రాయికల్ తాసిల్దార్‌కు పౌర సదుపాయాల కోసం వినతి పత్రం

రాయికల్ తాసిల్దార్ నాగార్జునకు వినతి పత్రం

రాయికల్ జనవరి 23 నేటి ధాత్రి:

పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా అగ్నిమాపక కేంద్రం ,ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,మినీ స్టేడియం,హైదర బాద్ ,బొంబాయి బస్సు పునరుద్ధరణ ,పూర్తీ సౌకర్యాలు కలిగిన బస్సు స్టేషన్ మరియు అంగడి బజార్ లో బస్ సెల్దర్ ,ఇట్టి సమస్యలు గత అనేక సంవత్సరాలుగా ఎద్దండి భూమారెడ్డి ,తురగ శ్రీధర్ రెడ్డి ,సర్గీయ జర్నలిస్ట్ ముంజ ధర్మపురి గౌడ్ జర్నలిస్ట్ ,ప్రజా సంఘాల నాయకులు ఉద్యమించినప్పటికిని స్పందన కరువైనది గత అనేక సంవత్సరాలు ప్రజల సమస్యలు పరిష్కకరం నోచుకోకుండా ఉన్న సమస్యలు అగ్నిమాపక కేంద్రం లేక అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు భారీగా ప్రజలు నష్ట పోతున్నారు ,డిగ్రీ విద్యా అందుబాటులో లేక అనేక విద్యార్థులు ఉన్నత విద్యా అందడం లేదు చదువు మధ్యలోనే మానేస్తున్నారు,కాగ దాదాపు మండలం నుండి యాభై శాతంకు పైగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం హైదరా బాద్ నగరంలో ఉన్నారు వారి రాకపోకల నిమిత్తం హైదరాబాద్ బస్సు అత్యవసరం మరియు బాబాయి లాంటి నగరంలో ఆస్తులు ,చుట్టరికాలు ,వివిధ పనులకోసం బాబాయి తరుచుగా వెళ్లి వస్తుంటారు కాగ తక్షణమే ఇట్టి రెండు నగరాల బస్సులు పునరుద్ధరించగలరు మరియు పూర్తీ సౌకర్యాల బస్సు స్టేషన్ ను మరియు అంగడి బజార్ లో బస్సు సెల్దార్ నిర్మాణం చేయించగలరు మరియు రెండు కోట్ల రూపాయల పది లక్షల రూపాయలు నిధులు రాగ సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అసంపూర్తి నిర్మాణం గానే ఉంది ఇట్టి సమస్యల్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా ప్రార్థన

రాయికల్ పాఠశాలలో వైభవంగా సరస్వతీదేవి అర్చన

వైభవంగా సరస్వతీదేవి అర్చన

వసంత పంచమి ఉత్సవాలు

రాయికల్ జనవరి 23 నేటి ధాత్రి:

రాయికల్.పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు లో నెలకొల్పిన శ్రీ సరస్వతీ దేవి మండపం వద్ద శుక్రవారం దేవికి పూజలు నిర్వహించారు. వివిధ రకాల పువ్వులచే సరస్వతీ దేవి అర్చన పూజలు చేశారు. అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులచే సరస్వతీ దేవికి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గట్టు రమేష్ నర్సయ్య ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ లక్కాడి రాజరెడ్డి, పి.శ్రీనివాస్, వి.గంగరాజం, రవీందర్, పి. రాజశేఖర్ పి.రమేష్,యండి రాజమహ్మద్, ఎ.పద్మ.జి.తరంగిణి,ఎ.రజిత, యస్.శోభ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక…

శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గం ఎన్నిక

రాయికల్ సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:

 

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ శ్రీ భవానీ ‌సేవా సమితి నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రోజున సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడుగా రాయిల్ల జనార్థన్,ముఖ్య సలహాదారుడుగా గంగాధరి సురేష్, నూతన అధ్యక్షుడుగా శ్రీగద్దె సుమన్ ,ఉపాధ్యక్షులుగా కొయల్ కర్ వినోద్,తొగిటి రవితేజ, ప్రధాన కార్యదర్శి మోర శశికాంత్,కోశాధికారిగా గట్టు నవీన్ కుమార్ , సంయుక్త కార్యదర్శిలుగా దువ్వాక కృష్ణ చైతన్య,శ్రీ గద్దె శ్రావణ్ కుమార్,కార్యవర్గ సభ్యులు పారిపెల్లి శివ ప్రసాద్,కటుకం శివ కుమార్,గట్ల తరుణ్,కొరల్ కర్ ప్రవన్,కుంబలకర్ వెంకటేష్,కట్టెకొల అకిలేష్ లను ఏకగ్రీవంగా శ్రీ భవానీ సేవా సమితి సభ్యులు అందరు ఎన్నుకున్నారు.

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది..

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది
…గురు దేవో భవ ….!
… మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు

రాయికల్, సెప్టెంబర్ 5, నేటి ధాత్రి:

 

దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని ఆ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు అన్నారు.శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10 మంది ఉపాధ్యాయులను సాలువా మెమొంటోతో ఘనంగా సన్మానించారు.భారతరత్న అవార్డు గ్రహీత,మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చి దిద్దేది గురువులేనని అలాంటి ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం అభినందనీయమన్నారు.ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించే పాఠాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తాయన్నారు.తల్లిదండ్రుల కన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతోనే విద్యార్థులు భవిష్యత్తులో సరైన మార్గాన్ని ఎంచుకుంటారన్నారు.ఉపాధ్యాయులు గ్రామంలోని బాలబాలికలకు విద్య అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొత్తపెళ్లి రంజిత్,డిసి బత్తిని భూమయ్య,కోశాధికారి బెక్కెం తిరుపతి,లయన్స్ క్లబ్ సభ్యులు మచ్చ శేఖర్,దాసరి గంగాధర్,ఆడెపు రాంప్రసాద్,ఎర్ర సుమన్,జిల్లాల సూర్యం రెడ్డి,సాంబారు శ్రీనివాస్,ఉపాధ్యాయులు కుంభాల శ్రీనివాస్,రాపర్తి నర్సయ్య,కడకుంట్ల అభయ్ రాజ్,బెజ్జంకి హరికృష్ణ,ఆడెపు సుజాత,మచ్చ చంద్రకళ,ధ్యావన పెళ్లి సురేందర్, పుర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version