గుండె పోటుతో యువ రైతు మృతి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువ రైతు గుండెపోటుతో మృతి…

గుండె పోటుతో యువ రైతు మృతి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన యువ రైతు గుండెపోటుతో మృతి

జమ్మికుంట ( నేటి ధాత్రి)

జమ్మికుంట మండలం జగ్గయ్య పల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్య పల్లి గ్రామానికి చెందిన గుజ్జ గోపాలరావు (45) అనే రైతు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పొలంలో నీటి పరిశీలిస్తున్న క్రమంలో గుండెపోటు కు గురయ్యాడు. పొలంలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

బడికి దూరమైన నెలలోపే ఉపాధ్యాయురాలి మృతి

బడికి దూరమైన నెలలోపే బతుకు చాలించిన ఉపాధ్యాయులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: బడికి దూరమైన నెలలోపే ఓ
ఉపాధ్యాయురాలు బతుకు చాలించారు. సమాచారం తెలుసుకున్న ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు. ఈ సంఘటనలో జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు వాస్కర్ నాగ స్వరూపరాణి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. గత డిసెంబర్ 31 వ తేదీన ఆమె పదవి విరమణ చేసారు. బడికి దూరమైన నెలలోపే గుండెపోటు రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను కబళించడం అందరిని కలచివేసింది. ఈ సంఘటన బడి, విద్యార్థులుతో ఆమెకున్న అనుబంధాన్ని సూచిస్తుందని తోటి ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన చివరి మార్గదర్శక ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన వైకల్యాన్ని ఎంత మాత్రం లెక్కచేయకుండా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి రాణించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులందరి మన్ననలు అందుకున్నారు.

ఎమ్ ఏ మతీన్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే

ఎమ్ ఏ మతీన్ గారిని పరామర్శించిన, ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుండెపోటు కారణంగా పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఎమ్ ఏ మతీన్ గారిని పరామర్శించి, అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఎన్నికల ఇంచార్జి దేవీప్రసాద్ గారు సీనియర్ నాయకులు నామ రవికిరణ్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు . తదితరులు పాల్గొన్నారు,

కేసముద్రం కాంగ్రెస్ నేత గుండెపోటుతో మృతి

గుండెపోటుతో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మృతి…

పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

కేసముద్రం/ నేటి దాత్రి

 

కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దురుసోజు ప్రతాపచారి గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్వగృహం వల్ల గుండె నొప్పి రావడంతో వెంటనే అకస్మాత్తుగా ప్రైవేట్ వాహనంలో మొహబత్ ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు వెంటనే గుర్తించి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు , భార్య ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిగింది. చిన్న కూతురు రమ్య కి వివాహము జరగలేదు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ హుటా హుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

బీబీ చారి అందరి మనసుల్లో నిలిచారు…

బీబీ చారి అందరి మనసుల్లో నిలిచారు

బీబీ చారి మరణంపట్ల కన్నీటిపర్యంతం అయిన మాజీ ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి పట్టణ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన బేతోజు భరత్ కుమార్ చారి (బీబీ చారి) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. యువకులతో సమానంగా పోటీ పడుతూ,అందరికీ సలహాలు సూచనలు అందిస్తూ,స్నేహపూర్వక స్వభావంతో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తిగా బీబీ చారి అందరి మనసుల్లో నిలిచారు.
ఈ సందర్భంగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు.బీబీ చారి పార్టీ కోసం చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 ఈ ఒక్క విటమిన్ లోపం వల్ల గుండెపోటు వస్తుందని మీకు తెలుసా..

 ఈ ఒక్క విటమిన్ లోపం వల్ల గుండెపోటు వస్తుందని మీకు తెలుసా?

 

 

ప్రస్తుత కాలంలో చాలా మంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు మరణాలు కూడా ఎక్కువయ్యాయి. అయితే, కాబట్టి, ఏ విటమిన్ లోపం వల్ల ఈ సమస్య వస్తుందో మీకు తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: గుండె సంబంధిత వ్యాధులు వృద్ధులలోనే కాదు, యువకులలో కూడా కనిపిస్తున్నాయి. చాలా మంది గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది గుండెపోటుకు కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా డయాబెటిస్ వంటి వ్యాధులే కారణమని చెబుతున్నారు. కానీ విటమిన్ డి లోపం కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణమని మీకు తెలుసా? అవును, ఈ విటమిన్ లోపం ఉంటే అది గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ విటమిన్ లోపం గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..
నిపుణుల ప్రకారం, విటమిన్ డి మన శరీరాలకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది మన శరీరంలో కాల్షియం, భాస్వరం స్థాయిలను సమతుల్యం చేయడమే కాకుండా మన ఎముకలను బలంగా ఉంచుతుంది. అయితే, ఇది కొన్నిసార్లు ఎముకలు, గుండెను ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీని లోపం ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని చెబుతారు. శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు, రక్తపోటు అసమతుల్యమవుతుంది. ఇది రక్త నాళాలలో వాపుకు కారణమవుతుంది. ఈ పరిస్థితి క్రమంగా గుండె జబ్బులకు దారితీస్తుంది.

