ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్…

ఆర్టీఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్

పరకాల నేటిధాత్రి

 

 

 

 

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్.దిలీప్ రావ్ నియమితులయ్యారు.ఈ మేరకు మంగళవారం ఆ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్.చంటి ముదిరాజ్,రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం,ఎన్.దిలీప్ రావ్ కు నియామకపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా దిలీప్ రావ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించిపౌరులకు,విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపీనాథ్ కట్టెకోల,వేముల పుష్పాలత, రాష్ట్ర కార్యదర్శి గండు వెంకటేశ్వర్లు,రాష్ట్ర సంయుక్త నీలం వెంకట మధు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్,అరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన.

ఆర్టిఐ నేత చర్లపల్లి వెంకటేశ్వర్లు ను పరామర్శించిన
రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామిడీ సతీష్ రెడ్డి
ఆర్టిఐరాష్ట్ర కమిటీ సభ్యుడు కమలాకర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

ఇటీవల రోడ్ ప్రమాదములో గాయపడ్డ భూపాల్ పల్లి జిల్లా సమాచార హక్కు చట్టం యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లును మొగుళ్ళ పల్లి మండలం ఎల్లా రెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం రోజున తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్య క్షులు కామిడి సతీష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు ముఖ్య సలహాదారులు కల్వల కమలాకర్ రావు లు పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు సమాచార హక్కు చట్టాన్ని ప్రతీ గ్రామము లోకి తీసుకు వెళ్లిన వెంకటేశ్వర్లు రోడ్ ప్రమాదము లో గాయపడడం బాధాకరం అన్నారు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version