ఆపరేషన్ థియేటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఆపరేషన్ థియేటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

హర్షం వ్యక్తం చేసిన మారుమూల ప్రాంత ప్రజలు

నేటి ధాత్రి చర్ల

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం మారుమూల ప్రాంతమైన చర్లలో నూతనంగా ఏర్పాటైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఆపరేషన్ థియేటర్ అందుబాటులోకి వచ్చింది నేటి నుండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అందుబాటులోకి వచ్చాయి గతంలో ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం ప్రజలు అరవై కిలోమీటర్ల దూరం వెళ్లి భద్రాచలం ఆసుపత్రికి వెళ్లేవారు ఇప్పుడు చర్ల లో ట్యూబెక్టమీ సేవలు అందుబాటులోకి రావడంతో చర్ల పరిసర ప్రాంతాల్లోని మహిళలకు చాలా మేలు చేసినట్టయింది
నాడు చర్ల లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొయ్యూరు కి తరలించగా చర్ల గ్రామానికి చెందిన ప్రజలు పర్యటనకి వచ్చిన అప్పటి కలెక్టర్ అనుదీప్ ని కలిసి చర్ల మండల కేంద్రంలో హాస్పటల్ ఉండవలసిన ఆవశ్యత గురించి తెలిపారు వెంటనే కలెక్టర్ ఈ ప్రాంతంలో సిహెచ్ సి హాస్పిటల్ ఏర్పరిచారు నేడు ఈ హాస్పిటల్ కు అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ రవిబాబు భద్రాచలం ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రామకృష్ణ చర్ల సిహెచ్సి సి హాస్పటల్ డాక్టర్స్ సిబ్బంది చర్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.

రేగొండ పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-79.wav?_=1

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పల్లెలల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండల కేంద్రంలో ఎన్ హెచ్ ఎం నిధులు రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాన(ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ పనిచేసే డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలని అన్నారు. నియోజకవర్గంలోని పల్లెలల్లో మరిన్ని దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే..
గాంధీయ మార్గాన్ని ఆచరిస్తూ, నిరాడంబరతో పయనిస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు అనునిత్యం శ్రమిస్తున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జన్మదినం ఈ సందర్భంగా రేగొండలో మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కేకు కోసి, వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జాతీయ నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, సింప్లిసిటీగా ఉంటుందన్నారు. ఆమె సాధారణ రీతిలో పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడం జరుగుతుందని, అటు ఢిల్లీకి వెళ్ళినా, ఇటు హైదరాబాద్ కు వచ్చినా ఫ్లైట్ లో కాకుండా రైలులో ప్రయాణం చేస్తుందని అన్నారు. 2029 లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఏకైక లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ అహర్నిశలు పనిచేస్తుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. వారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఎమ్మెల్యే వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

చిట్యాల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిన సరోజన

వైద్యులపై చట్టపురమైన చర్య తీసుకోవాలని

సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ కార్యదర్శి మారపల్లి మల్లేష్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-54.wav?_=2

భూపాలపల్లి నేటిధాత్రి

సరోజన అనే మహిళ చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి లోబీవీ తో రావడం జరిగింది వచ్చిన తర్వాత అంబులెన్స్ లో తీసుకొచ్చినటువంటి ఈ పి టి 12 గంటల సుమారులో ఆక్సిజన్ పెట్టినాడు ఆక్సిజన్ పెట్టిన వెంటనే డమెల్ మనీ పేలింది…..

