కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి.

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి

యువజన కాంగ్రెస్ గుండాల మండల ఉపాధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్

గుండాల,నేటిధాత్రి:

 

మండల గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విజయాన్ని యువజన కాంగ్రెస్ గుండాల మండలం ఉపాధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండాల మండలం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలుపరిచిన అభ్యర్ధులను గెలిపిస్తేనే గుండాల మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ తోనే పల్లె ప్రగతి సాధ్యం అవుతుంది గ్రామంలో మౌలిక సదుపాయాలతో పాటు మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజలు సన్న బియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. గుండాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ విజయం అవసరం..

గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ విజయం అవసరం

ఉల్లెంగల యాదగిరి స్పష్టం

నేటి ధాత్రి ఐనవోలు:

 

 

రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేషనల్ జాయింట్ కోఆర్డినేటర్, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి ఉల్లెంగల యాదగిరి పిలుపునిచ్చారు.
గ్రామస్థాయిలో అభివృద్ధి జరగాలంటే అనుభవజ్ఞులు, ప్రజాభిమానాన్ని గెలుచుకున్న నాయకులు ముందుకు రావాలని పేర్కొన్న యాదగిరి,రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 14వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే మాత్రమే గ్రామాలు మార్పు దిశగా అడుగులు వేస్తాయి” అని స్పష్టం చేశారు.

యాదగిరి నాయకత్వం – గ్రామాలకు భరోసా మాట

ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, గడచిన కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటించిన ఉల్లెంగల యాదగిరి ప్రతి ఇంటి సమస్యను విన్నారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన ఇలా అన్నారు.తాగునీరు అందుబాటులోకి రావాలి.గ్రామీణ విద్యా వ్యవస్థ బలపడాలి. ఉద్యోగావకాశాలు పెరిగే విధానాలు రావాలి.మురికినీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం అవసరం.ఎలక్ట్రిసిటీ సమస్యలు పూర్తిగా తొలగాలి.గ్రామీణ రహదారులు, పంచాయతీ భవనాలు అభివృద్ధి చెందాలి.”ఈ పనులు చేయగలిగేది కేవలం ప్రజలు ఎన్నుకున్న శక్తివంతమైన సర్పంచులు మాత్రమేనని, అందుకోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం తప్ప ప్రజలకు మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ – యాదగిరి దృఢసంకల్పం

“గ్రామం అభివృద్ధి చెందాలి అంటే నాయకులు కాదు… ప్రజలే ముందుకు రావాలి.
ప్రజలు ఓటుతో ఇచ్చే తీర్పే పాలనను మార్చగల శక్తి” అని యాదగిరి పేర్కొన్నారు.
గ్రామాభివృద్ధి, ప్రజల పురోగతి, భవిష్యత్తు తరాలకు మంచి గ్రామం నిర్మించాలనే లక్ష్యంతో, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి. అభివృద్ధిని కాంగ్రెస్ హామీ ఇస్తుంది, అని ఉల్లెంగల యాదగిరి ప్రజలను కోరారు.

గ్రామాభివృద్ధికి యువతే దిక్సూచి

లక్ష్యం సర్పంచ్ అవ్వడం కాదు — ఊరి భవిష్యత్తు మార్చడం..

నేటి ధాత్రి కథలాపూర్

 

కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (పౌర మరియు మానవ హక్కుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి తాలూకా మల్లేష్ మాట్లాడుతూ.

సర్పంచ్ అవ్వడం అంటే లంచాలు తీసుకోవడం కాదు,
సర్పంచ్ అవ్వడం అంటే ఊరి సమస్యలు పరిష్కరించడం.

సర్పంచ్ అవ్వడం అంటే ప్రజల్లో గొడవలు పెట్టి లాభం పొందడం కాదు ,.
అది ఊరిని కలిపి అభివృద్ధి దిశగా నడిపించడం * .

మంచి పాఠశాలలు కట్టించడం
హాస్పిటల్ నిర్మించడం
ప్రతి కుటుంబానికి ఇల్లు తెప్పించడం
ప్రతి ఇంటికి తాగునీరు, కొళాయిలు ఏర్పాటు చేయడం
ప్రజలకు కష్టసమయంలో అండగా నిలవడం — ఇదే నిజమైన సర్పంచ్ ధర్మం!

సర్పంచ్ అవ్వాలని కాదు — సేవ చేయాలని ఆలోచించాలి!
ప్రతి పనికి డబ్బు ఆశించే వారు ఊరిని ఎప్పుడూ అభివృద్ధి చేయలేరు.

*ఎలక్షన్ టైంలో సానుభూతి మాటలు, ప్రమాణాలు, కన్నీటి నాటకం చూపించే వారు,
ఊరి అభివృద్ధి కాదు — తమ స్వార్థాన్ని మాత్రమే కాపాడుతారు.*

యువత ముందుకు రావాలి!
స్వచ్ఛతతో, సేవా భావంతో, నిజాయితీతో ఉన్న యువతను
సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామం మారుతుంది!

లంచం లేని పాలన — యువతతోనే సాధ్యం!

> “ గ్రామం కోసం యువత — యువత కోసం గ్రామం”

అవినీతి అలవాటు పడ్డ వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సర్పంచ్‌గా ఎన్నుకోవద్దు!
అటువంటి వారిని సపోర్ట్ చేసే వాళ్లను కూడా నమ్మకండి.
వారి మాయమాటలకు మోసపోవద్దు —
అటువంటి వ్యక్తుల చేత గ్రామ భవిష్యత్తు నాశనం అవుతుంది.

యువతనే ఆశ, యువతనే మార్పు!
యువతను గెలిపిద్దాం — మన ఊరి భవిష్యత్తును వెలిగిద్దాం!

కిష్టంపేట ఎంపిటిసి బరిలో దాసరి శ్రీనివాస్…

కిష్టంపేట ఎంపిటిసి బరిలో దాసరి శ్రీనివాస్

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కిష్టంపేట ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయనున్నట్లు దాసరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న శ్రీనివాస్ కు మండల సమస్యలపై మంచి పట్టు ఉండటం వలన మౌలిక సదుపాయాల అభివృద్ధి కై కృషి చేస్తారని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎంపీపీ సీట్ కోసం రసవత్తరంగా పోటీ ఉండనున్నట్లు తెలిపారు.రాజకీయాల్లోకి చదువు కున్న యువతి, యువకులు రావాలని, అప్పుడే అన్ని గ్రామాలలో అభివృద్ధి మెరుగవుతుందని అన్నారు.తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేసే వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version