పెంచిన రైల్వే చార్జీలను తగ్గించాలి…

పెంచిన రైల్వే చార్జీలను తగ్గించాలి…

నేటి ధాత్రి -గార్ల:-

కేంద్ర ప్రభుత్వం పెంచిన రైల్వే ఛార్జిలను తక్షణమే తగ్గించి, సామాన్యులకు రైల్వే ప్రయాణం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, మండల కార్యదర్శి అలవాల సత్యవతి డిమాండ్ చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ ఎదుట పెంచిన రైల్వే చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, మధ్యతరగతి, పేద ప్రజలపై రైల్వే చార్జీల పెంపుదల భారం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ప్రయాణించే రైల్వే ఛార్జిలను పెంచి, ప్రయాణికులను ఆర్థికంగా దెబ్బతీస్తుందన్నారు.పెంచిన రైల్వే ఛార్జిలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ఆందోళనలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు వి.పి.వెంకటేశ్వర్లు,యం.నాగమణి,మండల కమిటి సభ్యులు సిహెచ్ ఎల్లయ్య, ఎ.రామకృష్ణ,జి.వీరభధ్రం,ఎస్.నాగరాజు,బి.నరేష్,బి.ఝాన్సీ, ప్రవీణ్,కోటయ్య,రమేష్,సంపత్,నరేష్,ప్రసాద్,రైల్వే ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు..

కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ లో శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అలాగే జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి,ఆర్.ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిఆర్డీఓ కౌసల్యాదేవి,డిబిసిడిఓ పుష్పలత, అధికారులు,సంఘ నాయకులు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

అల్లం పంట పైన అవగాహన సదస్సు.

అల్లం పంట పైన అవగాహన సదస్సు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ,కోహిర్ మండలం,పిచేర్యాగడి గ్రామంలోనీ రైతు వేదికలో ఉద్యాన శాఖ,కొహీర్ మండల్ ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో, రైతులకు అల్లం పంట సాగు పై అవగాహన కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన పంటల మీద ,ప్రభుత్వం ఇచ్చే రాయితీల మీద ,అవగాహన కలిపించడం జరిగింది.
మామిడి, జామ, బొప్పాయ, అరటి, అల్లం, వెదురు, తదితర పంటల మీద ఉద్యాన శాఖ సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుందని , ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు ఆర్జించవచ్చని ,కోహిర్ ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి సునీత అన్నారు.ఈ సందర్భంగా ఉద్యాన అధికారి మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులకు మొక్కలను 90 శాతం రాయితీ, డ్రీప్ ఏర్పాటుకు 80 శాతం నుంచి వంద శాతం రాయితీ వస్తుందన్నారు. పంటను కంపెనీయే కొంటుందని, దీని కోసం కోహిర్ మండల్ లోనే ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. అదేవిధంగా సీనియర్ సైంటిస్టులు మాట్లాడుతూ , కోహిర్ ప్రాంతం ముఖ్యంగా అల్లం మరియు ఆలుగడ్డ జామ సాగులో ప్రసిద్ధి చెందిందని తెలిపారు.అల్లం సాగులో ఎక్కువగా వచ్చే వ్యాధులకు సంబంధించిన నివారణను మరియు ఆ తెగుళ్లను ఎలా ఎదుర్కోవాలో వారు చాలా చక్కగా రైతులకు వివరించడం జరిగిందని రైతులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈవో సవిత, సంగారెడ్డి డిహెచ్ఎస్ఓ సోమేశ్వరరావు, డిడిఎస్, కెవికె సీనియర్ సైంటిస్ట్ వరప్రసాద్, శైలజ, నేటాఫిన్ సౌత్ ఇండియా హెడ్ సుబ్బారావు, ఉద్యానవన శాఖ అధికారి సునీత, మండల వ్యవసాయ అధికారి వినోద్, వ్యవసాయ విస్తరణ అధికారి సవిత, ఆయిల్ ఫామ్ ఆఫీసర్ రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ అమృత వీరారెడ్డి, అనంతరం, చంద్రశేఖర్, గ్రామ మైనార్టీ చైర్మన్ జహీరుద్దీన్, రైతులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ కాంట్రాక్టర్ జవీద్ గారి మాతృమూర్తి కుటుంబ సభ్యులను.

