కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు…

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు

కరీంనగర్, నేటిధాత్రి:

డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకులు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ సోమవారం మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు డిసిసి కార్యాలయంలో దరఖాస్తు అందజేశారు. డిసిసి పిఆర్ఓలు దొంతి గోపి, న్యాత శ్రీనివాస్ కు దరఖాస్తు అందజేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 1981 నుంచి కాంగ్రెస్ పార్టీలో వెలిచాల రాజేందర్ రావు ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి యూత్ కాంగ్రెస్ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. అదేవిధంగా రాజేందర్ రావ్ గుండి గోపాలరావుపేట సింగిల్ విండో చైర్మన్ గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ చాంబర్ ఆఫ్ మార్కెట్ కమిటీ అసోసియేషన్ చైర్మన్ గా, నెడ్ క్యాప్ గా డైరెక్టర్ పనిచేశారని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా రాజేందర్రావు పోటీ చేశారనీ, ఎన్నికల్లో మూడు లక్షల అరవై వేల ఓట్లు సాధించారని తెలిపారు. అతికొద్ది సమయంలోనే భారీ ఓట్లను సాధించి రికార్డు సృష్టించారని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు రాజేందర్ రావు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారనీ, నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత జగపతిరావు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత అనీ, వారి తనయుడు జగపతిరావు అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తూనే, కరీంనగర్ ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. అదేవిధంగా రాజేంద్ర రావు తల్లిదండ్రులు జగపతిరావు సరళాదేవి పేరిట సరల్ జగ్ అనే ట్రస్టును ఏర్పాటుచేసి పేద ప్రజలకు సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. నీతిగా నిజాయితీగా సౌమ్యుడిగా వ్యవహరిస్తున్న వెలిచాల రాజేందర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. రాజేందర్రావు డిసిసి అధ్యక్ష పదవికి అన్ని విధాల అర్హుడు అనీ, సమర్థుడని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈవిషయాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని డిసిసి అధ్యక్షుడిగా రాజేందర్ రావును నియమించాలని అధిష్టానాన్ని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్, ఆకుల నరసన్న, డిసిసి ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్, గండి రాజేశ్వర్, ఉప్పరి రవి, శ్రావణ్ నాయక్, జువ్వాడి మారుతి రావు, బాషవేణి మల్లేశం పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట అక్టోబర్ 8 నేటిధాత్రి (మెదక్)

Vaibhavalaxmi Shopping Mall

అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ.
రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏ క గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా చిర్ర సత్యనారాయణ, కోశాధికారిగా కట్ట ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా రాగి లింగం, సహాయ కార్యదర్శులుగా రామారపు యాదగిరి, కుస్టీ నారాయణ, ముఖ్య సలహాదారులుగా పాతూరి రమేష్ గౌడ్, ఉడెం దేవరాజు, మర్కు నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులకు అన్ని విధాలుగా తన వంతు ఎల్లప్పుడు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు.

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని డోకా మాటలు చెప్పింది కేసీఆర్
తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
తెలంగాణలో ఒక్క డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను డోఖ చేశారు
10సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా డోకా చేసింది కెసిఆర్
తెలంగాణ ఇస్తే ఇలాంటి అధికార అనుభవించకుండా చేసింది రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల చేసిన ఘనత మీది కెసిఆర్ అమరుల కుటుంబాలను ఉద్యమ కళాకారులను డోకా చేసింది మీరు
మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసింది మీరు
బీసీ రిజర్వేషన్లను 34% నుండి 23% దానికి పడగొట్టింది మీరు ధరణి పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి భూములను ఆక్రమణకు గురి చేశారు
యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని డోకా చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని, రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా రేపాక రాజేందర్ మాట్లాడారు
ఈ కార్యక్రమంలో గణపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బరిలో జట్గొండ మారుతి

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బరిలో జట్గొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్వి న్యాల్కల్ మండల్ మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ లో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ గత ఎన్నికల్లో మల్గి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అని అన్నారు అలాగే ఇప్పుడు న్యాల్కల్ మండల్ జడ్పిటిసి స్థానం బీసీ జనరల్ కేటాయించడంతో అధిష్టానం నాకు టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు,

