లు మోసం చేస్తున్నారని గమనించలేదు. అయితే ఇప్ప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాసిన లెటర్‌ను పట్టుకొని , డిల్లీకి వెళ్లండి? నేను మళ్లీ కేంద్ర మంత్రితో మాట్లాడతానని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడే అసలు చిక్కంతా వుంది. కేంద్రం ఒక వేళ ఒప్ప్పుకున్నా బియ్యం ఇచ్చేందుకు మిల్లర్ల దగ్గర ఒక్క గింజ కూడా లేదు. యాసంగి పంట వస్తే, ప్రభుత్వం కేటాయిస్తే ఆ వడ్లను మరాడిస్తే తప్ప బాయిల్డ్ మిల్లర్లకు బియ్యం లేవు. యాసంగి పంట వచ్చే దాక రాష్ట్ర ప్రభుత్వాన్ని మభ్య పెట్టాలి. కేంద్రాన్ని ఒప్పించాలి? ఇదీ బాయిల్డ్ రైస్ మిల్లర్ల అసలు బాగోతం. చేతిలో బియ్యంపు గింజ లేకపోయినా, కేంద్రాన్ని ఒప్పించేట్లు కొత్త నాటకం మిల్లర్లు ఆడుతున్నారు. ఎఫ్‌సిఐకి బియ్యం మిల్లర్లు ఇస్తారన్న సంగతి జిఎం చూసుకుంటారు. దాంతో కేంద్రం నుంచి రాష్ట్ర ఫ్రభుత్వానికి రావాల్సిన బకాయిలు వస్తాయి. అప్ప్పుడు ప్రభుత్వం నుంచి బాయిల్డ్ రైస్ మిల్లర్ల మీద ఒత్తిడి వుండదు. బియ్యం లేవన్న సంగతి అసలే తెలియదు. ఇదీ అసలు స్కెచ్. ఇలా ప్రభుత్వాన్ని నిండా ముంచే ఎత్తుగడ అందరూ కలిసి వేశారు. ప్రభుత్వం కళ్లు గప్ప్పుతున్నారు. అయితే ఇక్కడ మరో అతిపెద్ద ట్విస్టు వుంది. బాయిల్డ్ రైస్ మిల్లర్లంతా కలిసి ప్రభుత్వానికి సుమారు రూ.12వేల కోట్ల రూపాయల బకాయిలు వున్నారు. అయితే ఇందులో కొంత మంది బకాయిలు చెల్లించిన వారున్నారు. కాని నాయకులుగా చెలామణి అయ్యే వారు..పెద్ద పెద్ద మిల్లర్లు పెద్దఎత్తున బకాయిలు పడ్డవారున్నారు. ఆ బకాయిలు గత ఏడాది ఖరీఫ్ నుంచి వున్నాయి. ఆ బకాయిలే రూ.12వేల కోట్లకు చేరుకున్నాయి. ఇప్ప్పుడు మళ్లీ యాసంగి వడ్లు ఇస్తే మరో రూ.12వేల కోట్లు బకాయిలు పడతారు. అంటే రెండేళ్లకు గాను మొత్తం రూ.24 వేల కోట్లు బకాయిలు పడుతున్నట్లు లెక్క. అందులో కొన్ని చెల్లింపులు ఒక వేళ చేసినా బకాయిలు సుమారు రూ.20వేల కోట్లైనా వుంటాయి. వీటికి తోడు ఈ మిల్లర్లు గతంలో ప్యాడీ టెండర్‌కు సుమారు రూ.4వేల కోట్లు ఇంకా ఇప్పటికీ బకాయిలు వున్నారు. వాటిని కూడా చెల్లించలేదు. మొత్తం బకాయిలన్నీ లెక్కేస్తే సుమారు రూ.25వేల కోట్ల వరకు బకాయిలు వుండే అవకాశం వుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. ప్రతి ఏడాది వడ్లు తీసుకుంటున్నారు. అమ్ముకుంటున్నారు. ప్రబుత్వం ఒత్తిడి చేసిన సందర్భాలలో అప్ప్పుడింత, అప్ప్పుడింత చెల్లిస్తున్నారు. పెద్దమెత్తం బకాయిలు మాత్రం అలాగే పెండింగ్ పెడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ బకాయిలను వసూలు చేస్తే ఏటా సంక్షేమ పథకాలను రూపాయి లోటు లేకుండా అమలు చేయొచ్చు. కొత్త పథకాలు కూడా ప్రకటించి, అప్ప్పులేకుండా పాలన సాగించొచ్చు. వేలాది కోట్లరూపాయలు మిల్లర్ల వద్ద పెండింగ్‌లో పడిపోతున్నాయి. అయినా మొసలి కన్నీరు కారుస్తూ, మిల్లర్లు సానుభూతి పొందే ప్రయత్నం మరింత చేస్తున్నారు. ఒక్కొ మిల్లర్ వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి మిల్లర్లను కట్టడి చేసి, వారి నుంచి బకాయిలు వసూలు చేయాల్సిన అధికారులు లంచాలకు అలవాటు పడ్డారు. మిల్లర్లు ఇచ్చే లంచాలను మింగుతున్నారు. ప్రభుత్వానికి శఠగోపం పెడుతున్నారు. ప్రజల సొమ్ము దిగమింగుతున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. ఇలాంటి మిల్లర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రతినిధులు కూడా అండగా నిలుస్తున్నారు. అటు మిల్లర్లు, ఇటు అదికారులు కలిసి ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలు కుంటే మిల్లర్ల నుంచి ముక్కు పిండి బకాయిలు వసూలు చేయొచ్చు. మిల్లర్ల బకాయిలు కొండలా పేరుకుపోకుండా కాపాడొచ్చు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవచ్చు. ఇదీ మ్యాటర్!!

బీజేపీ వైఖరి విచిత్రం..అధికారం లోకి రావాలన్న సోయి శూన్యం!?

`కాంగ్రెస్, బీజేపీ లు దేశంలో బద్ద శత్రువులు!

`దశబ్దాలుగా రాజకీయాలలో భిన్న ధ్రువాలు?

`తెలంగాణా లో మాత్రం బహిర్గత శత్రువులు.. అంతర్గత మిత్రులు?

`తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీ విచిత్రమైన అనుబంధం?

`రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ఒక్కరు స్పందించరు?

`నిత్యం బీఆరఎస్ ను నిందిస్తూనే వుంటారు?

`గత ప్రభుత్వ పాలనపై దుమ్మెత్తి పోస్తూనే వుంటారు?

`ఇంత వరకు ఆరు గ్యారెంటీల మీద అడిగిన బీజేపీ నాయకుడు లేడు?

`రెండేళ్ల కాంగ్రెస్ పాలన మీద మాట్లాడిన వాళ్ళు లేరు?

`తెలంగాణాలో వచ్చేది మేమే అంటారు… నాయకుల్లో సఖ్యత లేదు?

`సర్పంచ్ ఎన్నికలలో కొన్ని గెలిచిందే ఎక్కువ అనుకుంటున్నారు?

`రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశ్నించరు?

`కేంద్రం నుంచి నిధుల వరద తేలేరు?

`ఒకప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యేగా వున్న ప్రభాకర్ పాటి పని కూడా ఎంపిలు చేయడం లేదు?

`ఇప్పుడు ఎనమిది మంది ఎమ్మెల్యే లు, ఎనమిది మంది ఎంపీలున్నారు?

`ప్రభాకర్ లాగా నిధులు తెచ్చిన వారు ఒక్కరు లేరు?

`ఇదినా ఘనత అని చెప్పుకునేందుకు ఏమిలేదు?

`ప్రసిడెంట్ గా అర్హత మాత్రం మాదే అని అందరూ అంటారు?

`పార్టీ ని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకునే వారు లేరు?

`రాష్ట్ర ప్రభుత్వాన్ని పల్లెతు మాట అనలేరు?

`మున్సిపాలిటీ ఎన్నికల ముందు కూడా సమాలోచనలు లేవు?

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

  పేరు పెద్ద ఊరు దిబ్బ అంటే ఇదే! ఆ పార్టీలో అందరూ ఉద్దండులే. రాజకీయ అనుభవంలో అందరూ కింగ్‌లే. పార్టీ బరువు మోయాలని అందరూ చూస్తున్నవారే. కాని పార్టీ బలోపేతానికి అందరూ చేతులేత్తేసేవారే? ఈ మాట అంటున్నది ఎవరో కాదు? సాక్ష్యాత్తు పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణలో బిజేపి బలోపేతం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. పార్టీ వైపు నిలిచేందుకు ప్రజలు కూడా ఎంతో కొంత అనుకూలంగానే వున్నారు. అందుకే గత ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నడూ లేని విదంగా ఎనమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎనమిది మంది ఎంపిలను గెలిపించారు. దాంతో ఇక తెలంగాణలో బిజేపికి మంచి రోజులు వచ్చినట్లే అని అందరూ అనుకున్నారు. పార్టీ ఇక గాడిలో పడినట్లే అని సంతోషపడ్డారు. ఎనమిది మందిఎంపిలు గెలిచినందుకు పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాని ఏమైంది? ఏమౌతోంది? పార్టీ ఎటు పోతోంది? నాయకులు ఏం చేస్తున్నారు? గెలిచిన వారు ఏ రాజకీయాలు చేస్తున్నారు? ఉమ్మడి రాష్ట్రంలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నా రానన్ని సీట్లు ఇప్ప్పుడు బిజేపి వచ్చాయి. బిజేపిఅంటే ప్రజల్లో గతం కన్నా సానుకూలమైన వాతావరణం ఏర్పడినట్లే అనుకున్నారు. కార్యకర్తలు అనుకున్నదొక్కటి..జరుగుతున్నదొక్కటి!! కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్ర బిజేపి నాయకులు ఎందుకు కదలడం లేదు? పై నుంచి వున్న ఆదేశాలా? లేక రాష్ట్ర నాయకుల ఆలోచనలా? అన్నది కూడా తేలాల్సి వుంది. సొంత పార్టీ కార్యకర్తలే గందరగోళంలో వున్నారంటే ప్రజలు ఎలా నమ్ముతారు? ఎలా విశ్వసిస్తారు? ఎలా ఓట్లేసి గెలిపించుకుంటారు? ప్రజలకు బిజేపి పార్టీ కావాలనుకుంటే గెలిపించుకుంటారు? అని అనుకుంటున్నారా? రెండేళ్ల కాలంలో చేస్తున్న రాజకీయం ఏమిటి? బలోపేతం కోసం తీసుకున్న నిర్ణయాలేమిటి? అనేది ఎవరూ చెప్పలేరు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మీద ఈగ వాలకుండా రక్షణగా వుంటున్నారన్న రాజకీయ విమర్శలకు కూడా సమాధానం చెప్పేవారు లేరు. తెలంగాణలో బిజేపి బలహీన పడడడం వల్ల అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది. అదికారంలోకి వచ్చింది. ఎప్ప్పుడైతే బండి సంజయ్‌ని పక్కన పెట్టారో అప్ప్పుడే పార్టీ మీద ప్రజల్లో కూడా అసహనం ఏర్పడింది. కార్యకర్తలో నిస్తేజం ఆవహించింది. అయినా సరే ప్రజలు కోరుకున్న ప్రాంతాల్లోఎమ్మెల్యేలు గెలిచారు. ఎంపిలు కూడా గెలిచారు. ఇంకా ప్రజలు ఎలాంటి సంకేతాలివ్వాలని అనుకుంటున్నారు. సహజంగా ప్రతిపక్ష పార్టీ అనేది పాలకపక్షం మీద యుద్దం చేయాలి. కాని తెలంగాణలో రివర్స్ రాజకీయం సాగుతోంది. ఇంకా బిఆరఎస్ పార్టీయే అదికారంలో వున్నట్లు బిజేపి నాయకులు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. రైతులకు సక్రమంగా రైతు భరోసా ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు చెప్పిన వాగ్ధానాలు ఏవీ అమలు చేయడం లేదు. ఒక్క ఆర్టీసిలో మహిళలకు ఉచిత ప్రయాణం మాత్రమే పర్‌ఫెక్టుగా అమలు జరుగుతోంది. సిలిండర్ రూ.500 అమలు జరుగుతుందనంటున్నారు. అది ఎంత మందికి వస్తుందనేది ఎవరికీ అర్దం కావడం లేదు. ఇక రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా కొంత వరకు బాగానే అమలు జరుగుతోంది. ఇక మిగతా పథకాల అమలు గాలిలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో అందుతాయా? లేదా? అన్నది ఎవరికీ అర్దంకాకుండా వుంది. ఇందిరమ్మ ఇ ండ్లు కొంత సాగుతున్నాయి. ఇక మిగతా వాగ్దానాలు అమలుకు నోచుకోవడం లేదు. రైతు భరోసా రూ.15000 ఇస్తామన్నారు. ఆఖరుకు రూ.12000 ఇస్తామన్నారు. కాని రెండేళ్లలో కేవలం రెండు విడతలు మాత్రమే అందాయి. మిగతా రెండు విడతలు అందలేదు. మూడో ఏడాది తొలి విడతకు మోక్షం రావడం లేదు. వాటిని గురించి బిజేపి ఎందుకు ప్రస్తావించడం లేదో అర్ధం కావడంలేదు. అదే సందర్భంలో మోడీ కిసాన్ పధకం సక్రమంగా సకాలంలో అమలు జరుగుతోంది. ఇక్కడ ఎందుకు జరగడం లేదన్నది ఎందుకు ప్రశ్నించడం లేదు. వయసు మళ్లిన వారికి గత ప్రభుత్వం నుంచి అందుతున్న పిం చన్ల పెంపు ముచ్చటే లేదు. అదికారంలోకి వచ్చిన వెంటనే వద్దులకు అందుతున్న పించన్లు వెంటనే పెంచుతామన్నారు. నెల నెల రూ.4000 ఇస్తామన్నారు. దాని అమలు కూడా నోచుకోలేదు. కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతోపాటు, తులం బంగారం ఇస్తామన్నారు. తులం జాడ లేదు. ఇచ్చే పరిస్దితి కనిపించడంలేదు. తెలంగాణలో వున్న ప్రతి మహిళకు రూ.2500 నెల నెల ఇస్తామన్నారు. అది కూడా పరీశీలనలోనే లేదు. 18 సంవత్సరాలు నిండిన చదువుకునే ప్రతి అమ్మాయికి ఉచితంగా స్కూటీ ఇస్తామన్నారు. అదీ గతి లేదు. విద్యార్దులకు రూ.5 లక్షల కార్డు ఇస్తామన్నారు. అదీ ముందట పడింది లేదు. ఇన్ని వైపల్యాలు కంటి మందుకు కనిపిస్తున్నా బిజేపి నాయకులు చూడడం లేదు. ప్రభుత్వాన్ని అడగడం లేదు. నిలదీయడంలేదు. ఉద్యమాలు చేయడం లేదు. పోరాటాల ముచ్చట అసలే లేదు. కాని గత పాలన మీదనే ఇంకా ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని దగ్గరుండి బిజేపి నాయకులు రక్షిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. తాజాగా నైనీ బొగ్గు గనుల కేటాయింపులపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రచ్చ రచ్చ జరగుతోంది. బిజేపి నాయకులు కనిపించడం లేదు. వినిపించడం లేదు. అసలు ఆ సంగతే వారు పట్టించుకోవడం లేదు. కేంద్రం స్పందించాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్‌రావు కేంద్రానికి ఉత్తరం కూడా రాశారు. సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి ఉలుకు పలుకులేదు. బిజేపి నాయకుల స్పందనే లేదు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందన విచిత్రంగా వుందంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నైనీ బ్లాక్ విషయంలో ఉత్తరం రాస్తే తాము రంగంలోకి దిగుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి వింత సమాదానం వస్తుందని ఎవరూ ఊహించలేదు. సాక్ష్యాత్తు పిసిసి. ప్రెసిడెంటు సవాలు చేసినా కేంద్ర మంత్రి ఉలుకు లేదు..పలుకు లేదు? సరే రాజకీయాలపై కాకుండా అభివద్ది మీద ఏదైనా దష్టిపెడుతున్నారా? అంటే అదీ లేదు. 2014 ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఎన్‌విఎసఎస్ ప్రభాకర్ లాంటి నాయకులు బిజేపి లేరా? అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఆయన ఎమ్మెల్యేగా వున్న సమయంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చారు. రూ.1750 కోట్ల రూపాయల విలువైన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును సాదించారు. అందుకోసం ఆయన అనేక సార్లు డిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరిని పలుసార్లు కలిశారు. మొత్తానికి ఎలివేటెడ్ కారిడార్‌ను సాధించారు. దాని కోసం ఆయన పడిన శ్రమ అంతా ఇ ంతా కాదు. అదే రకంగా తన నియోజకవర్గ పరిధిలో వున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివద్ది కోసం ఎంతో ప్రయత్నం చేశారు. అలా చేసిన ప్రయత్నంలో ఏకంగా చర్లపల్లిని స్టేషన్‌ను టెర్మినల్‌గా చేసేలా కషి చేశారు. యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగించాలని అనేక విజ్ఞప్తులు చేశారు. మూడో లైన్ కావాలని కోరారు. ఇలా ఆయన పట్టుపట్టి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అలాంటి నాయకుడిని జనం ఓడించారు. పార్టీ కూడా ఆయన సేవలను పట్టించుకోవడం మానేసింది. ఇప్ప్పుడు ఎనమిది మంది ఎమ్మెల్యేలున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే తన నియోజకవర్గ అభివద్ది కోసం డిల్లీ గడప తొక్కిందిలేదు. కేంద్ర మంత్రులను కలిసింది లేరు. అర్జీలు ఇచ్చింది లేదు. ప్రాజెక్టులు సాదించింది లేదు. అలాగే ఎనమిది మంది ఎంపిలున్నారు. కాని వాళ్లు కూడా తాము ఫలాన ప్రాజెక్టును తెచ్చామని చెప్ప్పుకోవడానికి ఏదీ లేదు. తెలంగాణ అంటేనే నీటి సమస్య. ఒకప్పటి పరిస్దితి ఇప్ప్పుడు లేదు. కాని ఇంకా కొన్ని పెండింగ్ ప్రాజెక్టులున్నాయి. వాటి కోసం ప్రయత్నం చేస్తున్న వారు లేరు. వారికి ఆ సోయి కూడా లేదు. పార్టీలో లుకలుకలు తప్ప మరేం కనిపించడం లేదు. బిఆరఎస్ నుంచి ప్రభుత్వం మీదకు విమర్శలు వచ్చినప్ప్పుడు మాత్రం బిజేపి నాయకులు వెంటనే స్పందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఈగ వాలకుండా చేస్తుంటారు. దేశంలో కొన్ని దశాబ్ధాలుగా బద్దశత్రువైన కాంగ్రెస్‌తో తెలంగాణలో ఈ అంతర్గత రహస్య స్నేహమేమిటో ఎవరికీ అర్ధం కాదు!!

చెరపకురా చెడేవు అంటే ఇదే!

`తన గోతిని తాను తవ్వుకున్న కాంగ్రెస్?

`2జి స్కాం జరక్కపోయినా లేని పోని రాద్ధాంతం చేసిందే కాంగ్రెస్?

`మిత్ర పక్షాన్ని ఇరికించి రాజకియం చేయాలనుకున్నది?

`తన గోతిని తానే తీసుకున్నది?

`ఇప్పుడు దిక్కు దివానం లేకుండా పోయింది?

`చేయని తప్పుకు డి ఎం కే ను ఇరికించి తప్పించుకోవాలనుకున్నది?

`డిఎంకె ను రాజకీయంగా బలిపశువును చేసింది?

`కర్మ తిరగబడితే దేశమంతా కాంగ్రెస్ నామారూపాలు లేకుండా పోయింది?

`కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలకు చేసిన మోసాలు అన్ని ఇన్ని కావు?

`బీహార్ లో లాలును ముంచారు?

`గడ్డి స్కామ్ పేరుచెప్పి దూరం చేసుకున్నారు?

`శరద్ పవార్ లాంటి నాయకుడిని దూరం చేసుకున్నారు?

`మమత బెనర్జీ లాంటి నాయకురాలు శక్తి ని తక్కువగా అంచనా వేశారు.

`ఆఖరుకు బి ఆర్ ఎస్ విలీనం లో కూడా దిక్కుమాలిన రాజకీయం చూపారు?

`వైస్ జగన్ విషయంలో కక్ష సాధింపు చర్యలు చేశారు.

`నమ్మిన పార్టీలను నట్టేట ముంచింది?

`నమ్మిన నాయకులను బలహీన పర్చూతూ వచ్చారు?

`నమ్మక ద్రోహుల మాటలు వింటూ వచ్చారు.

`ఇప్పటికి అదే దారిలో నడుస్తున్నారు.

`కాలానికి అనుగుణంగా రాజకీయాలు చేయలేక పోతున్నారు.

`జనం నాడిని అంచనా వేయలేకపోతున్నారు.

`ప్రతిసారి బొక్క బోర్లా పడుతున్నారు.

`గెలవడం చేత కాక గిల గిల కొట్టుకుంటున్నారు.

`రాజ్యాంగ వ్యవస్థలను అవమాన పరుస్తున్నారు.

`అన్ని వ్యవస్థలకు, వర్గాలకు దూరమై పోతున్నారు.

`కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నా పగటి కలల్లోనే రాజకీయం చేస్తున్నారు.

`ఇప్పుడు రాజకీయ శిక్ష అనుభవిస్తున్నారు?

`లేని అవినీతి పేరుచెప్పి కేజ్రీ వాల్ వచ్చాడు?

`అదే అవినీతికి బాలయ్యాడు?

`అన్నా హాజరే అనే వ్యక్తి అడ్రస్ లేకుండా పోయాడు?

`బీజేపీ ని నమ్మి కాంగ్రెస్ ను నిండా ముంచాడు?

`అప్పుడు కనీసం అన్నా హాజరే అనే పేరు వినిపించేది?

`చెజేతులా తన పేరు ప్రతిష్టలను తానే చేరిపేసుకున్నారు?

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

 దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్దితికి కారణం ఎవరో కాదు! ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు, అధినేతలే కారణం. రాజకీయాలలో మూస దోరణులు అనుసరిస్తూ గత మూడు దశాబ్దాలుగా ముందుకు సాగడమే అసలు వైఫల్యం. ప్రపంచీకరణతోపాటు, ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు అనుగుణమైన రాజకీయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమౌతోంది. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే నానుడిని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోంది. ఈ విధానమే తప్ప్పుడు నిర్ణయాల వైపు అడుగులు వేసేలా చేస్తోంది. గతం వేరు. వర్తమానం వేరు. భవిష్యత్తును అంచనా వేసుకోలేని రాజకీయాలు వధా! అందుకే గతం తాలుకు వైఫల్యాలను ఇంకా వెంటేసుకొని కాంగ్రెస్ వర్తమానంలో కూడా అడుగులు వేస్తోంది. దాంతో కాంగ్రెస్ పార్టీ తిరోగమనం వైపు పరుగులు పెడుతోంది. ముందు వెళ్లాల్సిన పరుగు, వెనక్కి వెళ్తోంది. తరం మారుతున్నప్ప్పుడు యువతలో వచ్చే మార్పులకు అనుగుణంగా పార్టీలు మలుపులు తిరగాలి. అంతే కాని రాజకీయ పార్టీలు ఎంచుకున్న దారిలో ప్రజలు నడవాలని కోరుకోవడం సరైంది కాదు. జనం ఆలోచనలు పసిగట్టడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనుకబడిపోతోందన్నది ఇంకా అర్ధం చేసుకోవడంలేదు. అలా అని బిజేపి వైఫల్యాలను ఎండగట్టడంలో కూడా పూర్తిగా విఫలం చెందుతోంది. నిజం చెప్పాలంటే ఈ పన్నెండేళ్ల బిజేపి పాలనలో వ్యవస్ధలన్నీ కుంటుపడుతున్నాయి. అయినా జనం బిజేపిని ఆదరిస్తున్నారు. నాయకులు అనుసరిస్తున్నారు. కొత్త తరం బిజేపిని అక్కను చేర్చుకుంటున్నారు. అందుకు ప్రజల ఆలోచనలను బిజేపి అనుసరిస్తోంది. జనం ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా అడుగులేస్తోంది. బిజేపి వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకొని రాజపకీయం చేస్తుందని కాంగ్రెస్ చెప్పడంలో అర్ధం లేదు. దేశ ప్రజలు కాంగ్రెస్‌పార్టీకి సుదీర్ఘ కాలం పాటు అవకాశాలిచ్చారు. మరే పార్టీకి ఇవ్వనంత సమయం ఇచ్చారు. ఎమర్జెన్సీ లాంటి పరిస్దితులను సష్టించినా జనం కాంగ్రెస్ వైపే నిలిచారు. అయినా కాంగ్రెస్ పార్టీ జనాన్ని అర్దం చేసుకోవడం మానేసింది. మూస రాజకీయాలు చేయడం మాత్రమే నేర్చుకున్నది. ఎమర్జెన్సీ తర్వాత కూడా ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మడమే అందుకు ఆ పార్టీకి శాపంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఎమర్జెన్సీకి ముందు రాజకీయాలే ప్రజలు ఆదరిస్తున్నారన్న భ్రమల్లోనే కాంగ్రెస్‌పార్టీ రాజకీయాలు చేస్తూవచ్చింది. ఇప్ప్పుడు బొక్కా బోర్లాపడింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని వద్దని ఇప్పటికీ అనుకోవడం లేదు. బిజేపి ఎంత ముక్త్ కాంగ్రెస్ అని ప్రకటనలు చేసినా జనం ఎంతో కొంత కాంగ్రెస్‌కు అండగా నిలుస్తూనేవున్నారు. అయినా కాంగ్రెస్‌లో మార్పు రావడం లేదు. తర్వాత కాలంలో ఆ పార్టీ అనుసిరంచిన మూస విధానల మూలంగా నిండా మునిగిపోయింది. ఇప్ప్పుడు తేరుకోవడానికి తంటాలు పడుతోంది. అయినా ప్రజలు సానుభూతిని చూపించడం లేదు. ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజలు అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యక్తిగతంగా, వ్యవస్ధ పరంగా కూడా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. అయినా బిజేపిని వద్దనుకోవడం లేదు. దేశంలో పన్నులు పెరిగాయి. ధరలు పెరిగాయి. ఉపాధి తగ్గింది. ఖర్చులు విపరీతంగా పెరిగాయి. విద్య, వైద్యం కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండాపోతోంది. చదువుకొనాలన్నా, వైద్యం చేసుకోవాలన్నా ఆస్ధులు అమ్ముకునే పరిస్ధితులు దాపురిస్తున్నాయి. అయినా ప్రజలు బిజేపి వైపే నిలుస్తున్నారు. కారణం అవినీతి రహిత పాలన అనేది బిజేపికి రక్షణ కవచడంగా మారిపోయంది. కాంగ్రెస్ పాలనలో అవినీతి అంటే పాలకులు చేసే అవినీతి మాత్రమే కనిపించేది. రాజీవ్ గాంధీ విషయంలో బోఫోర్స్ దేశరాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ నాయకులు, పాలకులతోపాటు, ఆ పార్టీకి నమ్మకంగా మద్దతు తెలిపిన పార్టీలను సైతం కాంగ్రెస్ పార్టీ అవినీతి చట్రంలో ఇరికించుకుంటూ పోయింది. దాంతో దేశంలో వున్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను నమ్మడం మర్చిపోయాయి. కాంగ్రెస్‌తో స్నేహం చేయడం వల్లనే ఆయా పార్టీలకు పుట్టగతులు లేకుండాపోయాయి. ఒకప్ప్పుడు బిహార్ అంటే లాలూ అనేవారు. అలాంటి బిహార్‌ను ఏకచత్రాదిపత్యంగా ఏలుతున్న లాలూకు అవినీతి మరకలు అంటించారు. ఆయనను జైలు పాలు చేశారు. ప్రజల్లో లాలూ నాయకత్వాన్ని పలుచన చేశారు. తద్వారా కాంగ్రెస్ తనను తాను ఆత్మహత్య చేసుకున్నది. లాలూ లాంటి లౌకిక వాదిని గడ్డి కుంభకోణంలో ఇరికించి, ఆయన ప్రస్తానాన్ని అడ్డుకున్నది. నితీష్ వెలుగులోకి వచ్చారు. ఇప్పటికీ రెండు దశాబ్దాలుగా పాలన సాగిస్తున్నాడు. అయినా ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వున్నా, ఆయన నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. కారణం ఆయనను బిజేపి రక్షణ కవచంగా చూసుకుంటోంది. నితీష్ రాజకీయంగా బలమైన నాయకుడు. ఆయనను అనవసరంగా కెలికి రాజకీయంగా శుప్తావస్తకు #రుకోవడం కన్నా, కలిసి సాగడమే మేలని బిజేపి కదులుతోంది. ఇదీ బిజేపి అసలు రాజకీయం. దక్షిణాదిలో తమిళనాడు నుంచి కాంగ్రెస్‌కు ఆది నుంచి డిఎంకే మద్దతిస్తూ వుంది. కాని ఆ డిఎంకే నేతలు కనిమొలి, రాజాలను టుజి స్ప్రెక్ట్రమ్ స్కామ్‌లో తొంరపడి ఇరికించారు. తమిళనాడులో డిఎంకేను పరోక్షంగా దెబ్బకొట్టారు. దాంతో తన గోతిని తానే కాంగ్రెస్ తవ్వుకున్నది. ఇలా కాంగ్రెస్‌కు అండగా వున్న నాయకులను, పార్టీలను బలపశువులను చేస్తూ పోయింది. మహారాష్ట్రలో బలంగా వున్న పూర్వపు కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ రాజకీయాన్ని తుంచేదసింది. మహారాష్ట్రలో స్వయంకతాపరాధంతో కాంగ్రెస్‌కు నీడ లేకుండా చేసుకున్నది. ఇలా శరద్‌యాదవ్ లాంటి నాయకుడిని కూడా దూరం చేసుకున్నది. పశ్చిమబెంగాల్ సిఎం. మమతా బెనర్సీని కట్టడి చేసి, ఆమెకు రాజకీయం లేకుండా చేయాలనుకున్నారు. ఆమె ఏకంగా ఇప్పటికీ మూడు సార్లు ముఖ్యమంత్రి అయి, బెంగాల్‌ను పాలిస్తోంది. పార్టీని నమ్ముకొని వున్న నాయకులకు, పార్టీలకు పొగబెట్టి, పనికిరాని నాయకుల మాటలు విని సోనియాగాందీ పార్టీని నిండా ముంచేసిందని చెప్పడంలో సందేహమే లేదు. చెరపకురా చెడేవు అనే సామెతను నిజం చేసుకున్న వారిలో డిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా చేరిపోయారు. అవినీతి మచ్చలేని అదికారిగా ఆయనకు 2013 వరకు పేరుంది. ఆ పేరును అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారు. జనం మెచ్చారు. ఆదరించారు. డిల్లీ ముఖ్యమంత్రిని చేశారు. ఆఖరుకు ఆయన కూడా అవినీతి పరుడనే ముద్రను తగిలించుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. వరుసగా మూడుసార్లు విజయం సాదిండచంతో ఆయన ఇక తాను ఆడింది ఆట పాడింది పాట అవుతుందని అనుకున్నారు. పార్టీని విస్తరించి, దేశ రాజకీయాలను ఏలాలనుకున్నారు. రాజకీయంగా పార్టీ విస్తరించడం అనేది గొప్ప విషయమే. ఆ విస్తరణ ప్రజా విస్తరణలా వుండాలే కాని, సామ్రాజ్య విస్తరణలా వుండకూడదని తెలుసుకోలేకపోయారు. దాదాపు దక్షిణాదికి చేరువయ్యే క్రమంలో తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారు. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చారు. గుజరాత్‌లో కూడా సీట్లు గెల్చుకున్నారు. ఉత్తరాదిలో ఊపేయాలనుకున్నారు. తన చీపురుతో అవినీతిని పార్టీలను ఊడ్చేస్తామని చెప్పారు. లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకున్నారు. ఒక్కసారి అవినీతి మరకలు అంటుకున్న తర్వాత వాటిని కడుక్కోవడం చాలా క ష్టం. కాలం మారుతున్నా ఆ మరక చెరిపేసుకోవడం ఈ రోజుల్లో సాద్యం కాదు. పదేళ్ల క్రితం చేసిన తప్ప్పులు కూడా సోషల్ మీడియాలో నిక్షిప్తమై వుంటాయి. ఎప్పటికప్ప్పుడు వెలుగులోకి వస్తుంటాయి. అందుకే బిజేపి అనేది అవినీతి మరÅ£లు అంటించుకోకుండా సాగుతోంది. ప్రతిపక్షాలన్నీ బిజేపిని నిందించాలంటే అదాని, ఆదాని అంటారే గాని, ఏ ఒక్క మంత్రికి అవినీతి మరకలు అంటించలేకపోతున్నారు. ఇదీ బిజేపి సాగిస్తున్న ఆసక్తికరమైన రాజకీయం. అవినీతిపై యద్దం మొదలుపెట్టి దీక్షలు, నిరసనలు చేసి దేశమంతా ఒక్కటి చేసిన, అన్నా హజారే లాంటి వారు అడ్రస్ లేకుండాపోయారు. కాంగ్రెస్ లేకుండా చేస్తే అవినీతి అంతమౌతుందనుకున్నాడు. కాని బిజేపి గెలిస్తే కనీసం ప్రశ్న కూడా వినపడని రాజకీయాలు వస్తాయని ఊహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ప్రశ్నించేందుకు అవకాశం వుండేది. ఇప్ప్పుడు ఆ ప్రశ్నకు కూడా అవకాశం లేకుండాపోయింది. ఇలా కొంత మంది నాయకులు, పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ చేసుకున్న స్వయంకతాపరాథమే మొదటికే మోసం తెచ్చింది. తేరుకోకుండా చేసుకున్నది.

