చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్

చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షులుగా పొదిల సురేష్

#నెక్కొండ, నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

నెక్కొండ మండల కేంద్రంలోని చంద్రుగొండ, బంజరపల్లి, మూడు తండా, గొల్లపల్లి, వాగ్య నాయక్ తండ, లకు సంబంధించి ఆటో యూనియన్ ఏర్పరచుకొని 30 సంవత్సరాలుగా అవుతున్న తరుణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఆటో యూనియన్ ఎన్నికలను నెక్కొండ నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలలో చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ ని, కార్యదర్శిగా చిలువేరు కొమ్మాలను, కోశాధికారి జితేందర్ , కమిటీ మెంబర్ గా కాజా పాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడు పొదిల సురేష్ తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా నెక్కొండ నవత యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట అక్టోబర్ 8 నేటిధాత్రి (మెదక్)

Vaibhavalaxmi Shopping Mall

అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ.
రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏ క గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా చిర్ర సత్యనారాయణ, కోశాధికారిగా కట్ట ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా రాగి లింగం, సహాయ కార్యదర్శులుగా రామారపు యాదగిరి, కుస్టీ నారాయణ, ముఖ్య సలహాదారులుగా పాతూరి రమేష్ గౌడ్, ఉడెం దేవరాజు, మర్కు నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులకు అన్ని విధాలుగా తన వంతు ఎల్లప్పుడు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ.

బాధిత కుటుంబానికి పరామర్శ.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో నీ గణేష్ పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించినా నాగలగాని కమల వారి కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జయశంకర్ భూపాలపల్లి జిల్ల అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి*
వారి వెంట జిల్లా ఉపాధ్యక్షులు మోరే రవీందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు మండల అధ్యక్షులు మోరే వేణుగోపాల్ రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి నేరెళ్ల శంకర్ తదితరులు ఉన్నారు

సీనియర్ ఫోటోగ్రాఫర్ కీ ఆత్మీయ సత్కారం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T151053.887.wav?_=1

 

సీనియర్ ఫోటోగ్రాఫర్ కీ ఆత్మీయ సత్కారం

మందమర్రి నేటి ధాత్రి

 

జి ఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ నిజామాబాద్ వారి 15 వ వార్షికోత్సవం సందర్భంగా 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలలో భాగంగా
జి ఆర్ మెమోరీయల్ వెల్ఫేర్ సొసైటీ
ఫౌండర్ చైర్మన్ నరేష్, సెక్రెటరీ శ్రీనివాస్ గుప్తా గార్లచే ఆత్మీయ సత్కారం. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షులు శ్రీ వడ్లకొండ కనకయ్య గౌడ్ కి
ఘనంగా సత్కరించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి నిజాంబాద్ ఈ ఎక్స్ జెడ్పి చైర్మన్ విట్టల్ రావు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కె హుస్సేన్ సార్ రాష్ట్ర కోశాధికారి మాధవ రెడ్డి గారు, జగిత్యాల జిల్లా సీనియర్ ఫోటోగ్రాఫర్ రామ్మోహన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు అప్పసు రాము. ప్రధాన కార్యదర్శి పోతరవేణి శ్వాస తిరుపతి కోశాధికారి ముక్కెర శ్రీనివాస్ మందమర్రి పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి నస్పూర్ మండల అధ్యక్షులు అగ్గు సాగర్ గారు నూనె సురేష్ తదితరులు పాల్గొన్నారు

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్…

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయంలో ఈనెల 27న గణపతి నవరాత్రి ఉత్సవములను నిర్వహించేందుకు నిర్వాహక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. శ్రీ సాంబమూర్తి దేవాలయ ప్రధాన అర్చకులు భైరవభట్ల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో. గ్రామస్తుల సమక్షంలో గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షనిగా క్యాతరాజు రమేష్, ఎన్నికయ్యారు. అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మాట్లాడుతూ. గణపతి నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని అందుకు కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తుల సహకారంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని క్యాతరాజు రమేష్ అన్నారు. ఉపాధ్యక్షులుగాదేవునూరి కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్దండి ప్రకాష్, కోశాధికారిగా బత్తిని రాజు, సహాయ కార్యదర్శిగాఎర్రబాటి మహేందర్, అన్నారపు కుమార్, కార్యవర్గ సభ్యులుగా వీణవంక నవీన్,క్యాతారాజు రజనీకాంత్, సూర్నేని మణికర్, గుడిమల్ల రమేష్, తంగళ్ళపల్లి వీరబ్రహ్మం, వీణవంక ప్రసాద్, కటుకూరి శ్రీధర్, దేవునూరి అశోక్, చాట్ల రాజు, పుట్ట అజయ్, హరీష్ లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

