ఉప్పరి సాయి కృష్ణను అభినందించిన మాజీ టీపీసీసీ అధ్యక్షులు దొమ్మటి
పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మండల పరిధిలోని మలకపేట గ్రామానికి చెందిన ఉప్పరి రవీందర్ మమత దంపతుల కుమారుడు ఉప్పరి సాయికృష్ణ ఎంబిబిఎస్ ప్రతిమ వైద్య కళాశాలలో సీటు వచ్చిన సందర్భంగా గురువారం రోజున ఉప్పరి సాయికృష్ణను మాజీ టీపీసీసీ ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా దొమ్మటి సాంబయ్య మాట్లాడుతూ ఒక పేద కుటుంబంలో పుట్టి ఉన్నంత చదువు చదివి సీటు సంపాదించదం అభినందనియామని గ్రామ యవత చదువులో ముందుండి మిగతా గ్రామాల యువతకు ఆదర్శవంతంగా ఉండాలని తల్లిదండ్రుల పేరును మరియు గ్రామ పేరును నిలబెట్టే విధంగా యువత తయారు అవ్వాలని,ఎంబిబిఎస్ సీటు సాధించిన సాయి కృష్ణ మరింత మంది యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట గ్రామస్తులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
