దోస్త్ మేరా దోస్త్ అని నిరూపించుకున్న స్నేహితులు

దోస్త్ మేరా దోస్త్ అని నిరూపించుకున్న స్నేహితులు

గణపురం నేటి ధాత్రి : 

 

గణపురం మండల కేంద్రంలో ఇటీవల కాలంలో పసునూటి వెంకటేష్ గుండెపోటుతో అకాల మరణంచెందడం తన స్నేహితులు వెంకటేష్ మరణాన్ని ప్రతి క్షణం వెంకటేష్ ఉన్నాడని భావించి వెంకటేష్ తమ వెంటే ఉన్నాడని తెలియజేయడంలో ముందడుగులో ఉన్నారు దానికి వెంకటేష్ దశ దినకర్మ నిర్వహించడం వారి యొక్క వెంకటేష్ పట్ల ఉన్న ప్రేమ స్నేహానికి ఇచ్చే గౌరవం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే పసునూటి వెంకటేష్ భౌతికంగా తమతో లేకున్నా ప్రతి విషయంలో మాకు తోడునీడగా ఉంటాడని భావించి వారు వెంకటేశు దశదినకర్మను నిర్వహించిన ఆటపాటలు, దశదిన కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమా లు వారి స్నేహాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం ఇలాంటి స్నేహితులను దక్కించుకోవడంవెంకటేష్ ఏ లోకంలో ఉన్న ఆత్మకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఈరోజు నిర్వహించిన దశదిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వెంకటేష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

గుండెపోటుతో బిల్ కలెక్టర్ ఇటీవల మరణం.

గుండెపోటుతో బిల్ కలెక్టర్ ఇటీవల మరణం
కుటుంబాన్ని పరామర్శించిన జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు
జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ గత అయిదు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన పులాల కుమార్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర రావు, కుమార్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కుమార్ చనిపోవటం చాలా బాధాకరం అని తెలిపారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, BRS నాయకులు బోగం వెంకటేష్ మరియు నాయకులు ఉన్నారు

ముహమ్మద్ సజ్జాద్ పటేల్ గుండెపోటుతో కన్నుమూశారు.

ముహమ్మద్ సజ్జాద్ పటేల్ గుండెపోటుతో కన్నుమూశారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహీర్, మండల్ కు చెందిన ప్రముఖ మరియు సుప్రసిద్ధ వ్యక్తి, ముహమ్మద్ సజ్జాద్ పటేల్ చిష్తి, మోహి ఖాద్రీ రిజ్వానీ అహ్మదీ యూసుఫీ,అల్-నైబీ అల్-మిర్జా కలందరీ,సజ్జాదా నషిన్ అస్తానా,ప్రస్తుతం జహీరాబాద్ లో నివసిస్తున్న గురుజువాడ నివాసి అహ్మద్ హుస్సేన్ గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించారు గురుజువాడ లో సాయంత్రం మగ్రిబ్ ప్రార్థన తర్వాత మృతుడి అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయి.పూర్వీకుల స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ప్రాణాలతో బయటపడిన వారిలో అతని భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు.

గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపిడిఓ మృతి.

గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపిడిఓ మృతి

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

మండలంలో ఎంపిడిఓ గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ హుస్సేన్ శనివారం రోజున గుండెపోటుతో మృతి చెందారు.ఎంపిడిఓ హుస్సేన్ స్వగ్రామం హన్మకొండ జిల్లా పరకాల పట్టణం కాగా గత సంవత్సరంలో ప్రమోషన్ తో మొగుళ్లపల్లి మండలానికి ఎంపిడిఓ గా బాధ్యతలు చేపట్టి మండల అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి మండల ప్రజల్లో అభిమానం చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో టైపిస్ట్ గా బాధ్యతలు చేపట్టి వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ. ఎంపిడిఓ గా మండలంలో పనిచేస్తున్న హుస్సేన్ నెల రోజుల్లో పదవి విరమణ పొందనున్నారు. గత మూడు రోజులుగా ఆరోగ్యం సరిగా లేదని ఆఫీస్ లో సెలవు తీసుకొని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో హటాత్తుగా గుండెపోటు రావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంపిడిఓ హుస్సేన్ మృతితో మొగుళ్లపల్లి ఎంపిడిఓ కార్యాలయం మూగబోయింది ఎంపిడిఓ హుస్సేన్ మరణవార్తతో మండలంలోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు సానుభూతి వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version