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్…

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండలం కాల్వపల్లీ గ్రామానికి చెందిన పంచికా మహేష్ యాదవ్ నీ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ లు తెలిపారు, పంచిక మహేష్ యాదవ్ యాదవ జాతిని పటిష్టత కోసం నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణ గల యాదవ బిడ్డగా భూపాలపల్లి జిల్లా యాదవుల కోసం వారి సమస్యల కోసం ఎనలేని పోరాటాలు చేస్తారని యాదవుల కమ్యూనిటీ కోసం బలోపేతం చేస్తారని నమ్మకంతోని ఇవ్వడం జరిగింది పంచీక మహేష్ యాదవ్ నీ ఎన్నుకునట్లు తెలిపారు.

నూతనంగా ఎన్నకైన మహేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ జాతి కోసం సిద్దాంతము పునరంకితం అయి నితి నిజాయితీ క్రమశిక్షణ చిథశుద్దితో పని చేస్తానని యాదవుల సామాజిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యలపై ఎనలేని పోరాటము చేస్తానని యాదవులను సంస్థాగతంగా పటిష్ఠ పరుస్తనను అదేవిధంగా నాకు సహకరించిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములన్నకు మరియు రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర అన్నకు అలాగే రాష్ట్ర నాయకులు అందరికి ఇతర జిల్లా మండల నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా దొంగల రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఅన్నారు,

ఆశాస్త్రీయంగా వార్డుల విభజన..

ఆశాస్త్రీయంగా వార్డుల విభజన
అధికార పార్టీకి లాభం చేకూర్చే విధంగా అధికారుల పనితీరు
భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

 

వర్దన్నపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం వార్డుల విభజన ఆశాస్త్రీయంగా చేపట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అడ్డదారిన గెలవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలలుగా ఓటర్ లిస్ట్ సవరణ పేరుతో ఎన్నోసార్లు అధికారులు మీటింగులు పెట్టి సవరణలు చేస్తున్నామని చెప్పి అటువంటి ఏమి చేపట్టకుండా మళ్లీ పార్లమెంటు ఎలక్షన్లో ఉన్న అటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా వార్డుల విభజన చేయడం విడ్డూరంగా ఉంది అని అన్నారు.

 

గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వారిని సైతం ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించకుండా మరియు ఒకే వ్యక్తికి ఒకే వార్డులో రెండు ఓట్లు ఉన్నా కూడా వాటిని కూడా సవరణలు చేయకుండా లిస్టులు విడుదల చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తప్పులను సరిదిద్దుకొని వార్డులను శాస్త్రీయ పద్ధతిలో విభజన చేయాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్. మడత రాజేష్. గోరు కంటి అనిల్ పాల్గొన్నారు.

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్…

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయంలో ఈనెల 27న గణపతి నవరాత్రి ఉత్సవములను నిర్వహించేందుకు నిర్వాహక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. శ్రీ సాంబమూర్తి దేవాలయ ప్రధాన అర్చకులు భైరవభట్ల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో. గ్రామస్తుల సమక్షంలో గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షనిగా క్యాతరాజు రమేష్, ఎన్నికయ్యారు. అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మాట్లాడుతూ. గణపతి నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని అందుకు కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తుల సహకారంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని క్యాతరాజు రమేష్ అన్నారు. ఉపాధ్యక్షులుగాదేవునూరి కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్దండి ప్రకాష్, కోశాధికారిగా బత్తిని రాజు, సహాయ కార్యదర్శిగాఎర్రబాటి మహేందర్, అన్నారపు కుమార్, కార్యవర్గ సభ్యులుగా వీణవంక నవీన్,క్యాతారాజు రజనీకాంత్, సూర్నేని మణికర్, గుడిమల్ల రమేష్, తంగళ్ళపల్లి వీరబ్రహ్మం, వీణవంక ప్రసాద్, కటుకూరి శ్రీధర్, దేవునూరి అశోక్, చాట్ల రాజు, పుట్ట అజయ్, హరీష్ లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఎన్నిక.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-70.wav?_=1

గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఎన్నిక.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలోని గణేష్ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల నూతన కమిటీని స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు తాటి పెళ్లి శ్రీనివాస్ తెలిపారు. ఉత్సవాల కమిటీ అధ్యక్షుడిగా వల్లాల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా క్యాతరాజు మల్లేష్, మేడిపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మైదం శ్రీకాంత్, సహాయ కార్యదర్శిగా ఉయ్యాల రమేష్, కోశాధికారిగా చిలగాని నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా ఓదెల శ్రీహరి, ఈగ కోటేశ్వర్, మహమ్మద్ అక్బర్, మామిడి శెట్టి తిరుపతి, చింతకింది దశరథం, భీమారం ప్రమీల, పట్టేం రాజు, మహమ్మద్ వలి, పోతుగంటి సంతోష్ లను ఎన్నుకున్నట్లు ఆయన వివరించారు.