అమరావతి సరే…ఆహారభద్రత మాటేంటి?

· రాజధాని కొలిక్కిరావడానికి పుష్కరకాలమా?

· ఛత్తిస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్‌ల అభివద్ధిని గమనించారా?

· ఏర్పడిన రెండు దశాబ్దాల్లో అద్భుతమైన ప్రగతి

· రాజధానిపై నిర్ణయానికి పన్నెండేళ్లు కావాలా?

· రాజకీయ విభేదాలతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేయడం అన్యాయం

· అమరావతి నిర్ణయంలో ఔచిత్యమెంత?

· అమరావతి భూములతో 2.5కోట్ల మందికి ఆహారభద్రత

· 50వేల ఎకరాలపై రైతులకు రూ.165 కోట్ల నుంచి రూ.250కోట్ల నికర లాభం

· ఈ స్థాయి దిగుబడినిచ్చే భూములను ప్రభుత్వం అభివద్ధి చేయగలదా?

· రియల్ ఎస్టేట్ ఏ భూముల్లోనైనా చేయవచ్చు

· అన్నపూర్ణ వంటి ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చడం అన్యాయం

· రోటీ, కపడా ఔర్ మకాన్ తర్వాతనే ఏదైనా

· వెనుకబడిన రాష్ట్రాల అభివద్ధి తీరు ఆదర్శం కావాలి

· ఆకాశానికి నిచ్చెనలు వద్దు

· ప్రభుత్వం వాస్తవాన్ని విశ్లేషించుకోవాలి

· రాజకీయం కాదు, రాష్ట్రహితం ముఖ్యం

 

హైదరాబాద్, నేటిధాత్రి: 

పార్లమెంట్ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించడం తాజా పరిణామం. రాష్ట్రానికి కేంద్ర స్థానంలో వుండి అన్ని ప్రాంతాలకు అందుబాటు లో వుండే అమరావతి చట్టబద్ధ రాజధానిగా రూపొందటం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి ఆనందం కలిగించవచ్చు. రాజకీయ చైతన్యం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని సమస్య అధికారపార్టీకి అనుగుణంగా మారిపోతుండటం ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పుష్కరాలం గడిచినా ఇప్పటివరకు రాజధాని సమస్య ఒక కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కార ణం. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీల మధ్య రాజధానిపై ఏకాబిప్రాయం లేదు. తెలుగుదేశం అమరావతి కేంద్రీకత రాజధాని కావాలని కోరుతుండగా, వైఎస్సార్సీపీ మాత్రం వికేంద్రీకత అభివద్ధి రాష్ట్రానికి అవసరమంటూ, విశాఖ (కార్యనిర్వాహక), అమరావతి (శాసన), కర్నూలు (న్యాయ) నగరాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. నిజం చెప్పాలంటే మొదటినుంచి మధ్య ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య రాజ ధాని విషయంలో ఏకాభిప్రాయం లేదన్న మాట వాస్తవం. అనేక తర్జనభర్జనల తర్వాత వాదోపపవాదాలు, మీడియా విశ్లేషణలు, కమిటీల నివేదికల నేపథ్యంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి ప్రాధాన్యతనిచ్చారు. ఈ మూడు ప్రాంతాల్లో ప్రతి దానికి సానుకూలత, ప్రతికూలతలు తప్పనిసరిగా వుంటాయి. దురదష్టవశాత్తు తెలుగుదేశం, వైసీపీలు ఒకరు చెప్పినదా న్ని మరొకరు ఆమోదించకపోవడం, ప్రభుత్వాలు మారడంతో రాజ ధాని విషయం ఎటూ తేల కుండానే పుష్కరకాలం దాటిపోయింది. ఇందుకు ప్రజల కంటే కూడా రాజకీయ పార్టీల వైఖరులనే నిందించాలి. రాజకీయ విభేదాలున్నా, రాష్ట్ర విశాలహితం కోసం అవి కలిసి పనిచేయడం వాటి విద్యుక్త ధర్మం. దురదష్టవశాత్తు దీన్ని ఈ రెండు పార్టీలు విస్మరించాయి. దీనివల్ల మౌలిక సదుపాయాల పరంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.

ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని తీసుకుంటే 2000, నవంబర్ 1న ఏర్పాటైంది. తక్షణమే తా త్కాలిక రాజధానిగా రాయ్‌పూర్ పనిచేయడం ప్రారంభమైంది. తర్వాత 10`15 సంవత్సరాల కాలంలో నయా రాయ్‌పూర్ (అటల్‌నగర్) ప్రణాళికాబద్ధ నగరంగా రూపొంది మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటయ్యాయి. పరిపాలన, ప్రజాసౌకర్యాలు ఏర్పాటు కావడమే కాదు, 2020 నాటికి ఈ సదుపాయాలు మరింత విస్తరించాయి కూడా! అదేవిధంగా 2000, నవంబర్ 15న ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. తక్షణమే రాజధానిలో రాజధాని కార్యక్రమాలు మొదలయ్యాయి.అసెంబ్లీభనవాలు, హైకోర్టు, సమగ్ర పట్టణీకరణ వంటివి 15`20 ఏళ్లలో పూర్తయ్యాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా 2000, నవంబర్ 9న ఏర్పాటైంది. తర్వాత మూడు నుంచి పదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పూర్తయింది. 2020 నాటికి రాష్ట్రం సుస్థిరమైన వద్ధిని నమోదు చేసింది. ఉత్తరాఖండ్ పర్వతాలతో నిండిన ప్రాంతం కావడంతో 2003లో కేంద్రం అందించిన సహకారంతో హరిద్వార్, సంత్‌నగర్, సెలాకి, సితార్‌గంజ్‌లను ప్రధాన పారిశ్రామిక పట్టణాలు గా అభివద్ధి చేసింది. 2000`19 మధ్య కాలంలో పారిశ్రామిక కార్మికుల సంఖ్య 12 రెట్లు భా రీగా పెరిగింది. ఆవిధంగా కొత్తగా ఏర్పడిన మూడు రాష్ట్రాలను పరిశీలిస్తే రెండు దశాబ్దాల కాలంలో అద్భుతమైన ప్రగతిని సాధించడం మన కళ్లముందు కనిపిస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్‌కు ఏమైంది? 12 సంవత్సరాలు పూర్తికావస్తున్నా ఇంకా రాజధాని నిర్ణయం రాజకీయాల మధ్య కొరుకుడు పడని సమస్యగా మిగిలిపోవడం ప్రజల దౌర్భాగ్యం.

చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానంలో పెద్ద లోపమేంటంటే ఒకేసారి లక్షకోట్లు పెట్టుబడి పెట్టి రాజధానిని ఏకంగా సింగపూర్ తరహాలో అభివద్ధి చేయాలన్న ఆచరణ సాధ్యంకాని సంకల్పాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. ఒకేసారి లక్షకోట్లు సమీకరణ సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికే రాష్ట్రం అప్పులు రూ.పదిలక్షల కోట్లు దాటిపోయింది. దీనికి తోడు అధికారం కోసం ఉచితాలను ఎడాపెడా ప్రకటించడంతో వాటికి నిధులు లేక, అమలు సాధ్యం కాక చేతులెత్తేసే పరి స్థితి! ఈ వైఫల్యాలను విపక్ష వైసీపీ క్యాష్ చేసుకొని ప్రజల్లోకి ప్రచారానికి వెళుతోంది. ఇది సహజం. మరి వచ్చేసారి తమ ప్రభుత్వమే వస్తుందన్న గ్యారంటీ లేదు. ఈ గ్యారంటీ వైస్ జగన్‌కూ వుండదు. అందువల్ల వీరిద్దరిమధ్య అధికార మార్పిడి జరుగుతున్న నేపథ్యంలో, ఈ రెండు పార్టీలు అహంకారానికి పోకుండా రాష్ట్ర హితం కోసం రాజధానిపై ఒకే తాటిపై నిలబడాలి. ఇప్పుడు వైసీపీ కూడా మూడు రాజధానుల ప్రతిపాదనను ఎట్టకేలకు విరమించుకున్నది కనుక, ఇరు పార్టీలు ఉమ్మడిగా అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన అభివద్ధిపై దష్టి పెట్టాలి. మీరు ఓకే అన్నప్పుడు మాత్రమే కేంద్రం నుంచి సహాయం అందుతుంది. ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివద్ధి చెందిన రాష్ట్రం. ఆ మూడు రాష్ట్రాలు ఏర్పాటైన రెండు దశాబ్దాల కాలంలో సాధించిన పురోగతిని దష్టిలో పెట్టుకోవాలి. పూర్తి పర్వత ప్రాంతమైన ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం రూ.22లక్షల కోట్లతో రోడ్లు, వంతెనల వంటి మౌలిక సదుపాయా లు అభివద్ధి చెందుతున్నాయి. నిజానికి నయారాయ్‌పూర్ విస్తీర్ణం 8వేల నుంచి 20వేల ఎకరా లు. ఝా ర్ఖండ్ రాజధాని రాంచీని స్మార్ట్ సిటీపేరుతో 65`657 ఎకరాలో అభివద్ధి చేస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్ శీతాకాల రాజధాని డెహ్రాడూన్ కాగా వేసవి రాజధాని గైర్‌సైన్. డెహ్రాడూన్ విస్తీర్ణం 74,131 ఎకరాలు. అదే గైర్‌సన్ తహసీల్ ప్రాంత విస్తీర్ణం 501 చదరపు కిలోమీటర్లు. ఆవిధంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు వాటికి అందుబాటులో వున్న భూభాగాల్లో, అనువైన విస్తీర్ణంలో కొత్త రాజధానులను ని ర్మించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఎంచుకున్న ప్రాంతం భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు మధ్యలో వున్నప్పటికీ ఆర్థిక, పర్యావరణ పరంగా ఇక్కడ కొన్ని కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవచ్చు. అదీకాకుండా మిగిలిన మూడు కొత్త రా ష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తున్న భూమి అత్యంత సారవంతమైంది. రాష్ట్రాన్నిఅన్నపూర్ణగా మలుస్తున్న సుక్షేత్రమైన కష్ణా పరీవాహక ప్రాంతం. ప్రభుత్వం మొత్తం 50వేల ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 2015లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 34385 ఎకరాలను తెలుగుదేశం ప్రభుత్వం సేకరించింది. ఇప్పుడు మరో 16వేల నుంచి 20వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 

ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో సగటున ఎకరాకు 2వేల నుంచి 2800 కిలోల వరకు దిగుబడి వుంటుంది. అంటే ఒక ఎకరాకు సగటున 2.5టన్నుల వరి దిగుబడి వస్తుందని భావిస్తే 50వేల ఎకరాల్లో మొత్తం దిగుబడి 125వేల టన్నులు (1.25లక్షల మెట్రిక్ టన్నుల) అవుతుంది. ఈ 125 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంతో 2.49కోట్ల మంది ప్రజలకు నెలరోజుల పాటు ఆహారం లభిస్తుంది. అమరావతిలో ఖరీఫ్, రబీ పంటలు పండిస్తారు కనుక వార్షికంగా ఈ దిగుబడి చాలా అధికం. ఇప్పుడు ప్రభుత్వం సేకరించే 50వేల ఎకరాల్లో 42వేల ఎకరాలు సాగుభూమి. వీటిల్లో 36వేల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం వుంది. అంతేకాకుండా ఇవి వర్షాకాలంలో వరదలకు గురవుతుంటాయి. అమరావతి చుట్టు పక్కల గ్రామాల్లో పత్తి, పప్పుధాన్యాలు, మొక్క్పు£న్న, చెరకు, అరటి, మామిడి వంటి పంటలను కూడా సాగుచేస్తారు. ఈ ప్రాంతంలో రైతులు బంతి వంటి పువ్వులతో పాటు వందరకాల పంటలు పండిస్తారు. ఇవి రైతులకు ఎంతో రాబడినిస్తాయి. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తే రైతుకు ఎకరానికి రూ.33వేల నుంచి రూ.51,200 వరకు లాభం వుంటుంది. అంటే 50వేల ఎకరాలకు కలిపి రూ.165 కోట్ల నుంచి రూ.250కోట్ల నికర లాభాన్ని రైతులు పొందుతున్నారు. ఇక మిర్చి, మిగిలిన ఉద్యానవన పంటల ద్వారా రైతులకు గణనీయమైన ఆదాయం లభిస్తుంది.

పై గణాంకాలను పరిశీలిస్తే రాజధాని నగరానికి ఇంతటి సుక్షేత్రమైన సాగుభూమిని సేకరించ డం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. రాజధాని నిర్మాణమంటే భవనాలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు వస్తాయి. వీటిని మరే ఇతర సాగుపరంగా తక్కువ ప్రా ధాన్యత కలిగిన భూముల్లో కల్పించవచ్చు. ఏ భూమి సేకరించినా అక్కడ మౌలిక సదుపాయాలుకల్పించాల్సిందే. ఈ ఖర్చులో ఎక్కడా తేడారాదు. కానీ కోట్లమంది ప్రజలకు ఆహారాన్ని అందిం చే ప్రాంతాన్ని కాంగ్రీట్ జంగిల్‌గా మార్చడం ఎంతవరకు సబబు? రాబోయే కాలంలో పెరిగే జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం వుంది. రాష్ట్రంలో సాగునీటి వసతిలేని భూములు 36% వరకు వుండగా 63.9% భూములకు నీటి సదుపాయం వుంది.స్థూల నీటిపారుదల విస్తీర్ణం 6.28 మిలియన్ హెక్టార్లు కాగా, వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే ప్రాంతం అధికం. ఇక రాయలసీమ ప్రాంతంలో కేవలం 8.87% భూములు మాత్రమే న మ్మదగ్గ నీటిపారుదల సౌకర్యాన్ని కలిగివున్నాయి. 41% నుంచి 49% వరకు భూగర్భ జలాలపైఆధారపడి వ్యవసాయం కొనసాగుతోంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఎల్లప్పుడూ నీటివసతి పుష్కలంగా వుండి, అన్నపూర్ణగా వున్న ఈ ప్రాంతాన్ని రాజధాని పేరుతో కాంక్రీట్ జంగిల్‌గా మా ర్చడంలో ప్రభుత్వ ఉద్దేశమేంటనేది అర్థం కాదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కొన్ని కోట్లమందికి ఆ హారభద్రత సమస్య ఏర్పడుతుంది. ప్రజాహితం కోరే ఏ ప్రభుత్వమైనా, ఇటువంటి కార్యక్రమాలను తక్కువ నీటి వనరున్న ప్రాంతాల్లో చేపట్టడం సహజం. దీనివల్ల ఆ ప్రాంతాలకు కొన్ని సదు పాయాలు అందుబాటులోకి రావడమే కాదు, ప్రభుత్వ చర్యలవల్ల అక్కడ నీటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశ ముంటుంది. అటువంటి వెనుకబడిన ప్రాంతాలు అభివద్ధి చెందుతాయి కూడా. కేవలం రాజకీయ ప్రయోజనం, రియల్ ఎస్టేట్ సంపాదన కోసం లేదా కొందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ లాభాల మాట అట్లావుంచి భవిష్యత్తులో ఆహారభద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశాలే ఎక్కువ. పోనీ ఇక్కడ సేకరించిన భూమి విస్తీర్ణంలో మరే ఇతర ప్రాంతంలోనైనా ఇంతటి సారవంతమైన భూములను ప్రభుత్వం అభివద్ధి చేయగýదా? ఎట్టిపరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే నదులు, సెýయేర్లు ఇతర నీటి వనరులు ప్రకతి ప్రసాదితాలు. కొత్తగా ఏర్పడిన ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలను పరిశీలి స్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిని నిర్ణయించడంలోనే పుష్కరకాలం జాప్యం చేసి ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు తప్పుడు నిర్ణయంతో సారవంతమైన భూములను నిరుపయోగం చే యడమే కాదు, ఆహార ఉత్పత్తికి విఘాతం కలిగిస్తోంది.

ప్రజలు ప్రాణం..కేసీఆర్ దైవం!

కృష్ణార్జునులు కేటీఆర్, హరీష్ ల స్నేహానికి నిదర్శనం.

ఖమ్మం గుమ్మానికి రవి,చంద్రుడు వద్దిరాజు.

`ఖమ్మం గులాబీ పార్టీకి వద్దిరాజు అరుదైన సైనికుడు.

vaddiraju ravichandra

`కార్యకర్తలను కాపాడుకునే గొప్ప మనసున్న నాయకుడు.

`ఖమ్మం గులాబీ మయం చేయాలని అహర్నిశలు కష్టపడుతున్నాడు.

`పార్టీ అధికారంలో లేకున్నా ప్రజల కోసం నేనున్నాననే దైర్యం ఇస్తున్నాడు.

`ఖమ్మం లో వరదలోచ్చినప్పుడు ప్రజలను ఆదుకున్న మనసున్న మారాజు.

`వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడి ప్రాణాలు నిలబెట్టిన దేవుడు.

`అకాల వర్షాలకు సర్వం కోల్పోయిన వారికి నెలల పాటు సర్వం సమాకూర్చిన నాయకుడు.

`వరద సమయంలో రాత్రికి రాత్రి సహాయక కేంద్రాలు ఏర్పాట్లు చేశారు.

`కరోనా కాలం నుంచి మొన్నటి వరదల దాకా ప్రజలను ఆదుకున్న ఒకేఒక్కడు వద్దిరాజు.

`పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు.

`ఖమ్మం జిల్లాను గులాబీ కంచు కోట చేయాలని అహర్నిశలు కృషి చేస్తున్నాడు.

`ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆరఎస్ కు బలం చేకూర్చుతున్నాడు.

ప్రజలంటే వద్దిరాజుకు ప్రాణం.. వారి యోగ క్షేమలే లక్ష్యం.

బీఆరఎస్ ను అధికారంలోకి తేవడమే తన ముందున్న గమ్యం.

`నిస్వార్థ సేవకు నిదర్శనం వద్దిరాజు రవిచంద్ర.

అభిమానులకు ఆపద్బాంధవుడు వద్దిరాజు.

`ఆపన్నులకు ఆకలి తీర్చే నిండైన మానవతా మూర్తి వద్దిరాజు.

వచ్చే ఎన్నికలలో వద్దిరాజు ఎమ్మెల్యే కావాలన్నది అభిమానుల కోరిక.

కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా జిల్లాను నెంబర్ వన్ చేయాలన్నది అందరి కోరిక.

వద్దిరాజుకు అభిమానుల పుట్టినరోజు శుభాకాంక్షలు.పార్టీ నాయకుల అభినందనలు.బీఆరఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులు

 

 

హైదరాబాద్, నేటిధాత్రి: :  