భీమారం బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T150935.256-1.wav?_=2

 

భీమారం బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్

జైపూర్,నేటి ధాత్రి:

 

జిహెచ్ఎంసి పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావ్ తలపెట్టిన చెలో సచివాలయం సేవ్ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా భీమారం పోలీసులు ముందస్తుగా బీజేపి మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్,ప్రధానకార్యదర్శి మడెం శ్రీనివాస్,వేల్పుల రాజేష్ యాదవ్,ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఎన్నిక.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-70.wav?_=3

గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఎన్నిక.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలోని గణేష్ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల నూతన కమిటీని స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు తాటి పెళ్లి శ్రీనివాస్ తెలిపారు. ఉత్సవాల కమిటీ అధ్యక్షుడిగా వల్లాల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా క్యాతరాజు మల్లేష్, మేడిపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మైదం శ్రీకాంత్, సహాయ కార్యదర్శిగా ఉయ్యాల రమేష్, కోశాధికారిగా చిలగాని నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా ఓదెల శ్రీహరి, ఈగ కోటేశ్వర్, మహమ్మద్ అక్బర్, మామిడి శెట్టి తిరుపతి, చింతకింది దశరథం, భీమారం ప్రమీల, పట్టేం రాజు, మహమ్మద్ వలి, పోతుగంటి సంతోష్ లను ఎన్నుకున్నట్లు ఆయన వివరించారు.

29 న రౌండ్ టేబుల్ సమావేశం..

29 న రౌండ్ టేబుల్ సమావేశం

ఎంసిపిఐ (యు) డివిజన్ సహాయ కార్యదర్శి రాజమౌళి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T121408.236.wav?_=4

నర్సంపేట,నేటిధాత్రి:

రైతాంగ ఉద్యమాలు – ఓంకార్ పాత్ర అంశంపై ఎంసిపిఐ(యు),ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 29న నర్సంపేట మండలం మాదన్నపేటలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంసిపిఐ(యు) పార్టీ నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు రానున్నట్లు తెలిపారు.

తుంకుంట పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..

తుంకుంట పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం తుంకుంట పంచాయతీ కార్యదర్శి బీరప్ప సస్పెండ్ అయినట్లు తెలిసింది వివరాలకు వెళితే తుంకుంట గ్రామం లో కోర్టు పరిధిలో ఉన్న భూమి తప్పదు తీర్మానాలు చేసిన విషయం లో ఆయన సస్పెండ్ అయినట్లు అనుకుంటున్నారు. ఈ సస్పెండ్ గత 17 వ తేదీ న అయినప్పటికీ అధికారులు ఇట్టి విషయం లో అధికారికంగా తెలుపడం లో ఆలస్యం చేస్తుండడడంతో పలు అనుమానాలకు అవకాశం కనిపిస్తుంది. వారం రోజులు గడించిన ఇప్పటివరకు తుంకుంట గ్రామానికి కూడా కనీసం ఇంచార్జి గా పంచాయతీ కార్యదర్శి ని నియమించాకపోవడం ఏమిటని అనుకుంటున్నారు.

ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

ఈనెల 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

.సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జులై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మారపల్లి మల్లేష్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలన్నారు. పెట్టుబడ్డిదారుల ప్రయోజనాల కోసం కార్మికులకు ఉన్న హక్కులను కాళ్లరాస్తున్నారన్నారు. పనిగంటలు పెంచడంతోపాటు కార్మిక వర్గాన్ని ఐక్యంగా లేకుండా నాలుగు లేబర్ కోడ్ లతో బలిచ్చే విధంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాము.ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్.. రాజు.. పాల్గొన్నారు.

బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి.

బిటి 3 పత్తి విత్తనాలను నియంత్రించాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ గౌడ్

మరిపెడ నేటిధాత్రి.