విటమిన్ డి లోపం లక్షణాలు

  • మీరు తరచుగా అలసిపోయినట్లు అనిపిస్తే, అది విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. అదనంగా ఎముక, కండరాల నొప్పి, తరచుగా అనారోగ్యం, నిరాశ లేదా మానసిక స్థితిలో మార్పులు వంటి లక్షణాలు విటమిన్ డి లోపాన్ని సూచిస్తాయి.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, విటమిన్ డి లోపం నిద్రలేమి, తరచుగా నిద్రకు అంతరాయం వంటి సమస్యలను కలిగిస్తుంది. మన శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు, మెలటోనిన్ అనే రసాయన ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల మనం సరిగ్గా నిద్రపోలేము.
  • విటమిన్ డి కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. విటమిన్ డి లోపం శరీరంలో కాల్షియం లోపానికి కూడా కారణమవుతుంది.

విటమిన్ డి లోపాన్ని ఎలా అధిగమించాలి?

  • ఉదయం రోజూ కనీసం 15 నిమిషాలు ఎండలో కూర్చోండి.
  • ఆహారంలో పాలు, పెరుగు, గుడ్లు, పుట్టగొడుగులు, చేపలను చేర్చుకోండి.
  • వైద్యుడి సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోండి.
  • గుండెపోటును నివారించడానికి, ఎప్పటికప్పుడు మీ విటమిన్ డి స్థాయిలను తనిఖీ చేస్తూ ఉండండి.
  • మీకు విటమిన్ డి లోపం ఉందని అనుమానం ఉంటే వెంటనే చికిత్స తీసుకోండి.
  • సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేర్చుకోండి.
  • విటమిన్ డి లోపాన్ని విస్మరించడం ప్రమాదకరం. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మీరు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

సీపీఆర్‌తో ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ ప్రాణం కాపాడు..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T132642.533.wav?_=1

 

సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్,గంగారాజు.

తిప్పపూర్ బస్టాండ్ వద్ద హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన అక్కడే విధులు నిర్వహిస్తున్న గంగారాజు,శ్రీనివాస్.

కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు ని అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

సిరిసిల్ల/వేములవాడ(నేటి ధాత్రి):

 

ఈరోజు ఉదయం నాంపెళ్లి గ్రామానికి చెందిన రమేష్ , వయస్సు 49 అనే వ్యక్తి తిప్పపూర్ బస్టాండ్ వద్ద హార్ట్ ఎటాక్ తో కుప్పకూలగా అక్కడే విధులలో ఉన్న కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు వెంటనే స్పందించి సీపీఆర్ చేసి వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కానిస్టేబుల్స్ చాకచక్యంగా వ్యవహరించడంతో రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు.సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ శ్రీనివాస్,గంగారాజు లను నెటిజన్లు అభినందిస్తున్నారు.

హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టింది.

“నిరుపేద రాజయ్య కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలి”

