కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా.!

కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె విజయవంతం

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక ఉద్యోగ రైతాంగ సంఘాలు ఇచ్చిన సమ్మె బుధవారం గుండాల మండలంలో విజయవంతం అయిందని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోడేటి నాగేశ్వరరావు,సిఐటియు జిల్లా నాయకులు ఈసం వెంకటమ్మ,ఏఐయుకేఎస్ జిల్లా నాయకులు మాచర్ల సత్యం, ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం( ఏఐటిఎఫ్) జాతీయ కన్వీనర్ ముక్తిసత్యం అన్నారు.
సమ్మె సందర్భంగా గుండాలలో గ్రామపంచాయతీ కార్యాలయం నుండి బొడ్రాయి సెంటర్ వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమాని ఐఎఫ్టియు జిల్లా నాయకులు యాసారపు వెంకన్నఅధ్యక్షత వహించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నాలుగు కోడులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతాంగం తమ రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించి చట్టాలను వెనక్కి కొట్ట గలిగారని అదే స్ఫూర్తితో కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా కార్మిక వ్యతిరేక నాలుగు కోడులను వెనక్కి కొట్టగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కార్మిక వర్గం సంగటితం కావలసిన అవశ్యకతను గుర్తు చేశారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెలో సుమారు 25 కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం సమ్మెలో పాల్గొన్నారని వారు అన్నారు. గుండాల మండలంలో అంగన్వాడి,ఆశ,హమాలి, భవన నిర్మాణం గ్రామపంచాయతీ,మోటార్ వర్కర్స్ తదితర అసంఘటిత సంఘటిత కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు గడ్డం నగేష్, వానపాకుల లాలయ్య,చింత నరసయ్య,బానోత్ చంద్యా, తాటి కృష్ణ,మెంతిని నాగేష్, ఏఐకేఎంఎస్ నాయకులు గడ్డం లాలయ్య,కొమరం సీతారాములు,బానోతు లాలు, పాయం ఎల్లన్న,టియుసిఐ నాయకులు కొమరం శాంతయ్య,కోడూరి జగన్, మొక్క నరి, సిఐటియు నాయకులు పాయం సారమ్మ, వట్టం పూలమ్మ,వాగబోయిన కౌసల్య,ఎస్.కె నజీమా తదితరులు పాల్గొన్నారు.

పార్టీలు, కండువాలు వేరైనా బీజేపీ,కాంగ్రెస్ విధానం ఒక్కటే

పార్టీలు, కండువాలు వేరైనా బీజేపీ,కాంగ్రెస్ విధానం ఒక్కటే

మందమర్రి నేటి ధాత్రి

కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్ లను తెచ్చిన బీజేపీ,మోడీ ప్రభుత్వంపై కార్మిక వర్గం,ప్రజలు జూలై 9 దేశా వ్యాప్త సమ్మె చేపట్టగా.

బీజేపీ,మోడీ కంటే మా ప్రభుత్వం ఎం తాక్కువకాదు అన్నట్లుగా
కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటల విధానాన్ని తేవడం దుర్మార్గం సిగ్గు చేటు.

కార్మిక వర్గం పై జరుగుతున్న నిరంకుశత్వ దాడిపై జూలై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు కార్మిక వర్గం బుద్ది చెప్పాలి

డా. బి ఆర్ అంబేడ్కర్ విగ్రహనికి పూల మాలలు.

 

 

 

మందమర్రి సీఐటీయూ అధ్వర్యంలో కార్మికుల బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడిన సంకె రవి సీపీఎం జిల్లా కార్యదర్శి.

పాల్గొన్న దూలం శ్రీనివాస్
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి.కార్మికులు.

 

 

 

కేంద్రంలోని బిజెపి,మోడీ రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు పార్టీలు, కండువాలు మాత్రమే వేరు పరిపాలన విధానం బడా పెట్టుబడుదారులు కార్పొరేట్ లా ఖజానా నింపడానికి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలు చేయడమే వారి లక్ష్యం ఈ నిరంకుషత్వ విధానాలకు వ్యతిరేకంగా జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మందమర్రి బి ఆర్. అంబేడ్కర్ విగ్రహం నుండి కార్మిక వాదాలు,మార్కెటింగ్ గుండా బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది.

 

 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం మొదటి నుండే రైతు, కార్మిక,వివిధ తరగతుల ప్రజలపై ఏదో ఒక రూపంలో దాడి చేస్తూనే ఉంది.
గతంలో రైతులపై మూడు నల్ల చట్టాలతో దాడి చేస్తే, వాటిని తిప్పి కొట్టడానికి రైతాంగమంతా పెద్ద ఎత్తున పోరాటాని నడిపించి మూడు చట్టాలను తిప్పికొట్టారు. అలాగే ఈరోజు కార్మిక వర్గంపై కూడా లేబర్ కోడ్ ల పేరుతో కార్మికులకు ఉన్న 49 చట్టాల నుంచి 29 చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చి బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు వారి ఖజానా నింపుకోవడానికి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా బలి చేస్తున్నారు.