CPI ML Liberation Secretary Marapalli Mallesh

ఈపీటి వెంటనే తొందరగా బయటికి వచ్చినాడు ఏం జరిగిందని చెప్పేసి పేషెంట్లు అంత నిద్ర లేచారు అప్పటికి సరోజన అరుస్తూనే ఉంది అమ్మా అయ్యాను పేషెంట్ వచ్చి అరగంట ఆయన అప్పటివరకు డాక్టర్ గాని సిస్టర్స్ గాని సెక్యూరిటీ సిబ్బంది గానీ వార్డు భాయ్ వచ్చిన పరిస్థితి కానరాలేదు క్షణమైతే చనిపోతుంది అప్పుడు అందరు వచ్చినారు వచ్చేసరికి ఆమె చనిపోయింది అప్పుడు వచ్చి ఆక్సిజన్ కొడితే అప్పటికే ఆమె చనిపోయింది నేను చేసే ప్రయత్నం చేశాను అంటున్న డ్యూటీ డాక్టర్ వాస్తవంగా రాత్రి 12 కాకముందుకే ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు వార్డు బాయ్ లేసింది లేదు సెక్యూరిటీని లేపింది లేదు సెక్యూరిటీ సిస్టర్ ను లేపింది లేదు సిస్టర్ డాక్టర్ను లేపింది లేదు ఈ సమయంలో అర్ధగంట గడిచిపోయింది ప్రాణాలు కాపాడతారని వస్తే నిర్లక్ష్యం మూలంగా ప్రాణాలు పోయినవి తక్షణమే ఇన్చార్జి సూపర్ డెంట్ సస్పెండ్ చేయాలి నిర్లక్ష్యం వహించిన వీళ్ళందరూ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏ పేషెంట్ వచ్చిన వంద పడకలకు పో గాంధీ హాస్పిటల్ వరంగల్ పో అని రెఫర్ చేస్తా ఉన్నారు ఇక్కడ తగ్గాల్సిన రోగాన్ని అక్కడికి పొమ్మని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు వచ్చిన తర్వాత సిస్టర్ గ్లూకోజ్ పెడతా ఉంది డాక్టర్ మాత్రం గంట తర్వాత వచ్చి కూడా చూడలేని పరిస్థితి అమ్మ ఎప్పుడు వస్తాడు అని అడిగితే తాత వస్తాడని అంటున్నారు నిర్లక్ష్య సమాధానం ఉద్యోగం మీద బాధ్యత లేకపోకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్లే హాస్పిటల్ దివాలా తీస్తోంది గతంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎంతో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి చిట్యాల ఈరోజు దివాలా తీయడానికి కారణం పాలకులే నిర్లక్ష్యం మూలంగా నిండుపానం బలైపోయింది 9 గంటల వరకు డ్యూటీ లో ఉన్నారు తొమ్మిదిన్నరకే అందరు పడుకున్నారు వాస్తవానికి నైట్ డ్యూటీ అంటే రాత్రంతా మేలుకొని ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా డ్యూటీ చేస్తున్నారు తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసమే తప్ప బాధ్యతతో పనిచేసిన దాఖలు లేవు తక్షణమే హాస్పిటల్ పైదృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని పోలీసులకు డిమాండ్ చేస్తున్నాం

వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు..

వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు.. ఈ లక్షణాలు కనిపిస్తే జర జాగ్రత్త!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-36.wav?_=3

వర్షాకాలం పూర్తిగా రానప్పటికీ దాని ప్రభావం కనబడుతోంది. అప్పుడప్పుడూ కురుస్తున్న వానలకు దోమల బెడద పెరుగుతోంది. దీనికి తోడు వాతావరణ మార్పులు, తేమ, నీటి కాలుష్యం వంటివి సాధారణ జ్వరాలకు, వైరల్ ఫీవర్లకు దారితీస్తున్నాయి. దోమకాటు వల్ల డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు సైతం వ్యాపించే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ సీజన్‌లో ఏయే వ్యాధులు వస్తాయి? లక్షణాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

డెంగ్యూ జ్వరం:-

వర్షాల తర్వాత సాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. ఏడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా ఈ వైరల్ ఫీవర్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇక లక్షణాల విషయానికి వస్తే అధిక జ్వరం (104°F వరకు), తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి వేధిస్తాయి. అలాగే చర్మంపై దద్దుర్లు, అలసట, వాంతులు, కడుపు నొప్పి వంటివి కూడా కొందరిలో సంభవిస్తాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, వైద్య నిపుణుల సలహాలు పాటించాలి.

మలేరియా:-

ప్లాస్మోడియం పరాన్నజీవి, ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా ఇది వస్తుంది. చలి, జ్వరం, వణుకు, చలి దశ తర్వాత వేడిగా అనిపించడం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, కొన్నిసార్లు వాంతులు, కామెర్లు కూడా మలేరియా లక్షణాల్లో భాగంగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సింప్టమ్స్ కనిపించగానే డాక్టర్లను సంప్రదించాలి. నిర్ధారిత పరీక్షల తర్వాత చికిత్స అందిస్తారు.

వైరల్ ఫీవర్ (ఫ్లూ లేదా ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు):-

ఇన్‌ఫ్లుయెంజా లేదా ఇతర వైరస్‌ల ద్వారా కూడా వైరల్ జ్వరాలు వస్తుంటాయి. తేలికపాటి నుంచి మధ్యస్థ జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారడం, బాడీ పెయిన్స్, అలసట ఈ జ్వరాల ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. వీటిని గుర్తించగానే వైరల్ PCR టెస్ట్ చేయించుకోవాలి. వైద్య నిపుణులను సంప్రదించి, వారి సలహాలు పాటించాలి.

టైఫాయిడ్ (ఎంటరిక్ ఫీవర్):-

సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా, కలుషిత నీరు లేదా కలుషిత ఆహారం ద్వారా ఈ జ్వరం వస్తుంది. చిన్నగా ప్రారంభమై ఒక్కసారిగా అధిక జ్వరం రావడం, ఉదయం తక్కువగా ఉండి సాయంత్రం లేదా రాత్రిళ్లు అధికం కావడం జరుగుతుంది. బలహీనత, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, మలబద్ధకం లేదా విరేచనాలు కూడా టైఫాయిడ్ లక్షణాల్లో భాగమే. కాబట్టి ఈ సింప్టమ్స్ గుర్తిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు.