సమాజంలో అందరూ నాయకులు కాలేరు. నాయకులైనందరూ ప్రజా సేవకులు కారు. ప్రజల్లో నుంచి వచ్చి, ప్రజలను ప్రేమించి, ప్రజలకోసం పనిచేసి,  ప్రజా సేవే పరమావదిగా  సేవలందించేవారు నాయకులైతే ఆ ప్రజలకు ఏంతో మేలు. వారి జీవితాలకు వెలుగు. అలా ప్రజలంటే ప్రాణమిచ్చే నాయకుల్లో వద్దిరాజు రవిచంద్ర ఒకరు. ఆయన ప్రజల కోసం చేసే సేవ అంతా ఇంతా కాదు. తన జీవిత పర్యంతం ప్రజలకు సేవ చేస్తూనే వున్నారు. అడిగిన వారికి లేదనకుండా సాయపడుతూనే వున్నారు. చిన్న అవసరాల నుంచి మొదలు, పెద్ద అవసరాలను కూడా ప్రజలకు తీర్చుతూ, వైద్య సేవల విషయంలో ఎంతో చేస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారు. ఎంతో మంది జీవితాలు  నిలబెట్టారు. వారి జీవితాలను కాపాడారు. అంత గొప్ప నాయకుడు  వద్దిరాజు రవిచంద్ర. వ్యాపారంలో వచ్చే లాభాలను సహజంగా ఎవరైనా ఆస్ధులు కూడబెట్టుకుంటారు. కాని వద్దిరాజు రవిచంద్ర తన ఆదాయాన్ని ప్రజలకు పంచుతూ వుంటారు. ప్రజల కోసం ఖర్చు చేస్తుంటారు. ప్రజాభిమానం కూడబెట్టుకుంటారు. ఇదీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గొప్పదనం. గొప్ప గుణం. అందుకే ఆయనను ఆదర్శవాది తోపాటు అజాతశత్రువు అని కొనియాడుతారు. పార్టీలకు అతీతంగా ఆయనను వ్యక్తిగా గౌరవిస్తారు. ఆయనను అభిమానిస్తారు.  వద్దిరాజు రవిచంద్రకు ప్రజలంటే  ఎంత ప్రాణమో, బిఆరఎస్ అధినేత కేసిఆర్ అంటే అంత దైవసమానం. కేసిఆర్ అంటే కూడా వద్దిరాజుకు ఎంతో గౌరవం. గురుసమానం. దైవ సమానం. అంతగా కేసిఆర్‌ను ఆరాదిస్తుంటారు. ఆయన బిఆరఎస్‌లో చేరిన నాటి నుంచి పార్టీ కోసం ఆయన అహర్నిషలు కషి చేస్తూనే వున్నారు. ఈసారి ఆయన నిర్ధేశి ంచుకున్న లక్ష్యం ఒక్కటే. వచ్చే ఎన్నికల్లో బిఆరఎస్ పార్టీని అధికారంలోకి తేవడం మళ్లీ కేసిఆర్‌ను ముఖ్యమంత్రిగా  చూడడం, ఖమ్మం జిల్లాను బిఆరఎస్ కంచుకోటగా మార్చడం.  ఖమ్మం జిల్లాలో బిఆరఎస్‌ను తిరగులేని శక్తిగా మార్చడం కోసం ఆయన ఎంతో కషి చేస్తున్నారు. రాజకీయంగా  బిఆరఎస్‌ను ఎదురులేని శక్తిగా మార్చి, భవిష్యత్తులో బిఆరఎస్ మీద పోటీ చేయాలంటే  ఇతర పార్టీలు వెనుకడగు వేసేంత బలంగా మార్చాలన్న కసితో పనిచేస్తున్నారు.  ప్రజా సేవ తర్వాతే రాజకీయాలను ప్రాదాన్యతనిచ్చే వద్దిరాజు రవిచంద్ర అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలకు ప్రాణం. ఆయనతో ప్రత్యక్షంగా సేవలు అందుకోని వారు చాల తక్కువగా వుంటారు. అంతలా ఆయన ప్రజలకు సేవ చేశారు. ఆ సేవను ప్రజలు కూడా మర్చిపోలేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా    ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. పార్టీని  గెలిపించే బాద్యతతోపాటు, తాను కూడా ఎమ్మెల్యేగా నిలిచి, గెలవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వ్యక్తిగతంగానే ఎంతో సేవ చేసే వద్దిరాజు రవిచంద్ర  ప్రజా ప్రతినిధి అయితే ఎంత సేవ చేస్తారో ఊహించుకోవచ్చు. అందుకే వచ్చే ఎన్నికల్లో వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యే కావాలని, మంత్రి కావాలని ప్రజలు ఎంతో బలంగా కోరుకుంటున్నారు. సహజంగా   ఏ సామాజిక సేవకుడైనా సరే తన ప్రాంతం, తన జిల్లా వరకు మాత్రమే సేవ చేయడం కనిపిస్తుంది.. కాని వద్దిరాజు రవిచంద్ర అంటే అటు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన చేసినన్ని సామాజిక సేవలు ఎవరూ చేయలేదు. ఆయన పుట్టిపెరిగింది వరంగల్ జిల్లా అయితే, ఆయన వ్యాపార సామ్రాజ్యం ఖమ్మం జిల్లా. అందుకే ఆయన ఏ జిల్లాను విస్మరించలేదు. పుట్టిన జిల్లాకు సేవలందించారు. ఆదరించిన జిల్లాను కడుపులో పెట్టుకున్నారు. ఇలాంటి నాయకుడు బహుశా ప్రపంచంలో కూడా ఎక్కడా వుండరేమో అంటే అతిశయోక్తి కాదు. అటు ఉమ్మడి వరంగల్, ఇటు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో చేసిన ఆద్యాత్మిక సేవలు కూడా అన్నీ  ఇన్నీ కావు.  రెండు జిల్లాలో కలిసి ఎన్ని దేవాలయాల నిర్మాణాలకు ఆయన సహకరించారో లెక్కేలేదు. అంతగా ఆయన దైవ సేవలో కూడా పాలు పంచుకున్నారు. ఏ ఊరి నుంచి ఎవరు వచ్చి, గుడి కుడుతున్నామంటే చాలు, వాళ్లు ఎంత అడిగితే అంత ఇవ్వడం అనేది ఒక్క వద్దిరాజు రవిచంద్రకే చెల్లింది. అంతలా దైవసేవతోపాటు,  ఆయన చేసిన వైద్య సేవలు కూడా అనేకం వున్నాయి. లెక్కలేనన్ని సార్లు హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేశారు. ఎంతో మందికి వ్యక్తిగతంగా వైద్య సాయం అందించారు. అలా ఆయనతో సాయం  పొందిన వారు ఎంతో మంది వున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుగా ప్రజలు గుర్తు చేసుకునేది వద్దిరాజు రవిచంద్రనే అంటే అతిశయోక్తికాదు. అంతలా ప్రజలకు చేరువయ్యారు. ప్రజలకు సేవ చేస్తున్నారు. వారికి సేవ చేయడంలోనే వద్దిరాజు తరిస్తున్నాడు. పదవుల  కోసం, రాజకీయాల కోసం ఆయన ఆలోచించలేదు. తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. అలా అటు ఉద్యమకారులు, ఇటు ప్రజలు, సామాజిక బాధ్యతలు, అన్నీ ఏక కాలంలో నిర్వర్తించిన మనసున్న మారాజు వద్దిరాజు రవిచంద్ర అని ప్రజలు చెబుతుంటారు. నిస్వార్ధ సేవకు నిదర్శనం వద్దిరాజు రవిచంద్ర. ఆపన్నులకు అన్నం పెడుతూ, వారి ఆకలి తీర్చే నిండైన గొప్ప మానవతా మూర్తి వద్దిరాజు రవిచంద్ర. ఆయన చేసిన సేవలల్లో   ప్రపంచమంతా చూసిన సేవలు అనేకం వున్నాయి. అందులో గత వర్షాకాలంలో వచ్చిన వరదల్లో ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని వ్యక్తిగతంగా ఆదుకున్న ఏకైక నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. అకాల వర్షానికి ఖమ్మం జిల్లా కేంద్రంలోని అనేక కాలనీలు నీల మునిగాయి. రాత్రికి రాత్రే కురిసిన వర్షానికి అనేక కాలనీలు జలమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. అలా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు అప్పటికప్ప్పుడు షెల్టర్లు ఏర్పాటు చేసి వారికి వసతీ సౌకర్యాలు కల్పించారు. వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. సురక్షిత ప్రాంతాలకు దగ్గరుండి తరలించారు. ఇంతటి ప్రయత్నం ప్రభుత్వంలో వున్న పెద్దలు కూడా చేయలేదు. అంతే కాకుండా వరద నీళ్లు పోయిన తర్వాత ప్రతి కుటుంబానికి నెలకు అవసరమైన సామాగ్రిని  ప్రతి ఇంటికి అందించిన ఏకైన నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఇదిలా వుంటే వరదల్లో చిక్కుకొని ఆర్తనాలు పెడుతున్న వారిని అప్పటికప్ప్పుడు జేసిబిలను పంపించి ప్రాణాలతో సురక్షింగా రక్షించారు. ప్రాణ హాని జరకుండా ఆ కుటుంబాలలో వెలుగులు నింపారు. ఇక కరోనా  సమయంలో ఖమ్మం జిల్లా ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు వద్దిరాజు రవిచంద్ర చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు అప్ప్పుటి బిఆరఎస్ ప్రభుత్వం చేసిన సాయానికి తోడుగా వద్దిరాజు ఎంతోమందికి నిత్యావసర వస్తువులను సరఫరా  చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. వేలాది కుటుంబాలకు బియ్యం, ఇతర సామాగ్రిని సరఫరా చేసి ఖమ్మం ప్రజల చేత దేవుడనిపించుకున్నారు. ఇప్పటికీ ఆయనను ప్రజలు కొలుస్తూ వుంటారు. అంతలా ప్రజలకు సేవ చేసిన వద్దిరాజు రవిచంద్రను ప్రజలు ఎమ్మెల్యే కాలనుకుంటున్నారు. మంత్రి కావాలని కోరుకుంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిసి ్దతుల్లోనూ  ఖమ్మం జిల్లాను బిఆరఎస్ కంచుకోటగా మార్చాలని వద్దిరాజు ఎంతో కషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా రెపరెపలాడించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. ప్రజలకు సేవ చేస్తున్నారు. పార్టీని పటిష్టం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో అందరికంటే ముందున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను బిఆరఎస్ స్వీప్ చేసేందుకు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ఖమ్మం అడ్డా, గులాబీ గడ్డగా మార్చేందుకు ఆయన పడుతున్న శ్రమం అంతా ఇ ంతా కాదు. అలాంటి వద్దిరాజు రవిచంద్ర భవిష్యత్తులో మంచి ఉన్నత స్దానానికి చేరుకోవాలని, ప్రజలకు , పార్టీకి మరింత సేవ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. నేడు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పుట్టిన రోజు. ఆయనకు అభిమానులు, బంధువులు, శ్రేయోబిలాషులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పార్టీ నాయకులు పెద్దఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. బిఆరఎస్ పార్టీ అదినేత కేసిఆర్  పుట్టిన రోజు జరుపుకుంటున్న వద్దిరాజుకు ఆశీస్సులు అందించారు. వద్దిరాజు రవిచంద్ర ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాయలతో  జరుపుకోవాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని, రాజకీయంగా ఉన్నత స్దానాలు పొందాలని నేటిధాత్రి ప్రత్యేకంగా కోరుకుంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు, అభినందనలు అందిజేస్తోంది.

చీరలొద్దంటున్న చెల్లెండ్లు… 2500 ఎప్పుడిస్తరని అడుగుతుండ్రు?

`కాంగ్రెస్ నాయకులకు చుక్కలు చూపిస్తుండ్రు?

`ఎక్కడికక్కడ మహిళల నిలదీత.. నాయకులకు ఉక్కపోత?

`మంత్రులనే ప్రశ్నిస్తున్న మహిళా లోకం!

`బతుకమ్మ చీరలు అప్పుడే పంచితే అయిపోయేది?

`ఇప్పుడు పంచితే ఎన్నికల కోసమే అన్నట్లుంది?

`పంచాయతీ ఎన్నికల ముందు చీరలు పంచారు?

`మునిసిపల్ ఎన్నికల ముందు మళ్ళీ పంచుతున్నారు?

`ఇప్పుడు అడగకపోతే ఇక ఇవ్వరు?

`ఆరు గ్యారెంటీలు అమలు చేయరు?

`ఇప్పుడు తప్పితే మళ్ళీ దొరకరు.. జనం ముఖం కూడా చూడరు?

`తర్వాత అని చెప్పి తప్పించుకుంటారు?

`మళ్ళీ ఎన్నికల దాకా జనాన్ని దేఖరు?

`ఓట్ల కోసమోచ్చినప్పుడే అడగాలే… ఇస్తేనే ఓట్లు వేయాలే?

`మున్సిపల్ ప్రాంతాల మహిళల్లో వచ్చిన చైతన్యం?

`పథకాలు తప్పించుకునేందుకే హడావుడి ఎన్నికలు?

`వచ్చే సర్వత్రిక ఎన్నికల దాకా ఉండవు తిప్పలు?

`సీఎం నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని భావిస్తున్నాను కాంగ్రెస్

నాయకులు?

`భవిష్యత్తులో కాంగ్రెస్ అంటే నమ్మకం లేకుండా పోతుందని నాయకుల్లో దిగులు?

`కాంగ్రెస్ ఒక్క సారి మాట ఇస్తే అమలు చేస్తుందని నమ్మిన ప్రజలు?

`ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్న పాలకులు?

`గతంలో ఇచ్చిన హామీలు ఎప్పుడూ కాంగ్రెస్ తప్పించుకోలేదు?

`అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించారు?

`మంత్రులు, ఎమ్మెల్యే లు నోరు తెర్వకపోతే మొదటికే మోసం రావొచ్చు?

`కాంగ్రెస్ శ్రేణులు ఆగం కావచ్చు.. రాజకీయంగా పార్టీకి కోలుకోలేని పరిస్థితి రావచ్చు?

`బీఆరఎస్ గద్దెలు కూలితే కాంగ్రెస్ గద్దెలు కట్టాలి?

`టీడీపీ జెండాలు ఎగరాలని సీఎం అంటే కాంగ్రెస్ నాయకులకు సోయి రాలేదు?

`కాంగ్రెస్ మీద ప్రజలకున్న నమ్మకం తుడుచుకు పోతోంది గ్రహించండి?

`ఇప్పటికైనా మించి పోయిందేమి లేదు కాంగ్రెస్ ను కాపాడుకోండి!

హైదరాబాద్, నేటిధాత్రి:

తెలంగానలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చి, రేవంత్ సర్కారు ఏర్పాటై రెండేళ్ల కాలం పూర్తయ్యింది. అదే సమయంలో కాంగ్రెస్‌లో అంతర్యుద్దం మొదలైంది. ప్రజలు ప్రశ్నించడం మొదలైంది. ప్రభుత్వంలో ఏ రకమైన లుకలుకలు వున్నాయో అటీవల బైటపడింది. ప్రభుత్వంలో ఎంత సమిష్టి వ్యవహారం నడుస్తుందో వాళ్లుకు వాళ్లే బైట పెట్టుకున్నట్లైంది. ఇక తాజాగా మున్సిపల్ ఎన్నికల నిర్వహనకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు మున్సిపాలిటీ పరిధిలో చీరల పంపకం మొదలైంది. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చి పడుతోంది. చీరల పంపిణీని ఎంతో అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. సభలు ఏర్పాటు చేసి, మహిళలకు చీరల పంపకాలు చేపట్టింది. ఇటీవల ఒకే రోజు రెండు సంఘటనలు జరిగాయి. మంత్రి దామోదర రాజనర్సింహ చీరలు పంపకాలు చేయడం మొదలు పెట్టడంతో అక్కడికి వచ్చిన మహిళలు చీరుల వద్దన్నారు. ఒక్కసారే మంత్రి దామోదర రాజనర్సింహ కంగుతిన్నారు. ముందైతే చీరలు తీసుకోండని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కాని మహిళలు వినలేదు. మంత్రి వారించారు. మహిళలు వాదనకు దిగారు. చీరులేమీ వద్దు? ఆరు గ్యారెంటీలు ఎప్ప్పుడు అమలు చేస్తారో చెప్పండి? మహిళలకు మహýక్ష్మి పధకం కింద ఇస్తామన్న రూ.2500 ఏమయ్యాయి? ఎప్ప్పుడిస్తారు? అని ప్రశ్నించారు. ఒక రకంగా మహిళలు మంత్రిని నిలదీసినంత పనిచేశారు. దాంతో మంత్రికి కాస్త అసహనం ఏర్పడింది. అయినా తనను తాను సముదాయించుకునే ప్రయత్నం చేశారు. మహిళలు మాత్రం వినలేదు. దాంతో ముందుండి ప్రశ్నిస్తున్న మహిళలను పక్కకు తప్ప్పుకోండన్నారు. అదే రోజు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా మహిళలకు చీరల పంపిణీలో పాల్గొన్నారు. సరిగ్గా అక్కడ కూడా ఉప ముఖ్యమంత్రికి కూడా అదే చేదు అనుభవం ఎదురైంది. మహిళలు ఉప ముఖ్యమంత్రిని నిలదీశారు. సమాదానం చెప్పలేక ఉప ముఖ్యమంత్రి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. మహిళలు వినలేదు. మంత్రి చెప్పే మాటలు వినిపించుకోలేదు. ఆరు గ్యారెంటీలు ఎప్ప్పుడిస్తారన్న మాటలే మహిళలు మాట్లాడారు. అంతకు ముందు మరో మంత్రి వివేక్ వెంకటస్వామికి అలాంటి అనుభవమే ఎదురైంది. రోడ్లేప్ప్పుడు బాగు చేస్తారని ప్రజలు ప్రశ్నించారు. తాను వచ్చిన తర్వాత రోడ్లు వేయించానని మంత్రి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈ రోడ్లు ఇప్ప్పుడేసినవి కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయలేదని ప్రజలు తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజలు, మంత్రికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే ప్రభుత్వానికి చెప్ప్పుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమస్యలు మంత్రి దష్టికి తీసుకెళ్తే ప్రభుత్వానికి చెప్ప్పుకొమ్మని అనడమేమిటని ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఇలా ప్రభుత్వం అటు పార్టీలో, ప్రభుత్వంలో, ప్రజల్లో లోపý, బైట సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీల అమలుపై తొలుత సిఎం. రేవంత్ చెప్పిన మాటలు జనం విన్నారు. కొంత అర్ధం చేసుకున్నారు. సిఎం. చెప్పిన మాటలు నిజమే కావొచ్చని నమ్మారు. ఈసారి కాకపోయినా వచ్చే ఏడాదైనా సరే ఇస్తారేమో అనుకున్నారు. అలా రెండేళ్లు గడిపేశారు. ఇది మూడో ఏడాదికి చేరింది. ఇక పంచాయితీఎన్నికలు పూర్తయ్యాయి. పంచాయితీ ఎన్నికల్లోనూ ప్రజలు అక్కడక్కడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు. పంచాయితీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేకపోవడంతో ఆ గ్రామంలో మంచి వ్యక్తుల కోసం పార్టీలను ప్రజలు కూడా పక్కన పెట్టారు. సర్పంచ్‌లుగా పోటీ చేసేవారిని నిలదీసే పరిస్దితి అక్కడ వుండదు. ప్రచారానికి కూడా పెద్దగా నాయకులు రాలేదు. దాంతో ఎట్లాగో ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్ కూడా మెరుగైన ఫలితాలే వచ్చాయి. కాంగ్రెస్ అనుకున్నదానికంటే ఎక్కువగానే సర్పంచ్‌లు గెలుచుకున్నారు. కాని మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వ పార్టీ గెలవాలంటే అంత సులువైన పని కాదు. ఎన్నికల మందు ప్రజలకు అనేక హమీలు ఇచ్చారు. అందులో ఓ రెండు అమలు చేశారు. ఆరు గ్యారెంటీలలో వున్న పదమూడు హమీలలో పది హామీలు అసలైనవే వున్నాయి. వాటి జోలికి వెళ్లడానికి ప్రభుత్వం జంకుతోంది. ప్రతి గహిణికి రూ.2500 ప్రతి నెల ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. ఇంత వరకు అమలు చేయడం లేదు. గతంలో బిఆరఎస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలకే తూట్లు పడుతున్నాయి. ప్రతి నెల పెద్దవారికి భరోసా రూపంలో రూ.2000వేలు ఇస్తున్నారు. అధికారంలోకి రాగానే రూ.4000 ఇస్తామన్నారు. రెండేళ్లయ్యింది. ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కళ్యాణ ýక్ష్మి పధకానికి అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు. ఎన్నికల సమయంలో హమీ ఇచ్చినప్ప్పుడు రూ.70వేలకు తులం వుండేది. ఇప్ప్పుడు లక్షా యాభైవేలు దాటింది. అసలు కల్యాణýక్ష్మి ఇవ్వడమే గగనంగా మారింది. అలాంటిది తులం బంగారం మర్చిపోవాల్సిందే అనే పరిస్దితి వచ్చింది. ఇక భవిష్యత్తులో ఇవ్వలేరు. అది కూడా తేలిపోయింది. కాని ప్రతి విద్యార్ధికి రూ.5లక్షల రూపాయల గ్యారెంటీ కార్డు ఇస్తామన్నారు. అది పాలకులు, ప్రజలు కూడా మర్చిపోయారు. ఫీజు రీఎంబర్స్ మెంటు పూర్తిగా ఇస్తేచాలు అనే పరిస్దితికి ప్రజలే వచ్చేశారు. చదువుకునే ప్రతి అమ్మాయికి స్కూటీ ఇస్తామన్నారు. అదీ లేదు. వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇక మహిళలు ఆశలు పెట్టుకున్నది కేవలం రూ.2500. ఆ స్కీమ్ కూడా అమలు కాకపోతే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమనే అభిప్రాయం అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు నైనీ బ్లాక్ బొగ్గు గని వివాదం ముసుకున్న వేళ, సిఎం. రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకుల్లో కలకలం రేపాయి. సిఎం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రా? లేక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రా? అని అన్ని వార్గలు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు కూడా కుతకుతలాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణలో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాలని కోరుకోవాలి. బిఆరఎస్ గద్దెలు కూలితే కాంగ్రెస్ గద్దెలు వెలవాలని చెప్పాలి. బిఆరఎస్‌ను నామరూపాలు లేకుండా చేసి, కాంగ్రెస్‌ను మరింత బలపలడేలా చేయాలి. అంతే కాని బిఆరఎస్ గద్దెలు కూల్చి తెలుగుదేశం జెండాలు ఎగరాలని సిఎం. చెప్పడంలో ఆంతర్యమేమిటన్నదానిపై ఇప్ప్పుడు పెద్ద చర్చనే కాదు, పార్టీలో రచ్చ జరుగుతోంది. పైగా అవకాశం దొరికనప్ప్పుడల్లా సిఎం. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద సానుభూతి చూపించడం, చంద్రబాబును పదే పదే పొగుడుతుండడం కూడాకాంగ్రెస్ నాయకులు సుతారం నచ్చడం లేదు. సిఎం. రేవంత్ రెడ్డి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి వస్తే కాంగ్రెస్‌లో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా లేకపోవంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలు ఒక గురి వుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏవైనా హమీలు ఇచ్చిందంటే ఖచ్చితంగా నూటికి నూరు పాళ్లు నిజం చేస్తుందని బలంగా నమ్ముతారు. గతంలో అలా ప్రజలు నమ్మడం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిన సందర్భాలు చాల వున్నాయి. గూడు లేని పేదలకు పక్కా ఇ ండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి 2004 తర్వాత పదేళ్ల కాలంలో తెలంగాణలో సుమారు 25ýక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం లేదు. గత ఎన్నికల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారని నమ్మినట్లే, పించన్లు పెంచుతామంటే నమ్మారు. రైతు భరోసా కూడా పదిహేను వేలు ఇస్తామంటే నమ్మారు. ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేస్తారని ప్రజలు బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వమ్ము చేస్తుందనే భావన ప్రజల్లో మొదలైంది. అధికారంలోకి వచ్చాక సాకులు చెప్పడానికి కాదు ప్రజలు ఓట్లేసి గెలిపించింది. సంపద ఎలా సష్టించాలో..వాటిని ప్రజలకు ఎలా పంచాలో తమకు తెలుసని ఎన్నికల ముందు చెప్పారు. అందుకు తగ్గ ప్రణాళికలు మాకు వున్నాయన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజాన ఖాళీ అంటున్నారు. ఖజానా ఖాళీగా వుందని ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ నాయకులు తెలుసు. ఇప్ప్పుడు తప్పించుకొని చూస్తుండడం అంటే కాంగ్రెస్ పార్టీని దగ్గరుండి నాయకులు, పాలుకులే భ్రష్టుపట్టిస్తున్నారని ప్రజలు కూడా బావిస్తున్నారు. తెలంగాణలోని తెలుగుదేశాన్ని తిరిగి తేవాలన్న దానిపై వున్న ఆసక్తి ఎన్నికల ముందు ఇచ్చిన హమీల అమలుపై లేదని అంటున్నారు?