అకస్మాత్తుగా మరణించిన కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన ఆకారపు రాజయ్య నిన్నటి రోజు గుండెపోటు రావడంతో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గ్రామానికి చెందిన రాజయ్య నిన్నటి రోజు గుండెపోటుతో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి నా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి రాములు. రాజయ్య జిల్లెల గ్రామంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికునుగా పనిచేస్తూ వడ్ల సీజన్లో అమాలిగా వడ్లు జోకుతూ ఉంటూ జీవనం సాగిస్తున్నారని ఆయనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని వారి పెండ్లిలకు గాను తనకున్న యావదాస్తి భూములు జాగాలు పొలం అమ్ముకొని ప్రస్తుతం నిలువ నీడలేని స్థితిలో గుడిసెలో జీవనం సాగిస్తూ ఉంటున్నారని. అలాంటి నిరుపేద వారికి గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో గాని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ వారికి కానీ ఇటువంటి నిరుపేదలు కనిపించడం లేదా. ఇలాంటి నిరుపేద కార్మికుల కుటుంబాన్ని ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని కోరుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి వారి జీవితాలు మారడం లేదని వెంటనే ప్రభుత్వ o . గుర్తించి ఇలాంటి కుటుంబాల వారిని ఆదుకోవాలని కోరుతూ ఇటువంటి నిరుపేదలు ఉండడానికి ప్రభుత్వం కేటాయించే డబ్బులు బెడ్ రూమ్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అందించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూవారి కుటుంబాన్ని పరామర్శించి మనో ధైర్యాన్ని ఇచ్చి నివాళులర్పించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని. వారినీ ప్రభుత్వాo ఆదుకోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అజ్జ వేణు. జిల్లా నాయకులు బాచుపల్లి శంకర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు

పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి ఘన నివాళులు.

పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి ఘన నివాళులు.

#బాధిత కుటుంబాలకు “మెపా” అండగా ఉంటుంది.

# పులి దేవేందర్ ముదిరాజ్
మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు.

#అచ్చునూరి కిషన్ ముదిరాజ్
మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు.

ములుగు, నేటిధాత్రి:

 

 

మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ తండ్రి అయిన పొన్నం సారయ్య ముదిరాజ్ ఇటీవల గుండెపోటు’తో మృతి చెందిన సందర్బంగా ఈరోజు వారి స్వగ్రామం అయిన రాజపల్లె లోని వారి నివాసానికి వెళ్లి పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, వారి కుమారులు పొన్నం రాజు, కృష్ణ ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చడం జరిగింది.
ఈ సందర్భంగా మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ…..కష్టం వచ్చిన కుటుంబాలకు మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రాజు, కృష్ణ కుటుంబానికి భరోసానిచ్చారు.
అలాగే మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మాట్లాడుతూ….. పొన్నం సారయ్య ముదిరాజ్ మృతి చాలా బాధాకరం, సారయ్య ఎక్కడ ఉన్న అతని ఆత్మ శాంతిచాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఆపదలో ఉన్న ముదిరాజ్ కుటుంబాలకు మెపా అండగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెపా ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, చొప్పరి రాజేందర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి ఘన నివాళులు..

పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి ఘన నివాళులు.

బాధిత కుటుంబాలకు “మెపా” అండగా ఉంటుంది.

పులి దేవేందర్ ముదిరాజ్
మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు,

అచ్చునూరి కిషన్ ముదిరాజ్
మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు.

హన్మకొండ:నేటిధాత్రి

 

మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ తండ్రి అయిన పొన్నం సారయ్య ముదిరాజ్ ఇటీవల గుండెపోటు’తో మృతి చెందిన సందర్బంగా ఈరోజు వారి స్వగ్రామం అయిన రాజపల్లె లోని వారి నివాసానికి వెళ్లి పొన్నం సారయ్య ముదిరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి, వారి కుమారులు పొన్నం రాజు, కృష్ణ ముదిరాజ్ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చడం జరిగింది.

ఈ సందర్భంగా మెపా రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ కష్టం వచ్చిన కుటుంబాలకు మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రాజు, కృష్ణ కుటుంబానికి భరోసానిచ్చారు.

అలాగే మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మాట్లాడుతూపొన్నం సారయ్య ముదిరాజ్ మృతి చాలా బాధాకరం, సారయ్య ఎక్కడ ఉన్న అతని ఆత్మ శాంతిచాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ, ఆపదలో ఉన్న ముదిరాజ్ కుటుంబాలకు మెపా అండగా నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెపా ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు భూమ నరేష్ ముదిరాజ్, చొప్పరి రాజేందర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మెపా నేత దేవేందర్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మెపా నేత దేవేందర్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం రాజపల్లె గ్రామానికి చెందిన మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్ తండ్రి పొన్నం సారయ్య ముదిరాజ్ గుండెపోటు మరణించగా మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు ముదిరాజ్, ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్,చిరుత వెంకటేశ్వర్లు ముదిరాజ్ లతో పాటు
వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ, ఉపాధ్యక్షులు పోలుదాసరి రాము, సొక్కం వెంకన్న,పిట్టల కుమార్, పెండ్యాల సదానందం ముదిరాజ్
హన్మకొండ జిల్లా అధ్యక్షులు పులి రాజేష్, ఉపాధ్యక్షులు గోనెల విజేందర్,మట్టపల్లి సాంబయ్య, యువత అధ్యక్షులు గోనెల సాగర్,8వ డివిజన్ ప్రధాన కార్యదర్శి పులి మహేష్ ముదిరాజ్,ములుగు జిల్లా అధ్యక్షులు అచ్చునూరి కిషన్,ప్రధాన కార్యదర్శి కుక్కల నాగరాజు,ఉపాధ్యక్షులు భామ నరేష్,రాజేందర్ లతో పాటు కుటుంబ సభ్యులు పొన్నం రాజు గీత,పొన్నం కృష్ణ అనురాధ,రాజు అనిత,కట్ల విజయ్,పొన్నం కుమారస్వామి,బుస నర్సయ్య, రేగుల భాను,హంస ప్రతాప్, రాసమల్ల రాజేందర్,అనిల్ పాల్గొన్నారు.

