వికలాంగుల పింఛన్ల కొరత, తక్షణమే పరిష్కారం కావాలి.

వికలాంగుల పింఛన్ల మాటమర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున వికలాంగుల నాయకుడు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ… గత నాలుగు సంవత్సరాలుగా వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా సైట్ బంద్ చేసి వారి జీవితాలతో చెరగట మాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తాగిన.బుద్ధి చెప్పాలన్నారు. కొత్త పింఛన్లు రాక వికలాంగులకు సరియైన తిండి లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధించిన జిల్లా అధికారులు తక్షణమే వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆన్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు కొత్త పిక్చర్లు ఇవ్వడానికి సైట్ ఓపెన్ చేసి పింఛన్లు మంజూరు చేసివారిని ఆదుకోవాలని కోరారు.

యూరియా కోసం తెలంగాణ రైతులు ఎదురుచూపు…

యూరియా కోసం తెలంగాణ రైతులు ఎదురుచూపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రైతు ఆవేదన పట్టించుకోవడం లేదు మహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మరియు బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాదినం శివప్రసాద్ కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ వజిర్ అలీ రైతు ఆవేదన తెలంగాణ రాష్ట్రంలో రైతు అకాల వర్షాలతో సతమతమవుతుంటే యూరియా ఎరువు దొరకక విలవిలలాడుతున్నారు అప్పులు చేసి పంట
సాగు చేస్తున్న రైతుకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం అందడం లేదు రైతు కన్నీళ్లు దేశానికి మంచిది కాదు రైతు పండిస్తేనే దేశానికి అన్నం దొరుకుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడి తెలంగాణ రైతులకు న్యాయం చేయాల్సిందిగా సకాలంలో ఎరువులు అందుకేనే పంటలు పండుతాయి లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఎరువుల కొరత లేకుండా చూడాలి గత నెల రోజుల నుండి ఎండనక వాననక యూరియా కోసం తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్నారు తక్షణమే యూరియా సరఫరా చేయాలి రైతులకు యూరియా సరఫరా చేయాలి,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version