*టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్..
తిరుపతి(నేటిధాత్రి)అక్టోబర్01:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పేదలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆగస్టు 1 వ తేదీన పొద్దు పొద్దునే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 7 గంటకు మున్సిపల్ కమీషనర్ ఎన్. మౌర్య ఐఏఎస్, అధ్యక్షతన టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి. నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, 15,19, 30,31, వార్డు లలో ఆదయక్షల అధ్యక్షులు కార్యదర్సులు, సభ్యులు లతో కలసి వయోవృద్ధులకు, వికలాంగుల కు, వితంతువులకు, అందులకు,అనాధలకు, ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంను అందచేశారు. ఈ కార్యక్రమం లో తిరుపతి తెలుగు దేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ , కొండా రామారావు, వార్డు నాయకులు భారతమ్మ,, బాల,,మధు, అలాగే కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.
టేకుమట్ల మండలోని ఎంపేడ్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ టేకుమట్ల మండల అధ్యక్షులు రేణుకుంట్ల శంకర్ మాదిగ ఆధ్వర్యంలో వికలాంగుల వృద్ధుల వితంతువుల చేయూత పెన్షన్ దారులు కొత్త పెన్షన్ దారులు గ్రామపంచాయతీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు టేకుమట్ల మండల ఇంచార్జీ రాం రాంచందర్ మాదిగ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు వృద్ధులకు వితంతువులకు 2000 నుండి 4000 వరకు వికలాంగులకు 4000 నుండి 6000 వరకు పెన్షన్లు పెంచి ఇస్తామని మాట ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తున్నరూ రాబోయే స్థానిక ఎన్నికలల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెపుతామణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని డిమాండ్ చేయడం జరిగింది కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ఎలుకటి నర్సయ్య పాల శంకర్ బొల్లి పైడి మాదిగ వికలాంగులు వృద్ధులు వితంతువులు తదితరులు పాల్గొన్నారు
వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సోమవారం మహాధర్నా కార్యక్రమం చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి బీడీ, చేనేత, గీత కార్మికులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పెన్షన్లు పెంచుతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి 22 నెలలు గడుస్తున్న వృద్ధులు వితంతుల వికలాంగుల గీతా చేనేత బీడీ కార్మికుల డయాలసిస్ క్యాన్సర్ హెచ్ఐవి పేషెంట్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా దాటవేయడం సబాబు కాదని వారు ఇచ్చిన మాటను తక్షణమే నిలబెట్టుకోవాలని లేనియెడల రాబోయే పంచాయతీ ఎంపిటిసి ,జెడ్పిటిసి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని పంచాయతీ సెక్రటరీ రామగిరి హరీష్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో శ్రీ సాయి వికలాంగుల సేవా కేంద్రం అధ్యక్షులు పైడిమల్ల శ్రీనివాస్ గౌడ్ వడ్డేపల్లి రమేష్, అంబాల మధున్నయ్య , గట్టు సాయి తేజ ,ఎండి షాహిద్ గుంట్టి శంకరయ్య, కాంతాళ రాజిరెడ్డి ,మాడ సుధాకర్ రెడ్డి ,కట్ట సదానందం, గాండ్ల శేఖర్ అయ్యా గట్టు సమ్మయ్య, ఏలువాక దశరథం, అంబాల నాగయ్య అంబాల సదయ్య, వడ్డేపల్లి తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ పెంపు కోసం గ్రామ కార్యాలయాలు ముట్టడి
◆:- వినతి పత్రం ఇచ్చిన వికలాంగులు వృద్ధులు వితంతువులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ ఎల్గోయి గ్రామాలలో ఈరోజు వృద్ధులు వితంతువులు వికలాంగులు గ్రామపంచాయతీ కార్యాలయాలు ముట్టడిచ్చి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి డివిజన్ నాయకురాలు శోభ రాణి మండల నాయకురాలు బిస్మిల్లా వికలాంగులు వృద్ధులు వితంతువులు పాల్గొన్నారు.
వికలాంగుల కు,చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలి.
◆:- పెన్షన్ దారులను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
◆:- పెన్షన్ దారులతో ఝరాసంగం తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించిన ఎం ఆర్ పి ఎస్ , వీ హెచ్ పి ఎస్ నాయకులు.
వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ రాయికోటి నర్సిములు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం సెప్టెంబర్ 15 కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6000/- మరియు చేయుత పెన్షన్ దారులకు 4000/- వెంటనే పెన్షన్ పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ రాయికోటి నర్సిములు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా నర్సిములు మాట్లాడడం జరిగింది.వికలాంగులకు మరియు వృద్ధులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు,చేనేత కార్మికులకు,బీడీ,గీత కార్మికులకు మరియు కండరాల క్షీణత 15000/- పెన్షన్ పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు 4000 /-నుండి 6000,/-మరియు చేయూత పెన్షన్ దారులకు 2000/- నుండి 4000 /-ఇస్తానని ఎన్నికలో హామీ ఇచ్చి ఇప్పటికి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం లోకి వచ్చి 21 నెలలు గడిచిపోయిన ఇప్పటివరకు వారికి పెన్షన్ పెంచలేదని విమర్శించారు.పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగ తహసీల్దార్ కార్యాలయం వికలాంగుల హక్కుల పోరాట సమితి ( వి హెచ్ పి ఎస్ ) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎం ఆర్ పి ఎస్ ) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు పెన్షన్ దారులతో మహాధర్న నిర్వహించడం జరిగింది. తదనంతరం డిప్యుటీ తహసీల్దార్ కర్ణాకర్ రావు కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెన్షన్ పెంచాలని అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము. పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలని తమరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కుప్పా నగర్ నర్సిములు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు శోభరాణి సావిత్రి, బిస్మిల్లా, ఖాదర్ అల్లి గినియర్ పల్లి నబీ,నాగమ్మ, గుండమ్మ నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 15న తహసీల్దార్ ఆఫీస్ ముట్టడిని విజయవంతం చేయండి
రాం రాంచందర్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు
టేకుమట్ల మండలం కుందనపెల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ వి హెచ్ పి ఎస్ అనుబంధ సంఘాల సమావేశానికి ఎంఎస్పి టేకుమట్ల మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశ ముఖ్య అతిథులు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రాం రాంచదర్ మాదిగ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు వృద్ధులకు వితంతువులకు 2000 నుండి 4000 వరకు వికలాంగులకు 4000 నుండి 6000 వరకు పెన్షన్లు పెంచి ఇస్తామని మాట ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ నెల 15వ తేదీన టేకుమట్ల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించాలని డిమాండ్ చేశారు అదే విధంగా మాట్లాడుతూ టేకుమట్ల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి వికలాంగులు, వృద్ధులు, వితంతులు బీడీ గీత నేత నూతన పెన్షన్ దారులందరు పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మాడగుల వీరయ్య వృద్ధులు, వికలాంగులు వితంతువులు తదితరులు పాల్గొన్నారు
12న తహసిల్దార్ ఆఫీస్ ముట్టడి * వికలాంగులకు వృద్ధులకు పింఛన్ వెంటనే పెంచాలి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ మహాదేవపూర్ సెప్టెంబర్ 9 నేటి ధాత్రి *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆవరణంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ 12 నతహసిల్దార్ కార్యాలయాల ముట్టడికి వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పింఛన్ పెంచాలని లేకపోతే స్థానిక ఎలక్షన్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య మాట్లాడుతూ. వికలాంగులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని మా బాధను ప్రభుత్వం పట్టించుకోవాలని జాప్యం చేయకుండా తక్షణమే పింఛన్లు పెంచాలని అదేవిధంగా కొత్త ఫించనులను కూడా మంజూరు చేయాలని వికలాంగులకు న్యాయం చేసే వరకు నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు వీరగంటి సమ్మయ్య .అంబటిపల్లి విహెచ్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తిరుమల చారి. మహాదేవపూర్ ఎమ్మార్పీఎస్ గ్రామ కార్యదర్శి లింగాల. సుశాంత్ తోపాటు తదితరులు పాల్గొన్నారు
వికలాంగుల పింఛన్ల మాటమర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున వికలాంగుల నాయకుడు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ… గత నాలుగు సంవత్సరాలుగా వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా సైట్ బంద్ చేసి వారి జీవితాలతో చెరగట మాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తాగిన.బుద్ధి చెప్పాలన్నారు. కొత్త పింఛన్లు రాక వికలాంగులకు సరియైన తిండి లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధించిన జిల్లా అధికారులు తక్షణమే వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆన్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు కొత్త పిక్చర్లు ఇవ్వడానికి సైట్ ఓపెన్ చేసి పింఛన్లు మంజూరు చేసివారిని ఆదుకోవాలని కోరారు.