ప్రముఖ కాంట్రాక్టర్ జవీద్ గారి మాతృమూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

మరియు రాయల్ ట్రాన్స్పోర్ట్ ఇస్సాం సెట్ ఇటీవల మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ వారి నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు .ఎమ్మెల్యే గారితో పాటు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజి మున్సిపల్ చైర్మన్ తంజీం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,యువ నాయకులు ముర్తుజా తదితరులు ఉన్నారు.

ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

ఉచిత ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాల కోసం దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు జులై 5 వరకు పొడిగించినట్లు తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు తెలిపారు. దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు, వ్యాపార వాహనాలు, వినికిడి పరికరాలు, వాకింగ్‌ స్టిక్స్, వీల్‌ఛైర్లు తదితర ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జులై 5 వరకు దరఖాస్తు గడువు ను ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. అర్హులైనవారు టీజీఓబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

పట్టా పాసు పుస్తకం ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మసీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఝరాసంగం మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం శుక్రవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం 11 నెంబర్ల విశిష్ట సంఖ్య ఉన్న ఫార్మసీ రిజిస్ట్రేషన్ మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్ద చేసుకోవాలని చెప్పారు. పూర్తి వివరాలకు మండల వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ విత్తనాల అధికారులను సంప్రదించగలరని కోరారు.

అద్వాన్నపుస్థితిలో మార్కండేయ నగర్ కాలనీ..

అద్వాన్నపుస్థితిలో మార్కండేయ నగర్ కాలనీ*

మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీలో గల 2వార్డు పరిధిలోని మార్కండేయ కాలనీ వాసులు వర్షం పడితే చాలు బురద గుంటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మార్కండేయ కాలనీ అధ్యక్షులు పెండెం శివానంద్ తెలిపారు.ఈ సందర్భంగా పెండెం శివానంద్ మాట్లాడుతూ 200 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్న మార్కండేయ కాలనీలో డ్రైనేజీ ,రోడ్ల వ్యవస్థ లేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారన్నారు. గతంలో కాలనీ గురించి అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని ఆరోపించారు.వర్షాకాలం వస్తే చాలు గుంతలలో నీరుచేరి డెంగ్యూ, మలేరియా లాంటి రోగాల బారిన పడుతున్నారు. వాహనదారులు కాలనీలో వాహనాలు నడపాలంటే తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అన్నారు.

Pendem Sivanand.

గతంలో అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మరమ్మతులు చేస్తామంటూ దాటవేస్తున్నారని అన్నారు. ఇకనైనా మున్సిపాలిటీ కమిషనర్ ర్,సిబ్బంది పట్టించుకోని కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని మార్కండేయ కాలనీ వాసుల తరఫున కోరుతున్నట్లు శివానంద్ తెలిపారు.

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి.

 

దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉద్యమించాలి

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు.

నర్సంపేట,నేటిధాత్రి:

భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి
విముక్తి కోసం సంఘం కట్టి బడిసెలు పట్టి బాంచన్ నీ కాళ్లు మొక్కుతా అన్న చేతులతో బందుకులు ఎక్కుపెట్టి మట్టి మనుషులు చేసిన చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని ఆయన
స్ఫూర్తితో ప్రతీ ఒక్కరూ ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురయ్య 59వ వర్ధంతిని సీపీఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య బలిదానం కొలిమోలే రాజుకుంది.భూస్వాముల ఆగడాల్నీ కాల్చి బూడిద చేసింది. దొడ్డి కొమురయ్య అక్షరాస్యడు కాదు. మార్క్స్ ను చదవలేదు, మావోను అధ్యయనం చేయలేదు. కానీ వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అగ్గి రాజేశాడని వర్ణించారు. అప్పటికే జాగీర్దార్ల, జమీందార్ల, దేశముఖ్ ల ఆగడాలతో విసిగి వేసారిన తెలంగాణ పల్లెలు ఆవేదన, ఆగ్రహంతో లావాలా కుతకుత ఉడికి పోతున్నాయి. ముఖ్యంగా విస్నూర్ దేశముఖ్, రాపాక రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు బాబు దొర అరాచకాలు పల్లెలను నిద్ర లేకుండా చేసాయి.దొరల అణిచివేతకు,అరాచకాలకు వ్యతిరేకంగా,కౌలు,లెవీ రద్దు చేయాలని,కూలిరేట్లు పెంచాలని, పేదలకు భూములు పంచాలని, వెట్టిచాకిరి నిర్మూలించాలని కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజా పోరాటాలు పెరిగాయని పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనలు, సభలు, వినతులు వంటి ప్రజాస్వామిక పద్ధతులలో పోరాటాలు జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రజా నిరసన ప్రదర్శన 1946, జూలై 4న విస్నూర్ దేశముఖ్ ఇలాకాలోని కడవెండి గ్రామంలో ప్రారంభిమైంది. విస్నూర్ రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ గడి ముందుకు ప్రదర్శన చేరగానే, ఆయన గూండాలు ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు. ప్రదర్శనలో ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమురయ్య తుపాకీ గుళ్ళకు బలయ్యాడని బాబు తెలిపారు.ఈ వార్త దావానలంలా తెలంగాణ పల్లెలన్నీ ఆవహించింది.ప్రజల్లో అప్పటికే రగులుకొంటున్న అసంతృప్తి ఒక్క ఉదుటున పెల్లుబికింది. ఆగ్రహంతో కుతకుత ఉడుకుతున్న అగ్ని పర్వతం కడవెండిలో బద్దలైందన్నారు.ఈ నేపథ్యంలో కొమురయ్య బలిదానం తెలంగాణను కొలిమోలే రాజేసింది.ఊరూరా ప్రతిఘటన పోరాటాలు ఉవ్వెత్తునలేచాయి. భూస్వాముల గూండాల నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు గొడ్డలి, పార, పలుగు, గుతుపకర్ర, వడిశెల వంటి వ్యవసాయ పనిముట్లను ఆత్మరక్షణ ఆయుధాలుగా మలుచుకున్న క్రమంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటరూపం తీసుకున్నదని పేర్కొన్నారు.కాగా ఈ పోరాటంలో భూస్వాముల గడీలు నేలమట్టమయ్యాయి. దొరలు పల్లెలిడిచి పట్నంకు పరుగు తీసిండ్లు. వేలాది గ్రామాలు భూస్వాముల పాలన నుండి విముక్తి చెందాయన్నారు.ఆ పోరాటం ముందుకుతెచ్చిన ఎంజెడా ఇంకా మిగిలే ఉందన్నారు. మరోవైపు దేశంలో కార్పొరేట్ శక్తుల, మతోన్మాదుల కూటమి దేశాన్ని పట్టిపీడిస్తున్నదని,ప్రజా వనరులన్నిటిని దోచి బడా పెట్టుబడిదారుల ఖజానా నింపుతున్నదని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, పరికి మధుకర్ పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ మండల, పట్టణ నాయకులు బుర్రి ఆంజనేయులు, పుచ్చాకాయల నర్సింహా రెడ్డి, నాయకులు లక్క రాజు, తోటకూరి రాజేష్, కందికొండ సంతోష్, వీరన్న, ప్రశాంత్, నర్సింహారాములు తదితరులు పాల్గొన్నారు.

పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

 

పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం చాలా దురదృష్టకరం

మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

ఎన్ హెచ్ ఆర్ సి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ

“నేటిధాత్రి”,పటాన్ చెరు / సంగారెడ్డి జిల్లా:

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ అన్నారు. మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, క్షతగాత్రులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏమిటనే అంశంపై పూర్తి విచారణ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యమయ్యాయని, ఇంకా 13 మంది మృతదేహాల అచూకీ వెంటనే కనుగొనడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి ఇండస్ట్రియల్స్ ను రద్దు చేయాలని, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం మరియు సిగాచి రసాయనిక పరిశ్రమ యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు..

 

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు”

● – ఎస్సై వినయ్ కుమార్….

