నెక్కొండ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నిక.

నెక్కొండ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నిక

అధ్యక్షుడిగా తాటిపల్లి శివకుమార్

ప్రధాన కార్యదర్శిగా భూపతి వీరన్న

నెక్కొండ నేటి ధాత్రి:

నెక్కొండ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులు పిఎసిఎస్ చైర్మన్ మారం రాము జిల్లా ఉపాధ్యక్షుడు గోరంట్ల వెంకటనారాయణ, జిల్లా కార్యదర్శి దేసూ లక్ష్మణ్, లసమక్షంలో ఎన్నికలు ప్రశాంతంగా ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికలను ఆర్యవైశ్య సీనియర్ నేతలు తాళ్లూరి వెంకటేశ్వర్లు, గన్ను సత్యం నంగునూరు శివయ్య, దొడ్డ విజయ్, తాళ్లూరు నరసింహ స్వామి, ల ఆధ్వర్యంలో జరగగ మండల కమిటీ అధ్యక్షుడిగా తాటిపల్లి శివకుమార్, నెక్కొండ, ఉపాధ్యక్షులు 1 వేంశెట్టి శ్రీహరి , పెద్ద కోరుపోలు, 2 మా శెట్టి యాదగిరి తోపనపల్లి, 3 కిరణ్ రెడ్లవాడ, ప్రధాన కార్యదర్శిగా భూపతి వీరన్న నెక్కొండ, సహాయ కార్యదర్శిగా బొల్లం యాకయ్య చిన్న కొరుపోలు, కోశాధికారిగా ఇమ్మడి శ్రీనివాస్ చంద్రుగొండ, మండల కార్యవర్గ సభ్యులుగా వేములపల్లి వీరన్న దీక్షకుంట, బెలిదే రమేష్ ముదిగొండ, సమ్మయ్య గుండ్లపల్లి, గాందే కృష్ణమూర్తి బంజారా పల్లి, చిదురాల నరేష్ అలంకానిపేట, గంప కుమారయ్యా నాగారం, వీరందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు తాటిపల్లి శివకుమార్ కార్యదర్శి భూపతి వీరన్న మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని మాకు బాధ్యతలు అప్పగించడంలో సహాయ సహకారాలు అందించిన పి ఎస్ సి ఎస్ చైర్మన్ మారం రాము,తాలూరి నర్సింహులు, దొడ్డ విజయ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాపైన నమ్మకాన్ని ఉంచిన అందరి ఆశీస్సులతో కమ్యూనిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో గన్ను కృష్ణ, తాలూరి లక్ష్మయ్య,, గన్ను రాము, డిష్ రాజు, దొడ్డ నగేష్, నంగునూరు వెంకన్న, అశోక్ ,తాలూరి కృష్ణ, మోహన్, బొల్లం చందు, ఇమ్మడి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

విడిపోయిన తండ్రి కొడుకులను కలిపిన నెక్కొండ ఎస్సై

విడిపోయిన తండ్రి కొడుకులను కలిపిన నెక్కొండ ఎస్సై

నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండలంలోని తొపనపల్లి గ్రామంలో కందికొండ మల్లయ్య, అతని కుమారుడు కుమారుడు ప్రభాకర్, కోడలు రజిత లతో గొడవపడి రెండు సంవత్సరాల క్రితం విడిపోయి గ్రామంలోని పాడుబడిన పాత పాఠశాల బిల్డింగ్ లో మల్లయ్య భార్య వీరి లక్ష్మితో ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న నెక్కొండ ఎస్ఐ మహేందర్ తల్లి తండ్రి కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి తల్లి తండ్రి కొడుకులను కలిపిన ఎస్ఐ మహేందర్ దీంతో పోలీసుల విధానాన్ని ఎస్సై చోరవకు పలు వర్గాల ప్రజలు అభినందనలు తెలిపారు.

నెక్కొండ పౌరులు అందరికీ ఆదర్శప్రాయులు.