 

 

 

ఈ లేబర్ కోడ్ లను తిప్పి కొట్టడానికి కార్మిక వర్గానికి అండగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న స్వతంత్ర ఫెడరేషన్లు,రైతు సంఘాలు,రైతు కూలీల సంఘాలు, అసోసియేషన్లు, విద్యార్థి సంఘాలు, విద్యుత్తు రంగ కార్మికులు ఇలా అన్ని రంగాల ప్రజలు ఈ పోరాటానికి మద్దతుగా నిలబడుతుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం బిజెపి మోడీ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ జీవో నెంబర్ 282 పేరుతో 12 గంటల విధానాన్ని అమలు చేయమని సర్క్యులేరు జారీ చేయడం కార్మిక వర్గాన్నే కాక నమ్మి ఓటేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయడమే అవుతుంది.

 

 

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక ఈ లేబర్ కోడ్ లను రద్దు చేయకుంటే రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెలకు కూడా రైతంగ పోరాట స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఎస్సి కేస్ సిఐటియు మందమర్రి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు గందం రవి, రమేష్ నాయకులు తిరుపతి, సంగి పోషం, వి. నిర్మల, రాజేంద్ర ప్రసాద్, రవీందర్, శ్రీధర్, రాయమల్లు, కొమ్మురయ్య, తిరుపతి, నరేష్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం.!

9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి..

*కార్మికులు, కర్షకులను కార్పొరేట్లకు బానిసలను చేసే విధానాలను వ్యతిరేకించండి..

*ఐఎఫ్ టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ పిలుపు..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 07:

జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్ టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపురం లోని ఐఎఫ్టీయు కార్యాలయంలో సమ్మె గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ రైతు, కార్మిక వ్యతిరేఖవిధానాలతో కేంద్రంలోని బాజాపా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంభిస్తోందన్నారు. నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని, నూతన వ్యవసాయమార్కెటింగ్ చట్టాన్ని ఉపసంహరించాలని,కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో కార్మిక, ఉద్యోగ, రైతులు చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడం జరుగుతోందని చెప్పారు. సమ్మె ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామిశెట్టి వెంకయ్య మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్, పెట్టుబడిదారులకు రైతులను, కార్మికులను బానిసలుగా చేసే దుర్మార్గపు చర్యలకు కేంద్ర పాల్పడుతోందని దీనికి వ్యతిరేకంగా జరిగే సమ్మెలో రైతులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఐఎఫ్టీయు నగర కన్వీనర్ లోకేష్ మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం 9.30 గంటలకు అంబెడ్కర్ విగ్రహం వద్ద నుంచి ఐ ఎఫ్
టి యూ, సి ఐటి యూ,
ఏ ఐ టి యూ
సి, ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐకే ఎం ఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు పి. వెంకటరత్నం, పీ ఓడబ్ల్యు జిల్లా కన్వినర్ అరుణ, అంగన్ వాడీ వర్కర్స్ ఫెడరేషన్ నగర అధ్యక్షురాలు సుజాత, నాయకురాలు గంగాదేవి తదితరులు పాల్గొన్నారు..

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

మోడీ విధానాలపై సమర శంఖం పూరించాలి.

జులై 9 న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు

కేసముద్రం/ నేటి ధాత్రి

జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి శివారపు శ్రీధర్, సిఐటియు, మండల కార్యదర్శి జల్లె జయరాజు, ఏఐసిటియు, జిల్లా కార్యదర్శి మరిపెళ్లి మొగిలి లు మాట్లాడుతూ మోడీ అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించాలని శుక్రవారం స్థానిక కేసముద్రం మార్కెట్ యార్డులో

 

 

 

ఐ ఎఫ్ టి యు కేసముద్రం పట్టణ అధ్యక్షులు మిట్టగడుపుల వెంకన్న అధ్యక్షతన కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.వక్తలు మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినాన్ని కార్మికులు పోరాడి సాధించుకుంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నెండు గంటలు పని చేయాలని నాలుగు లేబర్ కోడ్స్ తీసుకురావడం కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనని విమర్శించారు.

 

 

 

 

 

కార్మికులకు కనీస అవసరాలని కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడిచిన నేటికీ అనేకమంది కి విద్య, వైద్యం అందకపోవడం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం, కనీస వేతనాలు అమలు కాకపోవడం చాలా విడ్డూరంగా ఉందని, ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి నిదర్శనం అని అన్నారు.

 

 

 

మోడీ ప్రభుత్వం పేద ప్రజల కడుపులో కొట్టి కార్పొరేట్లకు దోచిపెడుతోందని ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమీకరణ కావాలని కోరారు. వ్యవసాయ రంగాన్ని కార్మిక రంగాన్ని తోపాటు అన్ని రంగాలను నష్టపరుస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి అప్పజెప్పడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా వ్యాప్తంగా సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

 

 

 

 

జూలై 9న స్థానిక జ్యోతిరావు పూలే సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక , రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బొబ్బల యాకూబ్ రెడ్డి, నీరుటి జలంధర్, ఏ ఐ సి టి యు జిల్లా నాయకులు జాటోత్ బిచ్చ నాయక్, ఐఎఫ్టియు కేసముద్రం ఏరియా కమిటీ నాయకులు బండి రాజు, తదితరులు పాల్గొన్నారు.