చికున్‌గున్యా:-

చికున్‌గున్యా వైరస్, ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పి (దీని వల్లే ‘చికున్‌గున్యా’ అనే పేరు వచ్చింది), చర్మంపై దద్దుర్లు, అలసట వంటివి దీని ప్రధాన లక్షణాలు రక్త పరీక్షల ద్వారా దీనిని నిర్ధారిస్తారు. కాబట్టి లక్షణాలు గుర్తించగానే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.

లెప్టోస్పిరోసిస్:-

లెప్టోస్పిరా బ్యాక్టీరియా, కలుషిత నీటితో సంపర్కం ద్వారా నీటిలో వృద్ధి చెంది జన సమూహాలకు వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, కళ్లు ఎర్రబడడం, కామెర్లు వంటివి దీని ప్రధాన లక్షణాలు. తీవ్రమైన సందర్భాల్లో కాలేయం, మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. రక్తం లేదా యూరిన్ టెస్ట్ (MAT లేదా PCR) ద్వారా దీనిని నిర్ధారిస్తారు. కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించ సూచనలు పాటించాలి.

జాగ్రత్తలు:-

సీజనల్ వ్యాధులు సాధారణంగా దోమకాటు, కలుషిత నీరు, అపరిశుభ్రత వల్ల వస్తుంటాయి. కాబట్టి దోమల నివారణ, వాటి నుంచి సంరక్షణ ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు. దోమ తెరలు ఉపయోగించడం, ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం చేయాలి. సాయంత్రం వేళల్లో పూర్తి చేతులు, కాళ్లను కప్పి ఉంచే దుస్తులు ధరించండం మంచిది. దీంతోపాటు వర్షాకాలంలో నీరు భూగర్భంలోకి ఇంకడంవల్ల, డ్రైనేజీల లీకేజీ కారణంగా నల్లా నీళ్లు కూడా కలుషితం అవుతుంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో మరిగించిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే తాగాలంటున్నారు నిపుణులు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వైద్య నిపుణులను సంప్రదించాలి.

వివరణ:-

పరిసరాల పరిశుభ్రత:

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, దోమలు, ఇతర క్రిములు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.

చేతులు కడుక్కోవడం:

చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవడం వల్ల సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందకుండా ఉంటాయి.

లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి:

జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

నీటిని మరిగించి తాగాలి:

నీటిని మరిగించి తాగడం ద్వారా సూక్ష్మక్రిములు నశిస్తాయి.

పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినాలి:

పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినడం ద్వారా క్రిములు శరీరంలోకి చేరకుండా నివారించవచ్చు.

ఝరాసంగం మండల ప్రభుత్వ వైద్య అధికారి రమ్య

ఉదయం చేసే ఈ తప్పులు ..!

 

ఉదయం చేసే ఈ తప్పులు మీ మొత్తం రోజును నాశనం చేస్తాయి.!

 

ఉదయం సానుకూలంగా ఉంటే రోజంతా బాగుంటుంది. అయితే, మీరు ఉదయం చేసే ఈ తప్పులు మీ మొత్తం రోజును నాశనం చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మన రోజంతా ఎలా ఉంటుందనేది మన ఉదయం దినచర్యపై ఆధారపడి ఉంటుంది. రోజు సానుకూలతతో ప్రారంభమైతే, రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. అదేవిధంగా, మన ఉదయపు అలవాట్లు కొన్ని రోజంతా నాశనం చేస్తాయి. మీ రోజు కూడా సానుకూలంగా ప్రారంభించి రోజంతా బాగుండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే, మీరు ఈ కొన్ని అలవాట్లను వదులుకోవాలి. ఎందుకంటే ఇవి మీ రోజును నాశనం చేస్తాయి. కాబట్టి, ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..

నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేసుకోవడం:

చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేసుకునే అలవాటు ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, వారి రోజు ఫోన్ తో ప్రారంభమవుతుంది. కాబట్టి, మీరు ఉదయం నిద్ర లేవగానే మీ ఫోన్ చెక్ చేసుకోకూడదు. ఇది మీ మెదడుపై భారాన్ని పెంచుతుంది. దీనివల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. మరో విషయం ఏమిటంటే, మీరు ఉదయం నిద్ర లేవగానే మీ మొబైల్ చెక్ చేసి చెడు వార్తలు చూస్తే, మీ రోజంతా నాశనం అవుతుంది. కాబట్టి, ఈ అలవాటును వదులుకోండి.

అల్పాహారం తినకపోవడం:

చాలా మంది కళాశాల లేదా ఆఫీసుకు ఆలస్యంగా వెళ్లడం వల్ల అల్పాహారం మానేస్తారు. ఉదయం తినకుండా ఆకలితో ఉండటం హానికరం. ఇది మెదడు శక్తిని తగ్గిస్తుంది. ఇది మీ ఏకాగ్రత, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తుంది.

నీరు తాగకపోవడం:

ఉదయం నీరు తాగడం అలవాటు చేసుకోండి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగాలి. ఉదయం నీరు తాగడం వల్ల మెదడు కణాలు చాలా చురుగ్గా ఉంటాయి.

 

ఆలస్యంగా నిద్రలేవడం:

ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం కూడా మంచిది కాదు. మీరు రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉండాలనుకుంటే, ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోండి.