ఘనంగా వి ఎచ్ పి యస్ ఆవిర్భవ దినోత్సవం సెప్టెంబర్ 9 లోపే వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి వికలాంగులకు 6000 వితంతువులు ఒంటరి మహిళలకు 4000 మహాదేవపూర్ఆగష్టు28 నేటి ధాత్రి
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ మహాదేవపూర్ మండల కేంద్రంలో ఘనంగా వి ఎచ్ పి యస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘమైన వి హెచ్ పి ఎస్ ఆవిర్భవించి 18 సంవత్సరాలు పురస్కరించుకొని వి ఎచ్ పి యస్ మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య జెండా అప్పుడే ఆవిష్కరణ చేశారు. వీరగంటి సమయం మాట్లాడుతూ వికలాంగుల హక్కుల కోసం వారికి సమాజంలో జరుగుతున్న అసమానతల కోసం ఎమ్మార్పీఎస్ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి వికలాంగులకు గుర్తింపు తీసుకురావడం అంటే ఎంతో గొప్ప విశేషమని దీనికి కారణమైన .మందకృష్ణ మాదిగ వికలాంగుల కోసం నిరంతరం పోరాటం చేయడం ద్వారానే వారికి సమాజంలో విలువైన జీవనం తగ్గిందన్నారు మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాటే మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ చొరవతోనే ఎన్నో విజయాలు సాధించిమని వికలాంగుల సమాజం మాన్యశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగా కే రుణపడి ఉంటుందని ఈ గౌరవం దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య టౌన్ ప్రెసిడెంట్ ముస్తాక్ మండల ప్రధాన కార్యదర్శి కన్నబోయిన కొమురక్క కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పీఏసీఏస్ చైర్మన్ వామన్ రావు బిజెపి మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు చింతకుంట సదానందం తదితరులు పాల్గొన్నారు
టేకుమట్ల మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని దాంతో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందుతాయని కొన్ని తపాలా సేవల కోసం ఇతర మండలాలకు వెళ్లే పరిస్థితి ఉండదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ఉమ్మడి మండలంగా ఉన్నప్పుడు టేకుమట్ల మండల కేంద్రంలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఉందని దానివలన వినియోగదారులు కొన్ని సేవలు మాత్రమే పొందుతున్నారని ఇతర కొన్ని తపాలా సేవల కోసం పనుల కోసం చిట్యాల మండల కేంద్రంలోని సబ్ పోస్ట్ ఆఫీస్ కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు వికలాంగులు చిట్యాలకు వెళ్లి తపాలా సేవలు పొందు టకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని అలాగే దూర కూడా వెళ్ళవలసి వస్తుందని అంటున్న ప్రజలు వరంగల్ పార్లమెంటు సభ్యులు స్థానిక ఎమ్మెల్యే సంబంధిత జిల్లా తపాలా శాఖ అధికారు లు స్పందించి టేకుమట్ల మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని టేకుమట్ల మండల ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేశారు
జహీరాబాద్ గతంలో డబుల్ బెడ్ రూమ్ ల పట్టాలు అందజేసి విచారణ పేరుతో 132 లబ్ధిదారులకు తాళాలు అందజేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బి. ఆర్.ఎస్ పార్టీ నాయకులు నామరవికిరణ్ బండి మోహన్ ఆరోపించారు. ఆగస్టు 14 నాడు ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ జరిగిన సభలో స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ రెవెన్యూ అధికారులు వారం రోజులలో తాళాలు ఇస్తామని గతంలో మాట ఇవ్వడం జరిగింది. వారు చెప్పి వారం రోజుల సమయం నిన్నటితో పూర్తయింది ఇట్టి విషయమై ఈరోజు లబ్దిదారులతో కలిసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వద్ద లబ్ధిదారులకు తాళాలు వెంటనే ఇవ్వాలని ఆందోళన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకుడు నామ రవి కిరణ్ మాట్లాడుతూ లబ్ధిదారులకు వెంటనే తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, విచారణ పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదు అన్నారు గతంలో ఉన్న ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు అందజేస్తే, కనీసం వారిపై కనికరం లేకుండా తాళాలు అందించకుండా వారికి ఇబ్బందులను గురి చేయడం సరైన పద్ధతి కాదు అన్నారు ఇట్టి విషయమై డిప్యూటీ తాసిల్దార్ ఇంకొక వారం రోజులు తప్పనిసరిగా లబ్దిదారులకు తాళాలు అందజేస్తామని చెప్పారు వారం రోజుల్లో తాళాలు తీయని యెడల లబ్ధిదారులు నేరుగా వారికి గతంలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించడం జరిగింది కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు శివప్ప, నాయకులు గణేష్ చంద్రయ్య విద్యార్థి విభాగం నాయకుడు రాకేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
