ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా..

ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా

ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పరామర్శ

నిరాశ చెందొద్దు..ఓడిపోయిన.. విజేతలు మీరే..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

దుగ్గొండి నేటిధాత్రి:

 

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా
బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు భారత్ రాష్ట్ర సమితి పార్టీతో పాటు నేను అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ధైర్యం నింపేందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శ యాత్ర చేపట్టారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి, తొగర్రాయి,తిమ్మంపేట, మహమ్మదాపురం,మర్రిపల్లి ,వెంకటాపురం గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమిపాలవగా
ఆయా గ్రామాల అభ్యర్థులను పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ ఓటమి చెందిన అభ్యర్థులకు పార్టీలో భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
* ప్రజాసేవయే లక్ష్యం ఇదే పోరాట స్ఫూర్తితో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారని పిలుపునిచ్చారు.

అధికార దుర్వినియోగం అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, అధికారులు చాలా చోట్ల బిఆర్ఎస్ విజయాలను తారుమారు చేశారని మండిపడ్డారు.కొన్నిచోట్ల ఎన్నికల ఫలితాలపై కోర్టులో సవాల్ చేస్తామని, న్యాయపరంగా, చట్టబద్ధంగా పోరాడి గెలుస్తామని స్పష్టం చేశారు.పోలీసుల అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫలితాలను తారుమారు చేసినా కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరంలేదని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్నికలలో ఒకటి ముపాయలైన నిరాశ చెందకుండా ఉండాలని అయినా ఓటమి చెందిన మీరే విజేతలు అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధైర్యం చెప్పారు.
ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వర్ రావు,,మాజీ మార్కెట్ ఛైర్మెన్ పొన్నం మొగిలి,మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, బిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, సర్పంచ్ శంకేసు కమలాకర్,మండల సీనియర్ నాయకులు,క్లస్టర్ బాధ్యులు, సర్పంచ్ లు.ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు ,మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

నన్ను గెలిపించండి ఊరికి సేవ చేస్తా..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T140406.358.wav?_=1

 

నన్ను గెలిపించండి ఊరికి సేవ చేస్తా

నడికూడ,నేటిధాత్రి:

 

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నడికూడ మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వంగ మల్లికార్జున్ కి మద్దతుగా మరియు వార్డ్ మెంబెర్స్ మోత్కూరి లక్ష్మీ రమేష్,వంగ శరణ్య మల్లికార్జున్,కోట తిరుపతి, ఎరుకల రాజారెడ్డి,మందోటి విజయేందర్,చేకిలె జమున రవీందర్ లకు మద్దతుగా గ్రామంలో ఇంటింటికి విస్తృత ప్రచారంలో బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు,56వ డివిజన్ అధ్యక్షులు మహేందర్ పటేల్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ
గ్రామపంచాయతీల అభివృద్ధి కేవలం కేంద్ర నిధుల ద్వారానే సాధ్యమని అందుకే బిజెపి బలపరిచిన అభ్యర్థి వంగ మల్లికార్జున్ బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెంతల జగన్, ఎరుకల శ్రీనివాస్,ఆకుల రాజు,మందుటి మహేందర్, కోట మల్లయ్య,కోట రవి, శంకర్ లింగం,బిక్షపతి,అంజి, ఆకుల నవీన్,ఎల్లస్వామి, గొనె రాకేష్,గొనె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-02T152743.505.wav?_=2

 

బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ నూతన కమిటీ ఎన్నిక

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కొత్త గట్టుసింగారం గ్రామ బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ నూతన కమి టీ ఎన్నుకున్నారు. ఈ సంద ర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసిన గ్రామ శాఖ నూతన అధ్యక్షుడు ఆలేటి శ్రీనివాస్ వారితో పాటు మండల అధ్య క్షుడు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తిరుపతి రెడ్డి, సదా శివ రెడ్డి, ఆలేటి రాకేష్, కొత్తగట్టు సాయి, పెంబర్తి వినయ్, అఖిల్, సునీల్ తదితరులు కలిశారు.

ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.పంతులా…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-01T122024.059.wav?_=3

 

ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డి.పంతులా

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో శుక్రవారం సిఎంఓఎఐ జనరల్ బాడి మీటింగ్,జనరల్ మేనేజర్ అధ్యక్షతన జరిపించారు.ఈ సమావేశంలో లో జనరల్ సెక్రటరీ సంతోష్ ఇదివరకు జరిగిన కార్యక్రమాలను జరగబోయే కార్యక్రమాలను గురించి వివరించారు.తదుపరి జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) &(ఓ&ఎం) మదన్మోహన్ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్,జాయింట్ సెక్రటరీ పదవులకు నామినేషన్ కోరడమైనది.దీనికి అధికారుల సంఘం సభ్యులందరూ సిఎంఓఎఐ ఎస్టిపిపి బ్రాంచ్ ప్రెసిడెంట్ గా డి.పంతులా ని ఏకగ్రివంగా ఎన్నుకున్నారు.వైస్ ప్రెసిడెంట్ గా జనగామ శ్రీనివాస్ ని,జాయింట్ సెక్రటరీ గా శ్యామల ని ఎన్నుకోవడం జరిగింది.అనంతరం నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ ధారావత్ పంతులా మాట్లాడుతూ.. అధికారుల సంఘం సభ్యులకి ఎస్టిపిపి యాజమాన్యానికి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో అందరి సహాయ,సహకారాలతో సెంట్రల్ కమిటి సభ్యులతో,యాజమాన్యాన్ని సమన్వయ పరుస్తూ పెండింగ్ లో ఉన్న పనులను, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సాధించుకోవడానికి తనవంతు కృషి చేస్తానని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి ఎస్టీపీపీ ఈడి సిహెచ్.చిరంజీవి,జిఎం ఎస్టిపిపి ఎం.నరసింహారావు,జీఎం(పిసిఎస్) & (ఓ&ఎం)మదన్మోహన్,ఏజిఎం (ఫైనాన్స్)మురళీధర్,డిజిఎం (సివిల్) ఆజాజుల్లా ఖాన్,డీజీఎం(పర్సనల్),డి కిరణ్ బాబు,కార్యవర్గ సభ్యులు డి.పంతులా,సంతోష్ కుమార్,జనగామ శ్రీనివాస్,అప్పారావు,రమేష్,శ్యామల,మోబిన్ పాల్గొన్నారు.

అజంత యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T134337.657.wav?_=4

 

అజంత యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం
బస్వరాజుపల్లి గ్రామం లో అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది అందులో యూత్ అధ్యక్షుడు ఎన్నికైన మిట్టపెల్లి అరవింద్,ఉప అధ్యక్షుడి కుక్కముడి చిన్న కుమార్, ప్రధాన కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, కార్యదర్శి మట్టెవాడ హరీష్, కోశాధికారి కుక్కమూడి నవీన్, సలహాదారులు, సభ్యులు పాల్గొన్నడం జరిగింది. అరవిందు మాట్లాడుతూ ఈ అధ్యక్ష పదవిని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యూత్ ని ముందుకు తీసుకుపోయే విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తానని అరవింద్ అన్నారు

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు…

కరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం వెలిచాల రాజేందర్ రావు తరపున దరఖాస్తు

కరీంనగర్, నేటిధాత్రి:

డిసిసి అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఏఐసీసీ పరిశీలకులు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతూ సోమవారం మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు డిసిసి కార్యాలయంలో దరఖాస్తు అందజేశారు. డిసిసి పిఆర్ఓలు దొంతి గోపి, న్యాత శ్రీనివాస్ కు దరఖాస్తు అందజేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 1981 నుంచి కాంగ్రెస్ పార్టీలో వెలిచాల రాజేందర్ రావు ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి యూత్ కాంగ్రెస్ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, సంయుక్త కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. అదేవిధంగా రాజేందర్ రావ్ గుండి గోపాలరావుపేట సింగిల్ విండో చైర్మన్ గా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ చాంబర్ ఆఫ్ మార్కెట్ కమిటీ అసోసియేషన్ చైర్మన్ గా, నెడ్ క్యాప్ గా డైరెక్టర్ పనిచేశారని చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా రాజేందర్రావు పోటీ చేశారనీ, ఎన్నికల్లో మూడు లక్షల అరవై వేల ఓట్లు సాధించారని తెలిపారు. అతికొద్ది సమయంలోనే భారీ ఓట్లను సాధించి రికార్డు సృష్టించారని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు రాజేందర్ రావు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారనీ, నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ కాంగ్రెస్ నేత జగపతిరావు కరీంనగర్ అభివృద్ధి ప్రదాత అనీ, వారి తనయుడు జగపతిరావు అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తూనే, కరీంనగర్ ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. అదేవిధంగా రాజేంద్ర రావు తల్లిదండ్రులు జగపతిరావు సరళాదేవి పేరిట సరల్ జగ్ అనే ట్రస్టును ఏర్పాటుచేసి పేద ప్రజలకు సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. నీతిగా నిజాయితీగా సౌమ్యుడిగా వ్యవహరిస్తున్న వెలిచాల రాజేందర్ రావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. రాజేందర్రావు డిసిసి అధ్యక్ష పదవికి అన్ని విధాల అర్హుడు అనీ, సమర్థుడని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈవిషయాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని డిసిసి అధ్యక్షుడిగా రాజేందర్ రావును నియమించాలని అధిష్టానాన్ని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల ప్రకాష్, ఆకుల నరసన్న, డిసిసి ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకటేష్, గండి రాజేశ్వర్, ఉప్పరి రవి, శ్రావణ్ నాయక్, జువ్వాడి మారుతి రావు, బాషవేణి మల్లేశం పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..

రామాయంపేట అక్టోబర్ 8 నేటిధాత్రి (మెదక్)

Vaibhavalaxmi Shopping Mall

అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ.
రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏ క గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మద్దెల సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా చిర్ర సత్యనారాయణ, కోశాధికారిగా కట్ట ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా రాగి లింగం, సహాయ కార్యదర్శులుగా రామారపు యాదగిరి, కుస్టీ నారాయణ, ముఖ్య సలహాదారులుగా పాతూరి రమేష్ గౌడ్, ఉడెం దేవరాజు, మర్కు నగేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ్యులకు అన్ని విధాలుగా తన వంతు ఎల్లప్పుడు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా తన ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ పనిచేస్తుందని అన్నారు.

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్

గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని డోకా మాటలు చెప్పింది కేసీఆర్
తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని డోకా చేసింది టిఆర్ఎస్ పార్టీ
తెలంగాణలో ఒక్క డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను డోఖ చేశారు
10సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేకుండా డోకా చేసింది కెసిఆర్
తెలంగాణ ఇస్తే ఇలాంటి అధికార అనుభవించకుండా చేసింది రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి డోకా చేసింది కేసీఆర్
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల చేసిన ఘనత మీది కెసిఆర్ అమరుల కుటుంబాలను ఉద్యమ కళాకారులను డోకా చేసింది మీరు
మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసింది మీరు
బీసీ రిజర్వేషన్లను 34% నుండి 23% దానికి పడగొట్టింది మీరు ధరణి పేరుతో రైతులను ఇబ్బంది పెట్టి భూములను ఆక్రమణకు గురి చేశారు
యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని డోకా చేసిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని, రాబోయే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా రేపాక రాజేందర్ మాట్లాడారు
ఈ కార్యక్రమంలో గణపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బరిలో జట్గొండ మారుతి

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బరిలో జట్గొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్వి న్యాల్కల్ మండల్ మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ లో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ గత ఎన్నికల్లో మల్గి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అని అన్నారు అలాగే ఇప్పుడు న్యాల్కల్ మండల్ జడ్పిటిసి స్థానం బీసీ జనరల్ కేటాయించడంతో అధిష్టానం నాకు టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు,

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్…

యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా పంచిక మహేష్ యాదవ్.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండలం కాల్వపల్లీ గ్రామానికి చెందిన పంచికా మహేష్ యాదవ్ నీ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్ లు తెలిపారు, పంచిక మహేష్ యాదవ్ యాదవ జాతిని పటిష్టత కోసం నమ్మిన సిద్ధాంతం కోసం క్రమశిక్షణ గల యాదవ బిడ్డగా భూపాలపల్లి జిల్లా యాదవుల కోసం వారి సమస్యల కోసం ఎనలేని పోరాటాలు చేస్తారని యాదవుల కమ్యూనిటీ కోసం బలోపేతం చేస్తారని నమ్మకంతోని ఇవ్వడం జరిగింది పంచీక మహేష్ యాదవ్ నీ ఎన్నుకునట్లు తెలిపారు.