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. గురువారం జహీరాబాద్ పట్టణ పరిధిలోని భవాని మందిర్ చౌరస్తా, బీదర్ చౌరస్తా లలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని అన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ వైలేషన్, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ సరిగా లేని, పత్రాలు లేని, సెల్ ఫోన్ డ్రైవింగ్ తదితర నిబంధనలు ఉల్లంగించిన వాహనాలకు రూపాయలు 17100 జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెద్దాం…

◆: ప్రతిపక్ష బిఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దాం

◆: జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ యువనాయకులు మహమ్మద్ షౌకత్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్వ వైభవం తేద్దామని జహీరాబాద్ యువనాయకులు రాంజోల్ మండలం మహమ్మద్ షౌకత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న చారిత్రాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ శ్రేణులు, నాయకులు సమిష్టి కృషితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. బిఆర్ఎస్, బీజేపీల చీకటి ఒప్పందాలను బహిర్గతం చేద్దామని, అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో బలంగా ఉన్న ఆ పార్టీలను ఎదుర్కొనేందుకు నావంతు కృషి చేస్తానాని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, భూభారతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేద వర్గాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, రూ 500 లకే వంట గ్యాస్ సిలిండర్, తెల్ల రేషన్ కార్డుల మంజూరి, ఖాళీ పోస్టుల భర్తీ తదితర పథకాలు అమలుతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని, వారికి స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో అవకాశం కల్పిస్తునదని స్పష్టం చేశారు. త్వరలో సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించి పార్టీ శ్రేణుల కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిగా మంత్రి గారి మద్దతు ఉంటుందని తెలిపారు.

హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో..

 

హెల్త్ హబ్ గా పేరుగాంచిన వరంగల్ జిల్లాలో వ్యాధులను నిర్మూలించాలి

రోగనిర్ధారణ పరీక్షల లక్ష్యాలను అధిగమించాలి.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి,తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తుందని,టీబీ రహిత జిల్లాగా మార్చుటకు తగిన చర్యలు తీసుకుంటామన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలుపుతూ భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అదనపు కార్యదర్శి – అరుంధతి పట్నాయక్ ఎం.డీ (ఎన్ హెచ్ ఎం) ఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టి.బి ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ పై సమీక్షించారు.వరంగల్ కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,అదనపు కలెక్టర్ జి.సంధ్యరాణితో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు.జిల్లాలో 8 రకాల వ్యాధి కారకాల బారిన పడే వ్యాధిగ్రస్తుల సంఖ్య 2,04,979 మంది ఉన్నారని వారికి 3,794 మందికి జూన్ 3 నుండి రెండో విడత టిబి,మరియు 8 రకాల వ్యాధి గ్రాస్తులకి స్క్రీనింగ్ పరీక్షలు చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

Warangal District Collector Dr. Satya Sarada

వరంగల్ జిల్లా హెల్త్ హబ్ గా పేరుగాంచిన జిల్లాలో టి బి, తదితర 8 రకాల వ్యాధులను నిర్మూలించుటకు జిల్లా వైద్యశాఖ కృషి చేస్తున్న నేపథ్యంలో టీబీ రహిత జిల్లాగా మార్చుటకు మరింత తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు సంబంధిత వైద్య అధికారులు ,సిబ్బంది  పాల్గొన్నారు.

పేదలకు అందని ఇందిరమ్మ ఇండ్లు..

 

పేదలకు అందని ఇందిరమ్మ ఇండ్లు

బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్

ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిధులతో

కట్టేవి ఇందిరమ్మ ఇండ్లు పేరుతో

కాంగ్రెస్ కార్యకర్తల కేనా ఇందిరమ్మ ఇండ్లు

చేర్యాల రెవెన్యూ డివిజన్ పై కాలయాపన

చేర్యాల నేటిదాత్రి

జనగామ నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇండ్లలో నిరుపేదలకు అందని ద్రాక్ష ల ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నదని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంగోని సురేష్ విమర్శించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను సమకూర్చి ప్రభుత్వానికి ఇస్తే ఇందిరమ్మ ఇండ్లు పేరుతో కట్టిస్తున్నారని విమర్శించారు మరియు నిరుపేదలైన ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు అందడం లేదని జనగామ నియోజకవర్గంలో చాలా తక్కువ మందికి ఇచ్చారని చేర్యాల మున్సిపల్ పరిధిలో కేవలం 34 మందికే ఇవ్వడం వీరి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుంది అని విమర్శించారు దానిలో కాంగ్రెస్ కార్యకర్తలు కు ఇందిరమ్మ ఇండ్లు అధికం వెనుకబడిన చేర్యాల ప్రాంతం పై మీరు చూపిస్తున్న ప్రేమ ఇదేనా అని విమర్శించారు మరియు చేర్యాల రెవెన్యూ డివిజన్ 100 రోజుల్లో తీసుకువస్తానని వెళ్లిన ముఖ్యమంత్రి ఇక్కడి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎటు పోయిందని విమర్శించారు చేర్యాల రెవెన్యూ డివిజన్ తీసుకొని తప్పక వస్తానని రెండోసారి ఎంపీ ఎలక్షన్లో మాట ఇచ్చిన చామల కిరణ్ కుమార్ ఏ ముఖం పెట్టుకొని ఇక్కడి ప్రజలకు చూపిస్తున్నాడని విమర్శించారు ఇప్పటికైనా వెనుకబడిన చేర్యాల ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలు అందరికీ ఇవ్వాలని అన్నారు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఇంకా కాలయాపన చేయవద్దని అన్నారు