వర్షాకాలం.. ఈ కూరగాయలు తినే ముందు..!

 

వర్షాకాలం.. ఈ కూరగాయలు తినే ముందు 100 సార్లు ఆలోచించండి..!

 

వర్షాకాలంలో ఈ కూరగాయలు తినే ముందు 100 సార్లు ఆలోచించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఏ కూరగాయల గురించి వారు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

కూరగాయలు ప్రయోజనకరంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాటిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటే, అనేక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. అయితే, వర్షాకాలంలో ఈ కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ కూరగాయల గురించి వారు హెచ్చరిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలీఫ్లవర్‌

వర్షాకాలంలో కాలీఫ్లవర్ తినడం మంచిది కాదు, ఎందుకంటే తేమ కారణంగా బ్యాక్టీరియా, పురుగులు పెరిగే అవకాశం ఉంది. కాలీఫ్లవర్‌లో తేమ ఎక్కువగా ఉండటం వలన, అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. కడుపు ఇన్ఫెక్షన్లకు కూడా కారణం కావచ్చు.

వంకాయ

వంకాయలలో కూడా టేప్‌వార్మ్ కనిపించే అవకాశం ఉంది. కోసేటప్పుడు పురుగులు కనిపిస్తే, మొత్తం వంకాయను పారవేయాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని పురుగులు వంట తర్వాత కూడా జీవించగలవు, వీటిని తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దాని లార్వా మెదడులోకి ప్రవేశిస్తే, అది ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తుంది.

బీరకాయ

బీరకాయ వర్షాకాలంలో సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఫైబర్ పరంగా గొప్ప కూరగాయ. కానీ వర్షాకాలంలో ఇది కీటకాలతో ఉంటుంది. దానిలో ఉండే పురుగులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ పురుగులను తింటే, అవి శరీరంలోకి ప్రవేశించి మెదడుకు చేరుతాయి. ఇవి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

క్యాబేజీ

క్యాబేజీ పొరల మధ్య టేప్‌వార్మ్‌లు దాక్కునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు చాలా వేగంగా పెరుగుతాయి. వాటిని శుభ్రం చేసి సరిగ్గా ఉడికించకపోతే, వాటి గుడ్లు జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి శరీరం లోపలికి, మెదడులోకి కూడా చేరుతాయి. మీరు తినాలని అనుకుంటే క్యాబేజీని ఉపయోగించే ముందు నీటిలో మరిగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

 

క్యాప్సికమ్

క్యాప్సికమ్ లోపలి భాగంలో టేప్‌వార్మ్‌లు ఉండవచ్చు. సరిగ్గా కడగకపోతే, టేప్‌వార్మ్ గుడ్లు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి కమిషనర్ రాజలింగు.

Mandamarri Municipal Commissioner Rajalingu

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – కమిషనర్ రాజలింగు

మందమర్రి నేటి ధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-29.wav?_=4

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు అన్నారు. శుక్రవారం రోజు మున్సిపాలిటీ పరిధిలోని ఊరు రామకృష్ణాపూర్ లో మున్సిపల్ సిబ్బందితో కలిసి పిచ్చి మొక్కలను తొలగించడం, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయడం వంటి పనులు చేపట్టారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, “సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్న ఈ కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. రోడ్లపై చెత్త వేయకుండా జాగ్రత్తలు పాటించాలి,” అని సూచించారు. ప్రజల భాగస్వామ్యం ఉండే వినూత్న శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

కళ్యాణికని సింగరేణి ఉన్నత పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు..

కళ్యాణికని సింగరేణి ఉన్నత పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు

మందమర్రి నేటి ధాత్రి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-27.wav?_=5

ఈరోజు మందమర్రి ఏరియా హాస్పిటల్, సింగరేణి ఆధ్వర్యంలో సింగరేణి ఉన్నత పాఠశాల, కళ్యాణికని యందు ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Medical examinations

ఈ పరీక్షలలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య స్థితిని పరిశీలించి, వారికి రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయి, శారీరక బలహీనత తదితర విషయాలపై పరీక్షలు చేపట్టారు. పరీక్షల అనంతరం, బ్లడ్ తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించి, వారికీ అవసరమైన ఔషధాలు, విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు.

Medical examinations

ఈ కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేలా, ముందస్తు వైద్య జాగ్రత్తలతో కూడినదిగా ఏర్పాటుచేయబడింది. పిల్లల ఆరోగ్యం పట్ల సింగరేణి సంస్థ చూపుతున్న చొరవకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యాపక వర్గం, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

న్యాల్కల్ KGBV హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత.

న్యాల్కల్ KGBV హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-22.wav?_=6

న్యాల్ కల్ లో కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ లో ఐదుగురికి విద్యార్థులు అస్వస్థతకు గురి . విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. జహిరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపించారు . విద్యార్థుల ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన విద్యార్థులకి మళ్లీ అస్వస్థత గురి కావడం చర్చనీ అంశం . వర్షాకాలం పరిశుభ్రత లోపించిందా ఆహారం లోపమా తెలియాల్సిందే. జిల్లా అధికారులు పర్యవేక్షణ లోపించింది .

