ఝరసంగం లోని కేంద్రీయ విద్యాలయంలో ఒకటవ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ బేబీ సింగ్ ఆదివారం తెలిపారు. కేంద్రీయ విద్యాలయాల సంఘటన్ (కేవీఎస్) 2025-26 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బాల్వాటిక-1, 2, 3 (ప్రీ ప్రైమరీ)తో పాటు, ఒకటో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. బాల్వా టికా క్యాటగిరీ తప్ప మిగిలిన తరగతుల సీట్లను అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు. భద్రతా దళాలు, కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అలాగే ఏక సంతానంగా ఆడపిల్లలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. దర ఖాస్తుల దాఖలుకు ఈ నెల 21న చివరి తేదీ. ఆ తరువాత నాలుగైదు రోజుల్లో ఎంపికైన వి ద్యార్థుల జాబితాను ప్రకటిస్తారు. కేంద్రీయ విద్యాలయ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చు. పూర్తి వివరాల కోసం https://kvsangathan.nic.in/en/ వెబ్సైట్ చూడవచ్చు.
మహిళలు సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి…..
అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలనీ అంజనేపుత్ర రియల్ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రం లోని చున్నం బట్టి వాడలో ఆ సంస్థ కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ అమ్మగా, ఆలిగా,ఆలిగా పోరాట జ్వాలవై, ఆశయాల బాటవై, ఈసృష్టికి మూలమై, మానవుడి మనుగడకు ప్రాణమై, అన్నిట్ల సగభాగమై, ఆదేరువై, ఆధరణై, అనునిత్యం అండగా ఉంటున్న ఆడబిడ్డలందరూ అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర సంస్థ డైరెక్టర్ లు మహిళలు తదితరులు పాల్గొన్నారు
చావా సినిమాను స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులకు చూపించిన బిజెపి నాయకులు
బిజెపి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో హిందూ హృదయ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంబాజి మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా చిత్రాన్ని తెలుగులో గణపురం లోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస థియేటర్లో ప్రదర్శించిన సందర్భంగా బిజెపి గణపురం మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు ఆధ్వర్యంలో మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 170 విద్యార్దిని విద్యార్దులకు ఉచితంగా సినిమా ప్రదర్శన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చావా మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకేర్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు దు రాక్రమణదారుడైన ఔరంగాజెబ్ మన మరాఠా యోధుడు శంబాజీ మహారాజును స్వరాజ్య పోరాటంలో ఏ విధంగా చిత్రహింసలు పెట్టి చంపాడో అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన 60 ఏళ్లలో ఎంతోమంది వీరుల చరిత్రను దాచిపెట్టి దురాక్రమన దారులైన ఔరంగాజెబ్,మహమ్మద్ బిన్ తుగ్లక్, అక్బర్, బాబర్, షాజహాన్,లాంటి వారి చరిత్రను పాఠ్యపుస్తకాలలొ చేర్చి మన పోరాట యోధుల చరిత్రను దాచి పెట్టింది కాంగ్రెస్ మన దేశ కేంద్ర మొట్టమొదటి విద్యా శాఖ మంత్రిని అరబ్ దేశాల నుండి తీసుకొచ్చి మన వీరుల చరిత్రపుటల్లో లేకుండా చేసింది దయచేసి స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులు మీ పిల్లలకు ఈ సినిమాను చూపించి హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ చేసిన పోరాటం పిల్లలకు తెలిసేలా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గాలిఫ్, బీజేపీ మండల నాయకులు దుగ్గుశేట్టి పున్నం చందర్, వడ్డెం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో… పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ బాక్సుల పంపిణీ….
మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ మహిళ పరిశుద్ధ కార్మికురాలికి ఘనంగా సన్మానం..