మరిపెడ మండలం
లోని రబీ సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమైన వేల మరిపెడ మండలంలోని అమాయకులైన రైతులను ఆసరాగా చేసుకుని బీటీ3పత్తి విత్తనాలను విచ్చలవిడిగా మరిపెడ మండలంలోని వివిధ గ్రామాల్లో విక్రయిస్తున్నారు అదేవిధంగా మరిపెడ మండలంలోని అనుమతి లేని ఫెర్టిలైజర్స్ అనుమతులు ఉండి రెన్యువల్ చేయని చేయని ఫెర్టిలైజర్స్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిషేధించినటువంటి క్రిమి సహారక రసానిక ఎరువులను అన్ని ఫెర్టిలైజర్ షాపులు నిల్వలు లేకుండా చూడాలని రైతులకు ఎమ్మార్పీ ధరలకు ఎరువుల బస్తాలు క్రిమి సారక మందులను అందించాలని వారు డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని మరిపెడ ఏవో గారికి సిపిఐ మరిపెడ మండలం తరపున కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ యాకన్న సత్యం రాజేష్ తదితరులు పాల్గొన్నారు

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం.

సిపిఐ జిల్లా కార్యదర్శి కి ఘన సన్మానం

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

 

 

సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయిన నేపద్యంలో రామకృష్ణాపూర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ శ్రేణులు ఘనంగా సన్మానించారు.పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ ను సైతం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. జిల్లా మహాసభలో చేసిన తీర్మానాలను,పార్టీ ప్రజా సంఘాల నిర్మాణానికి స్థానిక సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌల్, వెంకటస్వామి, వనం సత్యనారాయణ, సాంబయ్య, గోపి, మణెమ్మ,శంకర్,రాములు, సత్తన్న, మొగిలి తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన కార్యదర్శి నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బేటి

ప్రధాన కార్యదర్శి నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బేటి.

మహదేవపూర్ -నేటి ధాత్రి:

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మతినుల్లా ఖాన్ నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు బీటీ కావడం జరిగింది.
గురువారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్ఖానా గడ్డ లోని మతిన్ ఖాన్ నివాసంలో కోట రాజబాబు భేటీ కావడం,రాబోయే పంచాయితీ ఎన్నికలకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తుంది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మతిన్ ఖాన్, మహాదేవపూర్ కాటారం మండలాల్లో కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన నాయకుడుగా ఉండడం, రెండు మండలాల్లో ప్రజల్లో పలుకుబడి సంపాదించిన ఖాన్ సాబ్, కావడంతో పంచాయితీ ఎన్నికల్లో, సర్పంచ్ నుండి ఎంపీటీసీ ల పోటీలకు బి ఫాం నుండి, గెలుపు పొందె వరకు ఖాన్ సాబ్ అవసరం ఉంటుంది కనుక, ముందస్తుగా మతిన్ ఖాన్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో, పలు నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కోట రాజబాబు మతిన్ ఖాన్ గృహంలో కలవడం ఒక సాధారణ ప్రక్రియ లో భాగమేనని చెప్పడం జరుగుతుంది.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత .

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత గ్రామ కార్యదర్శి కృష్ణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని కార్యదర్శి కృష్ణ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోహిర్ మండల బేడంపేట గ్రామ యుపిఎస్ పాఠశాల ప్రాంగణంలో స్వచ్ఛత కార్యక్రమం గురువారము నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి పర్యావరణం కలుషితం కాకుండా ప్రకృతిని పెంచాలని మరియు గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలని వివరించడం జరిగింది ప్రకృతి బాగుంటేనే ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని వారు ప్లాస్టిక్ వ్యర్థాలను నదుల్లో పడేయొద్దని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి.

ఎస్సీ గురుకులాల సెక్రటరీని విధుల నుంచి తొలగించాలి
విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి విల్సన్

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

 

ఎస్సీ గురుకులాల విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణిని తక్షణమే విధులు నుండి తొలగించి కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ప్రధన కార్యదర్శి జేరిపోతుల విల్సన్ మాదిగ డిమాండ్ చేశారు.

మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
చిట్టు పాక ప్రభాకర్ మాదిగ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ముందుకు సాగుతూ ఎస్సీ గురుకుల ను దేవాలయాల లాగా వుండాలని చెప్పారు.

కానీ ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఒక ఐఏఎస్ అధికారిని అయి ఉండి దళిత విద్యార్థుల పై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కుల అహంకారంగా భావించాల్సిన అవసరం ఉంది అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను దళితులు పక్షాన ఉన్నాను ఉంటాను అని ఎన్నో వేదికల పైన మనకు తెలపడం జరిగింది కానీ ఇటువంటి కులహంకార అధికారుల వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి వర్షిని మాట్లాడిన మాటలు మనము గమనిస్తే విద్యార్దులే వారి టాయిలెట్లు కడిగితే తప్పేముంది అనే మాట ఏంతో విషపూరిత మాట కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటేనే వారిని తొలగించండి .