Nyalkal KGBV hostel.

వెంటనే తహసిల్దార్ ప్రభులు మండల గిర్ధవర్ శ్యామ్ రావు హాస్టల్ లో పరిస్థితులను పరిశీలించారు.

చిన్నపిల్లల్లో పెరుగుతున్న, గుండెపోటు ప్రమాదం.. కారణాలు ఇవే..!

చిన్నపిల్లల్లో పెరుగుతున్న, గుండెపోటు ప్రమాదం.. కారణాలు ఇవే..!

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-21.wav?_=7

జహీరాబాద్ నేటి ధాత్రి:

పిల్లలు ఏమీ తినకుండా గంటల తరబడి కూర్చోవడం వల్ల వారి జీవక్రియ రేటు క్షీణించడం, హైపోగ్లైసీమియా వారి గుండె సమస్యలను పెంచడం వంటి సమస్య పిల్లల్లో కనిపిస్తుంది.
గుండెపోటు.. ప్రస్తుతం చాలా మంది పిల్లలు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గుండెపోటు అనేది తీవ్రమైన సమస్య. దీని ప్రమాదం పెద్దలు మరియు పిల్లలలో పెరుగుతోంది. నిజానికి శరీరంలో రక్తం అడ్డుగా ఉన్నప్పుడు గుండె కండరాలు సక్రమంగా పని చేయకపోవడమే కాకుండా గుండెపోటు వంటి తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు ఏమీ తినకుండా గంటల తరబడి కూర్చోవడం వల్ల వారి జీవక్రియ రేటు క్షీణించడం, హైపోగ్లైసీమియా వారి గుండె సమస్యలను పెంచడం వంటి సమస్య పిల్లల్లో కనిపిస్తుంది.

Heart attack in children

వ్యాయామం లేకుండా ఉండటం..

కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. పిల్లలు ఆడుకోవడం మానేశారు. టీవీ, మొబైల్, ల్యాప్టాప్ ముందు కూర్చుని ఇంట్లో ఏదో తిన్నారు. రోజంతా ఒకే చోట కూర్చుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. నేటి పిల్లలు మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయ్యారు.. అంటే దానికి బానిసలై మైండ్ ని బలహీనపరుస్తున్నారు.

పిల్లల్లో ఒత్తిడి..

ఇది పిల్లలలో ఒత్తిడి సమస్యలకు దారి తీస్తుంది. ఒత్తిడి కారణంగా వారికి గుండె సమస్యలు కూడా వస్తాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ వాడడం, అందులో గేమ్లు ఆడడం, తెల్లవారుజామున నిద్రలేవడం వంటివన్నీ రోగాలకు కారణమవుతున్నాయి.

పిల్లల్లో ఊబకాయం సమస్య ..

ఊబకాయం సమస్య కూడా పిల్లల్లో గుండెపోటుకు దారి తీస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ఈ అలవాట్లపై దృష్టి పెట్టాలి. వారితో సమయం గడపాలి.

పిల్లలు తినే ఆహారం..

పిల్లలు ఒత్తిడితో గుండెపోటు వంటి వ్యాధుల బారిన పడకుండా వారి శారీరక దృఢత్వంపై కూడా తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలన్నారు. అలాగే పిల్లలకు వీలైనంత వరకు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వాలి. బయటికి వెళ్లినప్పుడు చాలా అరుదుగా బయటి ఆహారాన్ని తినవచ్చు. కానీ, క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో ఊబకాయం ఏర్పడుతుంది.

ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత.

ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయూత….

ఆటో డ్రైవర్లకు ఆరోగ్య బీమా పథకంకు కృషి…

ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-20.wav?_=8

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

నిత్యం రోడ్ల పై తిరుగుతూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్లు వారి ఆరోగ్యం పై జాగ్రతలు తీసుకోకుండా అనారోగ్యాల బారిన పడుతున్నారని, వారికి ఎలాంటి ఆరోగ్య బీమాలపై సరైన అవగాహన ఉండట్లేదని అందుకే ఆటో డ్రైవర్లకు ఆరోగ్య భీమా పథకం అమలు చేయించేందుకు కృషి చేస్తానని రామకృష్ణాపూర్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య అన్నారు.
రామకృష్ణాపూర్ పట్టణంలోని కనకదుర్గ కాలనికి చెందిన ఆటో డ్రైవర్ కొండ్ర రవి అనారోగ్యానికి గురై గత వారం మృతి చెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిది చాలా పేద కుటుంబం కావడంతో వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వారి కుటుంబానికి రామకృష్ణాపూర్ ఆటో యూనియన్ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఎనగంటి సంపత్, ఉపాధ్యక్షులు పాక అంజయ్య, ప్రధాన కార్యదర్శి జీడి రవి, చెన్నాల సారయ్య ,ముల్కల నరసయ్య, ఆల్క పున్నం, వాసం సది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వైద్యాధికారి పి.హెచ్.సి అధికారులతో సమీక్ష.

