100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అపెరల్ పార్కులో అందుబాటులోకి.

 

100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అపెరల్ పార్కులో అందుబాటులోకి.

జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు

ప్రారంభించిన కలెక్టర్, సిరిసిల్ల ఏ.ఎం.సీ చైర్ పర్సన్, డీఏఓ

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లాలో అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఎరువుల గోదాంను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాంను ఏర్పాటు చేయగా, శుక్రవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగంతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. జిల్లాలో ఎప్పుడైనా.. ఎక్కడైనా అత్యవసర పరిస్థితిలో ఎరువులు కొరత ఏర్పడినప్పుడు అందజేసేందుకు ముందస్తుగా ఎరువుల గోదాం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 100 మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ లో అందుబాటులో పెడతామని తెలిపారు.
అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మాట్లాడారు. జిల్లాకు అవసరమైన ఎరువులు గతంలో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి మాత్రమే జిల్లాకు తెప్పిస్తున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో ఎరువులు కావాల్సివస్తే ఇబ్బందులు ఎదురయ్యేవని గుర్తు చేశారు. ఈ ఇబ్బందులు అన్ని దూరం చేసేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో అపెరల్ పార్కులో 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాంను ఏర్పాటు చేయించారని వెల్లడించారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ.!

జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా టీవీ సత్యం

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

 

విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జగిత్యాల జిల్లా బండారి గార్డెన్లో నిర్వహించినటువంటి 18 మండలాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా అధ్యక్షునిగా టీవీ సత్యం ను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షుడు మద్దనపల్లి జలంధర్ మాట్లాడుతూ టీవీ సత్యం మన జగిత్యాల అధ్యక్షుడు కావడం మన అదృష్టమని ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని నిరుపేదలకు సబ్సిడీ ద్వారా దుగోడా మిషన్లు మరియు సంగడి మిషిన్లు విశ్వకర్మలకు ఇప్పించాలని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు మద్దనపల్లి జలంధర్ మరియు ప్రధాన కార్యదర్శి మద్దెనపల్లి నాగేష్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద దశరథం మరియు 18 మండలాల అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version