రెండు పి ఓ డబ్ల్యు సంఘాల విలీన సభను విజయవంతం చేయండి..

రెండు పి ఓ డబ్ల్యు సంఘాల విలీన సభను విజయవంతం చేయండి..

*శ్రామిక మహిళ స్వేచ్ఛ శ్రమ శక్తిని హరించే విధానాలను తిప్పికొట్టండి..

*పి ఓ డబ్ల్యు జిల్లా కన్వీనర్ ఎం.అరుణ పిలుపు..

తిరుపతి నేటిధాత్రి :

అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన ఒంగోలులో జరుగుతున్న రెండు ప్రగతిశీల మహిళా సంఘాల విలీన సభను జయప్రదం చేయాలని మహిళలకు పి ఓ డబ్ల్యు తిరుపతి జిల్లా కన్వీనర్ ఎం.అరుణ పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఐఎఫ్టియు కార్యాలయంలో శనివారం ఒంగోలులో జరుగుతున్న రెండు పి ఓ డబ్ల్యు సంఘాల విలీన సభ గోడపత్రికలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎం.అరుణ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కొరవడిందన్నారుఇంటిలోనూ పనిచేసే చోట మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, దీనికి తోడు మహిళల శ్రమశక్తి దారుణంగా దోపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నా మహిళలు పురుషులతో సమానమేనని చెబుతున్నా శ్రమ శక్తి దోపిడీ మాత్రం అధికంగా ఉందన్నారు. సమాన వేతనాలు లేక కుటుంబాన్ని పోషించుకోలేక దారుణ పరిస్థితుల్లో జీవితాలను నడుపుతున్నారని చెప్పారు.దీనికి తోడు కుల మతాల పేరుతో మహిళలను మరింతగా బందీలుగా మారుస్తున్నారని తెలిపారు.ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు చైతన్యవంతులై దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళలకు చట్టబద్ధ వేతనాలు, హక్కులు అమలు కాని దుస్థితి నెలకొని ఉందని వివరించారు. వీటికి వ్యతిరేకంగా ఏపీ ప్రగతిశీల మహిళా సంఘం పోరాటాలు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా నాయకురాలు ఆర్.అన్నపూర్ణ, సుజాత, గంగాదేవి, ఎ.లక్ష్మీ, ఈ. కవిత తదితరులు పాల్గొన్నారు..

కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి.!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి.

పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 27:

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలతోపాటు అన్ని కార్మిక సంఘాలు ఎండగట్టి వ్యతిరేకించాలని ఐఎఫ్టియు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గురు వారం పలమనేరు పట్టణములో అంబేద్కర్ సర్కిల్ నందు రెండు ఐ ఎఫ్ టి యు విప్లవ కార్మిక సంఘాలు రాష్ట్రస్థాయి విలీన సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించడానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలై స్కీం వర్కర్లు, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచకరణ ప్రైవేటీకరణ పేరుతో దేశంలోని ప్రజలు, కార్మికుల కష్టార్జితాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫాసిస్తూ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పడానికి దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా అనేక మంది కార్మికుల ప్రాణాలు పణంగా పెట్టి సాధించుకున్న కార్మిక హక్కులను హరిస్తూ, పనిగంటలను పెంచి కార్మికుల నడ్డి విరిచి కార్పొరేట్ శక్తులను కోటీశ్వరులు చేస్తున్నదని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు షరతులకు తలోగ్గి కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను తాకట్టు పెట్టి ,ప్రజల రక్తాన్ని రాబందుల్లాగా పీల్చి విదేశాల్లో దాచి పెట్టుకుంటున్నారని ఆరోపించారు. మార్చి 2 వ తేదీ రాజమండ్రి వేదికగా పుష్కరాల రేవు వద్ద చందన సత్రం నందు 2 ఐఎఫ్టియు సంఘాలు విలీన సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు, కార్మికుల బలం కన్నా పాలకులు, కార్పొరేట్ శక్తులు బలం ఎక్కువ కావడంతో చట్టాలను శాసిస్తూ హక్కులను అరిస్తున్నారన్నారు ఘాటుగా విమర్శించారు. ఐఎఫ్టియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ, చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు వి. ఆర్. జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరత్నం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతూ విభజించు పాలించే విధానాన్ని పాటిస్తున్నదని విమర్శించారు. పాలక పార్టీలు చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలోని రెండు బలమైన ఐ ఎఫ్ టి సంఘాలు విలీనం అవుతున్నాయని వాటిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. మార్చి 2న రాజమండ్రిలో జరగనున్న రెండు సంఘాల విలీన సభను జయప్రదం చేయడానికి రాష్ట్రంలోని ప్రజలు, అన్ని సంఘాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో యోగేష్ బాబు, వెంకటరమణ, వెంకటరమణారెడ్డి, ఆనంద్, వెంకటేష్ పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version