నూతనంగా ఎన్నకైన మహేష్ యాదవ్ మాట్లాడుతూ యాదవ జాతి కోసం సిద్దాంతము పునరంకితం అయి నితి నిజాయితీ క్రమశిక్షణ చిథశుద్దితో పని చేస్తానని యాదవుల సామాజిక వర్గం ఎదుర్కుంటున్న సమస్యలపై ఎనలేని పోరాటము చేస్తానని యాదవులను సంస్థాగతంగా పటిష్ఠ పరుస్తనను అదేవిధంగా నాకు సహకరించిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములన్నకు మరియు రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర అన్నకు అలాగే రాష్ట్ర నాయకులు అందరికి ఇతర జిల్లా మండల నాయకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి భూపాలపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా దొంగల రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందిఅన్నారు,

ఆశాస్త్రీయంగా వార్డుల విభజన..

ఆశాస్త్రీయంగా వార్డుల విభజన
అధికార పార్టీకి లాభం చేకూర్చే విధంగా అధికారుల పనితీరు
భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

 

వర్దన్నపేట స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం వార్డుల విభజన ఆశాస్త్రీయంగా చేపట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అడ్డదారిన గెలవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి ఆరోపించారు. గత ఆరు నెలలుగా ఓటర్ లిస్ట్ సవరణ పేరుతో ఎన్నోసార్లు అధికారులు మీటింగులు పెట్టి సవరణలు చేస్తున్నామని చెప్పి అటువంటి ఏమి చేపట్టకుండా మళ్లీ పార్లమెంటు ఎలక్షన్లో ఉన్న అటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా వార్డుల విభజన చేయడం విడ్డూరంగా ఉంది అని అన్నారు.

 

గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన వారిని సైతం ఓటర్ లిస్ట్ లో నుంచి తొలగించకుండా మరియు ఒకే వ్యక్తికి ఒకే వార్డులో రెండు ఓట్లు ఉన్నా కూడా వాటిని కూడా సవరణలు చేయకుండా లిస్టులు విడుదల చేయడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని తప్పులను సరిదిద్దుకొని వార్డులను శాస్త్రీయ పద్ధతిలో విభజన చేయాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి జడ సతీష్. మడత రాజేష్. గోరు కంటి అనిల్ పాల్గొన్నారు.

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్…

గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీ సాంబమూర్తి సామూహిక దేవాలయంలో ఈనెల 27న గణపతి నవరాత్రి ఉత్సవములను నిర్వహించేందుకు నిర్వాహక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. శ్రీ సాంబమూర్తి దేవాలయ ప్రధాన అర్చకులు భైరవభట్ల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో. గ్రామస్తుల సమక్షంలో గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షనిగా క్యాతరాజు రమేష్, ఎన్నికయ్యారు. అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మాట్లాడుతూ. గణపతి నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తుల సహకారంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు నిర్వహించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని అందుకు కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తుల సహకారంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని క్యాతరాజు రమేష్ అన్నారు. ఉపాధ్యక్షులుగాదేవునూరి కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్దండి ప్రకాష్, కోశాధికారిగా బత్తిని రాజు, సహాయ కార్యదర్శిగాఎర్రబాటి మహేందర్, అన్నారపు కుమార్, కార్యవర్గ సభ్యులుగా వీణవంక నవీన్,క్యాతారాజు రజనీకాంత్, సూర్నేని మణికర్, గుడిమల్ల రమేష్, తంగళ్ళపల్లి వీరబ్రహ్మం, వీణవంక ప్రసాద్, కటుకూరి శ్రీధర్, దేవునూరి అశోక్, చాట్ల రాజు, పుట్ట అజయ్, హరీష్ లను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు.

గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఎన్నిక.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-70.wav?_=5

గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఎన్నిక.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలోని గణేష్ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల నూతన కమిటీని స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు తాటి పెళ్లి శ్రీనివాస్ తెలిపారు. ఉత్సవాల కమిటీ అధ్యక్షుడిగా వల్లాల ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా క్యాతరాజు మల్లేష్, మేడిపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మైదం శ్రీకాంత్, సహాయ కార్యదర్శిగా ఉయ్యాల రమేష్, కోశాధికారిగా చిలగాని నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా ఓదెల శ్రీహరి, ఈగ కోటేశ్వర్, మహమ్మద్ అక్బర్, మామిడి శెట్టి తిరుపతి, చింతకింది దశరథం, భీమారం ప్రమీల, పట్టేం రాజు, మహమ్మద్ వలి, పోతుగంటి సంతోష్ లను ఎన్నుకున్నట్లు ఆయన వివరించారు.

మహాదేవపూర్ బీజేపీ మండల కొత్త కార్యవర్గం ప్రకటింపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T133102.779.wav?_=6

బీజేపీ మహాదేవపూర్ మండల నూతన కార్యవర్గo ఎన్నిక

మహాదేవపూర్ ఆగష్టు21 నేటి దాత్రి

ఈ రోజు కాటారం మండల్ కేంద్రం లో నిర్వహించిన ఐదు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిలు గా బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డిచల్ల నారాయణ రెడ్డి విచ్చేసి, ఈ రోజు మహాదేవపూర్ మండల్ బీజేపీ నూతన కార్యవర్గని ప్రకటించారు.
మండల అధ్యక్షులు గా: రాంశెట్టి మనోజ్ కుమార్,
ఉపాధ్యక్షులు,అంకరి రాజేందర్, సూరం మహేష్, శనిగరం కిష్టయ్య, ఆకుల మధుకర్,
మండల ప్రధాన కార్యదర్శులుగుజ్జుల శంకర్,బొల్లం కిషన్,లింగంపల్లి వంశీ,
బల్ల శ్రావణ్ కుమార్ ,
కార్యదర్శులుబంధుగుల సంతోష్, గోరె శ్రీకాంత్, M,R యాదవ్,, శ్యామల ప్రశాంత్
కోశాధికారిగాఉదారి పూర్ణచందర్,
కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు ఓడేటి బాలిరెడ్డి,
ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు సాగర్ల రవీందర్,
SC మోర్చ మండల అధ్యక్షులు బూడే శేఖర్,
ST మోర్చ మండల అధ్యక్షులు దుగ్యాల రాము,
లను నియమించడం జరిగింది, అనంతరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుకర్రె సంజీవ రెడ్డి మాట్లాడుతూ నూతన కార్యవర్గనికి శుభాకాంక్షలు తెలుపి, ప్రతీ ఒక్కరు కూడా బీజేపీ బలోపేతానికి కృషి చెయ్యాలని, అలాగే ప్రధానమంత్రి గౌ, శ్రీ నరేంద్ర మోడీప్రవేశపెట్టే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే రానున్న స్థానిక,సంస్థల ఎన్నికలలో బీజేపీ కోసం ప్రతీ ఒక్కరు కష్టపడాలని చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమం లో మహాదేవపూర్, మహాముత్తరాం, మలహార్ మండలాల అధ్యక్షులు,రాంశెట్టి మనోజ్ కుమార్, పూర్ణ చందర్ శ్రీకాంత్
దుర్గం తిరుపతి, బండం మల్లారెడ్డి,మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం నూతన….

సిరిసిల్ల మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-04T121019.374.wav?_=7

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడిగా టీ.వీ నారాయణ, మరియు కేంద్ర బాల సాహిత్య పురస్కార గ్రహీత (NBT) అధికారి డాక్టర్ పత్తిపాక మోహన్ ఆధ్వర్యంలో మానేరు రచయితల సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగినది. (మారసం) నూతన అధ్యక్షుడిగా గెంట్యాల భూమేష్, మహిళా అధ్యక్షురాలిగా డాక్టర్ కందేపి రాణి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా బూర దేవానందం, చిటికెన కిరణ్ కుమార్, ఉపాధ్యక్షురాలుగా జి. శ్రీమతి,అనిత చరణ్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఏలగొండ రవి, కార్య నిర్వహణ కార్యదర్శిగా జిందం అశోక్, ప్రధాన కార్యదర్శిగా ఆడెపు లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శిగా అల్లే రమేష్, అంకారపు రవి, యువ కార్యదర్శిరాలుగా ఈడెపు సౌమ్య, మరియు మారసం సభ్యులుగా కామవరపు శ్రీనివాస్,దూడం గణేష్, పోకల సాయికుమార్,వంశీ, నర్సింములు,సౌమ్య సభ్యులు ఎన్నుకోవడం జరిగినది.

ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

 

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ని ఎన్నిక చేయడం జరిగింది.ఈ కమిటీ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు దుప్పటి మొగిలి మాదిగ ఆధ్వర్యంలో మండల ఇన్చార్జీలు చిలువేరు సంపత్ మాదిగ కో ఇన్చార్జి మేకల రవి మాదిగ ముఖ్య అతిథులుగా వచ్చి మాట్లాడడం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం వృద్ధులు వితంతువులు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్ పెరగాలని తేదీ 7 8 2025 రోజున హనుమకొండలో జరగబోవు సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మండల నూతన కమిటీ కన్వీనర్ గా సంగాల సుమన్ మాదిగ, కోకన్వీనర్ గా దుప్పటి ప్రవీణ్ మాదిగను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మొగిళి మాదిగ, సురేందర్ మాదిగ,రాజయ్య మాదిగ,దేవమని మాదిగ, సుమన్ మాదిగ,మోహన్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ ప్లవర్ అసోసియేషన్ కమిటీ

బాలాజీ ప్లవర్ అసోసియేషన్ కమిటీ నూతన కమిటీ ఎన్నిక
ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిసిన కమిటీ

నర్సంపేట టౌన్,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని పూల దుకాణాల బాలాజీ ఫ్లవర్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా నూతన కమిటీ సభ్యులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.నూతన కమిటీ అధ్యక్షుడు పర్ష శ్రీనివాస్ ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శి బానోత్ పంతుల్ నాయక్,కార్యదర్శి కోల వెంకటే శ్వర్లు,కోశాధికారి భయ్యా కర్ణాకర్,కమిటీ సభ్యులు పర్ష వెంకన్న, పుల్లయ్య,శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇంకెన్నాళ్లు ప్రజల కష్టాలు…

ఇంకెన్నాళ్లు ప్రజల కష్టాలు…

పాకాల యేటి పై హైలెవల్ బ్రిడ్జినిర్మాణం ఇంకెప్పుడు..?

ప్రాణాలు పోతున్న పట్టించుకోరా..?

ఎన్నికల హామీగానే మిగిలిపోయిన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం…

కట్టెబోయిన శ్రీనివాస్ సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-74.wav?_=8

నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-

మండల పరిధిలోని రాంపురం పరిసర ప్రాంతంలో గల పాకాల ఏటిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పాలకులకు ఎన్నికల అప్పుడు హామీలకే పరిమితమైపోయిందని సిపిఐ రాష్ట్ర సమితి నాయకులు కట్టే బోయిన శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.బుధవారం గార్ల మండల కేంద్రంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ,ప్రాణాలు పోతున్న పట్టించుకునే నాథుడే లేడా అని అన్నారు.ప్రజల ఓట్ల మీద ఉన్న శ్రద్ద, ప్రజా సమస్యల పై ప్రజా ప్రతినిధులకు సోయి లేదా అని ఆయన ప్రశ్నించారు.ఇప్పటి నుండి నాలుగు నెలలపాటు ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్న, ప్రజలకు అనారోగ్య సమస్యలు ఏర్పడిన మండల కేంద్రానికి సకాలంలో వైద్యం కొరకు కానీ, విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.విద్యార్థులు తమ విద్యను అభ్యసించాలన్న, రైతాంగం తమ పంటలకు అవసరమయ్యే పరికరాలు మందులు తీసుకొని రావాలన్న చుట్టూ 30 నుండి 40 కిలోమీటర్లు తిరిగి మండల కేంద్రానికి రావలసిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దూరపు ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో పాకల యేటి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీద నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మండల కేంద్రంకు రావాలని అన్నారు.వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లాలన్న చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని,ఇంకా ఎన్నాల్లు ఈ ప్రాంత కష్టాలు? ప్రజల ఓట్లు దండుకోవడానికి వస్తున్న ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం ప్రజా సమస్య అయినటువంటి పాకాల ఏటిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోతున్నారని అన్నారు.ఇప్పటికైనా ఈ ప్రాంతం నుండి గెలిచిన ఎమ్మెల్యే,ఎంపీలు ప్రత్యేక శ్రద్ధచూపి హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక.