సామాజిక విలువలు దిగజారుతున్నాయి….!!!!

సామాజిక విలువలు దిగజారుతున్నాయి….!!!!

◆ :- దోపిడీ వ్యవస్థకు ప్రజలు అలవాటవుతున్నారు…….!!!!!!

జహీరాబాద్ నేటి ధాత్రి:

అవినీతి సమాజంలో ఎంత లోతు గా వేళ్లూనుకుని రాజ్యామెలుతుందో.ఈ మధ్య కాలం లో అవినీతి నిరోధక శాఖకు దొరికిన కొన్ని అణిముత్యాల ఆస్తుల వివరాలే ప్రత్యక్ష సాక్ష్యామిస్తున్నాయి.చిరు ఉద్యోగులు సైతం వందల కోట్లకు అధిపతులు గా ఎదగడం వ్యవస్థలోని లొసుగులను చూపిస్తున్నాయి.స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రతి చెడు పనిలో మంచి ఉందనే నమ్మకం సమాజం లోకి మెల్లి మెల్లి గా చొప్పించ బడుతుంది.ఫలితంగా ప్రజలు దోపిడికు అలవాటై పోయారు.పైసా లేనిది పని కాదనే సత్యాన్ని జీవితం లో ఓ భాగంగా చేసుకున్నారు. ఏ చిన్న పనైనా, పెద్ద పనైనా అధికారులైన, నాయకులైన సమర్పణ సమర్పించుకోవాల్సిందేనని ఫిక్స్ అయిపోయారు.అలవాటయ్యేలా వాస్తవానికి పరిస్తితులు స్టించబడ్డాయి.సమాజం లో పరపతి, పదవి లేకపోతే పచ్చి నిజం కూడా వచ్చి అబద్దంగా చిత్రీకరించ బడుతుందనే విధంగా వ్యవస్థల పని తీరు.దీనికి తోడు ఈ వ్యవస్థలకు రాజకీయ అంద ఉండడంతో నిజం న్యాయం అనే పదాల పై నమ్మకం మెల్లి మెల్లిగా తగ్గుతుంది.మెజారిటీ ప్రజలకు ధర్మ బద్దమైన పరిష్కార విధానం అనే వాక్యాల పై నమ్మకం సన్నగిల్లితుంది.సంస్థల్లో అవినీతిమయం.ఏ కార్యాలమైన లంచాల విధానం లేకుండా సాగే పరిస్థితులు లేవు.