రామాయంపేట మార్చి 8 నేటి ధాత్రి(మెదక్)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నాడు రామాయంపేట పట్టణంలో ఉన్న మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ మహిళ పరిశుద్ధ కార్మికురాలికి సన్మానం… అలాగే 18 మంది మహిళా పరిశుద్ధ కార్మికురాళ్ల కు వారి సేవలకు గుర్తింపుగా స్టీల్ టిఫిన్ బాక్స్ ల పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా శాఖ అధ్యక్షుడు ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు టిఫిన్ బాక్సులను అందజేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దెమే యాదగిరి మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అన్ని రకాల చర్య లు చేపడుతుందనీ తెలిపారు. గతంలో తాను కూడా వార్డు సభ్యునిగా, కౌన్సిలర్ గా ఉన్న సమయంలో పేదలకు సేవా కార్యక్రమం ద్వారా ఆదుకున్నట్లు తెలిపారు.. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డి.జి. శ్రీనివాస శర్మ, వైద్య శిబిరాల నిర్వాహన చైర్మన్ దామోదర్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మద్దెల సత్యం, మద్దెల రమేష్, పాతూరు సిద్ధ రాములు, దారం రమేష్, సతీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
వరంగల్, నేటిధాత్రి
celebrations
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, పరిపాలన విభాగం మహిళా అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. మహిళా పోలీస్ అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఉమెన్స్ డే సందర్భంగా ఇంతేజార్ గంజ్ స్టేషన్ లోని మహిళా కానిస్టేబుళ్లను అభినందిస్తూ వారితో కలసి ఫొటోస్ దిగారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం,ఘనంగా సన్మానించిన ఆర్టిఐ నేత వెంకటేశ్వర్లు గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా,గ్రామపంచాయతీ కార్యదర్శులు ,సుజాత గుండ్ల కర్తి పంచాయతీ కార్యదర్శి మౌనిక,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కరుణ,మాజీ వార్డ్ మెంబర్ స్వరూప ఘనంగా శాలువాతో సన్మానించిన వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ మనకు స్వాతంత్య్రం సిద్దించి దాదాపు 78 సంవత్సరాలు కావస్తున్న ఇంకను మహిళలకు రక్షణ కొరవడింది మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నమరోసారి మనం మహిళల సాధికారత, స్వేచ్చ,వారి హక్కులు,రక్షణ గురించి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఈనాటికి కూడా మహిళలు పూర్తి స్థాయిలో స్వేచ్చ,వాయువులు పీల్చుకోలేక పోతున్నారు అనే మాట మనకు చాలా స్పష్టంగా అవుతుందని ఎందుకంటే ఈనాటికి మహిళలు అనేక విధాలుగా గృహ హింస, లైంగిక దాడులు,భృణ హత్యలు, అత్యాచారాలు,పురిటిలోనే పసిపాపలను కడతెర్చడం,లింగ సమానత్వం వంటి విషయాల్లో తీవ్రస్థాయిలో అధిపత్య ధోరణి, దౌర్జన్యాలను,అమానుష ఘటనలను నిత్యం ఎదుర్కొంటుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబందించి అత్యంతదురదృష్టకరం.ముఖ్యంగా చట్ట సభల్లో మహిళల ప్రాధాన్యత 30 శాతానికి మించక పోవడం కూడా మహిళల పాలిట ఓ,శాపంగా పరిణమించి వారి ప్రశ్నించే గొంతుకకు కళ్లెం వేసినట్లయింది,అయినప్పటికీ మహిళలు ఈ మధ్యకాలంలో పురుషులతో సమానంగా అన్ని రంగాలలో వందే భారత్ ఎక్ష్ప్రెస్స్ లా దూసుకుపోతున్నారు స్త్రీలేకపోతేజనం లేదు, శ్రీ,లేకపోతే గమనం లేదు , శ్రీ,లేకపోతే అసలు సృష్టి లేదు కంటిపాపల కాపాడే శ్రీ మూర్తికి మహిళల హక్కులను వర్ధిల్లాలని నారీ శక్తిమణులు మహిళలకు వందనాలు,తెలుగు రాష్ట్రాల మహిళా మణులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు వెంకటేశ్వర్లు గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టిఐ, సభ్యుడు రమేష్, ఎంఈఓ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు,
మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి ఐటి పార్కు సమీపంలో రూ. 3, 225 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యక్షంగా 4500 మందికి ఉపాధి, పరోక్షంగా 10 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రూ. 800 కోట్లతో అల్టిమన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. రూ.502 కోట్లతో లోహమ్ మెటీరియల్స్ కంపెనీ ఏర్పాటు చేస్తారు. రూ.25 కోట్లతో సెల్ ఎనర్జీ కంపెనీ లకు కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఐటి శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్దుద్దిళ శ్రీదర్ బాబు, మహబూబ్ నగర్ ఎంపి శ్రీమతి డికె అరుణ, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై , అమరరాజా గిగా ఫ్యాక్టరీ మరియు ఇతర కంపెనీలకు భూమి పూజ చేసి కంపెనీ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సాదరంగా ఆహ్వానించారు. కంపెనీ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ కాంగ్రెస్, అమరరాజా కంపెనీ గల్లా జయదేవ్ , కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
జ్ఞానోదయ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం పురస్కరించుకొని లీగర్ లీటరసి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.