తెలంగాణను కుదిపేసిన నైనీ బ్లాక్ టెండర్ల వివాదం

· దెబ్బతిన్న రేవంత్ ప్రభుత్వ ప్రతిష్ట
· రాబోయే మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం?
· విపక్షాలకు బలమైన అస్త్రం
· బయటపడ్డ మంత్రుల మధ్య విభేదాలు
· సింగరేణి విశాల హితాన్ని మరచిన మంత్రులు
· స్వార్థంతో కాంగ్రెస్‌ను బజారుకీడ్చిన వైనం
· సింగరేణిని కాపాడేందుకు నైనీ బ్లాక్ కేటాయింపు
· టెండరు దక్కించుకోవడం కోసం రేగిన రాజకీయ రచ్చ
· ఎట్టకేలకు టెండర్లు రద్దు
· టెండర్లు ఆలస్యమైతే ప్రమాదంలో సింగరేణి భవితవ్యం
· ఇవేమీ పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్, నేటిధాత్రి:
తెలంగాణ విద్యుత్ అవసరాలకోసం సింగరేణికి కేటాయించిన ఒడిషాలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ టెండర్ బాగోతం రాష్ట్ర కాంగ్రెస్‌లోని విభేదాలను బయటపెట్టడం మాత్రమే కాకుండా, బీఆరఎస్, బీజేపీలకు రాజకీయ అస్త్రంగా మారడం వర్తమాన పరిణామం. అత్యంత లాభదాయకంగా వున్న ఈ మైనింగ్ టెండర్ విషయంలో కొందరుమంత్రులు పోటీపడటంతో వారి మధ్య విభేదాలు ఒక్కసారిగా రాజుకున్నాయని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆరఎస్ నాయకుడు హరీష్‌రావు ఈ బాగోతంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక బిడ్డర్‌కు అనుకూలంగా కొందరు ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ టెండర్ ప్రక్రియను నిలిపివేస్తూ ఆదేశాలివ్వడంతో రగులుతున్న రాజకీయ రచ్చకు తాత్కాలిక విరామం ఏర్పడింది. విపరీత రాజకీయ జోక్యం, నిర్వహణాలోపం వెరసి అత్యంత లాభాల్లో వున్న సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టేశాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. నిజానికి అటవీ ప్రాంతంలో వున్న నైనీ బ్లాక్‌ను రాష్ట్రానికి 2015లోనే కేంద్రం కేటాయించింది. ఇది అటవీ ప్రాంతంలో వుండటంతో ఆ శాఖనుంచి ఈ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన విధివిధానాల పూర్తి వంటి ప్రక్రియలతో ఇప్పటికే ప్రాజెక్టు చాలా ఆలస్యమైంది. అన్ని అడ్డంకులను దాటుకొని అమలు దశకు వచ్చేసరికి టెండర్లలో రాజకీయ విభేదాలు, వివాదాలు ప్రాజెక్టునుమరింత ఆలస్యం చేసే పరిస్థితి నెలకొనడంతో కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ముఖ్యం గా దీర్ఘకాలంలో ఇంధన భద్రతకు ఇబ్బంది ఏర్పడే ప్రమాదాన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎంతమా త్రం పట్టించుకోక పోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అసలు ప్రమాదాన్ని పక్కనబెట్టి వ్యక్తిగత లాభాలకోసం రాజకీయ రచ్చకు ఎంతమాత్రం వెనుకాడకపోవడం, స్వార్థపరత్వం తప్ప రాష్ట్ర విశాలహితాన్ని ఎవరూ కోరుకోవడంలేదన్న సత్యం బహిర్గతమైంది. టెండర్ తమకే దక్కాలన్నఉద్దేశంతో ఒకరిపై మరొకరు బురదజల్లుకునే ప్రక్రియలోనే తలమునకలై, రాష్ట్ర ప్రయోజనాల ను పట్టించుకోని వైఖరిని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఈ ప్రక్రియలో విధానపరమైన లోపాలపై కేంద్రం సమీక్ష మొదలు పెట్టడంతో ఎసఎస్‌సీఎల్ బోర్డు సమావేశాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు వసూలు కాక నిండా మునిగే దుస్థితికి కంపెనీ చేరుకోవ డంతో, కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి పనితీరు తీవ్రంగా దెబ్బతిన్నది. అత్యంత కీలకమైన ఇంధన సదుపాయాలను పట్టించుకోకుండా, రాజకీయ గొడవల్లో ప్రభుత్వం మునిగిపోవడం ఇటు కార్మికులను అటు కేంద్రాన్ని ఆగ్రహానికి గురిచేసింది.
ఎందుకు తీవ్రపోటీ?
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన నైనీ కోల్ బ్లాక్ కోసం ఎందువల్ల ఇంతటి తీవ్ర పోటీ వున్నదన్న ప్రశ్న సహజంగా ఉదయిస్తుంది. నిజం చెప్పాలంటే లాభాల పరంగా ఇదొక కామధేను వు లాంటిది. ఓవర్ బర్డెన్ (ఓబీ) తొలగింపు, డీజిల్ సరఫరాకాంట్రాక్టర్లకు భారీ ఎత్తున ఆదా యం లభిస్తుంది. ముఖ్యంగా దీనికి రైలు రవాణా అందుబాటులో లేకపోవడం సింగరేణికి నష్ట మైనప్పటికీ, కాంట్రాక్టర్లకు మాత్రం లాభాల పంట పండిస్తుంది. దీనికితోడు సింగరేణిపై జీఎస్టీచెల్లింపుల రూపంలో భారంపడే డీజిల్ సరఫరాలను నియంత్రించడంవల్ల మరిన్ని లాభాలు పొందవచ్చు. సీనియర్ రాజకీయ నాయకులు ఈ మైన్ తవ్వకం కాంట్రాక్టును తమకు అనుకూలమైన వ్యక్తులకు ఇవ్వడానికి యత్నించడంతో వివాదం రేగింది. ఇందుకోసం బిడ్డర్లు ప్రదేశాన్ని సందర్శించి, సింగరేణి సంస్థనుంచి “సైట్ విజిట్ సర్టిఫికెట’ తెచ్చుకోవాలంటూ ప్రవేశపెట్టిన నిబంధనతో రగడ మొదలైంది. కేవలం అస్మదీయులకు టెండరు దక్కేలా చేసేందుకే ఈ నిబంధన తీసుకొచ్చారన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పోటీలో వున్న కాంట్రాక్టర్లు సాధారణంగా “మైనస” రేట్లలో (అంటే అంచనా కంటే తక్కువ రేట్లకు) బిడ్లు దాఖలు చేయడం కద్దు. కానీ ఈ నిబంధనను అడ్డుపెట్టుకొని పోటీ తగ్గించడంవల్ల “G7” స్థాయి అధిక రేట్లకు బిడ్లు దాఖలు చేసేందు కు వీలవుతుంది. ఇది అస్మదీయులకు లాభం చేకూర్చే చర్యగా బీఆరఎస్ ఎదురుదాడికి దిగింది.ఇక్కడ కేవలం u£గ్గు తవ్వకం గురించి మాత్రమే కాదు, సైడ్ డీల్స్‌తో పాటు మైనింగ్ కాంట్రాక్టులను కేటాయించడం రాజకీయ ప్రమేయంతో కూడినవి కావడంవల్ల కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరుకు దారితీసింది.
సింగరేణి u£గ్గు ఖరీదు ఎక్కువ
కోల్ ఇండియాతో పోలిస్తే, సింగరేణి ఉత్పత్తి చేసే u£గ్గు ఖరీదు ఎక్కువ. సింగరేణి ఉత్పత్తి చేసే u£గ్గు ధర టన్నుకు రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య వుంటోంది. అదే కోల్ ఇండియా u£గ్గు ధర సగటున రూ.2వేలు మాత్రమే. ఉదాహరణకు సింగరేణి జి11 గ్రేడ్ u£గ్గు అమ్మకం ధర టన్నుకు రూ.4088 కాగా, ఇదే గ్రేడ్ u£గ్గును కోల్ ఇండియా రూ.1605కే ఇవ్వగలుగుతోంది. దీనికితోడు సింగరేణి u£గ్గు నాణ్యత 58% కాగా కోల్ ఇండియా u£గ్గు నాణ్యత 86%. దీనివల్ల మార్కెట్ పరంగా సింగరేణి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనాల్సి వస్తున్నది. ఇందుకు ముఖ్యమైన కారణం కోల్ ఇండియాకు ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌లలో విస్తారమైన ఓపెన్ కాస్ట్ గనులున్నాయి. వీటినుంచి తక్కువ ఖర్చుతో u£గ్గును వెలికితీస్తోంది. ఫలితంగా కోల్ ఇండియా తక్కువ ధరకే తన వినియోగదారులకు u£గ్గును సరఫరా చేయగలుగుతోంది. ఇదే సింగరేణి గనులు విషయానికి వస్తే ఒవర్ బర్డెన్ (u£గ్గుపైన వున్న రాతినేల)ను తొలగిస్తే తప్ప u£గ్గు తవ్వకాలు సాధ్యంకాదు. ఫలితంగా u£గ్గు వెలికితీతకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సివస్తోంది. అదీకాకుండా సింగరేణికి భూగర్భ u£గ్గు గనులు అధికం. అంతటి లోతుల్లోనుంచి u£గ్గును బయటకు తీయడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. ఎందుకంటే అంతటి లోతుల్లోని u£గ్గు బయటకు తీయడానికి భారీ యంత్రాలు అవసరం. అదీకాకుండా ఈ భారీ యంత్రాలు తక్కువ గంటలు మాత్రమే (12గంటలు) పనిచే స్తాయి. ఫలితంగా యూనిట్ ఉత్పత్తి ఖర్చు కోల్ ఇండియాతో పోలిస్తే చాలా అధికం. దీనివల్ల కోల్ ఇండియాతో సింగరేణి పోటీపడలేక పోతున్నది. దీనివల్ల సహజంగానే విద్యుత్‌యేతర పరి శ్రమలు, కోల్ ఇండియా u£గ్గువైపు మళ్లుతుండటంతో, సింగరేణికి డిమాండ్ తగ్గుతోంది. ఈ విపరిణా మాలనుంచి సింగరేణిని గట్టెక్కించేందుకోసం నైనీ బ్లాక్‌ను కేంద్రం కేటాయించింది. ముఖ్యంగా ఓవర్ బర్డెన్ లేకపోవడంవల్ల సింగరేణి సంస్థకు ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. సంవత్సరానికి 10మిలియన్ టన్నుల సామర్థ్యం వున్న ఈ బ్లాక్ నుంచి u£గ్గు వెలికితీత ద్వారా రా బోయే 38 సంవత్సరాల్లో సింగరేణి తన నష్టాలనుంచి బయటపడగలదని అంచనా. ముఖ్యంగా ఇప్పటివరకు తన ఆధీనంలో వున్న గనులనుంచి u£గ్గు ఉత్పత్తికి అవుతున్న అధిక వ్యయాన్ని కూడా ఈ నైనీబ్లాక్ భర్తీ చేయగలదు. ఉదాహరణకు ప్రస్తుతం ఒక టన్ను u£గ్గును వెలికి తీయడానికి సింగరేణి 12 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ను తొలగించాల్సి వస్తున్న ది. ఇదే నైనీ బ్లాక్‌కు అయితే 2.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్‌ను తొలగిస్తే సరిపోతుంది. ఇది సంస్థకు ఆర్థిక వెసులుబాటుతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచగలదు. అదీకా కుండా నైనీబ్లాక్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన జీ10నాణ్యమైన u£గ్గును అందిస్తుందికూడా. ఏటా 10మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం సరఫరాలో అంతరాలను కూడా తగ్గించడమే కాదు ఖర్చుతో కూడుకున్న పాత గనులపై సంస్థ పెద్దగా ఆధారపడాల్సిన అవసరం వుండదు.
తెలంగాణ ప్రభుత్వ బకాయిలు
ఇప్పటివరకు సింగరేణికి తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.47వేల కోట్ల నుంచి రూ.50వేల కోట్ల వరకు బకాయి పడింది. ఇవి u£గ్గు కొనుగోళ్లు, విద్యుత్ సరఫరాకు చెందినవి కావడం గమనార్హం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో రూ.17వేల కోట్లు,విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కామ్ రూ.12వేల కోట్లు వున్నాయి. గత బీఆరఎస్ ప్రభుత్వ రూ.26వేలకోట్లు బకాయిలు వుంచగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.13వేల కోట్ల నుంచి రూ.16వేల కోట్ల వరకు సింగరేణికి రుణం చెల్లించలేదు. ఈ బకాయిలను చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రోడ్‌మ్యాప్ రూపొందించలేదని కేంద్ర u£గ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శి స్తున్నారు. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ఈ బకాయిలవల్ల సింగరేణి సంస్థ దివాలా దశకు చేరుకుంటోంది. తన ఉద్యోగుల జీతాల చెల్లింపులకు బ్యాంకు రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాదు బకాయిలు చెల్లించకపోవడంవల్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ కార్మి కులకు సంక్షేమ కార్యక్రమాల అమలును నిలిపేసింది. ఇప్పటికే హామీ ఇచ్చిన వాటిని అమలు చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది.
దెబ్బతిన్న పభ్రుత్వ ప్రతిష్ట
నైనిబ్లాక్ టెండర్ల బాగోతం రేవంత్ ప్రభుత్వ ప్రతిష్టను గణనీయంగా దెబ్బతీసింది. విపక్ష బీఆర్ ఎస్, బీజేపీలు, ఇది “కమిషన్ల ప్రభుత్వం” అంటూ విమర్శల దాడిని ఉధతం చేశాయి. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న తరుణంలో వాటికి నైనీబ్లాక్ టెండర్లు ఒక బలమైన అస్త్రంగా మారాయి. ఇప్పటివరకు గుంభనంగా పనిచేస్తూ వచ్చినప్పటికీ, మంత్రుల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడటంతో రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిపోయింది. లాభాల్లో వున్న సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టి దివాలా స్థాయికి దిగజార్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్న అంశం బయటకు వెల్లడి కావడంతో ఎంతో సానుకూల ప్రచారం చేసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగరేణి పాపంలో బీఆరఎస్‌ది సింహభాగ మైనప్పటికీ, ఇప్పుడు అధికారంలో వున్న కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. గుట్టుగా నెట్టుకొద్దా మంటే కప్పల తక్కెడ రాజకీయం వంటబట్టించుకున్న కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత స్వార్థంతో అటు ప్రభుత్వాన్ని ఇటు సంస్థను బజారున పడేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఒక అగ్ర నాయకుడి బంధువుకు లబ్ది చేకూర్చేవిధంగా 2024లో రాష్ట్ర ప్రభుత్వం “సైట్ విజిట్ సర్టిఫికెట”ను ప్రవేశపెట్టిందని హరీష్‌రావు ఆరోపించారు. కేంద్ర u£గ్గు మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణిని ఏ కంగా రాజకీయ ప్రయోగశాలగా మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాగోతంపై అం తర్గత విచారణ ప్రారంభించామని, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తే సీబీఐ విచారణకు సిద్ధమని స్పష్టంచేశారు. కాగా పారదర్శకత కోసమే టెండర్లను రద్దుచేసామని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించడమే కాకుండా, మళ్లీ కొత్తగా టెండర్లను ఆహ్వానిస్తామని వెల్లడించారు. నైనీ బ్లాక్ టెండర్ బాగోతం ఏకంగా ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ప్రతిష్టను దెబ్బతీయడం, ఒక సీనియర్ మంత్రి తీవ్ర మనో సంక్షోభానికి, అమాయక జర్నలిస్టుల అరెస్ట్‌కు దారితీసి, సమస్యను ఏవిధంగా దారి మళ్లించి ఇతరుల జీవితాలతో ఆడుకోవచ్చో అందరికీ విడమరిచి చెప్పింది.
నిజానికి 2014 నాటికి సింగరేణికి రూ.3500కోట్ల బ్యాంక్ బ్యాలన్స్ వుండగా బీఆరఎస్ ప్రభు త్వం దిగిపోయేనాటికి భారీగా అప్పుల్లో మునిగిపోయిందని, ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం సింగ రేణిని తన రాజకీయ లేu£రేటరీలాగా ఉపయోగించడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శకుల వాదన. ముఖ్యంగా పెద్ద, చిన్న కాంట్రాక్టుల ఎంపికలో కల్వకుంట్ల కుటుంబం తమ స్వప్ర యోజనాలకు అనుగుణంగా వ్యవహరించడమే సింగరేణి మునగడానికి ప్రధాన కారణమని ప్ర త్యర్థుల ఆరోపణ. అయితే కేటీఆర్ ఈ ఆరోపణలను ఖండించారు. 2014లో సింగరేణి వార్షిక టర్నోవర్ రూ.12వేల కోట్లు కాగా 2023లో తమ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.32వేల కోట్లకు పెరిగిందని ఆయన సమర్థించుకున్నారు. 2023`24లో సింగరేణి రూ.4705కోట్ల మేర లాభాలను ఆర్జించడం తమ ప్రభుత్వ సమర్థ నిర్వహణకు నిదర్శనమని బీఆరఎస్ నేతలు వాదిస్తు న్నారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలే సింగరేణిని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో అంచనాలకంటే 20% తక్కువకు టెండర్లు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం అంచనాలకంటే 10% అదనపు రేటుకు కాంట్రాక్టులు అప్పగిస్తున్నదని ఆరోపించారు. ఏది ఏమైనా నైనీ బ్లాక్ టెండర్ల బాగోతం ప్రభావం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ప్రతికూల ప్రభావం చూ పే అవకాశముంది. ఇప్పుడు ఈ అంశం ప్రధాన ప్రతిపక్షమైన బీఆరఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర u£గ్గు మంత్రిత్వశాఖల మధ్య రాజకీయ యుద్ధానికి తెరలేపిందనేది మాత్రం అక్షరసత్యం.

“హరీష” గుండె ధైర్యానికి సలాం!

బలం బలగం బిఆరఎస్ సొంతం!

`కృష్ణర్జునుల సక్యత కు సంకేతం. ఐక్యతకు ఆదర్శం.

`పార్టీ నాయకుల్లో వున్న ధైర్యానికి నిదర్శనం.

`హరీష్ కు నోటీసులతో కదలిన యంత్రాంగం!

`తెలంగాణా నలు దిశల నుంచి వచ్చిన బిఆర#వతీతీ#స్ అభిమానజనం.

`ఒక్కసారిగా ఉలిక్కిపడిన కాంగ్రెస్ ప్రభుత్వం.

`సిట్ కార్యాలయానికి చేరుకున్న వేలాది మంది బి ఆర్ ఎస్ కార్యకర్తలు.

`లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టినా కదలని కార్యకర్తలు.

`హరీష్ రావును సాక్షి గా మాత్రమే పిలిచారు?

`పాలక పక్షం మీడియా తెలిసినా పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేసింది?

`అర్ధం కాని మీడియా హడావుడి చేసింది?

`సందిట్లో సడెమియా లాగా కవిత జొర్రాలని చూసింది?

`హరీష్ రావు మీద ఆగ్రహంతో తన సోషల్ మీడియాలో ప్రాపగండ ప్రచారం చేయాలని చూసింది?

`ప్రజల్లో హరీష్ రావు మీద వున్న అభిమానం పెల్లుబికింది?

`జనమంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు?

`హరీష్ ను అరెస్ట్ చేస్తారన్న వార్తలతో జనంలో ఆగ్రహం వ్యక్తమైంది?

`బీఆరఎస్ కార్యకర్తలు ఉప్పెనలా వచ్చేలా వున్నారని ఇంటెలిజెన్స్ కు ఉప్పందింది?

`ప్రభుత్వంలో వణుకు మొదలైంది?

`కొద్దిసేపటికే హరీష్ సిట్ కార్యాలయం నుంచి చిరునవ్వులు చిందిచ్చుకుంటూ వచ్చారు?

`అది చూసి గిట్టని వాళ్ళు కుళ్ళకున్నారు?

`కేటీఆర్,హరీష్ ల చిరునవ్వులు కొందరి గుండెలు అదిరేలా చేశాయి.

`బీఆరఎస్ బలమేమిటో, హరీష్ దైర్యం ఎంతటిదో కాంగ్రెస్ కు తెలిసింది.

`హరీష్, కేటీఆర్ ల అలింగనం చూసి ఓర్వలేని ఓ వర్గం మీడియా మళ్ళీ కట్టు కథలు అల్లింది?

`అబద్దాలు తెల్లారే సరికల్లా వందలు వండి వార్చింది?

`తెలంగాణా ఉద్యమ గుండెను బయపెట్టడం ఎవరి తరం కాదని తేలింది?

`తెలంగాణా కోసం కొట్లాడిన వాళ్ళకే ఉద్యమ కారుల తెగింపు తెలుసు?

`ఉప్పెనలాంటి ఉద్యమ పార్టీని ముట్టుకుంటే ఎలా వుంటుందో మరోసారి ప్రభుత్వానికి తెలిసింది.

`కాంగ్రెస్ పార్టీ గుండెల్లో వణుకు మొదలైంది?

`సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష కాంగ్రెస్ మెడకు చుట్టుకునేలా వుంది?

`బీఆరఎస్ హయాంలో ఏ కాంగ్రెస్ నాయకులను వేదించలేదు?

`తన వ్యక్తి గత కక్షను చోపించుకునే ప్రయత్నం సీఎం చేస్తున్నారు?

`సీఎం రేవంత్ మూలంగా అనవసరంగా కాంగ్రెస్ నాయకులు నష్టపోయే పరిస్థితి తెస్తున్నారు?

 

 ఓర్పు అనే పదానికి పర్యాయపదం హరీష్‌రావు అని చెప్పాల్సిందే. అందుకు ఆయనను పని రాక్షసుడు అని కూడా అంటారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం హరీష్‌రావు ఆత్మస్ధైర్యం కొంచెమైనా దెబ్బతీయాలని పదే పదే ప్రయత్నం చేస్తోంది. అయినా బెనకని, తొకలని గుండెధైర్యం హరీష్‌రావుది అని పదే పదే రుజువౌతూనే వుంది. ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఓ లొట్టపీసు కేసు అని అటు కేటిఆర్, ఇటు హరీష్‌రావులు ఇప్పటికీ వందల సార్లు చెప్పారు. అందులో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని కేసని వాళ్లే చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పాలకులు సంబందించింది కాదని, చట్టానికి మాత్రమే పరిమితమైందని కూడా గతంలో కేసిఆర్ స్పష్టంగా , సూటిగా చెప్పారు. అయినా దానిలో ఏదో తేల్చుతామని కంకణం కట్టుకొని రేవంత్ సర్కారు రెండేళ్లుగా లాగుతూ వస్తోంది. కేటిఆర్, హరీష్‌రావుల ఆత్మస్ధైర్యం దెబ్బతీయాలని విశ్వ ప్రయత్నం చేస్తూనే వుంది. ఉద్యమ కాలంలోనే రాజకీయాల్లో రాటు దేలిన నాయకులు హరీష్‌రావు, కేటిఆర్. స్వరాష్ట్ర సాదన కోసం జీవితాలను ఉద్యమ మార్గంలోకి తెచ్చుకొని పోరాటం చేసిన వారికి రాష్ట్రాభివద్ది, ప్రజా ప్రగతి ఆరాటముంటుందే కాని, వ్యక్తిగత లక్ష్యాలు వుండవన్న సంగతి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోలేకపోతోంది. పదే పదే బిఆరఎస్ నాయకలను ఇబ్బందులు పెట్టాలని చూస్తూనే వుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన చూస్తుంటే ప్రతిపక్షాల మీద పగసాదిస్తా అనేలా వుందేకాని,ప్రజలకు సేవ చేస్తామన్నట్లు కనిపించడం లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తుంది. ప్రతిపక్షం అనేది వున్నదే ప్రశ్నించడానికి, పాలకపక్షాన్ని దారిలో పెట్టడానికి అనేది రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. కాని రేవంత్ సర్కారు మాత్రం ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు. ప్రజలకు లేనిపోనివి చెప్పొదు. ప్రజýను చైతన్యం చేయొద్దు? ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగొద్దు? ఇచ్చిన మాట తప్పితే మోసమని అనొద్దు? ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎప్ప్పుడిస్తారన్న మా{ మాట్లాడొద్దు? ప్రభుత్వం చేసుకుంటూ పోయేదాన్ని చూసుకుంటూ వుండాలే తప్ప, ఇదేం పాలన అని కలలో కూడా అనుకోవద్దన్నట్లే వుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా తీరు. పైగా ప్రజలకు ఏం చేస్తామన్నదానిని చెప్పడానికి తీరిక లేదు. బిఆరఎస్ పార్టీ ప్రభుత్వంలో వున్నప్ప్పుడు అంతా అవినీతి చేసింది? దాన్ని తొవ్వితీయమే మా పని అన్నట్లు ప్రభుత్వం పనిచేస్తుందే గాని, ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమ పాలన అందిద్దామన్న ఆలోచన మచ్చుకైనా కనిపించడం లేదు. అయినా బిఆరఎస్ అదికారంలో వున్నప్ప్పుడు ఏ కాంగ్రెస్ నాయకుల మీద ఇలా పదే పదే వేధింపులు చేయలేదు. ఏ నాయకుడి మీద గతం తాలుకూ పాలనపై తవ్వకాలు జరపలేదు. తెలంగాణ వచ్చింది. తెచ్చుకున్న తెలంగాణ ఎలా బాగు పడాలి. ఎలా పంటలు పండాలి. ఎలా నీళ్లు తెచ్చుకోవాలి. ఎలా నిధులు సమకూర్చుకోవాలి. ఎలా నియామకాలు చేపట్టాలి. అన్ని రంగాలలో తెలంగాణను ఎలా అభివద్ది చేసుకోవాలి అనే విషయాల మీద దష్టి తప్ప ప్రతిపక్షం మీద దష్టిపెడితే తెలంగాణ ఇలా వుండేది కాదు! కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నూÅ£లు వుండేవి కాదు? అయినా రాజకీయాలంటే క్షక్షలు కాదు. రాజకీయాలంటే ఆదిపత్యం కాదు. ప్రజాసేవ. అది మర్చిపోయి సిఎం. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను పదే పదే టార్గెట్ చేస్తూ, పాలన గాలికి వదిలేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్ప్పుడు వారు చేయాల్సిన పని వారు చేస్తారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది బి ఆరఎస్‌నే వేదించడానికి, బిఆరఎస్‌ను ఇబ్బందుల పెట్టుడానికి అనే ఆలోచనతోనే వున్నట్లున్నారు. రెండేళ్ల వ్యవది పూర్తయింది. ఎంతో విలువైన సమయం కరిగిపోయింది. ఈ రెండేళ్ల కాలంలో కాళేశ్వరంలో మిగిలిపోయిన పనులేమైనా చేశారా? లేదు! పెండింగ్ ప్రాజెక్టులనేమైనా పూర్తి చేశారా? అదీ లేదు. ఏం చేశారు అంటే బిఆరఎస్‌ను ఇబ్బందుల పెడుతున్నామని చెప్ప్పుకోవడం తప్ప మరేం లేదు. ఎన్నిసార్లు కేసులు, ఎన్ని కేసులు, ఎన్ని సార్లు నోటీసులు, ఎన్ని సార్లు విచారణలు. ఎంత కావాలని ప్రభుత్వం ప్రతిపక్ష బిఆరఎస్ అధినేత కేసిఆర్, అగ్రనేతలు కేటిఆర్, హరీష్‌లను ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఏమొస్తుంది. ప్రజలు ఇచ్చిన సమయం వధా కావడం తప్ప మరేం ఒనగూరదు. అయినా బిఆరఎస్ అధికారంలో వున్నప్ప్పుడు ప్రస్తుతం మంత్రులుగా వున్న వారిలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎమ్మెల్యేలలో ఎవరినీ కేసుల్లో ఇరికించలేదు. సిఎం. రేవంత్‌రెడ్డిని కూడా ఏనాడు పట్టించుకోలేదు. అయినా తన ఉనికి కోసం, తన రాజకీయం ఉన్నతి కోసం, తన లక్ష్యం కోసం రేవంత్ ఉరుకులాడిండు. అందులో సక్సెస్ అయ్యిండు. మిగతా నాయకుల్లా వుంటే, తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోలేనని తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం పని చేశాడే తప్ప కాంగ్రెస్ మేలు కోసం చేసిందేమీ లేదు. ప్రజల కోసం చేసినట్లు ఏమీ కనిపించడం లేదు? అయినా రేవంత్ రెడ్డి మీద కేసిఆర్ ఏనాడు దష్టిపెట్టలేదు. రేవంత్‌ను ఇబ్బందులు పెట్టాలని ఎవరూ అనుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా, బిఆరఎస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నం చేస్తున్నప్ప్పుడు పాలకులు చేతులు కట్టుకొని కూర్చుంటారా? అయినా రేవంత్ రెడ్ది ఎమ్మెల్యే కొనుగోలు కేసు అనేది రాజకీయంగా కరక్టే కావొచ్చు? కాని నైతికంగా తప్ప్పు. తెలంగాణ అస్దిత్వత్వాన్ని దెబ్బతీయాలని చూడడం అంతకన్నా పెద్ద తప్ప్పు! పద్నాలుగేళ్ల సుధీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద వుంది. అలాంటిది ప్రజా ప్రతినిదులకు ఇంకా ఎంత బాద్యత వుండాలి? ఆ బాధ్యతను సిఎం. రేవంత్ రెడ్డి విస్మరించారు. బిఆరఎస్‌ను గద్దెదించాలనుకున్నారు. దాని తర్వాతకూడా రాజకీయంగా ఉద్యమం పేరుతో బిఆరఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రజల దష్టిలో పడేందుకు అనేక సంచనాలు చేశారు. దానికి కూడా బిఆరఎస్ అడ్డుకోలేదు. ప్రభుత్వాన్ని ఆనాడు పడగొట్టడం అనేది ఆయన దష్టిలో మంచిదే అయినప్ప్పుడు, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం కేసిఆర్ వుంది. అలా పెరిగిన రాజకీయ వైరం చివరకు రేవంత్‌ను సిఏం.ను చేసింది. అందుకు సంతోషించాల్సిందిపోయి, పదే పదే నిత్యం ఏదో రకమైన వివాదాలను సష్టించి కేసిఆర్‌ను వేదించడం సరైంది కాదు. పైగా తెలంగాణ తెచ్చిన నాయకుడైన కేసిఆర్‌పై ప్రతిసారి నోరు పారేసుకోవడం కూడా ఏమాత్రం మంచిది కాదు. ఇక కేటిఆర్, హరీష్‌రావులను నోటికొచ్చినట్లు తెట్టడమనేది గొప్ప అనుకుంటున్నారు. అదికారం వుందని, అధికారులు తమ చేతుల్లోవున్నారని కేటిఆర్, హరీష్‌రావులను రెచ్చగొట్టి, కేసులు నమోదు చేయాలని పదే పదే చేస్తున్నారు. కాని ఎక్కడా కేటిఆర్, హరీష్‌లు దొరకడం లేదు. కాళేశ్వరం కేసు నమోదు చేశారు. ఎలాగైనా హరీష్‌ను జైలకు పంపాలని చూశారు. కాని కుదరలేదు. కమీషన్ వేశారు. మంత్రుల తో కూడిన కమిటీ వేశారు. ఏమీ తేలలేదు. ఇక ఫార్ములా కేసు అని పెట్టి కేటిఆర్‌ను వేధించాలిని చూశారు. కేసులు నమోదు చేశారు. విచారణకు పిలిపించారు. అందులో కూడా ఏం చేసే అవకాశంలేదని తేలింది. ఇక ఫోన్ ట్యాపింగ్ అంటూ రెండేళ్లుగా సాగదీస్తున్నారు. మీడియాలో అదిగో, ఇదిగో అరెస్టు అంటూ వార్తలు రాయిస్తున్నారు. హరీష్‌ను జైలుకు పంపాలని చూశారు. హైకోర్టు హరీష్‌ను ముట్టుకోవద్దని తీర్పునిచ్చింది. ప్రభుత్వంఏకంగా సుప్రింకోర్టును ఆశ్రయించింది. హరీష్ కూడా తన వాదనలు సుప్రింకోర్టులో వినిపించారు. అక్కడ కూడా సుప్రింకోర్టు హరీష్‌కు క్లీన్ చీట్ ఇచ్చింది. హరీష్‌ను అరెస్టు చేయొద్దు. ఆయనపై కేసులు నమోదు చేయొద్దని తేల్చి చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ పాత్ర అనేది ఎక్కడా కనిపించలేదని కూడా సుప్రింకోర్టు చెప్పడంజరిగింది. దాంతో ఎలాగైనా కేటిఆర్, హరీష్‌లను అరెస్టు చేయాలంటే కుదరడం లేదు. ఆ అవకాశం రావడం లేదు. ఎందులోనూ సరైన ఆదారాలు లేవు. సాక్ష్యాలు అంతకన్నా లేవు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ప్రజలు రేవంత్‌ను పదే పదే అడుగుతున్నారని, ఎప్ప్పుడు ముగ్గురు నాయకులను అరెస్టు చేస్తారని సభల్లో రేవంత్ చెబుతున్నారు. తన వ్యక్తిగత కక్షకు ప్రజలకు ఏం సంబంధం???

కాంగ్రెస్ లో టీడీపీ మంటలు?

అధిష్టానం వరకు ఇంకా సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేరలేదా?

`సీఎం రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతల్లో కలవరం?

`తెలంగాణా అస్థిస్తవాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం?

`తెలంగాణా లో టీడీపీ పెరిగితే కాంగ్రెస్ కు ఏం లాభం?

`సీఎం రేవంత్ మాటలు కాంగ్రెస్ కు మొదటికే మోసం?

`సీఎం వ్యాఖ్యలు పరోక్షంగా కాంగ్రెస్ ను బొంద పెట్టే ప్రయత్నం?

`టీడీపీ పెరిగితే బలపడేది దూసుకొచ్చేది తెలంగాణా లో బీజేపీ?

`బీజేపీ పెరిగితే కాంగ్రెస్ కు తెలంగాణా లో పూర్తిగా సమాదే?

`తెలంగాణా ఇచ్చిన, తెచ్చిన పార్టీగా ప్రజల్లో కాంగ్రెస్ కు గుర్తింపు వుంది?

`అందుకే ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించింది?

`తెలంగాణా లో ఏ ఒక్క నాయకుడిని చూసి ప్రజలు గెలిపించలేదు?

`సోనియా గాంధీ తెలంగాణా ఇచ్చిన దేవత అని కాంగ్రెస్ ను గెలిపించారు?

`అధికారంలోకి వచింది కాంగ్రెస్ ను “బలి” చేయడానికేనా?

`కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎందుకు స్పందిచడం లేదు?

`మంత్రులు నోరెందుకు తెరవడం లేదు?

`తెలంగాణా ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ?

`ఏపీ లో మునిగినా త్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ?

`తెలంగాణా లో టీడీపీ పెరిగితే కాంగ్రెస్ కు తీరని నష్టం?

`కాంగ్రెస్ లో కరడు గట్టిన తెలంగాణా ఉద్యమ కారుల మౌనం దేనికి సంకేతం?