Social values

మినుకు మినుకు మనే వెలుతురు లా అక్కడక్కడ అరా కోరా అధికారులు అవినీతి రహిత కార్యాలయాల కోసం ప్రయత్నాలు చేసినా అంతగా సఫలం కాలేక పోతున్నారు.రాజకీయ ప్రోద్భలం ఉపయోగించి అలాంటి అధికారులను బదిలీ చేయిస్తున్నా విషయాలు వెలుగు లోకి వచ్చాయి కూడా, అధికారం తోముడిపడి పదాధికారులు చెప్పు చేతుల్లో వ్యవస్థలు కీలు బొమ్మలై చంప బడుతున్నాయి.రాజకీయ దోపిడీ ట్రెండ్ మారి విధానం లో మార్పులు వచ్చాయి.ప్రజలను దోపిడీలో భాగస్వాములను చేసి, దోచుకోవడం లాంటి కొత్త ఆవిష్కరణ తో, అవినీతి హుందాగా దరాగా వర్ధిల్లుతుంది, చేసే ఆవినీతి ను అభివృద్ధి గా, చూపించుకోవాడానికి సవాలక్ష దారులున్నాయి.ముఖ్యంగా నమ్మే జనాలున్నారు.రాజకీయం పేరిట దోచుకోవడం అంటే ఎవరికి కూడా ఆశ్చర్యం వెయ్యడు.ఎందుకంటే ప్రజలు ఈ పద్ధతికి అలవాటు పడి పోయారు.జనాల్ని తమ తో కట్టి పెట్టుకునేందుకు కొన్ని పద్ధతులు అవలంబిస్తున్నారు.అందులో ముఖ్యమైనవి పధకాలు, వాస్తవంగా కొంత వరకు ఈ పధకాలు జనాలకు మేలు చేసేవి ఉన్నా అంతా కంటే ఎక్కువ ఓటు బ్యాంక్ రూపం పనికొస్తున్నాయి.రక రకాల పధకాలతో, ప్రతి పది మంది లో ఏడుగురు లబ్ది దారులైన తర్వాత జనల్లో ఏది నిజం, ఏది అబద్ధం అనే ఆలోచన నే రాధు.ఇంకా జనం లో పట్టు కోసం కుల పరంగా లెక్కలు చూసుకుని ఆయా కుల సంఘ నాయకులకో పదవి, కాస్త పరపతి కల్పిస్తే వారందరూ గుప్పిట్లో ఉంటారు.తద్వారా గ్రామ గ్రామం వరకు రాజకీయ పట్టు నిలుపుకోవచ్చు.మన సమాజం లో జరుగుతుంది ఇదే.ఈ మధ్య కొన్ని మద్యమాలు కూడా వీటికి తొడయ్యాయి.ఏదో ఓ విషయం పై చర్చ, ఆ చర్చ తో ఓ కొత్త వివాదని తెర లేపి, జనాల్ని రెండు మూడు భాగాలుగా విడదీసి, పాలకుల పని తీరును ప్రశ్నించే సమయం లేకుండా జనాల్ని మరో వైపు మళ్లించడం లో టి. వి. చానెళ్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.బదులుగా ప్రకటన లతో చానెళ్లు లబ్ది పొందడం, ఇలా ఒకదానితో మరొకటి ముడిపడి అవినీతి రాజ్య మేలుతుంది.సమాజంలో మార్పు కోరుకునేవారు లక్షల్లో వున్నారు కానీ వర్తమాన సమాజానికి అన్వయించ దగిన సరికొత్త రాజకీయ సిద్ధాంతం వారి వద్ద లేదు.అబద్దపు హామీ లు ఇస్తున్న కిక్కు వాస్తవ చేదు నిజల్లో దొరకదు, అందుకే జనం ఎవరెక్కువ పధకాలు ప్రకటిస్తే వారి వెంట వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు.జరుగుతున్నది తప్పని అక్కడక్కడ కొంతమంది.గొంతు చించుకుని అరుస్తున్నా వినేందుకు జనం సిద్ధంగా లేరు.సంస్కరణల కోసం సంఘర్షణ చేసిన వారెవరూ అంత సునాయాసంగా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు.స్వయంగా మహాత్మా గాంధీ చేసిన స్వాతంత్య్ర పోరాట ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారున్నారు.దేశ స్వాతంత్య్ర్యం ప్రకటించ బడిన తర్వాత కూడా, బ్రిటిష్ కు మద్దతుగా ర్యాలీ లు నిర్వహించిన వారున్నారు.సమయం. దాటిన తర్వాత పరిస్తితులకు తల వగ్గే జనాలు సమాజం లో ఎక్కువ..అందుకే కాబోలు, పెద్ద పెద్ద సంఘ సంస్కర్తలు సమాజం నుంచి తిరస్కరించ బడ్డ వారే ఎక్కువ.సామాజిక, రాజకీయ, సంస్కతిక విలువల్ని కాపాడేందుకు సంఘ సంస్కర్తల కోసం వేచి చూడకుండా జనమే మేల్కొనాలి.గళం వినిపించాలి.పెద్ద పెద్ద ఉద్యమాలు చేయ లేక పోయినా వ్యక్తిగతంగా తన వంతు మార్పు కోసం యువత నడుం బిగించాలి.మేధావి వర్గం కూడ అవినీతి రహిత మానవీయ సమాజాన్ని నిర్మించడానికి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మహనీయుల సేవలు చిరస్మరణీయం..

