సిపిఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్

సిపిఐ హనుమకొండ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్

పరకాల నేటిధాత్రి:

 

ఈ నెల 26,27 న హసన్ పర్తిలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ హనుమకొండ జిల్లా మహాసభలలో భాగంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా లంక దాసరి అశోక్ ను ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావుకి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్ర బిక్షపతికి అశోక్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సహకరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ,పరకాల కార్మికులకు పక్షాన నియోజకవర్గంలో ఉన్న చర్లపల్లి,పోచారం తదితరుల గ్రామాలలో కార్మికులు సంఘాలకు నాయకత్వం వహించి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని మున్సిపాలిటీ భవన నిర్మాణం,హమాలీ బజార్,అమాలి ఐకెపిఆర్ లకోసం నా వంతు పనిచేస్తానని నాపై నమ్మకంతో ఈ పదవిని నాకు అప్పగించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు.

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ .!

బిజెపిలో చేరిన చీర్యాల గ్రామం మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్

కీసర నేటి దాత్రి :

 

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

కీసర మండల చీర్యాల గ్రామ మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో బండారు నరసింహ యాదవ్, గూడ నరేష్ గౌడ్, సాయికుమార్ గౌడ్, తదితరులు బిజెపిలో చేరారు వారిని ఈటల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ యొక్క కార్యక్రమము బిజెపి కీసర మండల అధ్యక్షులు కోళ్ల బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, పట్లోళ్ల విక్రం రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఉగ్రవాదుల దాడి అమానుషం.

ఉగ్రవాదుల దాడి అమానుషం

సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గంలో సామాన్యులపై ఉగ్రదాడిని ఖండిస్తున్నామని, ఈ సంఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరిపి ఉగ్ర మూకలను కఠినంగా శిక్షించాలని సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్ చేశారు.నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో జాతీయ అవార్డు గ్రహీత గోకా రామస్వామి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో డాక్టర్ పరికిపండ్ల అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, స్థానికులు జెండాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెజ్జం ప్రభాకర్, భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడేపూ రాజేంద్రప్రసాద్, వారణాసి మోహన్, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ,శుభ లతోపాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 26న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని గణపురం ఎస్సై ఆర్ అశోక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని గాంధీనగర్,మైలారం గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 15 లోపు గూగుల్ ఫామ్,క్యూఆర్ కోడ్ ద్వారా పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు. ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని ఎస్సై ఆర్ అశోక్ తెలిపారు._

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version