మహాదేవపూర్ బీజేపీ మండల కొత్త కార్యవర్గం ప్రకటింపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T133102.779.wav?_=2

బీజేపీ మహాదేవపూర్ మండల నూతన కార్యవర్గo ఎన్నిక

మహాదేవపూర్ ఆగష్టు21 నేటి దాత్రి

ఈ రోజు కాటారం మండల్ కేంద్రం లో నిర్వహించిన ఐదు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిలు గా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డిచల్ల నారాయణ రెడ్డి విచ్చేసి, ఈ రోజు మహాదేవపూర్ మండల్ బీజేపీ నూతన కార్యవర్గని ప్రకటించారు.
మండల అధ్యక్షులు గా: రాంశెట్టి మనోజ్ కుమార్,
ఉపాధ్యక్షులు,అంకరి రాజేందర్, సూరం మహేష్, శనిగరం కిష్టయ్య, ఆకుల మధుకర్,
మండల ప్రధాన కార్యదర్శులుగుజ్జుల శంకర్,బొల్లం కిషన్,లింగంపల్లి వంశీ,
బల్ల శ్రావణ్ కుమార్ ,
కార్యదర్శులుబంధుగుల సంతోష్, గోరె శ్రీకాంత్, M,R యాదవ్,, శ్యామల ప్రశాంత్
కోశాధికారిగాఉదారి పూర్ణచందర్,
కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు ఓడేటి బాలిరెడ్డి,
ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు సాగర్ల రవీందర్,
SC మోర్చ మండల అధ్యక్షులు బూడే శేఖర్,
ST మోర్చ మండల అధ్యక్షులు దుగ్యాల రాము,
లను నియమించడం జరిగింది, అనంతరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుకర్రె సంజీవ రెడ్డి మాట్లాడుతూ నూతన కార్యవర్గనికి శుభాకాంక్షలు తెలుపి, ప్రతీ ఒక్కరు కూడా బీజేపీ బలోపేతానికి కృషి చెయ్యాలని, అలాగే ప్రధానమంత్రి గౌ, శ్రీ నరేంద్ర మోడీప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే రానున్న స్థానిక,సంస్థల ఎన్నికలలో బీజేపీ కోసం ప్రతీ ఒక్కరు కష్టపడాలని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమం లో మహాదేవపూర్, మహాముత్తరాం, మలహార్ మండలాల అధ్యక్షులు,రాంశెట్టి మనోజ్ కుమార్, పూర్ణ చందర్ శ్రీకాంత్
దుర్గం తిరుపతి, బండం మల్లారెడ్డి,మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం నూతన….

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T121019.374.wav?_=3

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడిగా టీ.వీ నారాయణ, మరియు కేంద్ర బాల సాహిత్య పురస్కార గ్రహీత (NBT) అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్ ఆధ్వర్యంలో మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగినది. (మారసం) నూతన అధ్యక్షుడిగా గెంట్యాల భూమేష్, మహిళా అధ్యక్షురాలిగా డాక్టర్ కందేపి రాణి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా బూర దేవానందం, చిటికెన కిరణ్ కుమార్, ఉపాధ్యక్షురాలుగా జి. శ్రీమతి,అనిత చరణ్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఏలగొండ రవి, కార్య నిర్వహణ కార్యదర్శిగా జిందం అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శిగా అల్లే రమేష్, అంకారపు రవి, యువ కార్యదర్శిరాలుగా ఈడెపు సౌమ్య, మరియు మారసం సభ్యులుగా కామవరపు శ్రీనివాస్,దూడం గణేష్, పోకల సాయికుమార్,వంశీ, నర్సింములు,సౌమ్య సభ్యులు ఎన్నుకోవడం జరిగినది.

ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

 

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ని ఎన్నిక చేయడం జరిగింది.ఈ కమిటీ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు దుప్పటి మొగిలి మాదిగ ఆధ్వర్యంలో మండల ఇన్చార్జీలు చిలువేరు సంపత్ మాదిగ కో ఇన్చార్జి మేకల రవి మాదిగ ముఖ్య అతిథులుగా వచ్చి మాట్లాడడం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం వృద్ధులు వితంతువులు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్ పెరగాలని తేదీ 7 8 2025 రోజున హనుమకొండలో జరగబోవు సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మండల నూతన కమిటీ కన్వీనర్ గా సంగాల సుమన్ మాదిగ, కోకన్వీనర్ గా దుప్పటి ప్రవీణ్ మాదిగను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మొగిళి మాదిగ, సురేందర్ మాదిగ,రాజయ్య మాదిగ,దేవమని మాదిగ, సుమన్ మాదిగ,మోహన్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ ప్లవర్ అసోసియేషన్ కమిటీ

బాలాజీ ప్లవర్ అసోసియేషన్ కమిటీ నూతన కమిటీ ఎన్నిక
ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కమిటీ

నర్సంపేట టౌన్,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని పూల దుకాణాల బాలాజీ ఫ్లవర్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా నూతన కమిటీ సభ్యులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.నూతన కమిటీ అధ్యక్షుడు పర్ష శ్రీనివాస్ ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శి బానోత్ పంతుల్ నాయక్,కార్యదర్శి కోల వెంకటే శ్వర్లు,కోశాధికారి భయ్యా కర్ణాకర్,కమిటీ సభ్యులు పర్ష వెంకన్న, పుల్లయ్య,శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇంకెన్నాళ్లు ప్రజల కష్టాలు…

ఇంకెన్నాళ్లు ప్రజల కష్టాలు…

పాకాల యేటి పై హైలెవల్ బ్రిడ్జినిర్మాణం ఇంకెప్పుడు..?

ప్రాణాలు పోతున్న పట్టించుకోరా..?

ఎన్నికల హామీగానే మిగిలిపోయిన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం…

కట్టెబోయిన శ్రీనివాస్ సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-74.wav?_=4

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

మండల పరిధిలోని రాంపురం పరిసర ప్రాంతంలో గల పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పాలకులకు ఎన్నికల అప్పుడు హామీలకే పరిమితమైపోయిందని సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు కట్టే బోయిన శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం గార్ల మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ,ప్రాణాలు పోతున్న పట్టించుకునే నాథుడే లేడా అని అన్నారు.ప్రజల ఓట్ల మీద ఉన్న శ్రద్ద, ప్రజా సమస్యల పై ప్రజా ప్రతినిధులకు సోయి లేదా అని ఆయన ప్రశ్నించారు.ఇప్పటి నుండి నాలుగు నెలలపాటు ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్న, ప్రజలకు అనారోగ్య సమస్యలు ఏర్పడిన మండల కేంద్రానికి సకాలంలో వైద్యం కొరకు కానీ, విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.విద్యార్థులు తమ విద్యను అభ్యసించాలన్న, రైతాంగం తమ పంటలకు అవసరమయ్యే పరికరాలు మందులు తీసుకొని రావాలన్న చుట్టూ 30 నుండి 40 కిలోమీటర్లు తిరిగి మండల కేంద్రానికి రావలసిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దూరపు ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో పాకల యేటి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీద నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మండల కేంద్రంకు రావాలని అన్నారు.వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లాలన్న చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని,ఇంకా ఎన్నాల్లు ఈ ప్రాంత కష్టాలు? ప్రజల ఓట్లు దండుకోవడానికి వస్తున్న ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం ప్రజా సమస్య అయినటువంటి పాకాల ఏటిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోతున్నారని అన్నారు.ఇప్పటికైనా ఈ ప్రాంతం నుండి గెలిచిన ఎమ్మెల్యే,ఎంపీలు ప్రత్యేక శ్రద్ధచూపి హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట రూరల్ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ నూతన కమిటీని ఎంపిక చేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక చేసినట్లు తెలిపారు.బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడుగా గన్న రాజేష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్స్,మంచిక హరీష్,పెండ్యాల స్వామి,ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,అధికార ప్రతిధులుగా బుస శ్రీశైలం,దారావత్ మహేందర్,ఉపాధ్యక్షులు భాషబోయిన ప్రవీణ్,కర్దూరి హరీష్,కొంగర మురళీ,ఆల్లె రాజు,గజ్జి రాము,సహాయ కార్యదర్శులు జినుకల అఖిల్,పుట్ట అఖిల్,బయ్య నవీన్,చెరిపెల్లి రాజు,కోశాధికారి అజ్మీర నరేష్,కార్యవర్గ సభ్యులు చిలుక నరేందర్,దరావత్ రాజు,వాంకుడోతు అక్షయ్ కుమార్,
మోటం హరీష్,నునావత్ పవన్ కుమార్,భూక్య సుమన్ లు ఎన్నికైనట్లు ప్రకటించారు.మండలం లోని అన్ని గ్రామాల నుండి ఎన్నిక చేయడం జరిగిందని మండల పార్టి అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరములు,క్లస్టర్ ఇన్చార్జి మోటురి రవి,సీనియర్ నాయకులు బోల్లం బక్కయ్య,గడ్డం రాజు,బగ్గి రాజు,జై కిసాన్,బాణోత్ రవి,చిప్ప ప్రశాంత్,సమ్మెట రంగయ్య తదతరులు ఉన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన జిల్లా కమిటీ.!