సునిల్ కుమార్ గౌడ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సహాయం…

సునిల్ కుమార్ గౌడ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సహాయం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం నాగుర్లపల్లి గ్రామానికి చెందిన మచ్చిక సునిల్ కుమార్ గౌడ్ గత నెల 26 న గుండెపోటుతో మరణించారు.తను పని చేసిన సిద్దార్థ డిగ్రీ కళాశాలకు చెందిన తోటి అధ్యాపకులు మేరుగు శ్రీధర్ గౌడ్,ఏ.ఓ పరమేష్ ఆధ్వర్యంలో ,10 వ తరగతి స్నేహితులు కలిసి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం మంగళవారం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గౌడ జన పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మచ్చిక రాజు గౌడ్,గుంటి అశోక్,ప్రభాకర్ రెడ్డి, కోమాండ్ల రఘు, బండారి శ్రీనివాస్, సహాదేవ్, దండెం రవీందర్, రాజు కుమార్,వాళ్ళల రమేష్, అనిల్,మచ్చిక లక్ష్మణ్ గౌడ్, సమ్మయ్య గౌడ్, ఊడ్గుల సాంబయ్య గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్,గాదెగోని లింగయ్య గౌడ్, ఆనంద్ గౌడ్, గండు రమేష్ గౌడ్, సుదీర్ గౌడ్, రవితేజ గౌడ్,సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి…

గుండెపోటుతో ఆంధ్రప్రభ రిపోర్టర్ మృతి

•భౌతికకాయానికి నివాళిలు అర్పించిన భీంభరత్
* రాములు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

షాబాద్ మండలం తిర్మలపూర్ గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ రిపోర్టర్ రాములు శనివారం ఉదయం అకాల మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రాములు స్వగ్రామానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, తమిల్లి రవీందర్ షాబాద్ సర్పంచ్, షాబాద్ ఎంపీటీసీ అశోక్, తొంట వెంకటయ్య , మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుమలపురం శ్రీరామ్ రెడ్డి, బందయ్య దోస్వాడ సర్పంచ్ రాములు, తాళ్లపల్లి సర్పంచ్ పెంటయ్య, మద్దూరు మల్లేష్ సర్పంచ్, తదితరులు రిపోర్టర్ రాములు భౌతికకాయానికి నివాళిలు అర్పించారు.

ఆర్టీసీ డ్రైవర్ మొగిలికి దొమ్మటి సాంబయ్య నివాళులు

మొగిలి పార్థివదేహానికి నివాళులు అర్పించిన మాజీ టిపిసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి

 

పరకాల,నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మడికొండ మొగిలి గుండెపోటుతో అకాల మరణం చెందగా టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య గురువారం మడికొండ మొగిలి పార్దివదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.ఈ పరామర్శలో పిఎసిఎస్ మాజీ ఛైర్మెన్ బొజ్జం రమేష్,టీపీసీసీ ఎస్సిసెల్ కమిటీ వైస్ చైర్మన్ డాక్టర్.మడికొండ శ్రీను, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్,సమన్వయ కమిటీ సభ్యులు చిన్నాల గోనాథ్,మడికొండ సంపత్ కుమార్,బిసి సంఘం నాయకుడు అముదాలపల్లి మల్లేశం గౌడ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పుల్యాల గాంధీ,మండల ఎస్సిసెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,పట్టణ నాయకులు పాడి వివేక్ రెడ్డి,బొచ్చు భాస్కర్,బొచ్చు జితేందర్,బొచ్చు రవి,ఒంటెరు వరుణ్,బొచ్చు అనంత్,బొచ్చు రవి కుమార్,లాదేళ్ల బిక్షపతి,మడికొండ రాజు తదితరులు ఉన్నారు.