మెట్ పల్లి మార్చి 8 నేటి ధాత్రి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని భారత దేశ న్యాయస్థానం మహిళలకు ఉద్యోగులలో రాజకీయాలలో అన్ని రంగాలలో రిజర్వేషన్ ఇచ్చిందని దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మహిళలకు మన భారత దేశంలో ప్రాధాన్యత ఇస్తారని మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని వివిధ రంగాల ఉద్యోగాలలో ముందుగా పురుషులకంటే మహిళలు ఉద్యోగం సాధించి మంచి గుర్తింపు పొందుతున్నారని వారికి మరిన్ని ఉపయోగ ప్రభుత్వ పథకాల ద్వారా వారికి ప్రోత్సాహక వ్యాపారాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయని గుర్తింపు వీటిని మహిళలు మంచి లబ్ధి పొందుతున్నారని మీకు ఏ న్యాయ సలహా కావాలన్నా మా దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుపాలని దానికి మేము పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జ్ డి నాగేశ్వరరావు సామాన్య గృహిణిగా ఉన్న సాధారణ మహిళ చిరు పట్ట గొలుసుల తయారు చేసే వ్యాపారము ప్రారంభించి ఉన్నత వ్యాపార స్థానం చేరిన గృహిణి ని మరియు సీనియర్ మహిళ అడ్వకేట్లను ఘనంగా సన్మానం చేశారు . ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి టి నాగేశ్వరరావు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, టి వేణుగోపాల్ ,మగ్గిడి నరసయ్య ,కోటగిరి వెంకటస్వామి, ప్రిన్సిపాల్ సంతోష్ ,తెడ్డు సురక్ష, దయ రాజారామ్, తుల రాజేందర్, ఓజ్జల శ్రీనివాస్ ,గడ్డం శంకర్ రెడ్డి, అలల శంకర్, తదితరులు విద్యార్థిని విద్యార్థులు అడ్వకేట్లు అధ్యాపకులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో సతీ సమేతంగా.. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళ శక్తి పథకం కింద రూ. 15 లక్షల చెక్ లను మహిళా సంఘాలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని పేర్కొన్నారు. ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజాప్రభుత్వం చేపట్టిన విజయమన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న చర్యల వల్ల పది మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారని అన్నారు. మహిళా సంఘాలకు వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వము వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 21 వేల కోట్లకు పైగా రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. వడ్డీలు, చక్రవడ్డీలు అప్పుల బాధకు కుటుంబాలు బలి కాకుండా మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. పెద్దపెద్ద కార్పొరేట్లకే పరిమితమైన పరిమితం అయిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దన్నగా ఉంటూ అండగా ఉంటూ ప్రజా పాలన అందిస్తున్నారని వెల్లడించారు. మహిళా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని, తమను ఈ సందర్భంగా మహిళలందరూ దీవించాలని ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
కరకగూడెం మండలం నీలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామానికి చెందిన సోడి మాసయ్య (35) అనే వ్యక్తి గత కొంత కాలంగా కుటుంబ కలహాలతో మద్యానికి బానిసై శనివారం ఇంటి వద్ద మృతి చెందాడు. గ్రామస్థులు గమనించి పోలీసులకు సమాచారం అందించాగా విషయం తెలుసుకున్న కరకగూడెం ఎస్ఐ రాజేందర్ ఘటన స్థలం వద్దకు వెల్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడు బాబాయ్ సోడి మడకం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ శవ పరీక్షకు తరలించారు.
యావత్ బీసీలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలి ఈనెల లొనే శాసనసభలో బీసీ బిల్లు ఆమోదం బీసీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బోయిని హన్మాండ్లు జగిత్యాల మార్చి08 నేటి ధాత్రి .
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, విద్య ఉద్యోగాలలో కూడా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ బోయిని హన్మాండ్లు హర్షం వ్యక్తంచేస్తూ కృతజ్ఞతలు తెలిపారు పత్రికా ప్రకటన ద్వారా హన్మాండ్లు మాట్లాడుతూ గ్రామ గ్రామాన బీసీలు సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండాలని బీసీ సంఘలు యావత్ బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని తెలిపారు. భారతదేశంలో కుల గణన జరిపి బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా సాధ్యమవుతుందని తెలిపారు రిజర్వేషన్ల అమలుకు, న్యాయపరమైన చిక్కులు రాకుండా, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి సహకరించేలా దేశ జనాభా గణ నలో బీసీ కులాల గణన, చేపట్టడంతో పాటు, చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రధాని మోడీని ఒప్పించాలని కోరారు. నిత్యం బీసీ జపం చేసే ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా బిసి రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలని లేనియెడల వచ్చే ఎన్నికలలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన తెలిపారు.