నెక్కొండ పౌరులు అందరికీ ఆదర్శప్రాయులు

వాట్సాప్ గ్రూప్ ద్వారా సామాజిక చేయూత

శభాష్ నెక్కొండ వాట్సాప్ గ్రూప్ అంటూ పలువురు ప్రశంసలు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

నెక్కొండ అభివృద్ధికైనా, సామాజిక సేవా కార్యక్రమానికైనా, రైల్వే స్టేషన్ సంబంధించి రైలు ఆపడంలో, రాజకీయ బహిరంగ చర్చ కైనా నెక్కొండలో జరిగే ప్రతి అంశానికి ఆతిథ్యమిస్తూ ఏకైక గ్రూప్“ నెక్కొండ పౌరులు“ఈ వాట్సాప్ గ్రూప్ గత పది సంవత్సరాల క్రితం సేవ కార్యక్రమాలలో పాల్గొనేందుకు నెక్కొండ నగరానికి సంబంధించి మంచి చెడు తెలుసుకోవడానికి 2014 సంవత్సరంలో దుంప నాగరాజు అనే ఓ పారిశ్రామికవేత్త గ్రూప్ క్రియేట్ చేసి నెక్కొండలో జరిగే ప్రతి విషయాన్ని మంచి చెడులను నెక్కొండ ప్రజలకు తెలిసే విధంగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని గ్రూపులో చేరవేస్తూ ఆపద వస్తే మేమున్నామంటూ నిరుపేదలకు మేమున్నామంటూ ఒక భరోసాను కల్పిస్తూ వందల మందికి ఆదర్శంగా నిలుస్తున్న నెక్కొండ పౌరులు అనే గ్రూపు ఇప్పుడు అన్ని వాట్సాప్ గ్రూపు లలో చర్చనీ అంశంగా మారింది. వాట్సాప్ గ్రూప్ అంటే ఎవరికి ఇష్టం వచ్చిన పోస్టు వారు పెట్టకుండా నెక్కొండ అభివృద్ధికి సామాజిక సేవా కార్యక్రమాలకు రాజకీయ చర్చలకు ప్రజా అభిప్రాయాల సేకరణకు నెక్కొండ కేంద్ర బిందువుగా పనిచేస్తున్న నెక్కొండ పౌరులు పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

వాట్సాప్ గ్రూపు ద్వారా పలువురికి సహాయం

నెక్కొండ పౌరులు అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు ఏర్పాటు చేయడంలో దీనస్థితిలో చనిపోయిన వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించడంలో నెక్కొండ పౌరులు అనే గ్రూప్ లో ఉన్న సభ్యులు ఎవరికి తోచినంత వారు గ్రూప్ అడ్మిన్ అయినా దుంప నాగరాజుకు ఆన్లైన్లో అమౌంట్ చేరవేసి ఇలా చేరవేసిన అమౌంట్ ను పేదరికంతో చనిపోయిన వ్యక్తులకు, సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికీ ఈ గ్రూపు ద్వారా ఎన్నో కుటుంబాలకు చేయూతనందించడం గమనార్ధం.

నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

నెక్కొండలో లక్క పురుగుల నుండి కాపాడండి….!

దయచేసి అధికారులు విలేకరులు పట్టించుకోండి

వాట్సాప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు పోస్ట్ లు

తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నెక్కొండ మరియు చుట్టుపక్క గ్రామ ప్రజలు…

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండల కేంద్రంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటుచేసిన గోధుమల వల్ల మరియు వ్యవసాయ మార్కెట్ యాడ్ లో ఏర్పాటు చేసిన గోధుమల వల్ల ఏర్పడిన లక్క పురుగుల ద్వారా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నెక్కొండ మండలానికి చెందిన వాట్సప్ గ్రూపులలో కొందరు వ్యక్తులు లక్క పురుగుల నుండి నెక్కొండ గ్రామం తో పాటు గుండ్రపల్లి,అమీన్ పేట్, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎలాగైనా అధికారులు మరియు విలేకరులు చొరవ తీసుకొని ఈ విషయం పట్ల స్పందించి లక్క పురుగుల నుండి తమను కాపాడాలని కోరుతూ మెసేజ్ చేయడం గమనార్థం.