హజ్ శ్రీ ముహమ్మద్ షౌకత్ అలీ వేలాది మంది శోకసంద్రాల మధ్య అంత్యక్రియలు…

హజ్ శ్రీ ముహమ్మద్ షౌకత్ అలీ వేలాది మంది శోకసంద్రాల మధ్య అంత్యక్రియలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ మండలనికి చెందిన ప్రముఖ వ్యక్తి, వీడ్కోలు తబ్లిఘ్, దగ్వాల్ నివాసి, జహీరాబాద్‌లోని A to Z స్టీల్ యజమాని, 50 ఏళ్ల హజ్ ముహమ్మద్ షౌకత్ అలీ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. మృతుడి కుమారుడు హఫీజ్ ముహమ్మద్ అబూ బకర్ బిలాలి ఇషా ప్రార్థన తర్వాత జామియా మసీదు దగ్వాల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. దగ్వాల్ గ్రామంలోని పూర్వీకుల స్మశానవాటికలో ఖననం జరిగింది. అతని భార్యతో పాటు, వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. పండితులతో పాటు, అన్ని మతాలకు చెందిన వేలాది మంది మృతుడి అంత్యక్రియల ఊరేగింపులో పాల్గొన్నారు.

జహీరాబాద్ లో తరగతి గదిలోనే ఉపాధ్యాయురాలి మృతి

జహీరాబాద్ లో తరగతి గదిలోనే ఉపాధ్యాయురాలి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో బుధవారం ఉదయం ఎంపీ యుపీఏస్ పాఠశాల తరగతి గదిలో బి. సుజాత అనే ఉపాధ్యాయురాలు గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. విద్యాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు సుజాత టీచర్ కోహీర్ మండలం పైడిగుమ్మల్ గ్రామానికి చెందినవారు. ఈ సంఘటనతో పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ కన్నుమూత…

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ కన్నుమూత

 

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ బెంగళూరులో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో…

సీనియర్‌ జర్నలిస్ట్‌ టీజేఎస్‌ జార్జ్‌ బెంగళూరులో శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న జార్జ్‌(97) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బెంగళూరులో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన కుమార్తె శిబా తెలిపారు. 1938, మే 7న కేరళలో జన్మించిన జార్జ్‌.. 1950లో ప్రీ ప్రెస్‌ జర్నల్‌ ద్వారా బొంబాయిలో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించారు. సుదీర్ఘకాలం ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌సలో కొనసాగారు. సుమారు రెండున్నర దశాబ్దాలపాటు ‘పాయింట్‌ ఆఫ్‌ వ్యూ’ పేరిట కాలమ్స్‌ రాశారు. 2007లో కన్నడ రాజ్యోత్సవ పురస్కారం, 2011లో పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు.

గుండెపోటుతో వ్యక్తి మృతి…

గుండెపోటుతో వ్యక్తి మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గుండెపోటుతో శనివారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కమ్మరి మహేందర్ (45) గ్రామంలో కార్పెంటర్ (వడ్రంగి) కులవృత్తి పనిచేస్తుంటాడు. అయితే గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. శనివారం పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-19T143955.810.wav?_=2

గుండెపోటుతో పంచాయతీ కార్యదర్శి మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ (బి) గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. స్వగ్రామం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాంతానికి చెందిన ఆయన, నిర్వర్తిస్తున్నారు. ఈనెల 162 తేదీన ఆరోగ్య సమస్యలు ఉన్నందున సెలవు ఇవ్వాలని ఎం.పీ.డీ.వోను కోరగా, ఆ సెలవు తిరస్కరించారని మృతుని భార్య ఆరోపించారు. అంతేకాక, గత ఎం.పీ.వో.తో పాటు ప్రస్తుత ఎం.పీ.వో కూడా తన భర్తను మానసికంగా వేధించారని ఆమె తెలిపారు. వీరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంప్రసాద్కు ఒక చిన్న పాప ఉంది.

18 ఏళ్లు దాటాయా? అయితే..

18 ఏళ్లు దాటాయా? అయితే..

ఇటీవల 30 ఏళ్లలోపు యువతలోనూ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఆడుతూ, జిమ్, డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోతున్నారు. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, సిగరెట్, మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం కూడా గుండెపోటు మరణాలకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version