నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి…

నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

విద్య వ్యవస్థ అభివృద్ధి చర్యలలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ తో కలిసి పరిశీలించారు.పనుల నిర్వహణలో శ్రేష్టమైన సిమెంట్,ఇసుకను వినియోగించాలని,పనులలో నాణ్యత పాటించాలని తెలిపారు.తెలంగాణ సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల,సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్ లతో కలిసి పరిశీలించారు.అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,ఇందులో భాగంగా పాఠశాలలో చేపట్టిన విద్యుత్ వ్యవస్థ,మూత్రశాలలు, భోజనశాల ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం అమృత్ 2.0 పథకం ద్వారా నీటి ట్యాంకులు నిర్మించి త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటుందని,ఈ నేపథ్యంలో పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.చెన్నూరు పట్టణంలోని భవిత కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక అవసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.స్థానిక ప్రజలకు వేగవంతమైన,మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరగా పూర్తి చేసే విధంగా గుత్తేదారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు

కిష్టంపేట ఎంపిటిసి బరిలో దాసరి శ్రీనివాస్…

కిష్టంపేట ఎంపిటిసి బరిలో దాసరి శ్రీనివాస్

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కిష్టంపేట ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయనున్నట్లు దాసరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న శ్రీనివాస్ కు మండల సమస్యలపై మంచి పట్టు ఉండటం వలన మౌలిక సదుపాయాల అభివృద్ధి కై కృషి చేస్తారని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎంపీపీ సీట్ కోసం రసవత్తరంగా పోటీ ఉండనున్నట్లు తెలిపారు.రాజకీయాల్లోకి చదువు కున్న యువతి, యువకులు రావాలని, అప్పుడే అన్ని గ్రామాలలో అభివృద్ధి మెరుగవుతుందని అన్నారు.తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేసే వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు.

ఆపద్బాంధవులు ఫౌండేషన్ తీవ్ర రోగంతో బాధపడుతున్న బాలుడికి సహాయం…

ఆపద్బాంధవులు ఫౌండేషన్ ద్వారా చిన్నప్పటి నుంచి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న బాలుడి కుటుంబానికి సహాయం.

చందుర్తి, నేటిధాత్రి:

ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జగదీష్ కుటుంబానికి కుటుంబానికి మన ఆపద్బాంధవుల ఫౌండేషన్ తరపున వెయ్యి మంది సహకారంతో ఈరోజు సహాయం చేయడం జరిగింది.
జగదీష్ కుమాడు పుట్టిన మూడు నెలల బేబీ అప్పటినుండి, ఇపుడు రెండు సంవత్సరాల వయస్సు వరకు కూడా నయం కాకపోవడం. విపరీతమైన జ్వరం మరియు విపరీతంగా ఏడుస్తూ ఉన్న సందర్భంలో హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ప్రాబ్లం అలాగే ఉండడం వల్ల జ్వరం తగ్గకపోవడం వల్ల అనేక హాస్పిటల్స్ సిరిసిల్ల జిల్లాలోని హాస్పిటల్ మరియు కరీంనగర్ అలాగే హైదరాబాద్ టాటా హాస్పిటల్ లో బేబీకి వైద్యం అందిచడం జరిగింది అయినా జ్వరం తగ్గక ప్రతి 6 గంటలకు ఫీవర్ రావడం తో, బ్లడ్ టెస్ట్, బోన్మరో క్యాన్సర్ టెస్ట్ కూడా చేశారు, కానీ బాధపడుతున్న బాలుడికి తెల రక్త కణాలు 18000, 30000, అలా ఉండడం అధిక జ్వరంతో బాధపడుతూ ఉండడం జరుగుతుంది, ఇప్పటివరకు కూడా పరిస్థితులు అలాగే ఉండడం వల్ల ఆ కుటుంబం ఆర్ధికంగా చాలా దుర్పరస్థితికి వెళ్లిపోవడం జరిగింది.
ఇది తెలుసుకున్న మన అపద్బాంధవుల ఫౌండేషన్ తరపున ఆ యొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం మరియు 14 రకాల సరుకులు అందించడం జరిగింది ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలితో అలమట్టిస్తున్న వారి ముడుపోయిరాళ్లపైన నాలుగు అన్న మెతుకులై వారి కడుపు నింపడమే మా యొక్క ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version