`బీఆరఎస్ కతమైతే పెరగాల్సింది కాంగ్రెస్ పార్టీ?

`తెలంగాణా లో తిరుగు లేని శక్తి గా మారాల్సింది కాంగ్రెస్ పార్టీ?

`ఆ పని వదిలేసి రేవంత్ టీడీపీ కి పునాదులు పడాలని కోరుకోవడం ఏమిటి?

`సీఎం రేవంత్ రెడ్డి స్వయం ప్రకటిత విచిత్ర రాజకీయం.

`కాంగ్రెస్ నాయకులకు రాజకీయ సంకటం!

`మంత్రులు ఈ విషయం పై ఎందుకు మౌనం?

`ఇదేమిటని ప్రశ్నించ లేని మంత్రుల దైన్యం?

`పదవుల్లో ఉంటే చాలనుకుంటున్న దౌర్భాగ్యం?

`కరుడు కట్టిన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తున్న ఆవేశం?

`పదవుల్లో వున్న నాయకులు పట్టించుకోక పోవడం విడ్డూరం?

`కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వెలసిన తెలుగుదేశం?

`కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేసింది తెలుగుదేశం?

`తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో సీఎం!

`కాంగ్రెస్ బలపడాల్సిన చోట తెలుగుదేశంకు సీఎం ఊతం

`బీఆర్ ఎస్ దిమ్మెలు కూల్చి కాంగ్రెస్ దిమ్మెలు కట్టాలని చెప్పాల్సిన సిఎం?

`తెలంగాణా లో టీడీపీ బలపడాలని సిఎం కోరుకోవడం విచిత్రం?

`ఇప్పటికీ రేవంత్ రెడ్డితో టీడీపీకి విడదీయలేని అనుబంధం?

`ఎన్టీఆర్ కు బీఆర్‌కు ఏం సంబంధం?

`ఎన్టీఆర్ ఆత్మ శాంతికి బీఆరఎస్ గద్దెలకు ఏమిటి వైచిత్యం?

హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ నుంచి పారిపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ జెండా తెలంగాణలో కోలుకోకుండా చేయాల్సిన బాధ్యత కల్గిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం సమాధి అవుతుందని తెలిసీ తెలంగాణ ఇచ్చిన పార్టీకాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లో బలంగా వున్నప్పటికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఓ రాష్ట్రంలో పార్టీనే త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్‌పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీని పునాదులతో సహా పెలికిలించాల్సిన బాధ్యత తీసుకోవాలి. కాని తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఊపిరిపోయాలనుకోవడం కాంగ్రెస్‌కు సమాది కట్టడడమే అవుతుంది. ఏ రకంగా చూసినా ఒక రాష్ట్రంలో అంతర్ధానమైపోయి, మరో రాష్ట్రంలో కూడా లేకుండా పోవడం అంటే కాంగ్రెస్ పార్టీ త్యాగానికే అర్దం లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను చరిత్ర కూడా క్షమించదు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలెరు నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేకపోవడం విడ్డూరం. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోతోంది. మరో వైపు బిజేపి పార్టీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను నరికేసుకుంటూ వస్తోంది. ఏకంగా తుడిచేస్తూ వస్తోంది. యాభై ఏళ్ల పాటు అప్రతిహాతంగా ఎదరులేని శక్తిగా నిలిచి, గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాలలో నూకలు లేకుండా పోతున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసింది తెలంగాణ. జీవం నింపింది తెలంగాణ. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కత్పు్ఞత తెలిపిన ప్రజలు తెలంగాణ ప్రజలు. కొన ఊపిరిని సైతం నిజ ఊపిరిని చేసింది తెలంగాణ రాష్ట్రం. ఆ ఆశతో, ఆ ధైర్యంతో దేశమంతా మళ్లీ పుంజుకునేలా చేయాల్సిన బాద్యత కాంగ్రెస్ నాయకుల మీద వుంది. కాని తన పార్టీని వదిలేసి, తెలంగాణ వద్దన్న పార్టీకి పునాదులు తవ్వాలని సిఎం. రేవంత్ చెబుతుంటే కాంగ్రెస్ నాయకులు వింటూ వుండడం విచిత్రంగా వుంది. తెలంగాణ కోసం బిఆరఎస్ కంటే ముందు ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. సొంత పార్టీకి 42 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి, తెలంగాణ ఇవ్వాలని కోరింది కాంగ్రెస్ పార్టీ. అదీ కాంగ్రెస్ పార్టీకి వున్న గొప్పదనం. ఓ వైపు తెలంగాణ వద్దనే నాయకులు, మరో వైపు తెలంగాణ కావాలనే నాయకుల మధ్య పదేళ్లపాటు నలిగిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కరవమంటే కప్పకుకోపం, విడవమంటే పాముకు కోపంలా వున్నా, తెలంగాణను బతికించాలన్న సంకల్పంతో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలపింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు మరింత అన్యాయం జరగకుండా చూసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఎవ్వరూ మరో పార్టీ ఎదగాలని కోరుకోరు. మరోపార్టీకి ఆశ్రయం కల్పించాలని ఆలోచించరు. కాని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు తెలుగుదేశం జెండాలతో కార్యకర్తలు హజరౌవడం ఏమిటి? అని తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది. పాలేరు నియోజకవర్గం ఏర్పాటై నాటి నుంచి తెలుగుదేశం పార్టీ ఏనాడు గెలిచింది లేదు. పాలేరులో బలంగా వున్నది లేదు. అలాంటి పాలేరులో తెలుగుదేశం పార్టీ పెరగాలనికోరుకోవడంలో ఆంతర్యమేమిటో సిఎం. రేవంత్ రెడ్డే చెప్పాలని తెలంగాణ వాదులు అంటున్నారు. అయినా ఖమ్మం అంటేనే కాంగ్రెస్ కంచుకోట. ఆది నుంచి కాంగ్రెస్‌కు పూర్తి స్దాయిలో పట్టున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వున్నప్ప్పుడైనా, తెలుగుదేశంపార్టీ అదికారంలోకి వచ్చినప్ప్పుడైనా కాంగ్రెస్‌దే పై చేయి. అయితే కాంగ్రెస్ లేకుంటే కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మం. అలాంటి ఖమ్మంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడ ఏపార్టీకి అక్కడ తావులేదు. 2014 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాదించింది. 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గణనీయమైన స్దానాలను గెల్చుకున్నది. 2023లో ఒక రకంగా స్వీప్ చేసింది. అలాంటప్ప్పుడు కాంగ్రెస్ మరింత పాతుకుపోయేలా చేయాలి. పునాదులు మరింత బలపడేలా చేయాలి. అదికారంలో వున్నందున ఖమ్మమంతా కాంగ్రెస్ మయం చేయాలి. ఇది కాంగ్రెస్ నాయకులు, పాలకులు చేయాల్సిన పని. అంతే కాని బిఆరఎస్‌ను బూచిగా చూపి, తెలుగుదేశం పార్టీకి ఊపిరిపోస్తే, కాంగ్రెస్‌కే తీరని నష్టమెదురౌతుంది. శత్రువుకు, శ్రత్రవు మిత్రుడు అనుకోవడం రాజకీయాల్లో సరైంది కాదు. తెలుగుదేశం, కాంగ్రెస్‌కు బిఆరఎస్ శత్రువనుకుంటే, తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కాంగ్రెస్‌కు మిత్రుడు కాలేదు. ఈ చిన్న సూక్ష్మం కాంగ్రెస్ నాయకులు మర్చిపోయారా? తెలంగాణ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న నాయకులు కూడా కాంగ్రెస్‌లో వున్నారు. పదేళ్లపాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులు అనేక మంది వున్నారు. అందులో మంత్రి పొన్నం ప్రభాకర్, ఒకప్ప్పుడు ఎంపిగా ఉద్యమం చేసిన ప్రస్తుత మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వున్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి వున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి వున్నారు. తెలంగాణ కోసం తన రాజకీయాలను త్యాగం చేసిన మధుయాష్కీ గౌడ్ వున్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ కురువద్దుడు వి. హనుమంతరావు వున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోఉప ముఖ్యమంత్రిగా వున్న దామోదర రాజనర్సింహ వున్నారు. ఇలా ఎంతో మంది సీనియర్ నాయకులు తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేశారు. రాహుల్ గాందీతో వున్న సాన్నిహిత్యంతో తెలంగాణ కోసం పోరాటం, ప్రయత్నం చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వున్నారు. కేవలం తెలంగాణ కోసం ఆనాడు మంత్రి పదవిని వదులుకొన్న ప్రస్తుత మంత్రి జూపల్లి కష్ణారావు వున్నారు. ఇంత మంది నాయకులు తెలంగాణలో ఇప్ప్పుడు తెలుగుదేశంపార్టీకి జీవిగంజి పోయాలనుకుంటున్నారా? సిఎం. రేవంత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారా? పరోక్షంగా మద్దతిస్తున్నారా? అయినా తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ మీద కోపంతో అన్నది నాయకులు మర్చిపోయారా? కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కేసేదాకా విశ్రమించేది లేదని 1999 ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు మాటలు మర్చిపోయారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలికితే పాతుకుపోయేది బిజేపి పార్టీ అనే సత్యం గ్రహించలేకపోతున్నారా? ఓ వైపు బిజేపి దేశమంతా కాంగ్రెస్‌ను ఊడ్చేస్తుంటే, తెలంగాణలో చేజేతులా కాంగ్రెస్ పార్టీ నాయకులే బిజేపికి జీవం పోస్తారా? కరుడు గట్టిన కాంగ్రెస్ నాయకులు తేల్చుకోవాల్సిన తరుణం వచ్చినట్లే వుంది. లేకుంటే కాంగ్రెస్‌కు పుట్టగతులు లేకుండాపోయే ప్రమాదం లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినా ఆదరించి, అదికారమిచ్చిన కాంగ్రెస్‌ను తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని శక్తిగా నిలబెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులది. ఏపిలో కూడా కాంగ్రెస్ బతికి బట్టకట్టేలా కాంగ్రెస్ నాయకులు కషి చేస్తే ఆ పార్టీ రుణం తీరుతుంది. అంతే కాని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేకుండాపోయేలా కాంగ్రెస్‌లో ఏ నాయకుడు ప్రవర్తించినా అది మోసమే? అవుతుంది. ఓ వైపు రాహుల్ గాంధీ కాలుకు బలపం కట్టుకొని దేశమంతా రెండుసార్లు పాదయాత్రలు చేసి, కాంగ్రెస్‌కు ఎలా ఊపిరిపోయాలా! అని కష్టపడుతుంటే కనీసం ఉడుత సాయం చేయాల్సిన నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాలకు స్వాగతం పలకడం విచిత్రం. కాంగ్రెస్ పార్టీలో కరుడుగట్టిన నాయకులు రాజకీయం ఎలా వుంటుందో ఉమ్మడి రాష్ట్రంలో చూడలేదా? పార్టీకి ఏ మాత్రం ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయని తెలిసినప్ప్పుడు సిఎం.లను కూడా దించేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులకువుంది. అలా కలిసి కట్టుగా, పార్టీని నిలబెట్టుకున్న నాయకులు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయారు. అయినా పదే పదే సిఎం. రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వ్యాఖ్యలు చేస్తుంటే పార్టీ అధిష్టానం ఏం చేస్తోంది? ఇక్కడి విషయాలు డిల్లీకి చేరడం లేదా? లేక నాయకులు డిల్లీ పెద్దలకు చెప్పడం లేదా? పుట్టి పూర్తిగా మునిగితే తప్ప తేరుకోలేరా? కాంగ్రెస్ అభిమానులే సిఎం. మాటలను జీర్ణించుకోవడం లేదు? అలాంటిది కాంగ్రెస్ నాయకులు ఎలా మౌనంగా వుంటున్నారన్నదే ప్రశ్న???

పాలకపక్షంలోనే ప్రతిపక్షం.. అనాదిగా కాంగ్రెస్ రాజకీయం!

`కాంగ్రెస్ లో అధికార యావ వున్నవాళ్ళే వుంటారు?

`సీఎం కావాలన్న కసితోనే పనిచేస్తారు?

`నాకేం తక్కువ అనే నాయకులే ఎక్కువగా వుంటారు?

`నచ్చని నాయకుడిని దించేసే దాకా రాజకీయం చేస్తూనేవుంటారు?

`ఇందిరా గాంధీ నే బహిస్కరించిన నేతలున్నారు?

`దేశమంతా కాంగ్రెస్ లో ఇలాంటి నాయకులే కనిపిస్తారు!

`ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో కనిపించే రాజకీయాలు అన్ని ఇలాగే వుంటాయి!

`1971 లో అత్యధిక మెజారిటీ తో కాంగ్రెస్ ను అధికారం లోకి తెచ్చిన పీవీ. నర్సింహారావు ను 13 నెలలు కూడా సీఎం గా ఉండనివ్వలేదు?

`జై ఆంధ్ర ఉద్యమం తెచ్చి కుర్చీ నుంచి దించేశారు?

`1989లో కాంగ్రెస్ ను అధికారంలో కి తెచ్చిన చెన్నారెడ్డిని హైదరాబాద్ లో అల్లర్ల పేరుతో దించేశారు?

`1992లో ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు అమ్ముకున్నట్లు ఆరోపణలు తెచ్చి నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి ని దించేశారు?

`కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతిపక్షం అవసరం లేదు?

`ప్రతిపక్షానికి పెద్ద పని ఉండదు!

`ఇప్పుడు కూడా అంతే.. ఎప్పుడైనా అంతే?

`ఇంకా కాంగ్రెస్ రాజకీయాలు ఒంట బట్టని సీఎం. రేవంత్ రెడ్డి.

`కాంగ్రెస్ లో అతి పెత్తనం కుదరదు.. అతి మేతకతనం పనికిరాదు?

`ఎంత సేపు బీఆరఎస్ వల్ల నష్టమని సీఎం రేవంత్ అనుకుంటున్నారు?

`అసలైన ఇబ్బంది కాంగ్రెస్ నుంచే అని ఇప్పటికి తెలుసుకోలేక పోతున్నారు?

`కాంగ్రెస్ లో ఉంటూ టీడీపీ ని పదే పదే సీఎం. రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.

`కరడు గట్టిన కాంగ్రెస్ నేతలకు ఆ మాటలు గిట్టవని తెలుసుకోలేక పోతున్నారు?

`పైకి సంతోషంగా ఉన్నా, లోలోన కాంగ్రెస్ నాయకులు రగిలిపోతున్నారు?

`గతంలో నాయకులు సీఎంల మీద కుట్రలు చేసేవారు?

`ఇప్పుడు సీఎం తమ మీద అపవాదులు సృష్టిస్తున్నారని అనుకుంటున్నారు?

`పదేళ్లు నేనే సీఎం అని అనుకున్నప్పుడు పదవి గురించి మాత్రమే ఆలోచించాలి?

`నాయకుల తలలో నాలుకలా సీఎం వుండాలి?

`తాజా పరిస్థితులలో అన్ని వేళ్ళు సీఎం వైపే చూపిస్తున్నాయి?

`వన్ షాట్ టు బొర్డ్స్ అనుకున్నట్లున్నారు?

`ఎక్కడో మిస్ ఫైర్ అయ్యింది…గురి తప్పి ఎదురు తిరిగేలా వుంది?

`తిన్నారు.. తిన్నారు.. అంటేనే కేసీఆర్ ను పక్కన పెట్టారు?

`ఎన్ని పథకాలు అమలు చేసినా బీఆరఎస్ అవినీతి చేసిందంటే జనం నమ్మి ఓడించారు?

`ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఒకరిమీద, మరొకరు బురద చల్లుకుంటున్నారు?

హైదరాబాద్,నేటిధాత్రి:                          అధికారంలోకి రావడానికి కొట్లాడతారు! అదికారంలోకి వచ్చిన తర్వాత కొట్లాడుకుంటారు!! ఇది అనాదిగా కాంగ్రెస్ పార్టీ గురించి ఎప్ప్పుడూ చెప్ప్పుకునే మాట. ప్రతిపక్షంలో వున్నప్ప్పుడు నాయకులంతా కలిసి వుంటారు. అదికారంలోకి రాగానే నాయకులుంతా ఆగం చేసుకుంటారు. ఒకరికొకరు పుల్లలు పెట్టుకుంటారు. ఒకరిపై ఒకరు పిర్యాదులు చేసుకుంటారు. ఒకరి కాళ్లు, ఒకరు పట్టుకొని లాగేసుకుంటారు. ఇది ఆ పార్టీ ఆనాటి నుంచి వున్న ఆనవాయితీయే అంటారు. 2004 వరకు ఈ పరిస్ధితి వుండేది. 2004 తర్వాత ఆ పరిస్దితిని వైఎస్ కొంత వరకు మార్చాడు. కాని మళ్లీ ఇప్ప్పుడు మొదలైంది. కాకపోతే అప్ప్పుడు నాయకులు, సిఎంలను బెదిరించేవారు. ఇప్ప్పుడు సిఎం. నాయకులను బెదిరిస్తున్నాడు? కట్టడి చేస్తున్నాడు? అనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ గందరగోళాలు ఎదురౌతున్నాయని తెలుస్తోంది. ప్రజా సేవ గాలికి వదిలేసి, పదే పదే రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. అందుకు సిఎం. రేవంత్ నుంచి మొదలు, నాయకులంతా అదే చేస్తున్నారు. నిత్యం కేసిఆర్ స్మరణ తప్ప మరేం చేసినట్లు కనిపించడం లేదు. అవినీతి లేదంటూనే ఎప్ప్పుడూ ఏదో ఒకటి తెరమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఏం చేశారంటే ప్రతిపక్ష బిఆరఎస్ మీద కేసులు వేస్తున్నాం…అవినీతి పరులుగా గత పాలకులను చిత్రీకరిస్తున్నామని చెప్ప్పుకుంటున్నారు. లోలోన పార్టీలో జరిగే కుట్రలను మాత్రం పెంచిపోషించుకుంటున్నారు. పదేళ్ల తర్వాత పార్టీని అదికారంలోకి తీసుకొచ్చిన ఘనత దక్కించుకున్న సిఎం. రేవంత్ రెడ్డి ఇటీవల విమర్శల పాలౌతున్నారు. తనకు తానుగా చేసుకుంటున్నారా? లేక నాయకులనుంచి ఎదుర్కొంటున్నారా? అన్నది తేలాల్సి వుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వార్త తెలంగాణ రాజకీయాýను ఒక్క కుదుపు కుదిపేసింది. కాంగ్రెస్ అధికారంలో వుంటే ప్రతిపక్షానికి పని వుండదన్న మాటను మరోసారి రుజువు చేస్తున్నారు. ప్రతిపక్షానికి అవకాశమివ్వకుండా తమకు తమే గోతులు తవ్వుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సిఎం. అవుతారని జనం అనుకున్నారు. కాని ఎన్నికల తర్వాత నేనే సిఎం. అని అనుకున్న వారు కూడా చాలా మంది వున్నారు. తెలంగాణ రాకముందు కూడా ఇదే వుండేది. తెలంగాణ వస్తే తానే సిఎం. అని అప్ప్పుడే అరడజను మంది నాయకులు చెప్ప్పుకునేవారు. కాని వారి ఆశలు అప్ప్పుడు నెరవేరలేదు. ఇప్ప్పుడైనా నెరవేరుతాయా? అనుకుంటే రేవంత్ రూపంలో వారికి సిఎం. అయ్యే అవకాశం దక్కలేదు. అయినా నాయకులు సర్ధుకుపోతున్నారు. పాలనలో భాగస్వాములౌతున్నారు. తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇటీవల వరుస సంఘటలన్నీ ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా సిఎం. రేవంత్ వైపే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీకి అసలే మంచిదికాదు. అందుకు కారణం కూడా సిఎం. రేవంత్ అనే మాటలు బలంగా కాంగ్రెస్‌లోనే వినిపిస్తున్నాయి. తాజా సంఘటనకు ముందు ఓ రెండు నెలల క్రితం సిఎం. రేవంత్ రెడ్డి క్యాబినేట్‌లో మంత్రులకు క్లాస్ తీసుకున్నాడు?అనే వార్త ఓ దినపత్రికలో ప్రదానంగా వచ్చింది. అప్ప్పుడే విబేదాలకు ఆజ్యం పడింది. అలా వార్త వచ్చినప్ప్పుడే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డ స్పందించారు. సిఎం. రేవంత్ క్లాస్ తీసుకోవడమేమిటి? అనే మాటలు సన్నిహితుల వద్ద అన్నారు. ఆనాడే సిఎం. రేవంత్ రెడ్డి ఆ పత్రిక వ్యాసం మీద స్పందిస్తే ఆ సమస్య అక్కడితో ఆగిపోయేది. కాని ఆ సమయంలో సిఎం. మౌనం వహించారు. ఇప్ప్పుడు మా మంత్రుల మీద వార్తలు వస్తే సహించేది లేదంటున్నారు. ఆదిలోనే సిఎం. స్పందించి వుంటే, మంత్రుల మధ్య, సిఎం. రేవంత్ మధ్య దూరానికి అవకాశమే వుండేది కాదు. పైగా ఈ మధ్య ఓ చానల్‌లో వచ్చిన కథనంపై వెంటనే సిఎం. స్పందిస్తే పరిస్దితి మరోలా వుండేది. కాని ఆయన చిలికిచిలికి గాలి వానగా మారే దాకా స్పందించలేదు. పైగా ఇదే విషయంపై ఓ దినపత్రికలో, టివి. చానల్‌లో వచ్చిన తెలిసీ తెలియని పలుకులు వినిపించాయి. ఆ కధనంలో దీనంతటి వెనుక వున్న మతలబులో సిఎం. రేవంత్ స్పష్టంగా కనిపిస్తున్నట్లు తేలిపోయింది. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియకుండానే పోలీసు అదికారులు సిట్ వేశారని పత్రిక చెప్పడం వల్ల రేవంత్ ఇమేజ్ డ్యామేజే అవుతుంది తప్ప, పెరగదు. ఆ మాత్రం సోయి లేకుండా ఓ పత్రికాదిపతి తన చెప్పేశారు. అంటే సిఎం. రేవంత్‌ను సేఫ్ జోన్‌లో వుంచాలనుకునే ఉద్ధేశ్యమే అయినా, సిఎం చేతిలో కంట్రోల్ లేదని తేల్చినట్లైంది. పైగా జరిగిన దానిలో అంతర్యాన్ని ఆయన బహిర్గం చేశారు. మంత్రుల పేర్లు చెప్పేశారు. బొగ్గు గని లీజు సంగతి అని తేల్చేశారు. ఇద్దరు మంత్రుల మధ్య జరుగుతున్న పోరుగా చిత్రీకరించారు. ఇద్దరు ఒక రకంగా సిఎం. రేవంత్‌కు ఎదరులేకుండా చేయాలని ఆ పత్రిక అనుకొని కథనం వండి వార్చింది. కాని మిస్ పైర్ అయ్యింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలుగా రాజకీయం మారుతుందనుకున్నారు. కుదరలేదు. ఇప్ప్పుడు ఎవరు యూటర్న్ తీసుకునే పరిస్తితి లేకుండా చేసుకున్నారు. ప్రజల దష్టిలో అవినీతి ఏ మేరకు జరుగుతుందో తమకు తామే చెప్ప్పుకున్నట్లు చేశారు. ఇదిలా వుంటే సిఎం. రేవంత్‌రెడ్డి చేసిన కొన్ని కీలకమైన వ్యాఖ్యల వల్ల అటు కాంగ్రెస్ నాయాకులు, ఇటు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్తితి తెచ్చారు. తెలంగాణలో బిఆరఎస్ దిమ్మెలు కూల్చితే, ఏర్పాటు చేయాల్సినవి కాంగ్రెస్ గద్దెలా? టిడిపి గద్దెలా? అనేది ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలి. పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం ఎదగాలనుకోవడంలో ఆంతర్యం కూడా కాంగ్రెస్ నాయకులకు అర్ధం కావాలి? కాంగ్రెస్‌ను లేకుండా తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో వచ్చిందే తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్‌ను వెయ్యి మీటర్ల లోతులో పూడ్చిపెట్టాలని చెప్పింది చంద్రబాబు నాయకుడు. కాంగ్రెస్ నాయకులను కుక్క మూతి పిందెలు అని ఎద్దేవా చేసింది ఎన్టీఆర్. అలాంటి తెలుగుదేశం పార్టీకి మళ్లీ పునాది వేయాలని కాంగ్రెస్ పార్టీ సిఎం. రేవంత్ రెడ్డి చెప్పడం అనేది కాంగ్రెస్‌కు తీరని నష్టాన్ని మిగిల్చుతుంది. పైగా సిఎం. పదవిలో వున్న రేవంత్‌రెడ్డి గద్దెలు కూల్చమని చెప్పడమే రాజ్యాంగరిత్యా ఎంత వరకు సమంజసమో? ఆయనే చెప్పాలి. శాంతిభద్రతలను కాపాడాల్సిన సిఎం. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల బిఆరఎస్ గద్దెలు కూల్చితే పోలీసులు కేసులు ఎదుర్కొని,జైలుపాలయ్యే వారి జీవితాలను ఎవరు భరోసా ఇస్తారు? నిజానికి కాంగ్రెస్ పార్టీలో వుంటూ ఇన్ని రకాల వ్యాఖ్యలు చేస్తున్నా నాయకులు ఎంత సంయమనంతో వుంటున్నారు అంటే రేవంత్ రెడ్ది ఎంతో అదష్టవంతుడు. ఆ అదష్టాన్ని ఆయన చేజేతులా చెడగొట్టుకుంటున్నారని మాత్రం అర్దమౌతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పివి. నర్సింహారావును కనీసం 13 నెలలు కూడా సిఎం. సీట్లో కూర్చొనివ్వలేదు. ఆయనను పదవిలో నుంచి దించేయడానికి ఏకంగా జై ఆంద్రాఉద్యమాన్ని తెచ్చి పివిని దించేశారు. దేశాన్ని ఎదురులేకుండా ఐదేళ్లపాటు పాలించి పివి. ఆంధ్రప్రదేశ్‌ను పట్టుమని పదిహేను నెలలు పాలించలేకపోయారు. తర్వాత 1989లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన చెన్నారెడ్డిని ఏడాది తిరగకుండానే పాతబస్తీలో అర్లర్ల పేరుతో పదవి నుంచి దింపేశారు. కాంగ్రెస్ నాయకులు అంత స్ట్రాంగ్‌గా వుండేవారు. తర్వాత కాలంలో ఏపికి ఐటిని, ప్రైవేటు ఇంజనీరిగ్ విద్యను పరిచయం చేసి, టెక్నాలజీ రంగంలో ఏపి దూసుకపోయేలా చేసిన నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిని ఇంజనీరింగ్ సీట్ల విషయంలో లేని పోని వివాదాలు సష్టించి దించేశారు. రెండేళ్లు గడుస్తున్నా రేవంత్‌రెడ్డిపై ఎవరూ తిరుగుబాటు చేయడం లేదు. అందుకు సంతోషించాల్సిన సిఎం. రేవంత్‌రెడ్డి తనకు తానుగానే కొన్ని ఇబ్బందికరమైన పరిస్ధితులను కొని తెచ్చుకుంటున్నారని చెప్పక తప్పదు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయలేకపోయినా, చేస్తున్నామని చెబుతున్నా జనం కాలం గడవనీ అనుకుంటున్నారు తప్ప, ఎక్కడాఉద్యమాలు చేయడం లేదు. కాని రేవంత్ ఓ వైపు టిడిపిని పెంచాలని చూస్తే మాత్రం కాంగ్రెస్ నుంచి తొలి తిరుగుబాటు తెచ్చుకుంటారని చెప్పడంలో సందేహం లేదు.

సమ్మక్క తీర్థం..భూతల మహిమాన్వితం!

`మేడారం మిల మిల..కొత్త తోరణాలతో తళ తళ.

`ఆదివాసీ గిరిజన జాతర వైభవం!

`ఏడు వందల ఏళ్ల చరిత్రకు నిదర్శనం.

medaram 2026

`రాజులపై సామాంతుల తొలి తిరుగుబాటు సంతకం.

`వీర వనితల పోరు చరిత్రకు సజీవ సాక్ష్యం.

`వీర వనితలు దేవతలు గా అదృష్యమైన గొప్ప వేదిక మేడారం.