 

భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక

మంచిర్యాల జులై19 నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం భారతీయ మజ్దూర్ సంఘ్ మాజీ జిల్లా అధ్యక్షులు లగిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా పాత కమిటీని రద్దుచేసి, జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి  భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కమిటీని ప్రకటించడం జరిగింది, భారతీయ మజ్దూర్ సంఘ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా కుంటాల శంకర్, జిల్లా కార్యదర్శిగా మద్దూరి రాజు యాదవ్, ఉపాధ్యక్షులుగా కిషన్ రెడ్డి, నీరటి సురేష్, సగ్గుర్తి ఆనందరావు, కోశాధికారి గగ్గూరి విశాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రత్నాకర్ మహానంద్, సహాయ కార్యదర్శుగా, శశి,కొండు రాజేందర్, శాంతం సంపత్, కార్యవర్గ సభ్యులు,కోరకాని తిరుపతి ,కళ,సహజ,లను ఎన్నుకోవడం జరిగింది, భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన జిల్లా అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ బి.ఎమ్.ఎస్. జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎంపిక చేసిన రాష్ట్ర కమిటీ సభ్యులకు మరియు జిల్లా కమిటీ సభ్యులకు, కృతజ్ఞతలు తెలుపుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారతీయ మజ్దూర్ సంఘము (బి.ఎమ్.ఎస్)ను బలోపేతం చేస్తూ కార్మిక హక్కుల సాధన కోసం నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి బి.ఎమ్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి కంది శ్రీనివాస్, జాతీయ నాయకులు మండ రవికాంత్, కన్స్ట్రక్షన్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, మరియు జైపూర్ పవర్ ప్లాంట్,దేవాపూర్ పవర్ ప్లాంట్,సింగరేణి బొగ్గుగని కాంటాక్ట్,భవన నిర్మాణ, సంఘటిత, అసంఘటిత కార్మికులకు,పాల్గొన్నారు.

యాదవ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో పూర్తిస్థాయి కమిటీ ఎన్నిక.