*మహిళా దినోత్సవ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్..
*రూ.10.58 కోట్ల చెక్కు పంపిణి..
పలమనేరు(నేటి ధాత్రి)మార్చి 08:
మహిళలు మరింత చైతన్యవంతులుగా రాణించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.
మొట్ట మొదట మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి నాడు బీజం వేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీనేనన్నారు.
Women’s Day
మహిళలను ఆర్థికంగా రాణించడానికి దేశంలోనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమని,మహిళలకు రాజకీయ హక్కు కల్పించి 33% రిజర్వేషన్ ద్వారా స్థానిక సంస్థలందు అవకాశం కల్పించిన ఘనత కూడా టీడీపీదేనన్నారు.
బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మహిళల వెంట నేడు క్యూ కడుతున్నాయంటే అందుకు మీరు కల్పించుకున్న నమ్మకమే కారణమని అన్నారు,
మహిళలు వంటింటిలో పడుతున్న బాధలు చూసి వారికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఆదుకున్న నాయకుడు చంద్రబాబు అని ఇప్పుడు దీపం-2 ద్వారా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని గుర్తు చేశారు.
మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి,ఏపి ఎల్,ఎల్,సి,
ద్వారా భూమిని సగం ధరకే ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని మహిళలు తమ స్వశక్తితో రాణించడానికి టైలరింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తూ వారికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తూ అండగా ఈ ప్రభుత్వం నిలుస్తోందన్నారు.
ప్రతి ఇంటిలో ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని సరళమైన విధానాలతో అన్ని రకాల ప్రోత్సాహకాలు,సబ్సిడీ రుణాలను ప్రభుత్వం అందిస్తోందని,తల్లికి వందనం పేరుతో ప్రతిబిడ్డకు చదువుకోవడానికి 15000/- రూపాయలు త్వరలో చెల్లిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాలన్నీ మహిళలకు అందేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలా అన్ని ప్రభుత్వ పథకాలల్లో మహిళలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రాణించాలని కోరారు. అనంతరం పట్టణ స్వయం సహాయక సంఘలకు రూ.10.58 కోట్ల మెగా చెక్ ను అందజేశారు. తదనంతరం పలువురు వివిధ రంగాలల్లో రాణించిన మహిళలను ఆయన సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమాల్లో పలమనేరు బాలాజీ కో ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ,మున్సిపల్ కమిషనర్ రమణా రెడ్డి, మెప్మా మేనేజర్ బాబా లతో పాటు కౌన్సిలర్లు సునీతా నాగరాజు, కిరణ్, బీ ఆర్ సీ కుమార్ మరియు టీడీపీ నాయకులు ఆర్ బిసి
యువజ్యోతి యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో మహిళా వాక్తాన్ కార్యక్రమం,,,
యువభారత్ యువ ఉత్సవ్ కేంద్ర మంత్రుల శాఖ ఆధ్వర్యంలో నేడు ఉదయం 8 గంటల నుండి మహిళలకి వాక్తాన్ కార్యక్రమం,,,
రామాయంపేట మార్చి8 నేటిధాత్రి (మెదక్)
Women’s speech
ప్రపంచ మహిళా దినోత్సవం మరియు కేంద్ర యువజన సర్వీసులు క్రీడల అవగాహన ఉపాధి శాఖ ఆధ్వర్యంలో 9 నుండి 11 వ తారీకు వరకు యువ ఉత్సవ్ యువభారత్ అనే కార్యక్రమాలను జిల్లా నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో చేపట్టిన సందర్భంగా నేడు రామాంపేట స్థానిక యువజ్యోతి యూత్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100 మంది మహిళ యూత్ కార్యక్రమంలో వాక్ తాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యువ జ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఒక ప్రకటన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుండి సుమారు రెండు కిలోమీటర్లు మార్కెట్ యార్డ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు 100 మంది మహిళ యూత్ యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమానికి యువజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రజల్లో శక్తిసామర్థ్యాలకు యువభారత్ నుండి జరిగే కార్యక్రమాలు ఆరోగ్యం మరియు అవగాహన స్ఫూర్తిని కలిగించడానికి సహకరించాలని ఆయన కోరారు అలాగే మెదక్ డిగ్రీ కాలేజ్ లో 11 వ తారీఖున జరిగే ఇవ్వోచ్చావ్ కార్యక్రమంలో 19 నుండి 29 వరకు మహిళలు యువతులు సైన్స్ ఫెయిర్ మరియు సాంస్కృత క వత్తుత్వవ్యాసాలకు రచన పోటీలకు పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకోవడానికి 9 0 0 0752850. ,, పేర్లు నమోదు చేసుకోగలరు అని ఆయన తెలిపారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాల యంలో శనివారం రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కరించుకొని రచయిత దాసరపు నరేష్ రచించిన జగతికి నీవే ఆధారం సిడి ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి న సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గు మల్లేష్ యాదవ్ చేతుల మీదుగా సిడి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పురిటి నొప్పుల పుట్టుక నీది నీవు లేకుంటే మనుగడ లేదు అనే పాట రాసి మహిళల గొప్పతనాన్ని వర్ణించి రాసిన రచయిత దాసరి నరేష్ ను అభినందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి వచ్చిన మహిళ ఉద్యోగులు, పాట రచయిత రచయిత దాసారపు నరేష్, పాడినవారు రోజా, సంధ్య , ఈ పాటకి మ్యూజిక్ అందించిన కిట్టు, కళాకారులు.. పుల్ల ప్రతాప్ , మ్యాదరి సునీల్, బానోతు రాజు నాయక్, దూడపాక దివాకర్, డప్పు రాజు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ లో ప్రమాదవశాత్తు పడిన కారు
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (తండ్రి, కూతురు కొడుకు) మృతి.. మరొకరిని కాపాడిన స్థానికులు
బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు, గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు.
ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కుటుంబంగా గుర్తింపు…
వరంగల్, నేటిధాత్రి.
Car
వరంగల్ జిల్లా, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో ప్రమాదవశాత్తు కారు పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు (తండ్రి, కూతురు కొడుకు) మృతి.. మరొకరిని స్థానికులు కాపాడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఫ్యామిలీలో బాలుడి మృతి చెందారు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో తండ్రి, కూతురు కాలువలో గల్లంతు కావడం, గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ (30)తో పాటు ఆయన కూతురు ఎస్సారెస్పీ కెనాల్లో పడి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ప్రవీణ్ కొడుకు (3) మృతి చెందగా భార్యను స్థానికులు కాపాడారు. వరంగల్లో నివాసం ఉంటున్న ప్రవీణ్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి వరంగల్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలోనే సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కెనాల్లో వీరు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. దీంతో ప్రవీణ్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు తాడు సాయంతో భార్యను కాపాడారు. అప్పటికే బాబు మరణించాడు. ప్రవీణ్ ఆయన కూతురు కారు సహా నీటిలో గల్లంతయ్యారు. డ్రైవింగ్ సమయంలో ప్రవీణ్ కు చెస్ట్ పెయిన్ రావడంతో కారు ప్రమాదవశాత్తు కెనాల్ లో పడిపోయినట్లు తెలుస్తుంది. పోలీసులు గల్లంతయిన తండ్రీ కూతురు కోసం గాలిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్త్రీగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని ట్రెయిని ఎస్సై సృజన అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా అమే మాట్లాడుతూ నేడు పురుషులతో పాటు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని అలాగే పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. చాలా రంగాల్లో మహిళలు ముందుంటున్నారని అన్నారు. ప్రస్తుత కాలంలో ఏ రంగాల్లో అయినా మహిళలు రాణిస్తున్నారని అద్భుత విజయాలు సాధిస్తున్నారని అన్నారు. మహిళలు పురుషులకంటే ఆత్మస్థైర్యంగా శక్తివంతంగా తయారయ్యారని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టగానే చిన్నచూపు చూడకుండా వారిని కూడా పురుషులతో సమానంగా పెంచి ఉన్నత చదువులు చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తొందరపడి ఆడపిల్లలను చదివిన మధ్యలో ఆపేసి పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అప్పుడు తిరిగి ఆ సమస్య తల్లిదండ్రుల కు వస్తుందన్నారు. అలా కాకుండా ఆడపిల్లను ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగం సంపాదించే వరకు పెంచితే వారికి భవిష్యత్తు ఎంతో ఉంటుందని జీవితాంతం సుఖ సంతోషాలతో మెట్టిన ఇంట్లో కూడా ఉంటుందని అన్నారు. దేశంలో నేడు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు వస్తున్నాయని ఇది మహిళల యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించడం వల్లనే జరుగుతుందన్నారు. ఆడవారు ఉద్యోగాలనే కాకుండా స్వచ్ఛందంగా పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, స్వయం ఉపాధి రంగాల్లో ఎంతో రాణిస్తున్నారని అన్నారు.
పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటి ధాత్రి:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని ఈ రోజు పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో యస్ ఐ దీకొండ రమేష్ అద్వర్యoలో మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా మహిళ పోలీస్ సిబ్బందికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యస్ ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మహిళలు ఏదో ఒక్క రంగంలో అని కాకుండా, విద్య, వైద్య ,పారిశ్రామిక, అంతరిక్ష ఇలా అన్ని రంగాల్లో రాణించడం హర్షనీయమని అన్నారు.అన్ని రంగాల్లోనూ మహిళలదే పోటీ అని, వారికి ఎవరు సాటి రారని కీర్తించారు. మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువ, ప్రపంచానికి వెలుగు చూపేది మహిళ అని అన్నారు.పురుషులతో పోటీపడుతూ ఉద్యోగ అవకాశాల్లో, విధుల్లో వారితో సమానంగా మహిళలు పని చేయడం గొప్ప విషయం అని తెలిపారు. పురుషుల కన్నా మహిళకే పట్టుదల ఎక్కువ అని, కృషితో ఉద్యోగాలలో మరియు ఇతర రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతంగా ఆలోచించిన మహిళ తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి చేర్చే సత్తా ఉందని, ప్రత్యేకంగా పోలీస్ శాఖలో తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.మహిళా సాధికారత తోటే అభివృద్ధి సాధ్యం అని, ప్రతి ఒక్క మహిళ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని తెలియజేశారు. అనంతరం మహిళా పోలీస్ సిబ్బంది ప్రవల్లిక, రజిత, భారతిమ్మని సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏయస్ఐలు సుధాకర్, వీరస్వామి, రత్నాకర్, లక్ష్మి రాజం, హెచ్ సి కిషన్, శ్రీనివాస్, రాము, రాజేందర్, శివ శంకర్, రాజు, హరీష్, సతీష్ పాల్గొనారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో రూ. 45 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయి. కల్వకుర్తి పట్టణంలో శనివారం మహబూబ్ నగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజానర్సింహా, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ లు బృంగి ఆనంద్ కుమార్,యెన్నం భూపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు జిల్లెల్ల రాములు, దామోదర్ గౌడ్, చిన్న రాంరెడ్డి, గోరటి శ్రీనివాసులు, రవీందర్,చిన్న, బాలు నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సభ్యులు రేష్మ, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాల్ రాజ్, శ్రీధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నాని యాదవ్,రావుల కేశవులు, వెంకటేష్,దున్న సురేష్, శ్రీశైలం మహేందర్, నవీన్ కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో మహబూబ్ నగర్ ఎంపీ అరుణకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మరియు షాద్ నగర్ బిజెపి నాయకులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. షాద్ నగర్ బీజేపీ నాయకులు శ్రీనివాస్, విజయ్ బాస్కర్, నర్సింహా యాదవ్, మోహన్ సింగ్, సుధాకర్, కొత్తూరు మండల అధ్యక్షులు అత్తాపురం మహేందర్ రెడ్డి, చౌదరిగూడ మండల అధ్యక్షులు గడ్డమిది రాజు, శ్యామ్ సుందర్ రెడ్డి, మిద్దె గణేష్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రాజు నాయక్, తదితరులు ఉన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి లో పెద్దూర్ తాండ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన సభావత్ తారబాయి శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించింది. ఈ విషయం తెలుసుకున్న తలకొండపల్లి మాజీ జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ… తమ ట్రస్టు ద్వారా తక్షణ సహాయంగా బాధిత కుటుంబానికి ద్వారా రూ.3 వేల ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ యంపిటిసి రఘు నాయక్, మాజీ సర్పంచ్ సక్రి కిషన్ నాయక్, మాజీ వార్డు మెంబర్లు రవి, పుల్యి , రమేష్ గ్రామ పెద్దలు టిక్యి నాయక్, రమేష్ నాయక్, కిషన్ నాయక్, రవి నాయక్, దస్రు నాయక్, శ్రీనివాస్ ,కృష్ణ తదితరులు వివిధ నాయకులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.