`ప్రజలకు రక్షణగా నిలుస్తూ దీవెనలిస్తున్న దైవాలా గద్దెలు.

`మేడారం వ్యాప్తంగా ప్రజలను చల్లగా చూస్తున్న అమ్మల దీవెనలు.

medaram 2026

అమ్మల వేడుకకు ప్రజా ప్రభుత్వంలో సరికొత్త హంగులు!

`పతిష్టమైన అద్భుత కట్టడాలు.

`వందల ఏళ్ల దాకా చెక్కు చెదరకుండా నిర్మాణాలు.

మంత్రులు శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్కల పట్టుదలకు నిదర్శనాలు.

`మంత్రులు దగ్గరుండి పనుల పర్యవేక్షణలు.. పరిశీలనలు.

`ఎప్పటికప్పుడు సమీక్షలు.. సంప్రదింపులు.

`ఆదివాసీలా సంసృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణ పనులు.

ఆరు నెలలుగా మంత్రులు పడుతున్న శ్రమకు నిదర్శనాలు.

`అద్భుతమైన రోడ్లు… దశబ్దాలైనా చెక్కు చెదరకుండా ప్రాంగణ పరిసరాలు.

`నిరంతరం భక్తులకు సకల సౌకర్యాలు.

`ఒకప్పుడు జాతర సమయం లోనే భక్తులు వచ్చేవారు.

`ఇప్పుడు నిరంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

`అమ్మవార్ల చెంత నిద్రలు చేస్తున్నారు.

`అందుకు అనువైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల ముందు సీఎం రేవంత్‌ రెడ్డి మొక్కలు కోరుకున్నాడు.

`సీఎం రేవంత్‌ మేడారం అభివృద్ధి చేస్తామని చెప్పారు.

`ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నారు.

`ఆదివాసీల ఆత్మ గౌరవం కోసం పాటుపడుతున్నారు.

`జనమే వనమై… అమ్మలు కోలువై!

`తల్లుల దీవెనల కోసం భక్తుల ఆరాటం.

`దండుగా భక్తులు చేరుకుని అమ్మలను దర్శించునే భాగ్యం.

`రెండేళ్ల కోసారి మూడు రోజుల జనారణ్యం!

`పూజలతో పులకించే పవిత్రమైన ప్రాంతం.

`అమ్మలు నడ యాడిన విశేషమైన సుందర లోకం.

గొప్ప ఆధ్యాత్మిక ప్రపంచం…అమ్మల నామస్మరణతో మార్మోగే అరణ్యం.

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                             

 మేడారం అంటే ఓ గుడారం కాదు. ఓ కుగ్రామం అసలే కాదు. ఆదివాసీల ప్రజల రాజ్యం. పగిడిద్ద రాజు సంస్ధానం. ఆ రాజ్యాన్ని కాపాడిన దైవాంశ సంబూతురాలు సమ్మక్క. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతానికి దేవుడిచ్చిన వరం. సమ్మక్క దేవతా రూపం. ఇప్పటికీ మేడారాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న దేవతా మూర్తి సమ్మక్క. ఆ ప్రాంతానికి ఇలవేల్పు సమ్మక్క. ఆనాటి నుంచి నేటి వరకు పాలకుల చేత పూజలందుకుంటున్న ఇష్టదై వం సమ్మక్క. ఆదిశక్తికి ప్రతిరూపం. ప్రజలను కాపాడుకుంటున్న కుల దైవం. ఇప్పటికీ కొలిచే వారందరికీ కొంగు బంగారం. అడవిలో వెలసిన ఆడబిడ్డల ప్రతిరూపం. కుంకుమ బరిణ రూపంలో దర్శనమిస్తూ రెండేళ్లకోసారి పూజలందుకుంటున్న తీర్ధం. మేడారం మహిమాన్విత ప్రాంతం. ఆత్మగౌరవ పోరాటానికి తొలి సంతకం. తొలి చైతన్యానికి నిదర్శనం. తిరుగుబాటకు సంకేతం. ఎదిరించే నిలిచే గుండె ధైర్యానికి ఆదర్శం. తరతాలకు చెరగని, తరగని గుండె నిబ్బరాన్ని నింపిన కొండంత ఆశయం. అలాంటి మేడారంలో అడుగుపెడుతుంటేనే మనసు పులకించిపోతోంది. ఏదో ఒక శక్తి ఆవహించినంత సంతోషం కలుగుతుంది. జీవితం మీద ఆశలే కాదు, ఆశయాలు, ఆరోగ్యాలు, ఆనందాలు వెల్లివిరుస్తాయి. అందుకే మేడారం అంటేనే ఒక అద్భుమైన భావన. మేడారం తీర్దమనేది గొప్ప బావన. మనసుకు అనుభూతి నింపే దీవెన. సరిగ్గా ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి రాజరిక పాలనలో పీదనకు వ్యతిరేకంగా ఆదివాసీలు సాగించిన ఆత్మగౌరవం పోరాటం. రాజులకు ఎదిరించి నిలిచిన దీర వనితల ఆత్మత్యాగం. అంత గొప్పది మేడారం చరిత్ర. అరివీర భయంకరంగా ఆదిశక్తులుగా మారి తల్లి కూతుళ్లయిన సమ్మక్క..సారక్కలు సాగిస్తున్న యుద్దాన్ని తట్టుకోలేక వెన్నుపోటు పొడిచి అమ్మలను చంపాలని చూశారు. కాకతీయ కాలంలో జరిగిన ఈ యుద్దం ఆనవాలు ఇంకా సజీవంగానే వున్నాయి. ఆ యుద్దంలో ప్రత్యర్ధులకు యుద్దఖైదీలుగా చిక్కకుండా వారి చేతుల్లో ప్రాణాలు పోకుండా వుండేందుకు చిలకలగుట్టమీదకు వెళ్లి అదృష్యమైన ఆదిశక్తి రూపాల అవతారాలే సమ్మక్క సారక్కలు. మేడారం గూడెంలో దైర్యం నింపారు. వారికి రక్షణగా నిలిచారు. దేవతలుగా మారి అడవినంతా కాపాడారు. కాకతీయ రాజుల నుంచి మేడారం ప్రాంతాన్ని కాపాడుకున్నారు. ఆదివాసీల రాజ్యాన్ని కాపాడారు. నాటి నుంచి నేటి వరకు ఆదివాసీలను కంటికి రెప్పలా కాపాడుకుం టున్నారు. వాళ్లే సమ్మక్క…సారక్కలు. యుద్దంలో వెన్ను చూపని వీరవనితలు, గాయాల బారిన పడిపోయారు. వెన్ను పోటును తట్టుకొని కాకతీయులకు చిక్కకుండా చిలకలగుట్టకు చేరుకున్నారు. ఆ తర్వాత మాయమైపోయారు. ఇది తెలిసిన కాకతీయ రాజులు భయపడ్డారు. అప్పటి నుంచి మేడారం వైపు చూడాలంటే జడుసుకున్నారు. ఏ కాకతీయ రాజుల మూలంగా ఎలా చనిపోయారో కాకతీయ కడపటి రాజు కూడా అలాగే చనిపోవడం ఖర్మఫలితం. సంపెంగ వాగులో దూకి చనిపోయేలా జంపన్నను ఎలా చిత్రహింసలు పెట్టారో అదే తరహాలో కాకతీయ రాజుల కడపడి రాజు ప్రతాపరుద్రుడు కూడా నర్మదా నదిలో దూకి చనిపోవాల్సిన పరిస్దితి ఎదురైంది. ఇది అమ్మల ప్రతీకారమని ఇప్పటికీ చెప్పుకుంటారు. అప్పటి నుంచి రెండేళ్లకోసారి మూడు రోజుల పాటు, ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం, ఆదివాసీ పూజారులు సమ్మక్క, సారలమ్మ తీర్దాన్ని నిర్వహిస్తుంటారు. కన్నె పల్లి గుట్టల నుంచి సారలమ్మను మొదటి రోజు తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్టిస్తారు. రెండో రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. సమ్మక్కను తీసుకొచ్చేపప్పుడు ప్రభుత్వం ఎస్పీ ఆధ్వరంలో గాలిలోకి కాల్పులు కాల్పులు జరుపుకుంటూ అమ్మవారిని తీసుకొస్తారు. ఇద్దరు తల్లులు మూడో రోజు భక్తులకు దర్శనమిస్తారు. ఇలా మూడు రోజుల పాటు సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద జాతర ఒక్క మేడారంలోనే జరుగుతుంది. ఈ మూడు రోజుల పాటు సాగే జాతరకు సుమారు 10 కోట్ల మంది భక్తులు హజరౌతుంటారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ నుంచే కాకుండా, కర్నాకట, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, మధ్య ప్రదేశ్‌, ఒరిస్సాల నుంచి పెద్దఎత్తున ఆదివాసీ గిరిజనునలతోపాటు, ప్రజలు కూడా హాజరౌతుంటారు. 1996లోనే సమ్మక్క జాతరను రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వంగుర్తించింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అదికారికంగా మరోసారి ప్రకటించింది. కుంభమేలను తలపించేలా జనం తండోపతండాలుగా కోట్లలో హజరౌతుంటారు. అమ్మకు మొక్కులు చెల్లిస్తుంటారు. అమ్మవారికి అంత్యంత ప్రీతిపాత్రమైన బంగారాన్ని నిలువెత్తు సమర్పిస్తారు. ఆమ్మను తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ నిలువెత్తు బెల్లం సమర్పిస్తామని మొక్కుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే పేరుకు ఆదివాసీ జాతరే అయినా కోట్లాది మంది ప్రజలకు ఇలవేల్పులుగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా సమ్మక్క తల్లి కొలువబడుతోంది. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. 

తాడ్వాయి మండలంలోని మేడారానికి వెళ్లాలంటే ఓ ముప్పై నలభై ఏళ్ల క్రితం వరకు కొంత గగనమే.. అడవిలో వున్న సమ్మక్క, సారలమ్మల దర్శనానికి భక్తులు కేవలం జాతర సమయంలోనే వెళ్లేవారు. మిగతా సమయాల్లో వెళ్లాలంటే భయపడేవారు.చుట్టూ వుండే అడవిలో క్రూరమృగాలు సంచరిస్తూ వుండేవి. సమ్మక్క , సారలమ్మ గద్దెల సమీపంలో కూడా పులులు సంచరిస్తూ వుండేవని పెద్దలు చెబుతుంటారు. పైగా అక్కడ వసతులు వుండేవి కాదు. మేడారం జాతర సమ యంలో తప్ప ప్రభుత్వ బస్సులు కూడా నడిచేవి కాదు. ప్రజలకు కూడా ఇప్పటిలాగా కార్లు అందుబాటులో లేవు. రోడ్లు కూడా సరిగ్గా వుండేవి కాదు. 1990 తర్వాత సౌకర్యాల కల్పన మొదలైంది. అయితే జాతర సమయాల్లో తాత్కాలిక సదుపాయాలు కల్పించేవారు. ఇలా ప్రతి రేండేళ్లకోసారి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టేవారు. ఎందుకంటే ఆ సమయంలో మాత్రమే భక్తులు వచ్చేవారు. నాలుగో రోజు ప్రజలు అక్కడ వుండడానికి కూడా భయపడేవారు. మూడు రోజుల పాటు వనమంతా నిండిన జనం, నాలుగో రోజు మేడారం నిర్మాణుష్యమయ్యేది. ప్రభుత్వం కూడా ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపొమ్మని కోరేది. కాని ఇప్పుడు శాశ్వత సౌకర్యాల కల్పన జరిగింది. మూడువందల అరవైఐదు రోజుల పాటు భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మల సన్నిదిలో నిద్రలు చేస్తున్నారు. మొక్కులు తీర్చుకొని అక్కడే బస చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం అదికారంలోకి వస్తే, సమ్మక్క, సారక్క జాతరలను నభూతోన భవిష్యతి అనేలా నిర్వహిస్తామని, మేడారాన్ని శాశ్వత నిర్మాణాలతో అభివృద్ది చేస్తామని, మేడారానికి భక్తులు రావడానికి అవసరమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అద్భుతంగా కల్పిస్తామని సిఎం. రేవంత్‌ రెడ్డి మొక్కుకున్నారు. ఆ మొక్కులు తీరేలా ఆదివాసీ సంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారానికి కొత్త కొత్త హంగులు తీసుకొచ్చారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి సురేఖలు గత ఆరు నెలలుగా మేడారాన్ని దగ్గరుండి అభివృది చేయిస్తున్నారు. రాష్ట్ర ఫ్రభుత్వం అందుకోసం రూ.300 కోట్లు కేటాయించింది. గత రెండేళ్ల క్రితం జాతరకు వచ్చిన భక్తులు కూడా ఇప్పుడున్న మేడారం పరిసరాలను గుర్తుపట్టలేరు. కొన్ని సంవత్సరాలైనా సరే చెక్కు చెదకుండా వుండేలా రోడ్లతోపాటు, మేడారం గద్దెల ప్రాంగణాలతోపాటు, చుట్టుపక్కల పరిసరాలన్నీ పటిష్టమైన నిర్మాణాలతో తీర్చిదిద్దుతున్నారు. పైగా ఇప్పటి వరకు గద్దెల చుట్టూ ఇనుప కంచెలు వుండేవి. ఇప్పుడు గ్రానైట్‌ రాయితో కూడిన, శతాబ్దాల పాటు చెక్కుచెదరని గద్దెల నిర్మాణం చేపట్టారు. గద్దెల నుంచి మొదలు, ఆలయ ప్రాంగణమంతా గ్రానైట్‌ రాయితో ఆలయ స్వరూపం తీసుకొచ్చారు. తోరణాలను నిర్మాణం చేశారు. ఆ తోరణాలపై ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలను ఆదివాసీ బాషలో చెక్కడం జరిగింది. సమ్మక్క సారక్కల కుటుంబ చరిత్రలోపాటు, వారి వంశస్తులు, పూర్వీకుల గురించి తెలిసేలా బొమ్మల లిపిలో వుండే ఆదివాసీ బాషలో రాయిపై వాటిని చెక్కారు. శతాబ్దాలపాటు చెక్కు చెదరకుండా, భవిష్యత్తు తరాలు ఆదివాసీ చరిత్రను మర్చిపోకుండా గుర్తు చేసేలా నిక్షిప్తం చేశారు. మేడారాన్ని ఇలా తీర్చిదిద్ది సిఎం. రేవంత్‌ రెడ్డి తన మొక్కులు చెల్లించుకున్నారు. జాతర చరిత్రలోనే తొలిసారి ప్రజా ప్రభుత్వం క్యాబినేట్‌ మీటింగ్‌ కూడా ఏర్పాటు చేశారు. మేడారం రాజ్యంలో తల్లుల సన్నిధిలో తెలంగాణ ప్రభుత్వ మంత్రుల సమావేశం…అధ్భుత నిర్ణయం.

కారు దిగలేదు.. పార్టీ మారలేదు!

రెండో సారి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ రెండో సారి సంచలన తీర్పు.

`మూడోసారైన మిగతా ఎమ్మెల్యే లపై ఇలాంటి తీర్పే ఇస్తారా?

`ఎన్నికల కమీషన్‌ తో డీ కొంటారా?

`ఎప్పటికైనా పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు వేయాల్సిందే?

`ఆఖరు నిమిషం లో నైనా నిర్ణయం ప్రకటించాల్సిందే?

`ఇవి మధ్యంతర తీర్పులే అనుకోవాల్సిందే?

`గత బీఆర్‌ఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ కోర్టును ఆశ్రయించలేదు?

`అందుకే అప్పటి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదు?

`ఆ అవసరం కూడా అప్పటి స్పీకర్లకు రాలేదు?

`ఉమ్మడి రాష్టంలో పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లపై ఆఖరు దశలో చర్యలు తీసుకున్నారు?

`ఈ సారి అదే వ్యూహం అమలు చేయాలని చూస్తున్నట్టున్నారు?

`ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్యే లను రాళ్లతో కొట్టండి అని సిఎం రేవంత్‌ చెప్పారు?

`అప్పుడు అధికారంలోకి రాలేమనే ఆలోచనతో చెప్పారా?

`అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లోనే మాట మార్చారు?

`పది మంది ఎమ్మెల్యే లను చేర్చుకున్నారు?

`ఇప్పుడు కిటికీ లే తెరిచాను.. దార్వజ తెరిస్తే బి ఆర్‌ ఎస్‌ లో ఒక్కరు ఉండరన్నారు?

`పార్టీ మారిన ఎమ్మెల్యేలు మారినట్లు కూడా చెప్పారు?

`నిన్నటికి నిన్న పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కాలే యాదయ్య లపై క్లీన్‌ చిట్‌ ఇచ్చారు?

`అందరు స్పీకార్లు నారాయణ రావు లా ఎందుకు లేరు?

`స్వతంత్రంగా ఎందుకు వ్యవహరించడం లేదు?

`కనీసం యనమల రామ కృషుడుకు వున్న దైర్యం ఎందుకు లేదు?

`కనీసం ఆలపాటి ధర్మారావ్‌ లాగా కూడా ఎందుకు లేరు?

`ఆనాడు నాయకుల దైర్యం వేరు.. ఆ విలువలు వేరు?

`ఇప్పుడు పాలక పక్షం చెప్పింది వినకుండా ఉండలేరు?

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                                  

  తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాబిరామ వినుర వేమ అని చెప్పినట్టే వుంది మొత్తం కధ. ఎన్నికల ముందు ఏం చేప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎన్నికల సభల్లో ఎక్కడికెళ్లినా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అని పిలుపునిచ్చారు. కాని ఎన్నికలయ్యాక, గెలిచాక ఆ మాట మర్చిపోయారు. ఇతర పార్టీల నుంచి ఎన్నికైన సభ్యులను చేర్చుకున్నారు. గత పాలకులు చేసినప్పుడు తప్పుగా తోచి ంది. ఇప్పటి పాలకులకు ఒప్పుగా మారింది. అయ్యవారు ఉల్లిపాయ తినొద్దని చెప్పారు. అంటే తాము తినొద్దని కాదన్నట్లు వుంది. తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు ప్రజా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నామని కూడా చెప్పారు. అది కూడా నియోజక వర్గ అభివృద్ది కోసం, ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడానికే పార్టీ మారుతున్నామన్నారు. సంతోషం..కాని పార్టీ మారుతున్నట్లు అప్పుడు చెప్పినట్లు ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే బి ఆర్‌ఎస్‌ పార్టీ కోర్టుకు వెళ్తుందని పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఊహించలేదు. కోర్టు తలుపు తట్టి తమను అనర్హులుగా ప్రకటించేవరకు కొట్లాడతారని అసలే అనుకోలేదు. గతంలో పార్టీ మారిన వారు ఎలా పదవులు అనుభవి ంచారో తాము కూడా అలాగే పదవుల్లో కొనసాగుతామనుకున్నారు. కాని తలనొప్పి వస్తుందని అనుకోలేదు. అంతే కాదు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నామేమో అని అసలే అనుకోలేదు. సిఎం. రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు పార్టీలో చేరారు. ఆయన అభయంతో కండువా మార్చుకున్నారు. అయితే ఓ వైపు కేంద్రంలో ప్రదాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాత్రం చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతుంటారు. పార్లమెంటులో పదే పదే రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మాట్లాడుతుంటారు. రాజ్యాంగాన్ని కాపాడేది కాంగ్రెస్‌ పార్టీయే అంటారు. మరి తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇతర పార్టీలలో గెలిచిన వారిని తమ పార్టీలో చేర్చుకోవద్దని సూచించలేదు. ఏకంగా కడియం శ్రీహరి లాంటి వారికి అధిష్టానమే కండువా కప్పి మరీ పార్టీలోకి తీసుకున్నది. ఇది ద్వంద్వ విధానం కాదా? అని బిఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తుంటే అసలు పది మంది ఎమ్మెల్యేలలో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్‌ తేల్చేశారు. తీర్పునిచ్చారు. నెల రోజులు క్రితం ఓ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని చెప్పారు. తాజాగా సంక్రాంతి రోజున ఇద్దరు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలెయాదయ్యలు పార్టీ మారలేదని తీర్పు చెప్పేశారు. ఆ మరునాడే సుప్రింకోర్టులో కేసు వుండడంతో చివరి క్షణంలో ఈ తీర్పును గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చెప్పేశారు. అయితే కోర్టు మరోసారి స్పీకర్‌ తీరుపై అసహనం వ్యక్తంచేసింది. ఇప్పటికే మూడు నెలలు గడువు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరింత గడువు కావాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కోరడం జరిగింది. దాంతో మరో రెండు వారాలు సుప్రింకోర్టు గడువును ఇవ్వడం జరిగింది. ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొని వుంది. మొత్తంగా ఇప్పటి వరకైతే ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదు. కారు దిగినట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు అనిపించచలేదు. ఆ మధ్య ఐదురుగు పార్టీ మారినట్లు విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై స్పీకర్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. ఆ ఐరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు తనకు ఎలాంటి ఆదారాలు కనిపించలేదని తేల్చేశారు. వాళ్లు బిఆర్‌ఎస్‌ పార్టీలో వున్నట్లు స్వయంగా ఆ ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలను రికార్డు చేయడం జరిగింది. తాము పార్టీ మారలేదని ఘంటా పధంగా వారు చెప్పారు. స్పీకర్‌ పూర్తిగా నమ్మారు. తన తీర్పును వెలువరించారు. తర్వాత సరిగ్గా సంక్రాంతి పండుగ నాడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా పండుగ లాంటి వార్తను అందించారు. వారి రాజకీయ జీవితానికి కొత్త కాంతిని సంక్రాంతి రోజు ప్రసాదించారు. ఎక్కడా ఈ ఏడుగురు ఎమ్మెల్యే విషయంలో తనకు ఎలాంటి రుజువులు లభి ంచలేదు. పైగా పార్టీ మారినట్లు ఆరోపించి, స్పీకర్‌కు పిర్యాదు చేసిన వారు కూడా సూటిగా, స్పష్టంగా ఎలాంటి ఆదారాలు సమర్పించలేదు. వారు అంది ంచిన ఆదారాలలో నిజాలు కనిపించలేదు. అసలు వారు పార్టీ మారినట్లు తనకు స్పష్టత రాలేదు. అందుకే ఏడుగురు ఎమ్మెల్యేపై పిరాయింపు కేసును కొట్టేస్తున్నట్లు స్పీకర్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. ఇది స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు వున్న విశేష అదికారాలతో ఇచ్చిన తీర్పు. ఆయన తీర్పును ఇప్పుడు ప్రశ్నించినంత మాత్రాన ఇప్పటికప్పుడు జరిగేదేమీ లేదు? ఇక మరో ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. వారిలో మరీ ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుంచి ఎంపిగా పోటీ చేసిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిల విషయంలో తీర్పు ఎలా వుండబోతోందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నా, ఆ తీర్పు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సుప్రింకోర్టు ఆదేశాలను ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ సరిగ్గా అర్దం చేసుకోలేదో ఏమో కాని, ఏదో ఒక తీర్పు వెల్లడిరచాలని మాత్రమే ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్‌ తీర్పు కూడా అందుకు అనుగుణంగానే వుంది. అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న మాట. ఎందుకంటే సుప్రింకోర్డు పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెంటనే సప్పెండ్‌ చేస్తారా? లేదా? అని హెచ్చరించలేదు. ఏదో ఒక నిర్ణయం వెల్లడిస్తారా? లేదా? అనేది మాత్రమే సుప్రింకోర్టు చెప్పినట్లు స్పీకర్‌కు అర్దమైనట్లుంది. అందుకే ఆయన పార్టీ పిరాయించినట్లు ఆరోపించడబడుతున్న ఎమ్మెల్యేలకు ఊరట ప్రసాదించారు. వీటన్నింటిపై మళ్లీ బిఆర్‌ఎస్‌ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్దితి వుంది. అక్కడ కూడా వాయిదాల పర్వంతో మరింత కాలం కాలయపన తప్పదు. ఆ తర్వాత స్పీకర్‌ తీర్పును కోర్టు సమర్ధిస్తే బిఆర్‌ఎస్‌ చేసేదేమీ లేదు. ఒక వేళ మళ్లీ బిఆర్‌ఎస్‌ సుప్రింకోర్టు తలుపు తడితే అక్కడ ఈ అంశం కొలిక్కి వచ్చే వరకు పుణ్య కాలం పూర్తి కావొచ్చు. అప్పుడు ఎలాంటి తీర్పు వచ్చినా జరిగేదేమీ లేదు. బిఆర్‌ఎస్‌కు ఒరిగేదేమీ లేదు. అయితే నైతికత అనేది తెరమీదకు వస్తుంది. చట్టసభల తీరు, నాయకులు వ్యహారం ఎన్నికలను అపహస్యంచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారనేది తెలిసిందే. ఇక్కడ కొన్ని నిజాలు మాట్లాడుకుంటే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు రాజకీయంగా ఏం జరుగిందో తెలుసు. రాజ్యాంగ పరంగా ఆయనకు విశేషమైన అధికారులున్నప్పటికీ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా కొన్ని విషయాలపై కంకణ బద్దలై వుండాల్సిందే..లేకుంటే ఆయన పదవికి కూడా గండం రావొచ్చు. కాని చరిత్రలో కొంత మంది స్పీకర్‌లు నిక్కచ్చిగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. పాలకులను ఎదిరించిన స్పీకర్లు కూడా వున్నారు. 1989 సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ నియంతృత్వ పోకడలు నచ్చని అప్పటి స్పీకర్‌ తన పదవి రాజీనామా చేశారు. ఎందుకంటే ఆ సమయంలో ఎన్టీఆర్‌ తిరుగులేని నాయకుడు. ఎదురులేని పాలకుడు. ఎన్టీఆర్‌ ఏది చెబితే అదే నడిచిన కాలం. భవిష్యత్తులో కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చే అవకాశం లేదనుకుంటున్న కాలం. అలాంటి బలవంతమైన నాయకుడు, ఎన్టీఆర్‌ సర్కారు తీరు స్పీకర్‌ నారాయణరావుకు నచ్చలేదు. నారాయణరావు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే. అయినా స్పీకర్‌ బాద్యతలను నిర్మొహమాటలంగా నిర్వహించారు. సహజంగా స్పీకర్‌ దృష్టి ఎక్కువగా ప్రతిపక్షం వైపు వుండాలని అనుకుంటారు. ఎందుకంటే ప్రతిపక్షాల గొంతు ప్రభుత్వం నొక్కకుండా కాపాడేదే స్పీకర్‌. అలాంటి స్పీకర్‌ పూర్తిగా పాలకపక్షం వైపు నిలబడితే ప్రతిపక్షాని విలువేముంటుంది. అందుకే న్యాయబద్దంగా తన విధులు నిర్వహించడం ఎన్టీఆర్‌కు ఇబ్బంది అనిపిస్తుందని తెలసి తన పదవికి రాజీనామా చేశారు. ఆఖరుకు తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇక మరో స్పీకర్‌ యనమల రాముకృష్డుడు కూడా అదే ఎన్టీఆర్‌కు 1994లో మైక్‌ ఇవ్వలేదు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ కంట తడి కూడా పెట్టుకున్నారు. అయినా విదినిర్వహణ కోసం యనమల నిలబడ్డాడు. 1991లో ఓ సినిమా విషయంలో కాంగ్రెస్‌ పార్టీ పెద్ద రచ్చ చేసింది. ప్రతిపక్షం గొంతు నొక్కేంత పని చేసింది. సినిమా వ్యహారం కూడా ఆనాడు అసెంబ్లీని కుదిపేసింది. సినిమాను బ్యాన్‌ చేయాలని కాంగ్రెస్‌ పట్టుబట్టింది. దాంతో అప్పటి స్పీకర్‌ ఆలపాటి ధర్మారావు సినిమాను చూసి, ఆ సినిమాను బ్యాన్‌ చేయాల్సిన అవసరం లేదని అప్పటి కాంగ్రెస్‌ పెద్దల సూచనలకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. కీలకమైన విషయాల్లో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి.

చీలిక అసాధ్యం… హరీష్‌ దూరం అసంభవం!

`బతికున్నంత కాలం కేసీఆర్‌ తోనే ఉంటానని హరీష్‌ ఎప్పుడో చెప్పారు.