తంగళ్ళపల్లి మండల యాదవ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో పూర్తిస్థాయి కమిటీ ఎన్నిక…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం యాదవ సంఘం అధ్యక్షులు బండి దేవేందర్ యాదవ్. ప్రధాన కార్యదర్శి ముందటి తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో. మండలంలో పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో గౌరవ అధ్యక్షులుగా ఆత్మకు చంటి యాదవ్. ఉపాధ్యక్షులుగా మెడ కొక్కుల చరణ్ యాదవ్. కోశాధికారిగా మోతే మహేష్ యాదవ్. కార్యదర్శిగా చె న్నవనేని తిరుపతి యాదవ్. సహాయ కార్యదర్శులుగాబో ల్ల వేణి ఎల్లం. ప్రచార కార్యదర్శులుగా గుట్ల ఐలయ్య. దొంతుల ఆంజనేయులు. అరకుటి మహేష్. కొత్తపల్లి శ్రీనివాస్. వినవేని మల్లేశం. కార్యవర్గ సభ్యులుగా.. ఉడతల కుంటయ్య. దొంతుల ఆంజనేయులు చంద్రము. దొరగొ రాజేశం. త్యాగ దేవయ్య. జగ్గాని రాజేశం. తిరుపతిలు. ఏకగ్రీవంగా నీ ఎన్నుకున్నారని ఈ కార్యక్రమం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని యాదవ సంఘం కార్యాలయంలో మండల యాదవ సంఘం అధ్యక్షులు బండి దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన ప్రకటించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి ముందర తిరుపతి యాదవ్ మాట్లాడుతూ. యాదవ సంఘం బలోపేతానికి అభివృద్ధికి. నిరంతరం కృషి చేస్తామని పేర్కొంటూ యాదవులందరూ. ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు అనంతరం. తేదీ. 20వ . 07.2025. రోజున నూతన కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని. దీనికి మండలంలోని యాదవ కురుమ సోదరులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో మండల యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈనాటి ఈ బంధమేనాటిదో…

 

ఈనాటి ఈ బంధమేనాటిదో…

 

రాజ్యసభ సభ్యునిగా ఎంపిక అయిన సందర్భంగా తన చిరకాల, ప్రాణ మిత్రుడు రజనీకాంత్ ను కమల్ హాసన్ కలిశారు. ఈ సందర్భంగా రజనీ… కమల్ ను అభినందించారు.

 

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అంటే అందరికీ అభిమానమే. పార్టీలకు అతీతంగా ఆయన్ని ప్రేమించే వారు, అభిమానించేవారు, ఆరాధించేవారు, అనుసరించేవారు ఉంటారు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కూడా అందుకు అతీతమేమీ కాదు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. ఆ అనుబంధంతోనే రాజ్యసభ సభ్యునిగా ఎంపిక అయిన సందర్భంగా తన చిరకాల, ప్రాణ మిత్రుడు రజనీకాంత్ ను కమల్ హాసన్ కలిశారు. ఈ సందర్భంగా రజనీ… కమల్ ను అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 

రజనీకాంత్, కమల్ హాసన్ అనుబంధానికి ప్రధాన కారణం వీరిద్దరి గురువు కె. బాలచందర్ (K. Bala Chander). ఆయన తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగళ్’తో రజనీకాంత్ నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇదే సినిమా తెలుగులో ‘తూర్పు-పడమర’గా రీమేక్ అయ్యింది. అలా ఆ సినిమాతో మొదలైన బంధం 1985లో ‘గిరఫ్తార్’ వరకూ సాగింది. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కలిసి దాదాపు ఇరవై సినిమాల్లో నటిచారు. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి ‘అంతులేని కథ, ఎత్తుకు పై ఎత్తు, వయసు పిలిచింది, అందమైన అనుభవం, మూండ్రు ముడిచ్, అల్లావుద్దీన్ అద్భుతద్వీపం, పదనారు వయదినిలె, అవర్ గళ్’ వంటివి. అయితే తమిళనాడులోని ఓ థియేటర్ లో ఇద్దరు కలిసి నటించిన సినిమా విడుదలైన సందర్భంలో ఫ్యాన్స్ మధ్య ఏర్పడిన గొడవ చినికి చినికి గాలివానగా మారి, ఆ థియేటర్ కు నష్టం వాటిల్లింది. అభిమానులకు సర్ది చెప్పేకంటే… ఇద్దరూ కలిసి ఇకపై కలిసి నటించడం మానుకంటే మంచిదనే నిర్ణయానికి రజనీ, కమల్ వచ్చారు. అప్పటి నుండి కలిసి సినిమాలు చేయకపోయినా… ఒక సినిమాను మరొకరు ప్రశంసించడం, ఒకరి చర్యలను మరొకరు సమర్థించడం వస్తూ ఉంది.

