ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
వీణవంక,(కరీంనగర్ జిల్లా ):
నేటి ధాత్రి:
వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సోమవారం మహాధర్నా కార్యక్రమం చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వృద్ధులు వితంతువులు వికలాంగులు ఒంటరి బీడీ, చేనేత, గీత కార్మికులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం పెన్షన్లు పెంచుతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసి 22 నెలలు గడుస్తున్న వృద్ధులు వితంతుల వికలాంగుల గీతా చేనేత బీడీ కార్మికుల డయాలసిస్ క్యాన్సర్ హెచ్ఐవి పేషెంట్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా దాటవేయడం సబాబు కాదని వారు ఇచ్చిన మాటను తక్షణమే నిలబెట్టుకోవాలని లేనియెడల రాబోయే పంచాయతీ ఎంపిటిసి ,జెడ్పిటిసి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని పంచాయతీ సెక్రటరీ రామగిరి హరీష్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో
శ్రీ సాయి వికలాంగుల సేవా కేంద్రం అధ్యక్షులు పైడిమల్ల శ్రీనివాస్ గౌడ్
వడ్డేపల్లి రమేష్,
అంబాల మధున్నయ్య , గట్టు సాయి తేజ ,ఎండి షాహిద్ గుంట్టి శంకరయ్య, కాంతాళ రాజిరెడ్డి ,మాడ సుధాకర్ రెడ్డి ,కట్ట సదానందం, గాండ్ల శేఖర్ అయ్యా గట్టు సమ్మయ్య, ఏలువాక దశరథం, అంబాల నాగయ్య అంబాల సదయ్య, వడ్డేపల్లి తేజస్విని తదితరులు పాల్గొన్నారు.