బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన దుర్గం చిన్నయ్య

బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

తాండూర్,మంచిర్యాల: నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు షాద్ బాబా సతీమణి అకాల మరణం చెందారని,విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శనివారం వారి నివాసానికి వచ్చి కుటుంబానికి మనో ధైర్యాన్ని చేకూర్చి ప్రగడ సానుభూతి తెలిపారు.

సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి..

సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరింత చేరువై ప్రజలకు సేవలందించాలని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆకాంక్షించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని హైదరాబాదులో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చాడ వెంకటరెడ్డి. ఈసందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, మానవ హక్కుల భంగం కలగకుండా, రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని, గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిపిఐతో అవగాహన చేసుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వ ఏర్పాటులో సిపిఐ కార్యకర్తల కృషి ఉందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు దాటిందని, ప్రజా పాలన పేరుతో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వ కృషి చేయాలని, సంక్షేమ పథకాలు అసలైన అర్హులకు అందించాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రాల హక్కులను హరిస్తున్నప్పటికీ ఎంతో ధైర్యంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను ముందుకు తీసుకెళ్తుందని ఈనూతన సంవత్సరం నుండి మరో మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని భావించి ప్రజలకు సుపరిపాలన అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిశగా అడుగులు వేస్తారనే ఆశాభావాన్ని చాడ వెంకటరెడ్డి వ్యక్తం చేశారు.

ఓటమి గెలుపుకు తొలిమెట్టు-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

ఓటమి గెలుపుకు తొలిమెట్టు-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల,నేటిధాత్రి

 

ఓటమి గెలుపుకు తొలిమెట్టని మాజీ శాసనసభ్యులు చల్లధర్మ రెడ్డి అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో పోటీపడి ఓటమి చెందిన బిఆర్ఎస్ అభ్యర్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు.శనివారం పరకాల మండలం పోచారం,వెల్లంపల్లి,పైడిపల్లి,కామారెడ్డిపల్లి గ్రామాలలో వారు పర్యటించారు.ఈ సందర్భంగా ఓటమించేందిన పార్టీ అభ్యర్థులను కలిసి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర పరామర్శ..

మాజీ ఎమ్మెల్యే గండ్ర పరామర్శ

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బస్వరాజ్ పల్లి గ్రామ వాస్తవ్యులు కీ.శే కట్ల సాయిలు, కీ.శే బూడిద స్వామి సీతరాంపురం గ్రామ వాస్తవ్యులు కీ.శే మర్రి వెంకటయ్య, కీ.శే బాలాజీ రామాచారి – సంధ్య, కీ.శే ఎలకపల్లి రమేష్ అదే విధంగా బంగ్లాపల్లి గ్రామ వాస్తవ్యులు కీ.శే ధరంసోత్తు సమత, కీ.శే మారపాక భాగ్య ఇటీవల మరణించిన వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి .
వారి వెంట బి అర్ స్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య సీతారాంపూర్ సర్పంచ్ తోట రాకేష్ నాయకులు మార్త శ్రీనివాస్ మంద అశోక్ రెడ్డి చింతరెడ్డి పాపిరెడ్డి పరశురాంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ సీతారాంపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు వైనాల వెంకటేష్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-15T123640.197.wav?_=1

 

బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి

మాజీ ఎమ్మెల్యే చల్లా

నడికూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీ లు ఏమయ్యాయని నిలదీసి అడగాల ని ఓటర్లకు పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి పిలుపు నిచ్చారు మండలంలోని ముస్త్యాలపల్లి, కంఠాత్మకూర్ గ్రామాల్లో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరు చెప్పి ప్రజలను మోసం చేసిందని,వాటిని గుర్తించాలని సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని,దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మేమే చేశామని గొప్పలు చెప్పు కుంటూ ప్రజలను మరోసారి మోసం చేసుకుంటూ వస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఆలోచించి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు,వార్డ్ మెంబర్లు గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు. నడికూడ మండల కేంద్రంలో బిఆర్ఎస్ బల పరిచిన గోనెల శరత్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే శరత్ కుమార్ వల్లనే అవు తుందని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలందరినీ కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు,ఉప సర్పంచ్ కిన్నెర మణి,గ్రామ కమిటీ అధ్యక్షులు నారగాని శ్రీనివాస్,బిఆర్ఎస్ నాయకులు సంగని వేణు, మల్లారెడ్డి,నేరుగొమ్ముల ప్రభాకర్ రావు ఊర సతీష్ రావు,రావుల కిషన్,తాళ్ల రమేష్,యూత్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

