బాల్నే సర్వేశంను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

 

బాల్నే సర్వేశంను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు బాల్నే సర్వేశం సతీమణి బాల్నే చంద్రకళ సంవత్సరీకం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం బాల్నే సర్వేశంతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ, పట్టణ ప్రచార కార్యదర్శి,మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

గురు పౌర్ణమి పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

గురు పౌర్ణమి పూజలు చేసిన
మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

గురు పౌర్ణమి సందర్భంగా భూపాలపల్లి మంజూరు నగర్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కృష్ణకాలనీలోని శ్రీ షిరిడీ సాయిబాబాను దర్శించుకుని స్వామి వారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గండ్రను కలిసిన కేటీఆర్ సేన నాయకులు

*మాజీ ఎమ్మెల్యే గండ్రను కలిసిన కేటీఆర్ సేన నాయకులు*

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి నూతన కేటీఆర్ సేన అధ్యక్షుడిగా ఎన్నికైన రాకేష్ భూపాలపల్లి నియోజకవర్గం మాజీఎమ్మెల్యే గండ్ర వెంకటర మణారెడ్డి మర్యాద పూర్వ కంగా కలిసిన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కేటీఆర్ సేన నాయకులు అభినందించి శాలువాతో సత్కరించారు. బి ఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, అధికార కాంగ్రెస్ పార్టీ అబద్దాల ప్రచారాలను ఎప్పటి కప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎండ గట్టాలని తెలిపారు.ఈ కార్యక్ర మంలో భూపాలపల్లి జిల్లా కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి, నియోజ కవర్గ అధ్యక్షులు పిన్నింటి మణిదీప్, యూత్ నాయకులు సికిందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version