వారి మీద రాష్ట్ర ఉన్నత పోలీస్ శాఖకేసును సుమోటోగా తీసుకొని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి.

రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విచారణ జరిపి తక్షణమే విధుల నుంచి తొలగించాలి గురుకులాల సెక్రటరీ పోస్టును అర్హులైన దళిత అధికారిని వెంటనే నియమించాలి అప్పుడే మా దళిత బిడ్డలకు న్యాయం జరుగుతుంది స్వేచ్ఛగా చదువుకునే విసులుబాటు అందుతుందిఅని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ టి. ఎం. ఆర్. పి. ఎస్ తరుపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నమన్నారు.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శులుగా పాలకుర్తి తిరుపతి సంగ పురుషోత్తం

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శిలుగా పాలకుర్తి తిరుపతి,సంగ పురుషోత్తంలను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను మాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి.

బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి తిరుపతి

సహకరించిన అందరికి ధన్యవాదాలు -పాలకుర్తి తిరుపతి

 

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆదేశానుసారం ఏకాభిప్రాయంతో నూతన పట్టణ పూర్తి కమిటీని పట్టణ ప్రధాన కార్యదర్శి గా పాలకుర్తి తిరుపతి ని ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ పార్టీ కి ప్రజలకు సేవచేసే గొప్ప బాధ్యతను నాపై నమ్మకం ఉంచి అప్పగించినందుకు పార్టీని బలోపేతం చేసేందుకు అహర్నిశలు కష్టపడతానని,నా నియమకానికి సహకరించిన
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ,పరకాల కంటెస్టడ్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.పెసరు విజయచందర్ రెడ్డి,డాక్టర్ లో.సిరంగి సంతోష్ కుమార్,కాచం గురు ప్రసాద్,గుజ్జ సత్యనారాయణరావు,భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు,గాజుల నిరంజన్,మాజీ కౌన్సిలర్
జయంతి లాల్,దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్,కొలనుపాక భద్రయ్య,బెజ్జంకి పూర్ణచారి,బూత్ అధ్యక్షులకు,మోర్చాల అధ్యక్షులకు రాష్ట్ర మరియు జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్థుల పట్ల వివేక్షత చూపుతున్న సెక్రటరీ అలుగు వర్షిని.!

విద్యార్థుల పట్ల వివేక్షత చూపుతున్న సెక్రటరీ అలుగు వర్షిని సస్పెండ్ చేయాలి.

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా సెక్రెటరీ మారేపల్లి మల్లేష్.

చిట్యాల నేటిధాత్రి :

రాష్ట్రవ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాలకు సంబంధించి 12 జూనియర్ కళాశాలను మూసివేయడానికి కుట్టలు చేస్తున్న ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తూ ఎస్సి విద్యార్థుల పట్ల వివక్షత చూపుతున్న సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని తొలగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్ చేస్తున్నా ము. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఎస్సీ విద్యార్థుల కోసం పెద్ద పీఠం వేస్తున్న తరుణంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని జోగులాంబ గద్వాల కరీంనగర్ చొప్పదండి ఖమ్మం మహబూబాద్ సిద్దిపేట సంగారెడ్డి కామారెడ్డి జయశంకర్ భూపాలపల్లి జనగాం మేడ్చల్ మల్కాజిగిరి ఈ 12 జిల్లాల ఎస్సీ గురుకులాల కళాశాలలను సరిపడా విద్యార్థులు లేరని సాకులతో మూసివేయడం సరికాదన్నారు విషయం సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ గురుకుల మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలియపరుస్తాం అలాగే 2025 విద్య సంవత్సరంలో నుండి అక్కడ చదువుతున్న విద్యార్థులు ఎక్కడికి పోవాలి తెలియక ఆందోళన చెందుతున్నారని వాపోయారు ఆమె నిర్ణయం పట్ల దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాపోయారు ఒకే కాలేజీలో రెండు కోర్సుల చొప్పున ఇంటర్ ప్రాథమిక సంవత్సరంలో 120 ద్విత సంవత్సరంలో 120 మంది మొత్తం 240 సీట్లు ఉంటాయన్నారు 12 గురుకులాల్లో జూనియర్ కళాశాలలు మూసివేయడం వల్ల సీట్లు రద్దు అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు దీనివల్ల నిరుపేద దళిత విద్యార్థులు గురుకుల విద్యను కోల్పోతారన్నారు. ఈ విషయాన్ని గమనించి సీఎం స్పందించి ఎస్సి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.

మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

నీలికుర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ PACS ఏర్పాటు చేయాలి

సిపిఐ మరిపెడ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ

మరిపెడ నేటిధాత్రి.

 

 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు వ్యాపారులకు అమ్మకుండా కనీస మద్దతు ధర బోనస్ లభించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి ప్యాక్స్ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసింది మరిపెడ మండలంలోని అన్ని గ్రామాలలో ఐకెపి ప్యాక్స్ సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించడం జరుగుతుంది. నీలికుర్తి గ్రామంలో ప్యాక్స్ సెంటర్ ఏర్పాటుచేసి ఇక్కడ ఉన్నటువంటి 2500 మంది వరి ధాన్యం పండించే రైతుకు కనీస మద్దతు ద్వారా బోనస్ లభించే విధంగా ప్రజా ప్రతినిధులు అధికారులు తక్షణమే నీలికుర్తి గ్రామంలో ఫ్యాక్ సెంటర్ ఏర్పాటుచేసి కొనుగోలు ప్రారంభించాలని ఎమ్మార్వో గారికి డిమాండ్లతో కూడిన వినపత్రాన్ని అందజేయడం జరిగింది
గత కొన్ని సంవత్సరాలుగా నీలి కుర్తి గ్రామంలో ప్యాక్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు జరిగింది గత రబీ కాలంలో ప్యాక్ సెంటర్ కొనుగోలు వ్యాపారులు దళారులు ప్రమేయాన్ని అరికట్టాలని నీరుకుర్తి గ్రామస్తుల ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే దానిని సాకుగా చూసుకొని అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడ సెంటర్ ని ఎత్తివేయడం వలన రైతులు కనీస మద్దతు ధర బోనస్ను పొందలేకపోతున్నారు కాబట్టి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తక్షణమే ఫ్యాక్స్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని వినపత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్,యాకన్న,అంజి,వస్త్రం తదితరులు పాల్గొన్నారు

డయల్ యువర్ ఆర్టీసి డిపో మేనేజర్.!

*డయల్ యువర్ ఆర్టీసి డిపో మేనేజర్ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్ . . .

రాయికల్ .నేటిదాత్రి.తేదీ 11.04. 2025 

 

 

శుక్రవారం రోజున డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం లో భాగంగా డిపో మేనేజర్ కల్పన మేడం గారితో జగిత్యాల – బోర్నాపెల్లి బస్ కడెం వరకు కొనసాగించడం ద్వారా రామాజీపేట, భూపతిపూర్,లింగాపూర్,చింతలూరు, బొర్నపెల్లి గ్రామాల ప్రయాణికులు ఇబ్బందులకు గురిఅవుతుంద్రు అని ప్రస్తావించగా, ప్రభుత్వ ఆదేశానుసారం కడెం వరకు బస్సు వేయడం జరిగింది అని మేడం తెలుపారు, కాబట్టి ఇక్కడున్న స్థానిక ఎంఎల్ఏ గారికి విజ్ఞప్తి, మన నియోజక వర్గంలో చివరి గ్రామం బోర్నపెల్లి,కావున ఇక్కడి ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి కొన్ని నెలల క్రితం పరిమితికి మించి ప్రయాణికుల ఎక్కడం ద్వారా రాయికల్ కు వచ్చే బస్ వెనక టైర్లు రెండు ఊడి పోవడం జరిగింది అదృష్ట వశాత్తూ ఆ సంఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు, అన్ని రోజులు ఒక్కల ఉండవు కావున అలాంటి సంఘట మరొకటి జరుగకముందే బోర్నపెల్లి బస్ అక్కడి వరకే కొనసాగిస్తూ కడేంకు ఇంకొక బస్ వేయడం ద్వారా ఇక్కడి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రభుత్వ స్పందించక ఇలాగే పరిస్థితి కొనసాగిస్తే ప్రజల సౌకర్యార్థం ఎలాంటి నిరసనలు ఉద్యమాలు చేయడానికి అయినా సిద్ధం అని మండల ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి రాజశేఖర్ అనడం జరిగింది

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version