దేశ,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, తప్పనిసరి అవకాశం ఉన్నకాడ రిజర్వెన్లలోపోటీ చేయడానికి అవకాశం కల్పించాలని వికలాంగుల సంఘం నాయకుడు పుల్ల మల్లయ్య* కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులను కోరారు శమనవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తూన్నాయని అన్నారు . ఈ ప్రభుత్వాలు కొత్త పించలు సంక్షేమ పథకాలు, , అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు , భూమి కొనుగోలు పథకాలు వికలాంగులకు రావలసిన అనేక పథకాలలో అన్యాయం జరుగుతుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బంధులను, అవస్తలను ప్రభుత్వాలు గుర్తించి 5% శాతం రిజర్వేషన్లు కల్పించారని ,త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 5 శాతం రిజర్వేషన్లు సంబంధించిన కేంద్ర , రాష్ట్ర జిల్లా ఎన్నికల అధికారులు అమలు చేసి వికలాంగుందరికి అవకాశం కల్పించాలని కోరారు
దివ్యాంగులకు అంగవైకల్యం అడ్డు కాదు కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం భారత ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో పర్పుల్ ఫెయిర్ 2025 ను సుభాష్ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో మహిళా శిశు దివ్యాన్గుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, పథకాల ద్వారా వారి ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందించాలని అన్నారు. మొట్ట మొదటి సారిగా మన జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభినందించారు. దివ్యాన్ గులల్లోని సృజనాత్మకత ను వెలికి తీయడానికి ఇదొక మంచి అవకాశమని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాన్గుల పధకాలు ప్రతి మారుమూల గ్రామ స్థాయికి చేర్చాలని, దివ్యాన్గులను గుర్తించి వారి ప్రతిభ ఆధారంగా అవకాశాలు కపిస్తే వైకల్యం తమ ప్రతిభకు అడ్డు కాదని నిరూపిస్తారని తెలిపారు. అధికారులు దివ్యాంగుల అవసరాలను గుర్తించి, వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించి, వారి నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా దృష్టి పెట్టాలని సూచించారు. దివ్యాన్గుల సంక్షేమం సంక్షేమ శాఖ బాధ్యతని, సంక్షేమం, సౌకర్యాలు కల్పనకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. దివ్యాన్గులకు పాఠశాలల్లో విద్యాబ్యాసం, వృత్తి నైపుణ్యం, భవిత కేంద్రాలు నిర్వహణ, వారికి అవసరమైన పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. నేను మీకు అభయం ఇస్తున్నాను దివ్యాన్గులకు వర్తించే అన్ని పథకాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల సమన్వయంతో అభివృద్ధి లో దివ్యాన్గులను భాగస్వాములను చేస్తూ చేయూతను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బుద్ధిమాంద్యంతో బాధపడే దివ్యాంగుల సాధికారత కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చవల్ డిసేబులిటీఎస్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 18 ఎన్జీవోల స్టాళ్లు ఏర్పాటు చేయగా, వారు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. యూత్ ఫర్ జాబ్స్ సంస్థ ఉద్యోగ మేళా కోసం స్టాల్ ఏర్పాటు చేసింది. అలీం కో, ఐజినిష్డ్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్టాళ్లు పరిశీలించి దివ్యాంగులతో ప్రత్యేకంగా ముఖాముఖీ మాట్లాడారు. అన్ని స్టాళ్లను సందర్శించి, దివ్యాన్గులు వేసిన పెయింటింగ్ కొనుగోలు చేసి నగదు చెల్లించి అభినందించారు. ఈ సందర్భంగా దివ్యాంగులుప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో 600 కంటే ఎక్కువ దివ్యాంగులు, 300 IERPs, ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ డా. బి.వి. రామ్ కుమార్ దివ్యాంగులకు సౌకర్యాల కల్పన, అవసరమైన సేవల సమన్వయం కోసం ఆయన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీఈఓ రాజేందర్, వాసవి క్లబ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
