“ప్రలోభాలకు లొంగొద్దు: ఆంజయ్య పిలుపు”

ఓటర్లు డబ్బు మద్యం ప్రలోబాలకు లొంగొద్దు

• నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలి
•సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెక్రటరీ మంగలి ఆంజయ్య

చేవెళ్ల, నేటిధాత్రి :

 

స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు అధికంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దని సమాచార హక్కు వికాస సమితి(అర్టిఐ) చేవెళ్ల మండల సెసెక్రటరీ మంగలి ఆంజయ్య అన్నారు. ఈ సందర్బంగా మండలంలో సర్పంచి, వార్డు నెంబర్లుగా పోటీచేస్తున్న అభ్యర్థులు డబ్బులతో ఏకగ్రీవం చేసుకోవడానికి ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో గెలవడానికి ముందుగా ఎన్నికల్లో ఓటర్లకు మద్యం, విందు కార్యక్రమాలకు ఖర్చు చేసే డబ్బులు గెలిచిన తరువాత ప్రభుత్వం గ్రామపంచాయతీకి విడుదల చేసే నిధుల నుండి ఖర్చును పూడ్చుకునే అవకాశం సాధ్యం కాదనీ సమాచార హక్కు వికాస సమితి ముందుగా హెచ్చరిక తెలియజేస్తుందని అన్నారు. గ్రామానికి వచ్చిన నిధులను పనులు నిమిత్తం మాత్రమే పారదర్శకంగా ఖర్చు చెయ్యాలని సమాచార హక్కు చట్టం ప్రకారంగా పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240
ప్రకారంగా ప్రతీ విషయం ప్రజలందరూ తెలుసుకునే హక్కు ఉందని ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతి రాజ్ శాఖ సర్కులర్ 7240 ను ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయంలో సూచిక బోర్డు పై ప్రజలందరికీ తెలిచేలా ఏర్పాటు చెయ్యాలని అన్నారు .
నిధులను పక్కదారి పట్టించిన దుర్వినియోగం చేసినా,
సొంతానికి వాడుకున్న, తప్పుడు లెక్కలు చూపిన ప్రజలు ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పుడు జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి, నిధులను రికవరీ చేసి, పదవి నుండి తొలగించె అవకాశం ఉందని, కాబట్టి ఎన్నికల్లో అధిక ఖర్చులు పెట్టి అప్పుల పాలు కావద్దని సూచించారు. ఓటర్లు డబ్బు, మద్యం, ప్రలోబాలకు లొంగి ఓటు వేయొద్దని, నిజాయితీగా ప్రజాసేవ చేసేవారికే ఓటు వెయ్యాలని ఓటర్లకు సూచించారు.

ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్…

ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్

పరకాల నేటిధాత్రి

 

 

 

 

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్ నియమితులయ్యారు.ఈ మేరకు మంగళవారం ఆ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్,రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం,ఎన్.దిలీప్ రావ్ కు నియామకపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా దిలీప్ రావ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించిపౌరులకు,విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపీనాథ్ కట్టెకోల,వేముల పుష్పాలత, రాష్ట్ర కార్యదర్శి గండు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సంయుక్త నీలం వెంకట మధు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్,అరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన.

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన
రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడీ సతీష్ రెడ్డి
ఆర్టిఐరాష్ట్ర కమిటీ సభ్యుడు కమలాకర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

ఇటీవల రోడ్ ప్రమాదములో గాయపడ్డ భూపాల్ పల్లి జిల్లా సమాచార హక్కు చట్టం యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లును మొగుళ్ళ పల్లి మండలం ఎల్లా రెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం రోజున తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్య క్షులు కామిడి సతీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు ముఖ్య సలహాదారులు కల్వల కమలాకర్ రావు లు పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు సమాచార హక్కు చట్టాన్ని ప్రతీ గ్రామము లోకి తీసుకు వెళ్లిన వెంకటేశ్వర్లు రోడ్ ప్రమాదము లో గాయపడడం బాధాకరం అన్నారు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version