జై, ఈశ్వరి బాయి 107 వ.జయంతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T120157.012.wav?_=2

 

జై, ఈశ్వరి బాయి 107 వ.జయంతి

◆:- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు డా. జె గితారెడ్డి

◆:- రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్,ఉజ్వల్ రెడ్డి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు డా. జె గితారెడ్డి గారి మాతృమూర్తి దివంగత మాజీ ఎమ్మెల్యే ఉక్కు మహిళ పేదల పెన్నిధి, జై ఈశ్వరి బాయి గారి 107 వ.జయంతిని పురస్కరించుకొని రవీంద్ర భారతి హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించి నివాళులు అర్పించారు, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రివర్యులు సీతక్క,గడ్డం వివేక్ వెంకటస్వామి,శాసనసభాధ్యక్షులు గడ్డం ప్రసాద్,విజయ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్,ఉజ్వల్ రెడ్డి’ పాల్గొన్నారు.వారితోపాటు జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి నరసింహ రెడ్డి ఎస్సీ సెల్ స్టేట్ వైస్ చైర్మన్ కె, భీమయ్య,సుభాష్ రెడ్డి షాకీర్ అలీ నరసింహులు టీచర్,జనార్ధన్ పలువురు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-13T153518.955.wav?_=3

 

 

* వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర….*.
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం లో వివాహది శుభకార్యాలల్లో పాల్గొన్ని నూతన వధూవరులను ఆశీర్వధించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి .*
* గొర్లవీడు వాస్తవ్యులు, వార్డు మెంబర్ వర్మనీ సమ్మయ్య – సరోజన గార్ల కుమారుడి వివాహ వేడుకల్లో. పాల్గొని.
* చింతలపల్లి వాస్తవ్యులు వరువాల ఉమా – ఆనంద్ గార్ల పాల్గొనికుమార్తె వివాహ వేడుకల్లో…
వారి వెంట మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు నీ పరామర్శించిన నాయకులు..

మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు నీ పరామర్శించిన నాయకులు

మందమర్రి నీటి ధాత్రి

 

ఈరోజు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ఇంటి వద్ద మర్యాద పూర్వకంగా కలిసి గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న కారణంగా వారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది
*
పరామర్శించిన వారిలో వి హెచ్ పి ఎస్ జాతీయ నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ ఎం ఆర్ పి ఎస్ అసిఫాబాద్ జిల్లా కో ఇన్చార్జి మంత్రి మల్లేష్ మాదిగ
బి.ఎస్.పి జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్
ఎం ఆర్ పి ఎస్ సీనియర్ నాయకులు గాలి పెళ్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుంకె రవి శంకర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T130127.741.wav?_=4

 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుంకె రవి శంకర్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన పాకాల ప్రశాంత్ రెండు రోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచులు తడగొండ సత్యరాజ్ వర్మ, బక్కశెట్టి నర్సయ్య, నాయకులు నర్సింబాబు, బక్కశెట్టి శ్రీనివాస్, అజయ్, రాజు, ఖాసీం షరీఫ్, త్రినాథ్ వర్మ, పాదం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T125631.338.wav?_=5

 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో దుబాయ్ లో మరణించిన ఎలగందుల ప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్. గత కొద్దిరోజుల క్రితం మరణించిన ప్రకాష్ మృతదేహాన్ని అక్కడి ఎన్నారై సభ్యుల సహకారంతో ఇండియాకు రప్పించి వారికి ఇద్దరు పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని తెలుసుకొని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి పిల్లల చదువుల ఫీజులు మాఫీ చేయాలని కోరగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యులు రవిశంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పూడూరు మల్లేశం, ఎడవల్లి పాపిరెడ్డి, వేల్పుల హరికృష్ణ, దాసరి అరుణ్ కుమార్, సుద్దాల మల్లేశం, రేణికుంట బసంతం రేణిగుంట అశోక్, దాసరి అనిల్, వేల్పుల రవి, రేణికుంట శ్రావణ్, రేణిగుంట రవి, రేణిగుంట ఆనంద్, దాసరి శంకర్, రేణిగుంట హరీష్, లింగంపల్లి రవి, దాసరి శ్రీనివాస్, దాసరి శేఖర్, దాసరి శ్రీనివాస్, దాసరి రవీందర్, పురాణం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతి

ఘనంగా మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతి వేడుకలు.