 

కమల్ హాసన్ కంటే ముందే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ అనుకున్నారు. రజనీకాంత్ సైతం ఒకటి రెండు సార్లు అలాంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టి… ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. కానీ మడపతిప్పే అలవాటు లేని కమల్ హాసన్ తమిళ ప్రజలకు, తన అభిమానులకు మాట ఇచ్చినట్టుగానే ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీ పెట్టేశారు. ప్రజల నుండి కమల్ హాసన్ పార్టీకి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన గత ఎన్నికల్లో డీఎంకేకు మద్దత్తు పలికారు. దానికి ప్రతిగా ఆ పార్టీ కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. దీంతో తొలిసారి చట్టసభల్లోకి వెళ్ళబోతున్న కమల్ హాసన్… దానికంటే ముందు రజనీకాంత్ ను కలిసి, ఆయన శుభాశీస్సులను స్వీకరించారు. ఇద్దరు తమిళ సీనియర్ ఆర్టిస్టులు ఇలా కలుసుకోవడం ఇద్దరి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.

ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి.

ఎన్నికలలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

భూభారతి లోని లోపాలను వెంటనే సవరించాలి

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో విఫలం చెందిందని, తక్షణమే పూర్తిస్థాయిలో 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించుకోవాలని మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( ఐక్య)- ఎం సి పి ఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబురావు అన్నారు.ఆ పార్టీ పిలుపులో భాగంగా దుగ్గొండి మండల తహసిల్దార్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి పలు డిమాండ్లతో కూడిన మెమోరాండాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కుసుంబ బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంలోని లోపాలను తక్షణమే సవరించి పేద ప్రజలకు అండగా నిలవాలని, పెంచిన విద్యుత్ బస్ చార్జీలను తగ్గించాలని అంతేకాకుండా గ్రామాలలో కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.తద్వారా పేద బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా 6 గ్యారంటీలను అమలు సంపూర్ణంగా అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని, లేనియెడల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాఉద్యమాలను నిర్మిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నాగేల్లి కొమురయ్య, పేరబోయిన చేరాలు,మేరుగు సుధాకర్, ఐలోని, సురేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలు ఏవైనా ముదిరాజ్ లే పైచేయి సాధించాలి.

ఎన్నికలు ఏవైనా ముదిరాజ్ లే పైచేయి సాధించాలి.

స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే పోరాటం ఆగదు.

ముదిరాజులను బీసీ.డి నుండి ఏ మార్పించడమే లక్ష్యం

శాసన మండలి డిప్యూటీ స్పీకర్,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్

దుగ్గొండి మండలంలో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం

నర్సంపేట నేటిధాత్రి:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలైనా ముదిరాజ్ కులస్తులు ప్రజా ప్రతినిధులుగా పై చేయి సాధించాలని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ స్పీకర్,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామాల్లో గల వందన గార్డెన్ లో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు,శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేబోయిన అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ముదిరాజ్ కులస్తులను బీసీ.డీ నుండి బీసీ.ఏ లోకి మార్చడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని ఆనాటి దిగంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవో ద్వారా అమల్లోకి తీసుకచ్చామని ఐనప్పటికీ హైకోర్టులో వేసిన పిటిషన్ ద్వారా సాధించుకోలేకపోయామని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే ముదిరాజ్ కులస్తుల రిజర్వేషన్ కోసం పోరాటం మరోసారి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

గతంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల సర్వేతో పాటు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి కులగణన సర్వేలో కూడా
ముదిరాజ్ జాతి అత్యున్నత స్థాయిలో ఉన్నదని సర్వేలు చెప్పుతున్నాయని
బండ ప్రకాష్ వివరించారు.రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులు పటిష్టంగా ఉన్న ప్రజా ప్రతినిధులుగా ప్రాతినిధ్యం లేని పరిస్థితి నెలకొన్నదని రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉన్న ముదిరాజ్ బిడ్డలు ఏకమైతే అన్ని పంచాయితీలు మనవే అని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ ల సంఖ్యను పెంచుకోవడానికి ఏపార్టీ ఐనా ఐక్యతతో సీట్లు సాధించుకోవాలని తెలిపారు.రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వకున్న ముదిరాజ్ జెండాతో ప్రజా ప్రతినిధులుగా గెలువాలే అని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ పిలుపునిచ్చారు.
సర్పంచులు,జెడ్పీటీసీలు,ఎంపీటీసీ కోసం గెలిపించుకోవడం కోసం ప్రధాన బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీల నుండి సీట్లు సాధించుకోవాలన్నారు.మహిళా రిజర్వేషన్ ప్రకారం మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఎక్కువగా ఉన్నాయని ఈ నేపథ్యంలో ఆకాశాలను కల్పించుకోవాలని సూచించారు.పట్టణాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముదిరాజ్ బిడ్డలు పొటీచేయాలన్నారు.గతంలో 150 మత్స్య శాఖ సొసైటీలు ఉంటే తెలంగాణ వచ్చాక 6 వేల సొసైటీలను తీసుకువచ్చామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముదిరాజ్ కులస్తుల రిజర్వేషన్ అమలు కోసం ప్రధాన,ప్రతిపక్ష పార్టీలలో ఉన్న ముదిరాజ్ ప్రజా ప్రతినిధులతో హైదారాబాద్ లో సమావేశం పెట్టబోతున్నట్లు తేల్చిచెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఒక్క పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులు ముందుకొస్తున్నారని ఇదే తరహాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తుల ఐక్యతచాటాలని శాసనమండలి డిప్యూటీ స్పీకర్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ మాట్లాడుతూ ఐక్యతతో ఉంటే అన్ని హక్కులకు సాధించుకోవచ్చని తెలిపారు. కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు సాదించుకోవచ్చని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయితీ ఉంటే ముదిరాజ్ కులస్తులు ముదిరాజ్ సొసైటీలతో పటిష్టంగా ఉన్నారన్నారు.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ముదిరాజ్ కులస్తులు కీలకమని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు లభిస్తాయి.సీట్లు సాధించి ప్రజా ప్రతినిధులుగా ఎదగచ్చని తెలిపారు.

సామాజికంగా,ఆర్థికంగా ఎదగాలన్న సమిష్టిగా ఉండాలి.గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముదిరాజ్ లకు బీసీ డి నుండి బీసీ ఏ కు మార్చాలని ప్రత్యేక జీఓను ప్రస్తుత శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ తెప్పించారు.నేడు ఆయన వెంటే ఉంటూ హక్కులను సాధించుకోవాలని ముదిరాజ్ కులస్తులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు, వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గొనెల రవీందర్, వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోనెల పద్మ, జిల్లా మత్స్య శాఖ ప్రమోటర్ సోమయ్య, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు బుస మల్లేశం జిల్లా గౌరవాధ్యక్షుడు జిలుకల కొమ్మాలు, నీరటి సదానందం, గుంటిక సోమయ్య పోలు అమర్ చందు,గుండా రాకేష్, ముద్రపోయిన సుధాకర్,భీమ్ రాజ్, దుగ్గొండి మండల అధ్యక్షుడు పల్లె రమేష్, నూనె నర్సయ్య హంస విజయరామరాజు ముద్రబోయిన వెంకన్న రావుల రాజు తోట సాంబయ్య పిట్టల భాస్కర్ అన్నబోయిన లింగయ్య పంబాల కోటి కెవ్వు శివకాశి బోనాల భరత్, జిల్లా పరిధిలోని మాజీ జెడ్పిటిసిలు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్నికల భరోసాగా రైతు భరోసా.

ఎన్నికల భరోసాగా రైతు భరోసా.

విజయోత్సవాల పేరుతో గత సీజన్ రైతు భరోసా,వడ్లకు బోనస్ ఎగనామం..

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది ఫైర్..

నర్సంపేట నేటిధాత్రి:

గత సీజన్ లో రైతు భరోసా, అలాగే వడ్లకు ప్రకటించిన బోనస్ లను ఎగనామం పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి గత19 నెలల కాలంలో రైతులను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని పెద్ది డిమాండ్ చేశారు.ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 12 వేలకు పరిమితం చేయడం అలాగే గత వానకాలం,యాసంగిలో రైతు భరోసా ఎగ్గొట్టి ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపుకోవడం రైతులను మోసం చేయడం కాదా అని ప్రశ్నిస్తూ,రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నారంటూ ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో ఒక్క చెక్ డ్యాం కట్టలేదని ఆరోపించారు.2022 మే 6 న వరంగల్ లో జరిపిన రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ,సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ,ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రశ్నించారు.కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని అవేదన వ్యక్తం చేశారు.గత పదేండ్ల బిఆర్ఎస్ పాలన రైతు సంక్షేమ ప్రభుత్వమైతే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతు సంక్షోభ ప్రభుత్వంగా పెరుపొందుతున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version