జిల్లా వైద్యాధికారి పి.హెచ్.సి అధికారులతో సమీక్ష

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత రాజన్న సిరిసిల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులతో సమీక్షా సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేయడమైనది. ఈ సమీక్ష సమావేశంలో క్షయ వ్యాధి నివారణలో ఆశలు ఇంటింటి సర్వే ద్వారా రెండు వారాలకు మించి దగ్గు తెమడ బాధపడుతున్న వారిని గుర్తించి స్క్రీనింగ్ పరీక్షలకు పంపవలసిందిగా మరియు ఆరోగ్య మహిళ స్క్రీనింగ్ పరీక్షలకు ఆశలు ఏఎన్ఎంలు ఆరోగ్య కేంద్ర పరిధిలో గల మహిళలను రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, నోటి క్యాన్సర్ల పరీక్షల కొరకై ఆరోగ్య మహిళా క్లినిక్ యందు పరీక్షలు చేయించవలసిందిగా సూచిస్తూ, మలేరియా డెంగ్యూ జ్వరాల నివారణ డ్రై డే కార్యక్రమంను పగడ్బందీగా నిర్వహించవలసిందిగా సూచిస్తూ ఆరోగ్య కేంద్ర పథకాలపై సమీక్షించినారు.
ఈ కార్యక్రమంలో డి ఐ ఓ డాక్టర్. సంపత్ కుమార్, పోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ అనిత, డాక్టర్ రామకృష్ణ గార్లు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు పాల్గొన్నారు.

వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

నడికూడ,నేటిధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-8.wav?_=9

మండలంలోని కంఠాత్మకూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డెంగ్యూ, మలేరియా,టైఫాయిడ్ విష జ్వరాల బారిన పడకుండా గ్రామంలో ప్రజలను అప్రమతము చేయుట లో భాగంగా ప్రజలు ఇంటి పరిసరాలు శుభ్రముగా,పిచ్చి మొక్కలు ఇతర నీరు నిల్వ ఉండకుండా పడవేసిన డబ్బాలు ఇతర వ్యర్ధ ప్లాస్టిక్ వస్తువులు కొబ్బరి బోండాలు ఏ ఇతర వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా దోమలు నివారణలో భాగంగా కంఠాత్మకూరు గ్రామంనకు డ్రై డే ఫ్రైడే లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి హనుమకొండ ఎల్.లక్ష్మీ రమాకాంత్ ఇంటి పరిసరాలను పరిశీలించి సూచనలు సలహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.వీరి వెంట సిహెచ్ రవి,మండల పంచాయతీ అధికారి నడికూడ బి.భార్గవి పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది,ఏఎన్ఎం ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ పూజ ఆధ్వర్యంలో చినమిడిసిలేరు గ్రామంలో.

డాక్టర్ పూజ ఆధ్వర్యంలో చినమిడిసిలేరు గ్రామంలో హోమియోపతి వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-7.wav?_=10

చిన్న మీడిసిలేరు గ్రామంలో కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల హోమియోపతి వైద్యరాలు డాక్టర్ పూజ ఆధ్వర్యంలో హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు
ఈ ఆరోగ్య కేంద్రంలో 67 మంది ప్రజలను చూసి హోమియోపతి మందులను అందించారు
డాక్టర్ పూజ మాట్లాడుతూ హోమియో మందులు సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా పనిచేసే మందులు ఈ మందులు అందరూ ఉపయోగించుకోవాలి
దీర్ఘకాలిక రోగాలకు చర్మ రోగాలకు పిడ్స్ కిడ్నీలో రాళ్ళు స్త్రీల సమస్యలు ఫైల్స్ మొదలగు అన్ని వ్యాధులకు ఈ మందులు చక్కగా పనిచేస్తాయి
అందరు హోమియోపతి మందులు అలవాటు చేసుకోవాలని తెలియజేశారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొయ్యూరులో ఈ మందులు ఉచితంగా లభిస్తాయి కనుక చర్ల మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని తెలియజేశారు

ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లనునియమించాలి.

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లనునియమించాలి

సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ .

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల ప్రభుత్వ హాస్పిటల్ లో వెంటనే డాక్టర్లను నియమించాలి…. గతంలో చిట్యాల హాస్పిటల్లో అనేక డెలివరీ కేసులు అత్యవసర కేసులకు చికిత్స అందించేవారు. అటువంటి హాస్పిటల్ నేడు దయనీయ పరిస్థితిలో ఉందని మొత్తంగా 18 మంది డాక్టర్లు ఉండవలసిన ఆస్పత్రిలో ప్రస్తుతానికి ఆరుగురు డాక్టర్లతో తూతూ మంత్రంగా వైద్య సేవలని అందిస్తున్నారని దుయ్యబట్టారు …. గైనిక్,, అనస్తీసియా,, పీడియాట్రిక్ డిపార్ట్మెంటులో ఇద్దరేసి డాక్టర్ల చొప్పున ఉంటూ వైద్యాన్ని అందించాల్సి ఉండగా వైద్యుల కొరత వల్ల అనేక ఎమర్జెన్సీ కేసులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు భూపాలపల్లి పరకాల హనుమకొండ వంటి పట్టణాలకు వెళ్లే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు… కొన్నిసార్లు సమయానికి వైద్యం అందక ప్రాణాలను సైతం కోల్పోతున్నారు… పరిస్థితి పూర్తి అధ్వానంగా మారింది.. ఈ విషయాన్ని స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు* ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావట్లేదని, పేద ప్రజల ఆరోగ్యం అంటే ఆయనకు లెక్కే లేకుండా పోతుందని మండి పడ్డారు…వెంటనే జిల్లా కలెక్టర్ గారు నిరుపేద రోగుల పరిస్థితుల దృష్ట్యా చిట్యాల హాస్పిటల్ కు పూర్తి స్థాయిలో గైనిక్,, అనస్తీషియా,, పీడియాట్రిక్ డాక్టర్లను నియమించాలని ఆయన కోరడం జరిగింది. లేనట్లయితే చిట్యాల హాస్పిటల్ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్థామని ఆయన హెచ్చరించారు..

DR నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం.

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బోదనెల్లి గ్రామంలో
డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు
ముగ్గురు జ్వరం బాధితులకు రక్త పరీక్ష మరియు ఆర్డిటి చేసినారు మలేరియా లేదని నిర్దారణ చేసి చికిత్సచేసినారు
32 మందికి సాధారణ వ్యాధుల కు మందులు ఇచ్చినారు
గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసినారు
అలాగే ప్రతి నెల గర్భిణీ స్త్రీల పరీక్షలు చేయించుట కొరకు ఆసుపత్రికి రావాలని మరియు సురక్షిత కాన్పు కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము సత్యనారాయణపురంకి రావాలి అని తెలిపారు
ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేసినామని తెలిపారు
డ్రై డే కార్యక్రమాలు చేపించి ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు
జ్వరాలు వచ్చిన వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా ఆసుపత్రికి కి రావలెనని చెప్పడం జరిగింది
దోమల వలన వచ్చే వ్యాధుల గురించి చెప్పడం జరిగినది
కాచి చల్లార్చిన నీళ్లు త్రాగాలి
నీటి నిల్వలు లేకుండా చూడాలని
దోమలనుంచి రక్షణ కొరకు దోమతెరలు కట్టుకోవాలి ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో
హెచ్ఈఓ బాబురావు
యమ్ హెల్ హెచ్ పి
సంధ్య హెల్త్ అసిస్టెంట్స్ వరప్రసాద్
కవిత
ఆశా కార్యకర్తలు
పోతమ్మ తదితరులు పాల్గొన్నారు

మెగ్నీషియం లోపంతో ప్రాణాలకే ముప్పు..!

మెగ్నీషియం లోపంతో ప్రాణాలకే ముప్పు..! ఈ లక్షణాలు కనిపిస్తే బీ అలర్ట్..!

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది సంకేతాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు కచ్చితంగా శరీరానికి అందాల్సిందే. విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు ఇలా ప్రతిదీ అవసరమే. ఏ ఒక్కటి లోపించినా శరీర విధులకు ఆటంకం కలిగి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇది శరీరానికి అవసరమయ్యే ఖనిజాల్లో అత్యంత ప్రధానమైనది. ఏకంగా 300 విధుల్లో శరీరానికి తోడ్పడుతుంది. మన ఒంట్లో శక్తి ఉత్పత్తికి, పెరుగుదల సహా అనేక ఇతర క్రియలకు అత్యంత ముఖ్యమైనది.

ప్రతిరోజూ ఆహారంలో తగినంత మెగ్నీషియం తీసుకోని వారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. అత్యంత సర్వసాధారణంగా కనిపించే ఈ సంకేతాలను పట్టించుకోకపోతే మూల్యంగా ప్రాణాన్నే చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏఏ లక్షణాల ద్వారా మెగ్నీషియం లోపాన్ని గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం.

కండరాల తిమ్మిరి

శరీరంలో మెగ్నీషియం తగ్గితే కనిపించే మొట్టమొదటి సంకేతం కండరాల తిమ్మిర్లు. కాళ్ళలో తరచుగా కండరాల తిమ్మిర్లు, నొప్పులు ఉంటే మెగ్నీషియం లోపించిందని అర్థం. కండరాల పనితీరులో మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది లోపిస్తే కండరాలు అసాధారణంగా సంకోచిస్తాయి. నరాల పనితీరు దెబ్బతింటుంది.

అలసట, బలహీనత

విశ్రాంతి తర్వాత కూడా అసాధారణంగా అలసిపోయినట్లు అనిపిస్తుంటే తక్కువ మెగ్నీషియం స్థాయిలకు సంకేతం కావచ్చు. ఈ ఖనిజం శక్తికి ముఖ్యమైనది. ఇది లోపిస్తే కణాల్లోని శక్తి తగ్గుతుంది. అందుకే అలసట, బలహీనత వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

క్రమరహిత హృదయ స్పందన

మెగ్నీషియం గుండె కండరాల పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ హృదయ స్పందనను నిర్వహించడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు గుండె దడ, క్రమరహిత హృదయ స్పందనలు (అరిథ్మియా) లేదా ఛాతీ బిగుతుకు కారణమవుతుంది.