టేకుమట్ల మండలం బోర్నపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేణిగుంట శంకర్ ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ శాఖ అధ్యక్షులుగా అడిచర్ల తిరుపతి ఉప అధ్యక్షులుగా రేణికుంట్ట్ల మొగిలి ప్రధాన కార్యదర్శిగా భోగి రవి నీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు రామ్ రామచంద్ర వారు హాజరైనారు అనంతరం మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ రూపాయలు 6000 పెంచాలని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత కార్మికుల పెన్షన్ 4000 కు పెంచాలని అలాగే పూర్తిస్థాయి కండ నరాల బలహీనత ఉన్నవారికి 15000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే వికలాంగుల మహా గర్జన విజయవంతం చేయడానికి ఈనెల 25న భూపాలపల్లి లో నిర్వహించబోయే ఈ సభకు వృద్ధులు వికలాంగులు ఇదంతులు హాజరై గీత బీడీ గౌడ అందరూ ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
చర్ల మండలం వీహెచ్పీఎస్ మండల అధ్యక్షుడు రేగళ్ల సుధాకర్ ఆధ్వర్యంలో ఈనెల 24 న టీఎన్జీవో ఖమ్మం ఫంక్షన్ హాల్ నందు మహా గర్జన సన్నాహక సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సారధ్యంలో వికలాంగుల పెన్షన్ పెంచుటకు వితంతువుల చేయూత 4వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో వికలాంగులు మరియు వితంతువులు భారీ బహిరంగ సదస్సు నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు గాను వికలాంగులకు నెలసరి 6000 రూపాయలు ఇవ్వాలని వితంతువులకు 4 వేల రూపాయలు ఇవ్వాలని హెచ్ఐవి పేషెంట్లకు ఏఆర్టి పెన్షన్ పెంచాలని వృద్ధులకు 4000 రూపాయలు పెన్షన్ గత ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి చర్ల మండలం వికలాంగులు వితంతువులు చేయుత పెన్షన్ దారులు ప్రతి ఒక్కరూ మరియు మండల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ నాయకులు భారీ సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మచ్చ రాజా వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నం రామ్మూర్తి మండల ప్రధాన కార్యదర్శి పూసం ముత్యాలరావు కార్తీక్ ఇల్లందుల జైరామ్ గుద్దేటి నాగరాజు బోయిల్లా ప్రవీణ్ సురేష్ రెడ్డి సతీష్ సాగర్ సుబ్రహ్మణ్యం శంకరాచారి కమల నానమ్మ తదితరులు పాల్గొన్నారు
జహీరాబాద్ దివ్యాంగుల స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం
జహీరాబాద్ నేటి ధాత్రి:
దివ్యాంగుల స్వయం ఉపాధికి ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి గురువారం తెలిపారు. దరఖాస్తులను http://tgobmms. cgg. gov. in 3 ໖ చెప్పారు. బ్యాంకు లింకేజీ లేకుండా 37, బ్యాంకు లింకేజీ తో 3 యూనిట్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
దివాంగులకు మోటార్ సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా , నేటిధాత్రి
బుదవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో జిల్లా సంక్షేమ శాఖ, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా లోని అర్హులైన దివ్యాంగులు రెండు మోటారు వెహికల్స్ ను గ్రామం. కోడిసెలకుంట లోని బనోతు యాకూబ్, గ్రామం నర్సాపూర్ గుర్రం శ్రీహరి లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలసి పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి టి.రవి, సి.డి.పి.ఓ. శిరీష, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మహాదేవపూర్ నేటిధాత్రి
దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
శుక్రవారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలీం కో సంస్థ ద్వారా అందిస్తున్న దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు, ఇతర ఉపకరణాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
దివ్యాన్గులకు అవసరమైన ఉపకరణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విధాల కృషి చేస్తుందన్నారు.
మహదేవ్ పూర్ మండలంలో సుమారు 200 మంది దివ్యాంగులను గుర్తించడం జరిగిందని వారిలో మొదటి విడతలో 50 మంది దివ్యాంగులకు వివిధ రకాలైన బ్యాటరీ ట్రై సైకిళ్ళు, సాధారణ ట్రై సైకిళ్ళు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, స్టాండ్ లు వారి వారి వైకల్యాన్ని బట్టి అందిస్తున్నామన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని ఇల్లు లేని దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.
