వర్గ పోరాటమే ప్రత్యామ్నాయం: ఎంసిపిఐ(యు) కార్యదర్శి

వర్గ సామాజిక పోరాటాలే ప్రత్యామ్న్యాయం

నిర్మాణాత్మక ఉద్యమాలు చేపట్టాలి

ఎంసిపిఐ(యు) ముగింపు శిక్షణ తరగతుల్లో జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా వర్గ సామాజిక జమిలి పోరాటాలే ప్రత్యామ్నాయమని ఆ దిశలో ఉద్యమాలను నిర్మించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పిలుపునిచ్చారు. దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో
ఎంసిపిఐయు రాష్ట్రస్థాయి సైద్ధాంతిక రాజకీయ శిక్షణా తరగతులకు ముగింపులో భాగంగా వర్గాలు వర్గ పోరాటాలు సామాజిక న్యాయం అనే అంశంపై పార్టీ జిల్లా కార్యదర్శి ప్రసంగిస్తూ సమాజ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అని పార్టీ కార్యకర్తలు వర్గ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పెట్టుబడిదారీ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక కూలి వర్గాలను కూడగట్టి వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని కోరారు.

కార్పొరేట్ శక్తులు పెట్టుబడుదారులు దోపిడిని విస్తృతం చేసి సంపదను పెంచుకుంటున్నారని వారికి అనుకూలంగా పాలకులు చట్టాలను మారుస్తున్నారని ఈ క్రమంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోయి ఎంత శ్రమించినా కనీస అవసరాలు తీరలేని పరిస్థితికి దారితీస్తుందని ఇలాంటి పరిస్థితుల్లో మార్క్సిజం చెప్పినట్లు దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ నాయకత్వంలో శ్రామికులు ఐక్యం కాక తప్పదని అందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కోరారు. కులం మతం ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలందరికీ చెందాల్సిన సంపదను దోపిడీ చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరంతర కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వర్గ సామాజిక ఐక్యతను పెంపొందిస్తూ వర్గ పోరాటాలను జయప్రదం కోరారు.

ఈ శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగాల రాగసుధ ప్రిన్సిపాల్ గా వ్యవహరించగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పార్టీ కార్యక్రమం నిబంధనవళి భవిష్యత్తు కర్తవ్యాలను వివరించారు.ఈ శిక్షణ తరగతులకు వివిధ జిల్లాల నాయకత్వంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్ కుంభం సుకన్య ఎన్ రెడ్డి హంసారెడ్డి మంద రవి రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు గుండెబోయిన చంద్రయ్య తుడుం అనిల్ కుమార్ నర్ర ప్రతాప్ కర్ర రాజిరెడ్డి నీల రవీందర్ జబ్బర్ నాయక్ కంచ వెంకన్న కనకం సంధ్య గడ్డం నాగార్జున మాస్ సావిత్రి కర్ర దానయ్య మాలోత్ సాగర్ సుంచు జగదీశ్వర్ ముక్కెర రామస్వామి వివిధ జిల్లాల కార్యదర్శులు డివిజన్ మండల కార్యదర్శి మహమ్మద్ రజాసాహెబ్ సింగతి మల్లికార్జున్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు…

ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు

ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం

గ్రామాల అభివృద్ధి గాలికి ఒదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిన్నటి దాకా ఎన్నికల డ్రామా నిర్వహించిందని, వారిది బీసీలపై కపట ప్రేమ నటిస్తుందని వారు అన్నారు. కేవల రాజకీయ లబ్ది కోసమే బీసీ రిజర్వేషన్లు అమలు చేసినట్టుగా నటించి తిరిగి వారి నాయకులతోనే హై కోర్ట్ లో కేసులు వేపియ్యడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ కి అన్ని పార్టీలు సహకరించాయని ఆనాడు తెలిపి, ఈరోజు కాంగ్రెస్ పార్టీయే ఒంటరి పోరాటం చేస్తుందని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం ఏనాడు వ్యతిరేకంచలేదని, భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని వారు తెలిపారు. కేవలం వారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందొ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో లేదో అని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న ట్రయల్ వేసినట్టు ఉందని, వారి ప్రభుత్వం మీద,వారి అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకొని ఎన్నికల పట్ల కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం అని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్,జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, సూదగోని మహేష్ గౌడ్, కలిగేటి ఎల్లయ్య, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల ఐటి సెల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, బూత్ కమిటీ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, నాగి లచయ్య, మాడిశెట్టి శ్రీసాయి, కోడూరి ప్రణయ్,కట్ట అనీల్ కుమార్, కొలిపాక రాజేష్, పురేళ్ల సన్నీ, కొలిపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version