జలదరింపు

చేతులు, కాళ్ళు లేదా ముఖంలో జలదరింపు అనుభూతులు లేదా తిమ్మిరి మెగ్నీషియం లోపానికి సంకేతాలు. ఇలాంటివారిలో నరాల సరిగా పనిచేయవు. నరాల సాధారణ పనితీరుకు అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే, మెగ్నీషియం నరాల సంకేతాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

చాక్లెట్ లేదా ఉప్పు

మీకు తరచుగా చాక్లెట్ లేదా ఉప్పు తినాలనే కోరికలు కలుగుతుంటే ఒంట్లో తక్కువ మెగ్నీషియం ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ఖనిజాలకు గొప్ప మూలం. మెగ్నీషియం అసమతుల్యతను భర్తీ చేసుకునేందుకు మీ శరీరం ఉప్పు లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కోరుకోవచ్చు.

ఉచిత వైద్య శిభిరని ప్రారంభించిన..

ఉచిత వైద్య శిభిరని ప్రారంభించిన హనుమంతరావు పటేల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రముఖ హోలీస్టిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలోఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది లింగాయత్ సత్రం, టెంపుల్ రోడ్ నిర్వహించిన ఉచిత శిబిరాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు పటేల్ ప్రారంభించారు. కార్డియాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థోమలాజీ, ఇంటర్నల్ మెడిసిన్ తో పాటు ఈసిజీ,ఆర్థో,కంటి,బిపి,డయాభైటిక్ షుగర్ తదితర పరీక్షలు వచ్చిన రోగులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రజలను అవసరమైన టెస్టులు మందులు ఉచితంగా అందించడం జరిగింది. గ్రామస్తులు ఆయా గ్రామస్తులను ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

అంతర్గత అవయవాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. అయితే, ఈ లక్షణాలు, మీ శరీరంలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. ఎందుకంటే..

 మన శరీరం దాని లోపల జరిగే ప్రతి మార్పు గురించి మనకు సమాచారాన్ని అందిస్తుంది. మనం దానిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంతర్గత అవయవాలు దెబ్బతిన్నప్పుడు శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. కాబట్టి, ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరంలో వాపు, అలసట, బలహీనత అనేవి మీ అంతర్గత అవయవాలు అనారోగ్యానికి గురవుతాయని హెచ్చరించే కొన్ని లక్షణాలు. మూత్రంలో అధిక నురుగు, తరచుగా మూత్రవిసర్జన, మూత్ర పరిమాణంలో తీవ్రమైన మార్పులు మొదలైనవి మూత్రపిండాల సమస్యలను సూచించే కొన్ని లక్షణాలు.

ఇది మాత్రమే కాదు.. మీ కాళ్ళు, చీలమండలు, పాదాలు, ముఖం, కళ్ళ చుట్టూ వాపు కనిపించడం ప్రారంభిస్తే మీ మూత్రపిండాలలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోండి. దీనితో పాటు శ్వాస ఆడకపోవడం, ఆకలి లేకపోవడం, రక్తపోటు పెరగడం, శరీరంలో తేలికపాటి దురద వంటి లక్షణాలు కనిపిస్తే ఇది మీ మూత్రపిండాలలో సమస్యకు ప్రత్యక్ష సూచన అని గుర్తుంచుకోండి.

బరువు పెరగడం లేదా తగ్గడం, కడుపులో గ్యాస్, ఎల్లప్పుడూ ఆమ్లత్వం వంటి సమస్యలు మొదలైనవి మీ ప్రేగుల ఆరోగ్యం క్షీణిస్తోందని సూచించే కొన్ని లక్షణాలు. ఇది మాత్రమే కాదు, మీరు మళ్లీ మళ్లీ తినాలని భావిస్తుంటే ఒత్తిడికి గురవుతుంటే ఇవి ప్రేగులలోని రుగ్మత లక్షణాలు కూడా కావచ్చు. ఈ లక్షణాలను తెలుసుకుని వాటికి చికిత్స తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ.

మున్సిపల్ సిబ్బందికి సీజనల్ మరియు హెల్త్ కిట్స్ పంపిణీ

.వర్షాకాలంలో 16వ డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచాలి.

సుంకరి మనిషా శివకుమార్.
16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి.

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధి 16వ డివిజన్ లోని పారిశుద్య పనులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ సీజనల్ మరియు హెల్త్ కిట్స్ అందచేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిరంతం డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్న సిబ్బంది అనారోగ్య ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు కార్పొరేషన్ హెల్త్ కిట్స్ అందించడం ద్వారా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.అదే విధంగా వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ కిట్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ సిబ్బంది కార్పొరేటర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ జవాన్ లు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version