`అనేక సార్లు ఈ విషయం స్పష్టం చేస్తూనే వస్తున్నారు.

`పదే పదే పని లేని దరిద్రులు హరీష్‌ మీద అసత్య ప్రచారం చేస్తూనే వున్నారు.

`రాజకీయమంతా బీఆర్‌ఎస్‌ లోనే కేసీఆర్‌ తోనే అని హరీష్‌ వంద సార్లు చెప్పారు.

`అయినా నీచపు రాజకీయం చేసేవారు అబద్దాలు ప్రచారం చేస్తూనే వున్నారు.

`ఎన్ని రకాల ప్రచారాలు చేసినా కుట్ర దారుల కలలు నెరవేరవు!

`కేసీఆర్‌ కుడి భుజం హరీష్‌ ను పార్టీ నుంచి కదపలేరు!

`హరీష్‌ ధ్వజ స్తంభంలా వుండగా బీఆర్‌ఎస్‌ ను ఒంటరి చేయలేరు.

`తిక్క పనులు చేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళు పోయారు!

`జీవితమిచ్చిన పార్టీకే వెన్నుపోటు పొడిచారు.

`వారి స్వార్ధ రాజకీయం కోసం పార్టీని మునగాలని కోరుకుంటున్నారు.

`ఆత్మాభిమానం ముసుగులో దూరం జరిగారు!

`పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు తమ దారి చూసుకున్నారు.

`అలాంటి వారికి బీఆర్‌ఎస్‌ గురించి మాట్లాడే హక్కు లేదు.

`అన్యాయం గురించి మాట్లాడే నైతికత అసలే లేదు.

`ఆత్మ ద్రోహం చేసుకున్న వాళ్ళు సొల్లు పురాణాలు ప్రచారం చేస్తే ఎవరూ నమ్మరు.

`ఎవరి దారి వాళ్ళు చూసుకొని ఇంకా బీఆర్‌ఎస్‌ మీద పగతో రగిలి పోతున్నారు.

`బీఆర్‌ఎస్‌ లేకుండా పోవాలని పగటి కలలు కంటున్నారు..

`శత్రువులతో చేతులు కలిపి కపట నాటకమాడుతున్నారు.

`నడి గోదారి చూసుకొని గందరగోళం తెచ్చుకున్నారు.

`చెప్పుడు మాటలు విని ఇప్పటికే మొదటికే మోసం తెచ్చుకున్నారు.

`నిజం గ్రహించలేక మంది మాటలు పట్టుకున్నారు.

`ఎండమావులను వెతుక్కుంటూ వెళ్లిపోయారు.

`ఇంకా బీఆర్‌ఎస్‌ మీద విషం చీమ్ముతూనే వున్నారు.

`బీఆర్‌ఎస్‌ నుంచి హరీష్‌ ను దూరం చేయాలని కపట నాటకాలు ఆడుతూనే వున్నారు.

`హరీష్‌ ను దూరం చేసి బీఆర్‌ఎస్‌ పని అయిపొయిందని చెప్పాలనుకుంటున్నారు.

చీల్చితే చీలేది ఈఆర్‌ఎస్‌ కాదు.. బీఆర్‌ఎస్‌ బలహీనంగా లేదు.

బలమైన క్యాడర్‌ తో ఎంతో దృఢంగా వుంది.

కృషార్జునులు లాంటి ఇద్దరు నాయకుల కాపలాలో కెసిఆర్‌ నాయకత్వంలో పటిష్టంగా వుంది

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తప్పుడు వార్తలు, సత్యదూరమైన విషయాలు, విషం చిమ్మే ప్రయత్నాలు, అసత్యాలను పదే పదే ప్రచారం చేయడం మొదలైనవి చేయడం రాజకీయ పార్టీలు బాగా అలవాటు చేసుకున్నాయి. రాజకీయ నాయకుల మనోధైర్యం దెబ్బతీస్తున్నాయి. ఒకరిని ఒకరు నమ్మే పరిస్తితి లేకుండా చేసుకుంటున్నారు. పార్టీల మధ్య విద్వేషాలు రగలించుకుంటున్నారు. రాజకీయ పార్టీల ఉనికినే ప్రశ్నార్ధం చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనలు సాగిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నిజమేనా అని అందరూ నమ్మేలా నిజం మచ్చుకు కూడా లేని విషయాలను పదే పదే ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఈ తరహా ప్రచారం విసృతమైపోయింది. నిత్యం అబద్దాలే ప్రచారం చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. సహజంగా పాలక పక్షం మీద ప్రతిపక్షాలు రాజకీయ దాడి చేయడం గతంలో వుండేది. కాని ఇప్పుడు పాలకపక్షాలు పాలనను గాలికి వదిలేసి, నిత్యం రాజకీయం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది దేశ వ్యాప్తంగా జరుగుతూనే వుంది. అందులో ఏ రాష్ట్రం మినహాయింపు కాదు. ఏకంగా అబద్దాల యూనివర్సిటీలనే నిర్వహిస్తున్నారు. తెలంగాణలో గత పదేళ్ల కాలంగా ఇదే సాగుతోంది. కాకపోతే గతంలో ప్రతిపక్షాలు పాలకపక్షాల మీద విపరీతమైన అడ్డగోలు ప్రచారాలు సాగిస్తూ వుండేవారు. పాలకులు ఇవేవీ పట్టించుకోకుండా పనులు చేసుకుంటూ పోయేవారు. కాని ఇప్పుడు పరిస్దితి మారిపోయింది. ప్రతిపక్షం ప్రజల తరపున పనిచేస్తుంటే, పాలకపక్షం మాత్రం ప్రతిపక్షాన్ని మరింత నిర్వీర్యం చేసే రాజకీయాలు చేస్తున్నాయి. పాలన అటకెక్కించాయి. అందుకు సోషల్‌ మీడియా వేదికలు బాగా పాలకపక్షానికి ఉపయోపగపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ లేకుంటే బాగుండు అనుకునే రాజకీయ పక్షాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బిఆర్‌ఎస్‌ వుంటే తమ రాజకీయాలు సాగవని వారికి బలంగా తెలుసు. బిఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొవడం అంత సులువైన పని కాదని తెలుసు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు అనేది ఆ పార్టీ బలం కాదు. ప్రజల్లో వున్న కొద్ది అసంతృప్తి మూలంగా కాంగ్రెస్‌ బైట పడిరది. అదికారంలోకి వచ్చింది. ఇక అధికారం ఇలాగే నిలబెట్టుకోవాలంటే బిఆర్‌ఎస్‌ లేకుండా చేయాలి. బిఆర్‌ఎస్‌లో చీలికలు తేవాలి. అందు కోసం అబద్దాలు పదే పదే ప్రచారం చేయాలని చూస్తున్నారు. అందుకు వారికి కొన్ని రాజకీయ అస్త్రాలు కూడా తోడౌతున్నాయి. బిఆర్‌ఎస్‌లో ఆధిపత్యమే కావాలని కోరుకునే వారు ఆ పార్టీకి దూరమయ్యారు. బిఆర్‌ఎస్‌లో వున్నంత కాలం పార్టీకి పట్టుగొమ్మ, పునాది లాంటి నాయకుడైన హరీష్‌రావును ఎలాగైనా పార్టీ నుంచి పంపించే ఎత్తుగడలు అనేకం వేశారు. కాని కుదలేదు. వారి మాటలు పార్టీ అదినేత కేసిఆర్‌ వినలేదు. పార్టీకి హరీష్‌రావు ఎంత మూల స్ధంభమో పార్టీ అదినేతకు తెలుసు. హరీష్‌రావు వుంటే తమ పప్పులు ఉడకవు అని పార్టీలో పెత్తనం కోసం ఆరాటపడిన వారికి తెలుసు. అందుకే ఆది నుంచి హరీష్‌రావును ఎలా సాగనంపాలన్నదానిపై అనేక శుక్రాచార్య ఎత్తుగడలు వేశారు. కాని కుదరలేదు. ఎందుకంటే హరీష్‌ స్దానం దక్కించుకోవాలని చూశారు. నిజానికి హరీష్‌రావు ఎప్పుడూ పార్టీలో పెత్తనం కోసం ఆశించలేదు. ఆరాపటపడలేదు. ఎప్పుడూ తాను ఒక సామాన్య కార్యకర్తగానే వున్నారు. పార్టీని భుజాన మోస్తూ వస్తున్నారు. పార్టీ అదికారంలో వున్నా తన పార్టీకి పనులు విషయంలో తన శక్తికి మించి పని చేయడమే తెలుసు. పార్టీని నిలబెట్టడమే తెలుసు. పార్టీని కాపాడడమే ఆయనకు తెలుసు. అందుకే ఎన్ని రాజకీయ అడ్డంకులు ఎదురైనా వాటిని అవలీలగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఆయన మీద పగపట్టిన వారు మాత్రం ఇంకా బుసలు కొడుతూనే వున్నారు. అయినా హరీష్‌ను పార్టీ నుంచి బైటకు పంపడం అనేది సాద్యమయ్యేది కాదు. పార్టీలో అసలు ఆ చర్చే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఆయనపై రకరకాల ఆరోపణలు గతం నుంచి చేస్తూనే వున్నారు. రాళ్లు వేస్తూనే వున్నారు. కాని ప్రజలు మాత్రం హరీష్‌ నాయకత్వానికి పూలు మాత్రమే చల్లుతున్నారు. దీవెనలందిస్తున్నారు. ఇది కొందరికి నచ్చడం లేదు. రాజకీయంగా హరీష్‌ ఒక్కొమెట్టు ఎక్కడం వారికి అసలే గిట్టడం లేదు. చివరికి వారి వారి రాజకీయాలకన్నా, హరీష్‌ రావు రాజకీయం మీదనే దృష్టిపెట్టి తమ రాజకీయాన్ని నాశనం చేసుకున్నారు. తమ రాజకీయం తలకిందులౌతున్నా సోయిలేని రాజకీయాలు చేయాలనే చూశారు. హరీష్‌రావు ఒకసారి కాదు, ఇప్పటికి వందసార్లు చెప్పారు. తన రాజకీయమంతా బిఆర్‌ఎస్‌లోనే..తప్ప మరో ఆలోచన వుండదు. రాదు. అలాంటి పరిస్దితే వస్తే రాజకీయాలనుంచి దూరమౌతానే తప్ప మరో పార్టీ అనే ఆలోచన కలలో రాదు. బతికుండా ఆ ఆలోచన చేయను. అన్నారు. ఇంత సూటిగా, స్పష్టంగా అనేక సార్లు చెప్పారు. పైగా ఇదే ఆఖరు సారి అని గత ఎన్నికల సమయంలో కూడా చెప్పారు. తనకు పార్టీ ఇప్పటికే ఇవ్వాల్సిందానికన్నా ఎక్కువ ఇచ్చింది. ఇంకా నాకు ఏవేవో కోరికలు లేవు. ఆశలు అంతకన్నా లేవు. అని కూడా ఆయన స్పష్టం చేశారు. కాని ఆయన మాటలను పట్టించుకోకుండా హరీష్‌ పార్టీలో వుంటే తమ రాజకీయం సాగదని అనుకొని తన గోతిని తాను తీసుకున్న వారు కూడా వున్నారు. సహజంగా ఏ పార్టీ నాయకుడైనా, పార్టీ కార్యకరైనా సరే పార్టీకి బలమైన నాయకులు వుండాలని కోరుకోవాలే గాని, బలహీనమైన నాయకులు వుండాలని స్వార్ధపరులు కోరుకుంటారు. అలాంటి స్వార్ధపరులు ప్రతి పార్టీలోనూ వుంటారు. సొంతమనుషులే అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తుంటారు. సొంత పార్టీనే పోతే ఎంత వుంటే అంత అని కూడా అంటుంటారు. అందకే వాళ్లు పోతే ఎంత, వుంటే ఎంత అని పార్టీ కూడా అనుకున్నది. పార్టీ నుంచి పంపించేసింది. అయినా వారి కడపు మంట చల్లారలేదు. సొంతగా రాజకీయం చేస్తామని బీరాలు పలికి, ఇతర పార్టీలలోకి తొంగి చూడడమే చేస్తున్నారు. హరీష్‌రావు పక్కకు జరిగితే మళ్లీ దూరుదామని చూస్తున్నారు. లేదా తమ కళ్ల ముందు బిఆర్‌ఎస్‌ పేక మేడలా కూలిపోవాలని కోరుకుంటున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చరిత్రలో ఎవరూ చేసి వుండరు. కాని అయిన వాళ్లే అలా చేస్తున్నారు. కన్న తల్లి లాంటి పార్టీకి ఇప్పటికే వెన్నుపోటు పొడిచారు. అభిమానం ముసుగేసుకొని కొంత కాలం మొసలికన్నీళ్లు కార్చి కపట నాటకాలు ఆడారు. ఇంకా ఆడాలనే చూస్తున్నారు. పార్టీని లేకుండా చేయాలన్న కుట్రలు పన్నుతూనే వున్నారు. హరీష్‌ను పార్టీ నుంచి పంపడం వారికి సాద్యం కాలేదు. కాదని తెలుసు. అందుకే మరో ఎత్తుగడ వేయాలని చూస్తున్నారు. గతంలో పార్టీకి హరీష్‌రావు వల్లనే నష్టమంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు హరీష్‌రావు పార్టీ మారుతున్నారని అసత్య ప్రచారం సాగిస్తున్నారు. బిజేపి పెద్దలతో హరీష్‌రావు మంతనాలు సాగిస్తున్నారని లేనిపోనివి సృష్టిస్తున్నారు. నిత్యం ప్రజల్లో వుంటూ, ప్రతిక్షణం కార్యకర్తల మద్యలో వుండే హరీష్‌రావు మీద ఎలాంటి ప్రచారాలు సాగించినా చెల్లవని తెలుసు. అయినా ఒక విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తే నిజమని నమ్మేవాళ్లు వుంటారని అనుకొని గోబెల్స్‌ ప్రచారం సాగిస్తున్నారు. ఇలా తాజాగా అసత్యాలను ప్రచారం చేస్తున్న వారికి గట్టిగా బుద్ది చెప్పేలా పార్టీయే సమాదానం చెప్పింది. ఇలాంటి అసత్యాలకు హరీష్‌రావు సమాదానం చెప్పాల్సిన పనిలేదు. గతంలో హరీష్‌రావును మాత్రమే టార్గెట్‌ చేసే వారు. ఇప్పుడు హరీష్‌రావును అడ్డుపెట్టుకొని పార్టీకే ఎసరు పెట్టాలని చూస్తున్నారు. పదేళ్ల పాటు పదవులు అనుభవించి, మొదటి నుంచి పార్టీ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకున్న వాళ్లే ఇప్పుడు విషం చిమ్ముతున్నారు. కడుపులో వున్నదంతా కక్కెస్తున్నారు. తమ అసలు రూపం చూపి ంచుకుంటున్నారు. రాని కన్నీళ్లతో తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్నారు. జనం నమ్మకపోవడంతో మరింత క్షోభకు గురౌతూ, అక్కసును మరింత పెంచుకుంటున్నారు. ప్రజలు ఆదరణ కరువు కావడంతో పిచ్చెక్కి పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ వాళ్లు చేసేది ఏమీ వుండదు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌కు హరీష్‌రావు పునాది. బిఆర్‌ఎస్‌కు హరీష్‌రావు ఆత్మ. తన ఇరవై ఆరేళ్ల జీవితమంతా పార్టీకి ధారపోసిన నాయకుడు హరీష్‌రావు. తెలంగాణ ఉద్యమం కోసం కేసిఆర్‌తో కలిసి తొలి అడుగులు వేసిన కుటుంబ సభ్యుడు హరీష్‌రావు. అలాంటి హరీష్‌రావుకు పదవులు అవసరం లేదు. పార్టీ పది కాలాలపాటు సాగితే చాలు. తెలంగాణ వున్నంత వరకు పార్టీ రాజకీయాలు సాగితే చాలు అనుకుంటారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా బిఆర్‌ఎస్‌ను కాపాడుకుంటూనే వుంటారు. తెలంగాణ సాధనలో హరీష్‌రావు పాత్రను ఎవరూ చెరిపేయలేరు. పార్టీకి దూరం ఎవరూ చేయలేరు. వారి దుష్టపన్నాగాలు సాగవు.

కుదించినా,తొలగించినా.. ముప్పే!

`మదించి కొత్త మార్గంలో పెడితే కొంత మంచిదే.
`ఎత్తి వేయాలని చూస్తే కొరివితో తల గోక్కున్నట్లే.


`జిల్లాల తేనే తుట్టే..ఓట్లుకు తూట్లే
`జనం నుంచి తిరుగుబాటు తథ్యమే.


`పంతానికి పొతే రాజకీయం పరేషానే!
`ఎన్నికల హామీ అనుకుని సాగితే పొరపాటే
`మున్సిపల్‌ ఎన్నికల ముందు ఈ నిర్ణయం గ్రహపాటే!
`పదేళ్ల తర్వాత జిల్లాలు తొలగిస్తే కష్టమే!
`సరిహద్దులు కొన్ని జిల్లాలలో మార్చితే మంచిదే.
`ప్రజాభీష్టాన్ని నెరవేర్చడం అవసరమే.
`జిల్లాలే కుదిస్తే తుపాన్‌ కొని తెచ్చుకోవడమే.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక మాట అన్నారంటే అది చేసి తీరుతారు. ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు చెప్పిన విషయాలలో చాలా వరకు అనుకున్నది అనుకున్నట్లుగా చేశారు. నిజానికి కొన్ని కీలకమైన నిర్ణయాలను అమలు చేస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఆదిలోనే ఒక్కసారిగా నెరవేర్చడం కష్టమని తేల్చేశారు. తాము లంకెబిందెలు వున్నాయని కొని వచ్చాం. కాని ఇక్కడ ఖాళీ కుండలు దర్శనమిస్తున్నాయన్నారు. అంతే ఒక్కసారిగా జనం విస్తుపోయారు. అయితే ఖజాన ఆదాయం పెంచి దశల వారిగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామంటూ మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నారు. సమయం చూసి పధకాలు అమలు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. కాని అవి కార్యరూపం దాల్చచడం లేదు. ఏవైతే చేయడానికి వీలైనంత సులువుగా వున్నాయో వాటిని చేయడానికి సిఎం వె నుకాడడం లేదు. అందులో తెలంగాణ బోర్టుల విషయంలో టిఎస్‌కు బదులు టీజి పేరు పెడతామన్నారు. ఎందుకంటే ఉద్యమ సమయంలో టిజి అని సంబోదించారు. బోర్టుల మీద కూడా అప్పటి ఏపి పేరు చెరిపేసి టిజి అని ఉద్యమ కారులు రాసేవారు. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కేసిఆర్‌ తెలంగాణ పేరును టిజి కాకుండా, టిఎస్‌ అని మార్చారు. అప్పుడే కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించింది. టిఎస్‌ అంటే బిఆర్‌ఎస్‌ అని పిలికేలా వుండడం కోసమే అలా మార్చారని అన్నారు. కాని కేసిఆర్‌ మాత్రం తెలంగాణ ఉనికిని చెప్పడానికి తెలంగాణ స్టేట్‌ అని తెలిసేలా వుంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాలు ఆనాడు వినలేదు. కాంగ్రెస్‌ ఆనాడే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టిఎస్‌ను ఖచ్చితంగా టిజిగా మార్చుతామని చెబుతూ వచ్చారు. గత ఎన్నికల హామీలలో ఇది కూడా చేర్చారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఎం. రేవంత్‌ రెడ్డి సర్కులర్‌ జారీ చేశారు. టిఎస్‌ స్ధానంలో టిజి అని నామకరణం చేశారు. బోర్టులన్నీ మార్చేశారు. టిఎస్‌ ఆర్టీసిని, టిజి ఆర్టీసిగా మార్చేశారు. ప్రభుత్వ కార్యాలయాలపై కూడా టిజి అని బోర్డులు మార్చారు. వెయికిల్స్‌కు ఇచ్చే నె ంబర్‌ ప్లేట్లపై కూడా టిజిగా మార్చేశారు. మరి కొంత కాలానికి తెలంగాణ విగ్రహంలో మార్పులు చేర్పులు చేస్తామన్నారు. అలాగే చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభత్వ హాయాంలోనే కాదు, ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ తల్లి అంటే ఒక ముద్ర నాటుకుపోయింది. కొన్ని లక్షల విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ మలిదశ ఉద్యమం పురుడు పోసుకున్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం సాదాసీదా తెలంగాణ మహిళ రూపంలో వుండేలా చిత్రీకరించారు. ఉద్యమం ఊపందుకున్న తర్వాత తెలంగాణ తల్లికి కొత్త శోభను తెచ్చారు. తెలంగాణ తల్లిని దేవతా మూర్తిలా మలిచారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మందు విగ్రహాన్ని మార్చుతామని చెప్పారు. తెలంగాణ తల్లి సాదాసీదా మహిళగా వుండేలా రూపకల్పన చేశారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం ఏఐసిసి నాయకురాలు సోనియాగాందీని పోలి వుందనే మరో వివాదం తెరమీదకు వచ్చింది. తెలంగాణ తల్లి దేవతా మూర్తి రూపంలో నగలు, కిరీటంతో వుండడం కాంగ్రెస్‌ పార్టీకి నచ్చలేదు. సాధారన సగటు తెలంగాణ మహిళ రూపాన్ని తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపునిచ్చారు. ఇలా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడం ఖర్చుతో కూడుకున్నది. ఖజానా ఖాళీగా వున్నప్పుడు ఆ పథకాలు ఎలాగూ అమలు చేయలేరు. కాని పెద్దగా ఖర్చుతో సంబంధం లేని వాటిని అమలు చేస్తూ వచ్చారు. అందులో టిజి, తెలంగాణ తల్లి విగ్రహం వున్నాయి. ఇక మూడోది జిల్లాల పునర్వవ్యవస్థీకరణ మిగిలి వుంది. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులకు చేర్పులకు కొదవలేదన్నట్లే వుంది. కొత్తగా జిల్లాల పునర్వవస్దీకరణ మీద చర్చ మళ్లింది. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నింటికన్నా ముందు చెప్పిన విషయాలలో జిల్లాల పునర్వవ్యస్ధీకరణ చేస్తామన్నారు. దాంతో ప్రభుత్వం వచ్చిన తొలిరోజుల్లోనే రాజకీయం వేడెక్కింది. తర్వాత ఆ విషయం అటకెక్కింది. అప్పుడే రావాల్సినంత వ్యతిరేకత వచ్చింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ ప్రకటనను ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇలాంటి ప్రకటనలు పాలకుల నుంచి రావడం సహజమే అనుకున్నారు. ఆదిలోనే బిఆర్‌ఎస్‌ జిల్లాల పునర్విభజన ఎలా చేస్తారో చూస్తామని ఆనాడే సవాలు విసిరింది. తర్వాత కాలంలో ఆ మాట మరుగున పడిరది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో అసంబద్దంగా, అన్యాయంగా, అశాస్త్రీయంగా చేసిన జిల్లాను మార్చుతామని చెప్పడం జరిగింది. జనం ఎంత వరకు ఆ మాటలు విన్నారో..నమ్మారో తెలియదు కాని, ఓట్లేశారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు. సిఎం. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. కాని ఆదిలోనే తేనె తుట్టేను కదిలించడం వల్ల లేని తలనొప్పి పెట్టుకోవడం ఎందుకు అనుకున్నారు. జిల్లాల పునర్విభజన అంశం పక్కన పెట్టారు. ఇప్పుడు మళ్లీ తెరమీదకు తెచ్చారు. సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌ రెడ్డి జిల్లాల పునర్విభజనపై జ్యుడిషియల్‌ కమీషన్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైకోర్టు జడ్జి చేతనో, సుప్రింకోర్టు రిటైర్డ్‌ జడ్జి చేతనైనా కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. వారిచ్చిన సూచనలు సలహాలతో జిల్లాల పునిర్వభన చేపడతామన్నారు. దాంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నిజానికి కేసిఆర్‌ జిల్లాల ప్రకటన చేసినప్పుడు అకున్నది వేరు. తర్వాత పూర్తిగా అమలు చేసే సమయం వచ్చేసరికి చేసిన జిల్లాలు వేరు. కొన్ని జిల్లాలు తాత్కాలికంగా వచ్చిన ఉద్యమాల వల్ల కూడ ఏర్పాటయ్యాయి. అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన జిల్లాలు కూడా వున్నాయి. హాటాత్తుగా తెరమీదకు వచ్చిన జిల్లా సిరిసిల్ల. కేవలం కేటిఆర్‌ కోసమే ఆ జిల్లా ఏర్పాటు చేశారన్న విమర్శలు ఆనాడే ఎదుర్కొన్నారు. సిరిసిల్ల ప్రజలకు కూడా అప్పటి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. కేటిఆర్‌ రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం చూపేదాకా వెళ్లాయి. దాంతో వెంటనే సిరిసిల్లను ప్రకటించారు. జనగామ, ములుగు లాంటి జిల్లాలు సుమారు మూడేళ్లపాటు నిరంతం పోరాటాల వల్ల ఏర్పాటు జరిగాయి. జనగామ జిల్లా మొదట యాదాద్రి, భువనగి జిల్లాలో చేర్చారు. జనగామ ప్రాంతంలో మూడేళ్లపాటు జరిగిన ఉద్యమం మూలంగా జిల్లా ఏర్పాటుచేశారు. తొలుత ఇరవై నాలుగు జిల్లాలు ఏర్పాటు చేద్దామనుకున్న కేసిఆర్‌ ఆఖరుకు 33 జిల్లాలు చేశారు. అది కూడా కేసిఆర్‌ లక్కీనెంబర్‌ 6 కలిసొచ్చేలా చేశారని ఇప్పటికీ అంటుంటారు. ఏది ఏమైనా తర్వాత కాలంలో 33 జిల్లాలలో పెద్దఎత్తున ఇంటిగ్రేటెడ్‌ జిల్లా కార్యాలయాల సముదాయాలు నిర్మాణం చేశారు. జిల్లాల విభజన వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత దగ్గర చేశారు. అంతే కాకుండా 33 జిల్లాలలో 33 మెడికల్‌ కళాశాలలు తీసుకొచ్చారు. ఉద్యోగుల విభజన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ జిల్లాల మదింపును తెరమీదకు తెచ్చారు. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ హాయంలో జిల్లా ఏర్పాటు అంశం పక్కన పెడితే ప్రాంతాల కూర్పు అంతా అశాస్రీయంగా జరిగిందన్న వాదన మొదటి నుంచి వుంది. తమకు అన్యాయం జరిగిందని ఉద్యమాలు చేసిన ప్రాంతాలున్నాయి. కొత్తగా రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు డిమాండ్‌ చాలా వచ్చాయి. అందులో కొన్ని పూర్తి చేశారు. మండలాల ఏర్పాటులో కూడా కొన్ని డిమాండ్లు వచ్చాయి. వాటిలో కొన్ని పూర్తి చేశారు. ఇంకా చేయనివి ఉన్నాయి. చేసిన వాటిలో అసంబద్దంగా, అన్యాయంగా చేసిన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఆనాటి నుంచే పోరు సాగుతోంది. వాటన్నింటికీ న్యాయం చేస్తూ, కొత్త జిల్లాల కూర్పు, మదింపు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కొన్ని జిల్లాల కోత తప్పదని ప్రభుత్వం పరోక్షంగా కొన్ని విషయాలు లీక్‌ చేశాయి. అంటే పరోక్షంగా తెనె తుట్టెను కదలించినట్లే అవుతుంది. అశాస్త్రీయంగా వున్న జిల్లాలను బాగు చేయడంవరకు ఓకే కాని, జిల్లాలకు జిల్లాలే ఎత్తి వేస్తే మాత్రం ప్రజలను ంచి నిరసన వ్యక్తమయ్యే పరిస్తితులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏం తప్పు చేసినా పట్టుకుందామని చూస్తున్న బిఆర్‌ఎస్‌కు జిల్లాల మార్పు అంశం రాజకీయంగా ఉపయోగపడుతుందా? లేదా? అనేది కాలమే చెప్పాలి.

సైబర్‌ వల.. జేడీ విలవిల!

`జేడీ అత్యాశ..సైబర్‌ టోకరా!

`పేరుకు మేధావి.. ఇదేం తింగరి పని!