నెక్కొండ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ గోదాంల సముదాయంతో పాటు నెక్కొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన గోదాముల వల్ల నెక్కొండ లో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెక్కొండ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ఎక్కువగా వాహనదారులు లక్క పురుగుల ద్వారా ప్రమాదాలకు గురి కావడంతో పాటు చెవి, ముక్కు, కను రెప్పల మద్దెలపడడంతో వాహనదారులు ఇబ్బంది పడటం పాటు అనారోగ్యానికి గురవుతున్నారు, అంతేకాక నెక్కొండ స్థానికంగా జీవించే ప్రజలు చర్మవ్యాధులతో పాటు కళ్ళ మంటలతో మరి చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని వెంటనే అధికారులు అప్రమత్తమై సంబంధిత గోదాములను తనిఖీలు చేసి నివారణ చర్యలు చేపట్టి నెక్కొండ ప్రజలను రక్షించాలంటూ పలువురు నెక్కొండ నివాసులు అభిప్రాయపడుతున్నారు.

నెక్కొండలో ఘనంగా రంజాన్ వేడుకలు.

నెక్కొండలో ఘనంగా రంజాన్ వేడుకలు

@ ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

 

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

ముస్లింలకు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగ రంజాన్ కావడంతో నెక్కొండ లోని ముస్లిం సోదరులు నెక్కొండ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై ముస్లిం సోదరులతో అలైబాలై తీసుకుంటూ ముస్లిం సోదరులతో కలిసి మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు నెల రోజుల నుండి ఉపవాసం ఉంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అత్యంత పవిత్రతో జరుపుకునే పండగ రంజాన్ పండగని ఈ రంజాన్ పండుగ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం లోని ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. అలాగే ఈ సంవత్సరం రాష్ట్రంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతోని పాడిపంటలతోని ఆ అల్లా కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల మహేష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కీ అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ షబ్బీర్, రామాలే కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట ఏజిపి అడ్వకేట్ బండి శివకుమార్, నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, దొడ్డ విజయ్, తాళ్లూరి నరసింహస్వామి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోలిశెట్టి భాను, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సింగం ప్రశాంత్, ముస్లిం సోదరులు రఫీ, మహమ్మద్ అమీర్ , మహమ్మద్ హమీద్, ఎండి అన్వర్ పాషా, యాకుబ్ పాషా, ఇబ్రహీం, ఎండి అఫ్జల్, సలీం, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ తిరుపతి ని అభినందిస్తున్న నెక్కొండ ప్రజలు.

సలాం పోలీస్….

@ కానిస్టేబుల్ తిరుపతి ని అభినందిస్తున్న నెక్కొండ ప్రజలు

#నెక్కొండ, నేటి ధాత్రి :

పోలీసులంటే భయంతో వణికిపోయే ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ ను ఏర్పాటు చేయడంతో ప్రజలతో మమేకంగా ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడంలో పోలీస్ సేవలు అత్యంత అమోఘం అని చెప్పవచ్చు. పోలీస్ సేవలో భాగంగానే 2024- 25 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తుండడంతో మొదటిరోజు పరీక్షకు నెక్కొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్దకు వచ్చిన విద్యార్థిని తన పరీక్ష కేంద్రం అక్కడ కాదని నెక్కొండ మోడల్ స్కూల్లో ఉందని ఉపాధ్యాయులను తెలుసుకొని నెక్కొండ ప్రభుత్వ కాలేజీ నుండి ప్రభుత్వం మోడల్ స్కూల్ లో పరీక్ష రాయవలసి ఉండడంతో సమయం కూడా కేవలం ఐదు నిమిషాల సమయం ఉండడంతో ఆ విద్యార్థి ఇక పరీక్ష రాయలేనేమో అని బోరున్న విలపించగా అక్కడే విధులు నిర్వహిస్తున్న బానోతు తిరుపతి అనే కానిస్టేబుల్ వెంటనే ఆ విద్యార్థి దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని తెలుసుకుని ఐదు నిమిషాల వ్యవధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మోడల్ స్కూలుకు తన బైక్ పై తీసుకువెళ్లి నిర్ణీత ఐదు నిమిషాల వ్యవధిలో విద్యార్థిని పరీక్షకు హాజరు చేయడంతో ఆ విద్యార్థిని కానిస్టేబుల్ తిరుపతికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది. ఇది అంతా ఓ వ్యక్తి వీడియో తీసి పలు నెక్కొండ మరియు వివిధ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో సలాం పోలీస్ అన్న అంటూ కానిస్టేబుల్ తిరుపతి ని నెక్కొండ ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version