పద్మశాలి భవన్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎన్నిక,
జహీరాబాద్ నేటి ధాత్రి:
విశ్రాంతి ఉద్యోగుల సంగం సమావేశం పద్మశాలి భవన్ నందు తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉధ్యోగుల సంఘం జహీరాబాద్ మండల శాఖ ఎన్నికలు ఎకగ్రీవంగా జరిగినవి.అధ్యక్షులుగడ్డం జనార్దన్, ప్రధాన కార్యదర్శి పటేల్ రాజేందర్ రావు, కోశాధికారి శ్రీ బెండి చంద్రశేఖర్, అసోసియేట్ ప్రసిడెంట్ శ్రీ కౌలస్ ప్రభాకర్, ఉపాధ్యక్షులు ఎం. డి. ఆజీం, విజయ లక్ష్మీ, జాయింట్ సేక్రటరి నర్సిములు, అర్గనైజింగ్ సేక్రటరి కౌలస్ రాజేశేఖర్, పబ్లిసిటీ సేక్రటరి మహబూబ్ గౌరి, కార్య వర్గ సభ్యులుగా జి. చంద్రశేఖర్, యాకుబ్ అలి, సైఫోద్దిన్ గౌరీ, ఎ. బాగారెడ్డి, జి. రాందాస్, వి. నర్సిములు జిల్లా కౌన్సిల్ రమేష్ బాబు, పి. దుర్గయ్య, మల్లేష్ం ఎంపిక కాబడినారు. ఎన్నికల అధికారిగా విజయ రావు అబ్జర్వర్ జగదీశ్వర్ రావడం జరిగింది.
ముఖ్య అతిధిగా రాష్ట్ర జనరల్ సేక్రటరి సి. చంద్రశేఖర్ మాట్లాడుతు త్వరలో మనకు రావల్సిన డి. ఎ, పిఅర్సి, హేల్త్ కార్దులు ఇప్పించడానికి ప్రభుత్వానికి ప్రాతి నిధ్యం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమలో విశ్రాంత ఉధ్యోగులు తదితరులు పాల్గొన్నారు.