#నివాళులు అర్పించిన ఎం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ మాజీ శాసనసభ్యులు మద్ది కాయల ఓంకార్ 17వ పురస్కరించుకొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సాంబయ్య మాట్లాడుతూ దొరలకు వ్యతిరేకంగా భూస్వాములపై పోరాటం చేసి పెత్తందార్ల గుండెల్లో మనకు పుట్టించి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి ఓంకార్ అలాంటి వ్యక్తి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని యువకులు ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్త నాగరాజు, సుభాష్, సుదర్శన్, వెంకటయ్య, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది…

ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

 

రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విజ్జయ అనారోగ్యంతో గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్, బిఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విజ్జయ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.రాష్ట్ర మాజీ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి

కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి

మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
ఆనాడు ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేటికి రోజులు లెక్కపెట్టి చూస్తే దాదాపుగా 660 రోజులు అయ్యింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయింది ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తు చేద్దామని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు ఇస్తూ వివరిస్తూ వారిని చైతన్య పరిచే దిశలో మేము పని చేస్తుంటే వాళ్ళ పునాదులు కదులుతాయనే భయంతో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తూ ఏదో డోఖా కార్డుల పేరుతో కొత్త రాజకీయం మొదలు పెట్టారు.
మేము ఏమైనా లేనివి ఇవ్వమని చెప్పుతున్నామా మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్నామని అన్నారు.
బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజలకు మంచి చేసిందా,చేడు చేసిందా అనేది వాస్తవం తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్యూరిటీ లేకుండా ప్రజలలోకి రావాలి.
రాబోయే 38 నెలలు వీళ్ళు అధికారంలో ఉంటారు కావచ్చు.ఈ 38 నెలలు వీళ్ళ నీడలాగ వెంటాడుతూనే ఉంటాం.
పడేండ్లలో డోఖా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఈ విదంగా ఉండదు.
భూపాలపల్లి చిన్న కుగ్రామం నేడు జిల్లా స్థాయికి వచ్చింది.
మారుమూల జిల్లా అయిన ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చిన్నాయి, పెన్షన్స్ వచ్చినాయి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినయి.
కేసీఆర్ మాట చెప్పి ఎన్ని రోజులు నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని.
కనీసం యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, చేతకాని ముఖ్యమంత్రి అని ప్రజలు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు పెట్టాలంటే బయపడుతున్నారు.
ప్రధాన ప్రతిపక్ష హోదాలో మాకు ప్రశ్నించే హక్కు ఉంది డానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసి ఎస్ చైర్మన్ మేకల సంపత్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట రాణి సిద్దు గండ్ర హరీష్ రెడ్డి నూనె రాజు తదితరులు పాల్గొన్నారు

దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు…

దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు.

శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ నందు శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
దుర్గామాతను దర్శించుకున్నారు
ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఉగ్యోగి వెలంగదుల శంకరయ్య సుజాత దుర్గామాత కి చేయించిన మకర తోరణంను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతుల చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకుల వారికి అందచేయడం జరిగింది.
భూపాలపల్లి మంజూరునగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి అభిషేకం, అర్చన చండీ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు…

ఘనంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు

పరకాల నేటిధాత్రి

 

 

 

మాజీ ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని భవానీ సమేత కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం బస్టాండ్ కూడలిలో బాణాసంచా కాల్చి కేక్ కటింగ్ చేసి ఘనంగా వారి జన్మదిన వేడుకలు నిర్వహించారు.అనంతరం స్థానిక ప్రభుత్వ దవాఖానలో రోగులకు బ్రెడ్ మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ పరకాల అభివృద్ధి పదంలోకి వచ్చింది అంటే అది ధర్మారెడ్డి గతంలో పట్టణానికి తీసుకువచ్చిన 100 పడకల ఆసుపత్రి,ప్రభుత్వ కార్యాలయాలు,టెక్సటైల్ పార్క్ ఇవన్నీ నిదర్శమని మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీల తరుపున నియోజకవర్గ ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,నాయకులు,మహిళా నాయకురాళ్లు,యూత్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పాపయ్య గారికి నివాళులర్పించిన నల్లాల ఓదెలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-68.wav?_=6

పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలిపిన నల్లాల ఓదెలు

మందమర్రి నేటి ధాత్రి

*మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ తండ్రి పాపయ్య కి నివాళులు అర్పించిన మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ గారి తండ్రి మేడిపల్లి పాపయ్య స్వర్గస్తులవగా విషయం తెలుసుకొని కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, రామన్నపల్లి గ్రామంలోని వారి స్వగృహం నందు పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన *మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

రైతులకు తక్షణమే యూరియా అందించాలి: బీఆర్ఎస్ ధర్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T131112.007.wav?_=7

రైతులకు యూరియా తక్షణమే అందించాలి

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో ధర్నా, రాస్తారోకో

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని మాందారిపేటకూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగండ్ర వెంకట రమణారెడ్డి నాయ కత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయ త్నంలో భాగంగానే ఇది జరుగు తున్నది.సిబిఐకి కాలే శ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.

BRS Holds Protest

నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతి రేకంగా మాట్లాడిన రేవం త్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తె లంగా ణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవా లి. లేదంటే మున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని, బెదిరింపులు కేసు లు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువ య్యారని అన్నారు. రోడ్డుపై బఠాయించి ధర్నాచేసి నిరసన తెలిపారు ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మే కారణం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంవచ్చి న తర్వాత రైతులు ఆరిగోస పడుతు న్నారన్నారు సకాలం లో రైతు బంధు అందక ఎరు వులు లేక అష్ట కష్టాలు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నా రని మండి పడ్డారు రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర మంలో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

BRS Holds Protest

అల్లాడుతున్న అన్నదా తలు గంటల తరబడి నిరీక్షణ

వేసినపంట అదను దాటి పోవడంతో యూరియా రైతులు అల్లాడిపోతున్న పనులన్నీ మానుకొని ఎరువుల దుకాణం వద్ద పడికా పులు కాస్తున్నాం అన్నదాతలు ఎరువుల కేంద్రం వద్ద క్యూ కట్టారు యూరియా బస్తాలు తక్కువ రావడంతో ఉన్నవారికి ఒక్కొక్కడిగా ఇవ్వడం జరుగుతుంది. మండల కేంద్రంలో పంపిణీ చేస్తున్న యూరియా బస్తాలను రైతులను అడిగి తెలుసుకు న్నారు. మండల వ్యవసాయ అధికారికి రైతుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు సంపూర్ణంగా అందే టట్లు చూడాలని మాట్లాడడం జరిగింది.రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే అన్నారు

బాధిత కుటుంబాలను పరామర్శించిన గండ్ర..

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎక్కటి సంజీవరెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి నివాసానికి చేరుకొని ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు.
అనంతరం అదే గ్రామానికి చెందిన మొగిలి కోమల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం కర్కపల్లి గ్రామానికి చెందిన తాంపు నరసింగం గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్సాని లక్ష్మీ నరసింహారావు,పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్,ఐలోని రామచంద్ర రెడ్డి,నాయకులు రవీందర్ రెడ్డి, కేటీఆర్ సేనా జిల్లా అధ్యక్షులు వీసం భరత్ రెడ్డి, రాజిరెడ్డి,మల్లారెడ్డి, కొమురయ్య, శ్రీనివాస్, యాకయ్య, రఘు, తదితరులు ఉన్నారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T124440.534-1.wav?_=8

 

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

 

కల్వకుర్తి పట్టణ కేంద్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య కార్యకర్తలు,నాయకులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు నాయకుల సమక్షంలో శాలువాతో సన్మానించి కేకు కట్ చేసి అనంతరం భారీ ఎత్తున టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా

 

నడికూడ,‌నేటిధాత్రి:

 

మండలం లోని చౌటుపర్తి,నడికూడ, కౌకొండ గ్రామాలలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన ఎలుగటి రవీందర్ రెడ్డి,దుప్పటి మరియమ్మ,బూరం పెద్ద మల్లయ్య,గోల్కొండ శాంతమ్మ,దంచనాల కమలాకర్ కుటుంబాలను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారి మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version