నర్సంపేట మండల బిఆర్ఎస్ యూత్ కమిటీ ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట రూరల్ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ నూతన కమిటీని ఎంపిక చేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక చేసినట్లు తెలిపారు.బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడుగా గన్న రాజేష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్స్,మంచిక హరీష్,పెండ్యాల స్వామి,ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,అధికార ప్రతిధులుగా బుస శ్రీశైలం,దారావత్ మహేందర్,ఉపాధ్యక్షులు భాషబోయిన ప్రవీణ్,కర్దూరి హరీష్,కొంగర మురళీ,ఆల్లె రాజు,గజ్జి రాము,సహాయ కార్యదర్శులు జినుకల అఖిల్,పుట్ట అఖిల్,బయ్య నవీన్,చెరిపెల్లి రాజు,కోశాధికారి అజ్మీర నరేష్,కార్యవర్గ సభ్యులు చిలుక నరేందర్,దరావత్ రాజు,వాంకుడోతు అక్షయ్ కుమార్,
మోటం హరీష్,నునావత్ పవన్ కుమార్,భూక్య సుమన్ లు ఎన్నికైనట్లు ప్రకటించారు.మండలం లోని అన్ని గ్రామాల నుండి ఎన్నిక చేయడం జరిగిందని మండల పార్టి అధ్యక్షుడు నామాల సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరములు,క్లస్టర్ ఇన్చార్జి మోటురి రవి,సీనియర్ నాయకులు బోల్లం బక్కయ్య,గడ్డం రాజు,బగ్గి రాజు,జై కిసాన్,బాణోత్ రవి,చిప్ప ప్రశాంత్,సమ్మెట రంగయ్య తదతరులు ఉన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన జిల్లా కమిటీ.!

 

భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక

మంచిర్యాల జులై19 నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం భారతీయ మజ్దూర్ సంఘ్ మాజీ జిల్లా అధ్యక్షులు లగిశెట్టి కమలాకర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా పాత కమిటీని రద్దుచేసి, జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి  భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన కమిటీని ప్రకటించడం జరిగింది, భారతీయ మజ్దూర్ సంఘ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా కుంటాల శంకర్, జిల్లా కార్యదర్శిగా మద్దూరి రాజు యాదవ్, ఉపాధ్యక్షులుగా కిషన్ రెడ్డి, నీరటి సురేష్, సగ్గుర్తి ఆనందరావు, కోశాధికారి గగ్గూరి విశాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రత్నాకర్ మహానంద్, సహాయ కార్యదర్శుగా, శశి,కొండు రాజేందర్, శాంతం సంపత్, కార్యవర్గ సభ్యులు,కోరకాని తిరుపతి ,కళ,సహజ,లను ఎన్నుకోవడం జరిగింది, భారతీయ మజ్దూర్ సంఘ్ నూతన జిల్లా అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ బి.ఎమ్.ఎస్. జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎంపిక చేసిన రాష్ట్ర కమిటీ సభ్యులకు మరియు జిల్లా కమిటీ సభ్యులకు, కృతజ్ఞతలు తెలుపుతూ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా భారతీయ మజ్దూర్ సంఘము (బి.ఎమ్.ఎస్)ను బలోపేతం చేస్తూ కార్మిక హక్కుల సాధన కోసం నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి బి.ఎమ్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి కంది శ్రీనివాస్, జాతీయ నాయకులు మండ రవికాంత్, కన్స్ట్రక్షన్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ, మరియు జైపూర్ పవర్ ప్లాంట్,దేవాపూర్ పవర్ ప్లాంట్,సింగరేణి బొగ్గుగని కాంటాక్ట్,భవన నిర్మాణ, సంఘటిత, అసంఘటిత కార్మికులకు,పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version