అతి త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు.
నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకొక్క హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు.
అనంతరం మహదేవ్ పూర్ మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు సుమారు 90 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అంతకు ముందు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన డా బి.ఆర్ అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ ను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మెన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి లతో కలిసి ప్రారంబించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సీడీపిఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి:
దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం ఐడిఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలింకో వారి సహాయంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణముల పంపిణి శిభిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిడబ్ల్యూఓ మల్లేశ్వరి ప్రారంభించారు అనంతరం దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుండాలని దివ్యాంగులకు అద్భుతమైన తెలివి తేటలు, ప్రతిభా పాఠవాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక కోట ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా బలపడేందుకు తోడ్పడతామని అన్నారు. జైపాల్ రెడ్డి దివ్యాన్ గుడు అయినప్పటికి సుదీర్ఘ కాలం పాటు రాజకీయ నాయకుడుగా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. లోకల్ బాడి ఎన్నికల్లో సైతం దివ్యాంగుల ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. అలీంకో సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా 204 భూపాలపల్లి నియోజక వర్గంలో 154 దివ్యాంగులకు 21 రకాల వివిధ సహాయ ఉపకరణాలు అందించడం జరుగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ అమృతం పథకం ద్వారా జిల్లాలో 8640 మంది 14 నుండి 18 సంవత్సరాల వయసు గల కిషోర బాలికలను గుర్తించి వారిని రక్త హీనత నుండి కాపాడడి, సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తయారు చేసేందుకు పల్లి పట్టీలు, మిల్లెట్ పట్టీలు, నెలకు రెండుసార్లు అందించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆరోగ్య పరిరక్షణ లి భాగంగా ప్రభుత్వం ఇందిరమ్మ అమృతం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం దివ్యాన్గులకు ఉప కరణాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మీ, డిడబ్ల్యూఓ మల్లేశ్వరి, ఆలిం కో ప్రోస్టేటిక్ అండ్ ఆర్థోటిస్ట్ రష్మీ రాజన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య
వనపర్తి నెటిదాత్రి:
shine junior collegeవనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కాగితాల లక్ష్మయ్య నియామకం అయ్యారు .వనపర్తి వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాగర్ కర్నూల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బి రాములు పార్టీ నేతల ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు .ప్రధాన కార్యదర్శిగా డి బాలరాజ్ కోశాధికారిగా ఏర్పుల చిన్నయ్య కార్యదర్శిగా గంధం రాజు కోమరి పుల్లూరి విశ్వనాధం దస్తగిరి ఉపాధ్యక్షులుగా పోలేపల్లి బాలయ్య నియామకం అయ్యారు ఈ సందర్భంగా పార్లమెంట్ నాగర్కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు వనపర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షున్ని కమిటీ సభ్యులను అభినందించారు వారికి దిశా నిర్దేశం చేస్తూ వనపర్తి పట్టణంలో అన్ని వార్డులు పర్యటించి వార్డులో ఉన్న సమస్యలపై సంబంధిత అధికారులకు తెలపాలని ప్రజల సమస్యలు పరిష్కరించుటకు కృషి చేయాలని సూచించారు ప్రతి మూడు నెలలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ఉంటుందని గైర్హాజరు కాకుండా కమిటీ నాయకులు పాల్గొన్నారు సూచించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల కొరకు పనిచేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించే సమావేశాలకు మూడు నెలలు రాకుంటే వారి వారి పదవిని తొలగిస్తామని రాములు తెలిపారు తెలుగుదేశం పార్టీ ని దివంగత ఎన్టీ రామారావు స్థాపించారని బడుగు బలహీన వర్గాలకు పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు వనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని ఓటు బ్యాంకు కూడా ఉన్నదని స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపాలిటీ జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ నుండి అభ్యర్థులను ఉంచుతామని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో హోటల్ బలరాం ఫారుక్ ఎండి దస్తగిరి శంకర్ ఆవుల శ్రీను అప్పయపల్లి బాలయ్య చిట్యాల బాలరాజు ఉపేంద్ర బి శేఖర్ తదితరులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.