`సమాజ చైతన్యం.. అత్యాశ వ్యాపారం!

`సమాజాన్ని మార్చే ప్రయత్నం…నిత్యం చైతన్య ప్రవచనం.

`నూతన రాజకీయం… అత్యశ వ్యాపారం.

`సుదీర్ఘ కాలం పాటు పోలీస్‌ డిపార్ట్మెంట్‌ ఉద్యోగం నేర్పిందేమిటి?

`జేడీ లక్ష్మీనారాయణ నేర్చుకున్నదేమిటి?

`ఆ మధ్య బెట్టింగ్‌ యాప్స్‌ మీద ప్రజల్ని చైతన్యం చేసిన జేడీ.

`సైబర్‌ నేరగాళ్లు ఎలా వల విసురుతారో చెప్పిన జేడీ.

`ఆయన ఎట్లా సైబర్‌ వలలో చిక్కారు?

`పదేళ్ల క్రితమే రిటైర్‌ అయిన జేడీ కి అంత డబ్బు ఎక్కడిది అని

పుట్టుకొస్తున్న ప్రశ్నలు!

`రాజకీయ పార్టీ పెట్టి తీసుకున్న విరాళాలా?

`ఎన్నికల అఫిడవిట్లో చూపించిన లెక్కలకు, పోగొట్టుకున్న సొమ్ముకు

పొంతన లేదంటున్నారు?

`డబ్బు పోయినందుకు బాధ పడాలా?

`అనవసరంగా డబ్బులు పోయిన విషయం చెప్పి విమర్శల

పాలవుతున్నారా?

`12 రోజుల్లో 19 సార్లు డబ్బులు ఎలా చెల్లించారు?

`500 శాతం ఆదాయం సమాకూరుతుందంటే ఎలా నమ్మారు?

`సైబర్‌ నేరగాళ్లు చెప్పిన మాటలు ఎలా నమ్మారు?

`హర్షద్‌ మెహతా కథ తెలియని వ్యక్తి కాదు?

`స్టాక్‌ మార్కెట్‌ గురించి తెలియని అమాయకుడా?

`అన్నీ తెలిసిన జేడీ అత్యాశ తో ఇరుక్కున్నారు?

`సామాన్యుల పరిస్థితి ఏమిటి?

జేడీ పేరు చెప్పి, సైబర్‌ నేరగాళ్లు ఇంకా ఎంత మందిని మోసం చేశారో?

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:

దురాశ దుఖానికి చేటు. అత్యాశ కొంపకు చేటు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ఏ కాలంలోనైనా ఇలాంటి వారు వుంటారని పెద్దలు ఏనాడో ఊహించి వుంటారు. అందుకే ఈ మాటలు చెప్పారు. అయితే సిబిఐ మాజీ డైరెక్టర్‌ జేడి లక్ష్మినారాయణ లాంటి వారు కూడా ఇలాంటి అత్యాశలో చిక్కుకుంటారని మాత్రం ఎవరూ అనుకోలేదు. కాని అందుకు తాను కూడా మినహయింపు కాదని నిరూపించారు. ఎందుకంటే ఆయన తన పోలీసు ఉద్యోగ నిర్వహణలో ఇలాంటి కేసులు కూడా చూసి వుంటారు. ఆయన తన విదినిర్వహణలో వున్నప్పుడు అనేకం తెలుసుకొని వుంటారు. కాని శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు ఆయన కూడా బాధితుడౌతాడని ఎవరూ అనుకోలేదు. ఆయనపై సైబర్‌ వల విసరడం ఏమిటి? దానిని ఆయన గమనించకపోవడమేమిటి? వాట్సాప్‌ కాల్స్‌ అన్‌నోన్‌ పర్సన్‌ నుంచి వస్తే లిఫ్ట్‌ చేయొద్దు. మాట్లాడొద్దు? అని ఇటీవల పోలీసు శాఖ హెచ్చరిస్తూనే వుంటోంది. సైబర్‌ నేరగాళ్లు ఏ వైపు నుంచైనా దాడి చేయొచ్చని చెబుతూనే వున్నారు. పైగా జేడి లక్ష్మి నారాయణ కూడా గత పది సంవత్సరాల కాలంగా సామాజిక హితబోధ నిత్యం చేస్తూనే వున్నారు. ఎక్కడ ఏ చిన్న క్రైమ్‌ అయినా, సైబర్‌ మోసాలు, కేసుల పరంగా వివరాలపై మీడియా పెద్దఎత్తున ఆయనను సంప్రదిస్తూనే వుంటుంది. ఆయన అన్నింటికీ సమాధానం చెబుతూనే వుంటారు. సైబర్‌ మోసగాళ్ల తెలివితేటల గురించి ఆయన చెబుతూనే వుంటారు. అలాంటి లక్ష్మినారాయణ ఇలాంటి కేసులో ఇరుక్కొవడం అనేది వినడానికే విడ్డూరంగా వుంది. పైగా ఒక్క రూపాయి కాదు, రెండు రూపాయలు కాదు. వేలు కాదు, లక్షలు కాదు. ఏకంగా రెండు కోట్ల యాభై ఎనమిది లక్షల రూపాయలను పోగొట్టుకున్నారంటే ఆశామాషీ వ్యవహారం కాదు. సైబర్‌ మోసగాళ్ల మాటలు నమ్మి, 12 రోజుల్లో 19 సార్లు లక్షలకు లక్షలు సొమ్మును బదిలీ చేశారంటే ఏ నమ్మకంతో ఆయన పంపిచారో అర్దం కాకుండా వుంది. ఇదంతా జేడి లక్ష్మినారాయణ సతీమణి పంపించిందని అంటున్నా, ఆమెకు కూడా చట్టం మీద ఎంతో కొంత అనుభవం వుంటుంది. పోలీసుశాఖ ఉన్నతాధికారి బార్య అంటే వారికి తెలియని విషయాలు కూడా వుండవు. కాని ఆమె కూడా సైబర్‌ వలలో చిక్కుకునేంత సులువుగా ఇతరులను ఎలా నమ్మింది అనేది ఇక్కడ బోధపడకుండా వుంది. బంగారు వస్తువులు కుదువపెట్టి మరీ డబ్బులు టాన్స్‌జాక్షన్‌ చేశారంటే చిన్న విషయం కాదు. చట్టాల మీద అవగాహన, సైబర్‌ నేరాల మీద పూర్తి నియంత్రణ వున్న లక్ష్మినారాయణ ఎలా అంగీకరించారు. ఆయన సతీమణి ఏకంగా లక్ష్మినారాయణ సెల్‌ పోన్‌ నెంబర్‌తోనే ఈ లావాదేవీలు నిర్వహించారంటే ఆశ్చర్యమనిపిస్తోంది. ఆయనకు తెలియకుండా జరిగింది కాదు? నేరుగా ఆయన సెల్‌ పోన్‌ నుంచే సొమ్ము బదిలీ జరుగుతుంటే ఆయన ఏం చేశారు? అంటే ఆయనకు పూర్తిగా వివరాలు తెలిసు అనేది ఇక్కడ స్పష్టమౌతోంది. నిత్యం సమాజ శ్రేయస్సు గురించి గంటలు గంటలు చర్చల్లో పాల్గొంటూ, ప్రజలను చైతన్యం చేసే లక్ష్మినారాయణ సైబర్‌ వలలో చిక్కడంతో ఆయనపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఆయన నిజాయితీకి మారు పేరు అనేది అందరూ చెప్పుకునే మాట. ఆదర్శజీవితానికి నిదర్శనంగా పోలీసు శాఖలో లక్ష్మినారాయణ గురించి మీడియాలో గొప్పగా చెబుతుంటారు. ఎందుకంటే గతంలో ఎంతో సిన్సియర్‌ ఆపీసర్‌ అయితేనే ఉన్నత స్ధాయికి వెళ్లేవారని అంటుంటారు. అయినా పోలీసు శాఖలో లక్ష్మినారాయణ ఒక సింహస్వప్నం అని కూడ చెబుతుంటారు. ఆయన కూడా తన జీవితంలో ఎంత ఆదర్శంగా వున్నారో కూడా చెప్పుకుంటారు. కొన్ని విషయాల్లో సూటిగా స్పష్టంగా వుండడం నచ్చని నాయకులు తనను ట్రాన్స్‌పర్లు చేశారని కూడా చెప్పుకుంటారు. మహరాష్ట్రలో ఆయన చేసిన సేవల గురించి, చేధించిన కేసుల గురించి ఆయన ప్రత్యేకంగా చెబుతుంటే యువత కూడా ఆయనను ఆదర్శంగా తీసుకున్నది. పైగా ఆయన అనేక సెమినార్లలో పాల్గొని, యువతకు హిత బోధ చేస్తుంటారు. ఒక రకంగా క్లాస్‌లు తీసుకుంటారు. యువతలో చైతన్యంతోపాటు, ఆదర్శాల గురించి ఆయన అనేక సభలు, సదస్సులలో పాల్గొంటారు. అలాంటి లక్ష్మినారాయన కూడా సైబర్‌ నేరగాళ్ల వలలో పడ్డారంటేనే విస్తుపోవాల్సి వస్తుంది. అది ఆయనకు తెలియకుండా జరిగింది కాదు. వారిని పూర్తిగా నమ్మిన తర్వాతే సొమ్ము బదిలీ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ సైబర్‌ నేరగాళ్లు కొంత కాలం నమ్మిస్తారు. నిజమే అని బలంగా నమ్మేలా చేస్తారని కూడా అంటారు. అలా వారిని నమ్మడం వల్ల పోగొట్టుకున్న విషయం చెబుతున్నారు. కాని ఎంత లాభం వచ్చిందన్న విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పినట్లు లేదు. అంటే ఎంతో కొంత లాభం ముందు చూస్తేనే తర్వాత కూడా సొమ్మును బదిలీ చేసే అవకాశం వుంటుంది. ఇదిలా వుంటే ఆయనకు అంత సొమ్ము ఎక్కడిది? ఆయనకు ప్రత్యేకంగా ఎలాంటి వ్యాపారాలున్నట్లు కూడా తెలియదు. ఆయన కూడా ఎక్కడా వాటి గురించి చెప్పలేదు. సహజంగా స్టాక్‌ మార్కెట్‌లో ఎంతో అనుభవం వున్నవారైతే తప్ప పెట్టుబడులు పెట్టరు. అంతే కాకుండా ఏ పెట్టుబడిలోనూ 500శాతం లాభాలు వుండవు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడి వల్ల నాశమైన కుటుంబాలే ఎక్కువ అని కూడా తెలియని వ్యక్తి లక్ష్మినారాయణ కాదు. అలాంటి అన్నీ తెలిసిన లక్ష్మినారాయణ పెట్టుబడి పెట్టడం ,మోసపోవడం కూడా చకచకా జరిగిపోయింది. కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే ఇదంతా ఓ మాయలాగా జరిగిపోయింది. అయితే ఆయనకు అంత సొమ్ము ఎక్కడిది? ఆయన రిటైర్‌ అయి కూడా సుమారు పది సంవత్సరాలు దాటిపోయినట్లుంది. పెన్షన్‌ తప్ప మరో ఆదాయం వున్నట్లు కూడా లేదు. ఉద్యోగ విరమణ సమయంలో కూడా ఇంత పెద్ద మొత్తం కూడా రాదు. నిజం చెప్పాలంటే ఇలాంటి స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు పోతే పోని అనుకుంటే తప్ప ధైర్యం చేయరు. అటువంటప్పుడు రెండుకోట్ల యాభై ఎనమిది లక్షలు పెట్టాలంటే ముందు ధైర్యం కావాలి. లేకుంటే పోతే పోయిందిలే అనుకొని అయినా పెట్టుబడి పెట్టాలి. తాము మోసపోయామని తెలుసుకోవడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే స్టాక్‌ మార్కెట్‌లో నష్టపోతే ఈ విషయం బైటకు పొక్కేది కాదు. వాళ్లు చెప్పేవారు కాదు. ఉత్త పుణ్యానికి అంత సొమ్ము పోగొట్టుకున్నామని, సైబర్‌ నేరగాళ్ల బారిన పడ్డామని తెలిసి బైటకు వచ్చారు. దాంతో వారికి వారుగానే అనేక అనుమానాలు ప్రజలకు కలిగేలా చేశారు. ఇప్పుడు ఆయన రిటైర్డ్‌ పోలీస్‌ అదికారి మాత్రమే కాదు, రాజకీయ నాయకుడు కూడా..! ఆయన గతంలో జనసేన పార్టీలో చేరారు. అక్కడ ఇమడలేక సొంతంగా రాజకీయ పార్టీనే ఏర్పాటు చేశారు. ఆ పార్టీని కూడా ఆయన రద్దు చేసినట్లున్నారు. అంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు వచ్చిన విరాళాలా? లేక ఉద్యోగ నిర్వహణలో వున్నప్పుడు సంపాదించిన సొమ్మా? అనే అనుమానం ఆయనే కల్పించారు. ఎందుకంటే ఆయన ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో చూపిన లెక్కలకు, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడి లెక్కలకు పొంతన లేదు. బంగారాన్ని తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు తెచ్చి పెట్టారంటే, వాటి అసలు ఖరీదు ఎంతుంటో అర్దం చేసుకోవచ్చు? పైగా ఒక బ్యాంకు కూడా కోట్లాది రూపాయలు బంగారం కుదువ పెట్టుకుంటే ఇచ్చే అవకాశం లేదు. అలా బంగారాన్ని కుదువపెట్టి, ఏ ఏ ఫైనాన్స్‌ సంస్థల నుంచి సొమ్ము తెచ్చారన్నది కూడా లెక్క చెపాల్సిన పరిస్ధితి వుంటుంది. ఈ విషయంలో ఎవరు కోర్టుకు వెళ్లినా దీని మీద దర్యాప్తు చేసే అవకాశం వుంది. ఎన్నికల సంఘానికి ఉత్తరం రాసినా పరిస్దితి మరో రకంగా వుంటుంది. తనకు తానుగా అత్యాశకు పోయి అన్ని దారులు మూసుకునేలా చేశారా? తెలిసి చేసినా తెలియక చేసినా ఇది కూడా నేరమే అవుతుందా? లేక బాదితుడే అవుతారా అన్నది కూడా తెలియాల్సి వుంది. ఆ మధ్య బెట్టింగ్‌ యాప్‌ల వలలో పడొద్దు. కేసుల పాలు కావొద్దు. అంటూ అనేక నీతులు చెప్పారు. అందుకు సహకిరంచిన వారిపై కూడా కేసులు నమోదు చేయాలని చెప్పారు. మరి ఇప్పుడు జేడి లక్ష్మినారాయణ పేరు చెప్పి ఆ సైబర్‌ నేరగాళ్లు ఎంత మంది సొమ్ముకు కన్నంపెట్టారన్నది తెలిసే అసలు గుట్టంతా బైటకు వస్తుంది.

‘‘నేటిధాత్రి’’ కథనానికి స్పందించిన ‘‘ఐఏఎస్‌,ఐపీఎసు అధికారుల సంఘాలు.

ప్రధానంగా ‘‘నేటిధాత్రి’’ సూటిగా సందించిన ప్రశ్నలు?

`‘‘ఐఏఎస్‌, ఐపీఎసుఅధికారుల స్పందనకు కారణం?

`‘‘ఐఏఎసు లంటే అంత ఆశామాషిగా వుందా? అని ‘‘నేటిధాత్రి’’ నిలదీసింది.

`మహిళా ‘‘ఐఏఎసు అధికారులు అంత అలుసై పోయారా? అని ప్రశ్నించింది ‘‘నేటిధాత్రి’’.

`మహిళా ‘‘ఐఏఎసు ల జీవితాల మీద అభండాలా? మీడియా దుర్నీతిని ‘‘నేటిధాత్రి’’ నీలదీసింది.

`పరోక్షంగా మంత్రి ని హీరో ను చేస్తారా? అని మీడియను కడిగేసింది.

`ఏ రంగంలో వున్నా అవమానాలు, అనుమానాలు తప్పవా? అని మేలుకొలిపింది.

`మంత్రికేనా కుటుంబం వుండేది? అధికారుల సంఘానికి గుర్తు చేసింది.

`ఆ మహిళా ‘‘ఐఏఎసు అధికారికి కుటుంబం ఉండదా? అని మీడియా ప్రపంచానికి చెప్పింది ‘‘నేటిధాత్రి’’.

’’ఆల్‌ ఇండియా క్యాడరు అధికారులపై ఊహజనిత వార్తలు సృష్టి స్తారా! అని నిగ్గ తీసి అడిగింది’’నేటిధాత్రి’’.

`మీడియా చేతిలో వుంది కదా అని ఎలాంటి కట్టు కథైనా అల్లేస్తారా? అని ‘‘నేటిధాత్రి’’ తూర్పర పట్టింది.

`ఆ కలెక్టర్‌ అని చెప్పగలిగిన మీడియా మంత్రి పేరు ఎందుకు దాచారు? అని ‘‘నేటిధాత్రి’’ నిలదీసింది.

`మహిళా కలెక్టర్‌ పరువు పోయినా పర్వాలేదనుకున్నారా? అని ‘‘నేటిధాత్రి’’ కడిగిపారేసింది.

’’ఐఏఎసు ల సంఘం ఏం చేస్తున్నట్లు? అని ‘‘నేటిధాత్రి’’ గాటుగా ప్రశ్నించింది.

`మహిళా ‘‘ఐఏఎసు ఆత్మభిమానం మీద దెబ్బ కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అని నిర్మొహమాటం లేకుండా అడిగింది. నేటిధాత్రి.

మహిళా కమిషన్‌ ఏం చేస్తోంది? అని గుర్తు చేసింది.

`తోటి మహిళా ‘‘ఐఏఎసు అధికారులు మాకెందుకు అనుకుంటున్నారా? అని కూడా అక్షేపించింది ‘‘నేటిధాత్రి’’.

ఓ మంత్రిని హీరో ను చేస్తూ అధికారి మీద స్టోరీ చేస్తే ప్రశ్నించకుండా ఏం చేస్తున్నారని గుర్తు చేసింది ‘‘నేటిధాత్రి’’.

ఇదెక్కడి దిక్కుమాలిన జర్నలిజం? అని కడిగి పారేసింది కూడా నేటిధాత్రి.

జర్నలిజం నైతిక విలువలు వదులుకోవడాన్ని తప్పని సూచించింది నేటిధాత్రి.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ ఉద్యోగులైన ఐఏఎస్‌, ఐపిఎస్‌లు అంటే అయ్యా ఎస్‌లు కాదు. అడ్మినిస్ట్రేషన్‌ హెడ్‌లు. రాష్ట్ర ప్రభుత్వం సాగాలన్నా, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలన్నా, ప్రజలకు కొత్త కొత్త పథకాలు అందాలన్నా వాటి రూపకల్పన, అమలులో ఐఏఎస్‌ అదికారులదే కీలకపాత్ర. పైగా ఐఏఎస్‌ అధికారులైన కలెక్టర్‌లు ఫస్టుక్లాస్‌ మెజిస్ట్రేట్‌లు. వారు విధినిర్వహణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అందులో మంచి చెడులను విశ్లేశించొచ్చు. పాలనా పరమైన పొరపాట్లు వుంటే మీడియా పరంగా ప్రశ్నించొచ్చు. కాని వారి వారి వ్యక్తిగత జీవితాలపై లేనిపోనివి రాయడం సరైంది కాదు. అందులోనూ వారికి సంబంధం లేని విషయాలను సెన్సెషన్‌ కోసం వెలుగులోకి తీసుకురావొద్దు. ఇటీవల కొన్ని న్యూస్‌ ఛానళ్లలో పెద్దఎత్తున ఇలాంటి వార్తల ప్రసారమయ్యాయి. దాంతో తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ మొదలైంది. ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్తితి వచ్చింది. పైగా మహిళా ఉన్నతాదికారి మీద లేని పోని నిందలు వేస్తూ ఓ కథనం ప్రసారం చేశారు. అదిగో పులి అంటే, ఇదిదో తోక అన్నట్లు వున్నవి లేనివి వండి వార్చారు. దాంతో ఐఏఎస్‌ అధికారుల్లో అలజడులు మొదలయ్యాయి. ప్రభుత్వపరంగా ఉన్నత స్దానంలో వున్న ఉద్యోగుల మీద అలాంటి వార్తలు వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవడానికి ముందుకు రాలేరు. మీడియా ఆఫ్‌ద రికార్డు అంటూ రాసే వార్త తనపైనే అని చెప్పుకునే పరిస్తితి వుండదు. మీడియా ఎవరో ఏదో చెప్పారని, వాటిని పూర్తిగా నిర్దారించుకోకుండా, పూర్తి వివరాలు సేకరించకుండానే వార్తలు ప్రసారం చేస్తే వారి మనోభావాలు దెబ్బతింటాయి. వారి జీవితాలు తలకిందులౌతాయి. తర్వాత ఎంత మెత్తుకున్నా తిరిగి వారి గౌరవం రావడం కష్టం. అయినా ఫస్టుక్లాస్‌ మెజిస్ట్రేట్‌ బాద్యతలో వున్న వారిపై వ్యక్తిగతమైన వార్తలు రాసేప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అసవరం వుంటుంది. వృత్తి నిర్వహణలో ఎలాంటి తప్పులు దొర్లినా, పొరపాట్లు జరిగినా ప్రశ్నించే హక్కు మీడియాకు వుంది. కాని వ్యక్తిగత విషయాలపై వార్తలు రాసే అదికారం ఎవరికీ లేదు. అందుకే ఈ విషయంలో మొదట సూటిగా స్పష్టంగా మీడియా సమాజానికి నేటిధాత్రి ప్రశ్నలు సందించింది. ఇంత రచ్చ జరుగుతున్నా ఐఏఎస్‌ అధికారుల సంఘం స్పందించకపోవడాన్ని కూడా నేటిధాత్రి ప్రశ్నించింది. ఆ మరుసటి రోజే సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల సంఘాలు స్పందించాయి. అదే రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ చానల్‌ ప్రసారాలను ఖండిరచారు. చట్టం తన పని తాను చూసుకుపోతుందన్నారు. ఉన్నతోద్యోగుల విషయంలో ఇలాంటి వార్తలు రాయడాన్ని ఆయన ఖండిరచారు. అయితే నేటిధాత్రి మొదటి రోజే చాలా ఘాటుగా ఆ చానల్‌ ప్రసారాన్ని ఖండిరచింది. ఐఏఎస్‌ అధికారులకు కూడా ప్రశ్నలు సందించింది. ఐఏఎస్‌ మహిళా అదికారులంటే అంత ఆశామాషీగా వుందా? అని నిలదీసింది. మహిళా ఉన్నతాదికారులంటే మీడియాకు అంత అలుసైపోయిందా? అని నిలదీసింది. మహిళా ఐఎఎస్‌ అధికారుల జీవితాల మీద వ్యక్తిగత విమర్శలకోసం వేయరాని అభాండాలు వేయడాన్ని ఏ సమాజం స్వాగతించదు. అలాంటి దుర్నీతి మీడియాను ఖచ్చితంగా అందరూ నిలదీయాల్సిన అవసరం వుంది. ఒక మహాళా అదికారి మీద వేయకూడని ముద్ర వేయడం వల్ల అవతలి వ్యక్తులు హరోలౌతారు. ఆ మహిళా అదికారులు సమాజంలో చులకనౌతారు. ఆ అదికారి విషయంలో షశబిషలు లేకుండా చెప్పి, నాయకుల విషయంలో ఫజిల్‌ పూరించండి అన్నట్లు చెప్పి వదిలేయడం వల్ల ఆ అధికారి ఎంత మానసిక క్షభ అనుభిస్తారో అనే ఆలోచన లేకుండా ఎలా ప్రసారం చేశారు. పైగా ఆ ప్రోగ్రాంను మళ్లీ మహిళా యాంకర్‌తోనే ప్రసారం చేయించారు. ఇంతకన్నా దుర్మార్గమేమైనా వుందా? అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు మిగతా చానళ్లు కూడ నిజానిజాలు తెలుసుకోకుండా అవి కూడా మహిళా యాంకర్లతోనే కథనాలు ప్రసారం చేశాయి. ఇంతకన్నా దుర్గారం ఏదైనా వుంటుంది. మొత్తం తెలుగు మీడియాలోనే ఒక్క నేటిధాత్రి మాత్రమే ఇదెక్కడి సంసృతి, ఇదెక్కడి సంప్రదాయం, మహిళా ఐఏఎస్‌ అధికారి పరువును బజారుకీడుస్తారా? వార్తను రాసింది. కేవలం ఒక్క నేటిధాత్రి మాత్రమే ఆ అధికారులకు అండగా వార్తను ప్రచురించింది. ఆ కథనంలో ప్రస్తావించిన సంబందిత మంత్రికేనా కుటుంబం వుండేది. ఆ మంత్రికేనా కుటుంబ విలువలు వుండేది అని ఆ చానళ్లను నిలదీసింది. ఆల్‌ఇండియా క్యాడర్‌ మహిళా ఉన్నతోద్యోగుల మీద ఊహజని కథనాలు వండి వారుస్తారా? అని నేటిధాత్రి నిగ్గదీసింది. మీడియా చేతిలో వుంది కాదా? అని ఎలాంటి వార్తలైనా సృష్టిస్తారా అని నేటిధాత్రి ప్రశ్నించింది. ఆ కలెక్టర్‌ గురించి కీలకమైన విషయాలు చెప్పిన మీడియా మంత్రి పేరు ఎందుకు చెప్పలేకపోయింది? అంత దమ్ము లేనప్పుడు ఎందుకు ఇలాంటి నీచమైన వార్తలు ప్రసారం చేయాలని కడిగేసింది. కలెక్టర్‌ మహిళ కావడంతో ఆమె పరువు పోయినా ఫరవాలేదనుకున్నారా? మంత్రికి మాత్రం మరక అంటకుండా వుండాలని చూశారా? ఇలాంటివి పురుష అదికారులైనా, మంత్రులైనా, నాయకులైనా, ఇతరులెవ్వరైనా తట్టుకోగలరు. అవసరమైతే వివరణ ఇచ్చుకోగలరు. కాని మహిళా అదికారుల మీద ఇలాంటి తప్పుడు కథనాలు రాసి వివరణలిచ్చుకో అన్నట్లు వదిలేస్తే దానిని జర్నలిజం అంటారా? అందుకే ఐఏఎస్‌ల సంఘం ఏం చేస్తున్నట్లు? నిద్రపోతుందా? అని నేటిధాత్రి నిలదీసింది. పురుష ఐఎఎస్‌ అదికారుల మీద చిన్న వార్తలు వస్తేనే వెంటనే స్పందిస్తారు. కాని ఒక మహిళా ఐఏఎస్‌ అదికారి మీద ఇలాంటి తప్పుడు కధనాలు వస్తుంటే ఆ సంఘం ఏం చేస్తోందని నేటిదాత్రి ప్రశ్నించింది. మహిళా ఉన్నతాదికారి ఆత్మాభిమానం దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారా? అని నేటిధాత్రి ఆ అదికారుల సంఘాన్ని నిలదీసింది. ఇంత పెద్ద అబాండాలు ఏ మహిళా ఐఏఎస్‌ అధికారి మీద వేసి వార్తలు రాస్తుంటే ఇతర మహిళా అదికారులు మాకెందుకు లే అనుకున్నారా? అని కూడా నేటిదాత్రి అడిగింది. ఇదెక్కడి దిక్కుమాలిన జర్నలిజం అని ఆ ప్రసారం చేసిన చానళ్లను కూడా నేటిధాత్రి ప్రశ్నించింది. ఎట్టకేలకు అందరూ స్పందించారు. మంత్రి కూడా ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదన్నారు. ఐఏఎస్‌ అదికారుల సంఘం కూడా ఆయా చానళ్లకు నోటీసులు ఇస్తామని చెప్పింది. పోలీసు శాఖ కూడా వెంటనే రంగంలోకి దిగింది. దోషులపై 20 రోజుల్లో దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఏది ఏమైనా నేటిధాత్రి తన సామాజిక బాద్యతను మరోసారి నిలబెట్టుకున్నది. సామాజిక బాద్యత నిర్వహణలో మళ్లీ నేటిదాత్రి మాత్రమే ముందుదని నిరూపించుకున్నది. నేటిధాత్రికి అదికారుల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version