మహనీయుల సేవలు చిరస్మరణీయం

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఘనంగా రోశయ్య జయంతి,దొడ్డి కొమురయ్య వర్ధంతి నివాళులు

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహనీయుల సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి, వేడుకలను దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ మరియు జిల్లా యువజన క్రీడల శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం
దొడ్డి కొమురయ్యకు నివాళి
జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమాల్లో డి.వై ఎస్ ఓ రాందాస్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి రాజ మనోహర్ రావు,జిల్లా అధికారులు , సిబ్బంది, ఆయా కుల సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

అసత్యపు ఆరోపణలు మానుకో..

అసత్యపు ఆరోపణలు మానుకో.. బహిరంగ చర్చకు సిద్ధమా ..?

సింగల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

అసత్యంతో కూడిన కల్పిత ఆరోపణలు మానుకోవాలని సంబంధిత ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సింగల్ విండో డైరెక్టర్(21వ వార్డు ఇంచార్జ్) ధర్ని మధుకర్ మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణకు సవాల్ విసిరారు.

గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ఈనెల 2వ తేదీన స్థానిక ప్రెస్ క్లబ్ లో బేర సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడిన అసత్యపు మాటలను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

నిరాధారణమైన వాక్కులు అంత మంచివి కావని హితువు పలికారు.తాను ఎవరి భూములను అక్రమంగా తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఒకవేళ ఆధారాలతో నిరూపిస్తే దైవ సాక్షిగా ఆ భూములను ఈ ప్రాంత ప్రజలకు బే షరతుగా పంచుతానని పత్రికా ముఖంగా తెలుపుతున్నానని అన్నారు.

తగిన ఆధారాలతో శనివారం సర్వేనెంబర్ 8 లోని రైస్ మిల్లు వద్దకు వస్తే నేను అన్న మాటలకు కట్టుబడి ఉంటానని అన్నారు.

నీ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ లబ్ధి కోసం అనేక పార్టీలు మారావే కానీ నిన్ను గెలిపించి రాజకీయంగా పదవులు కట్టబెట్టిన 21వ వార్డు ప్రాంత ప్రజలకు ఏ విధంగా నువ్వు సహాయం చేయలేదని విమర్శించారు.

నువ్వు ఎంపీపీ స్థానంలో ఉండి రొడ్డ రాజేశం,గాజుల విజయలక్ష్మి,తిప్పని పద్మ, పోతురాజుల రమేష్ వంటి పేద ప్రజలకు సంబంధించిన భూములను అక్రమంగా లాక్కొని వారిని అనేక రకాలుగా ఇబ్బంది చేసిన విషయాన్ని మర్చిపోయావ అని గుర్తు చేశారు.వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా 21 వార్డులో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక రాజకీయంగా భవిష్యత్తులో తన ఉనికిని కోల్పోతాడనే ఉద్దేశ్యంతో అసత్య ప్రేలాపనలు పేలుతున్నాడని మండిపడ్డారు.

భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి తాను సిద్ధమని ప్రజల మద్దతు ఎవరికో వేచి చూడాలని సవాలు విసిరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

జపాన్‌లో రేపు ఏం జరగనుంది.

జపాన్‌లో రేపు ఏం జరగనుంది

 

 

 

 

 

జపాన్‌లో 2025 జూలై 5న ఒక పెనువిపత్తు సంభవిస్తుంది. జపాన్‌కి, ఫిలిప్పీన్స్‌కి నడుమ సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది.

  • జూలై 5న భయంకరమైన సునామీ వస్తుందంటూ..
  • 1999లో చెప్పిన జపనీస్‌ మాంగా ఆర్టిస్ట్‌ టట్సుకీ
  • కొవిడ్‌ గురించి, 2011లో జపాన్‌ను వణికించిన భూకంపం, సునామీలపై నిజమైన ఆమె జోస్యాలు
  • రెండు వారాలుగా జపాన్‌లోని టొకారో దీవుల్లో 900కు పైగా భూప్రకంపనలతో ప్రజల్లో ఆందోళన

టోక్యో, జూలై 3: ‘జపాన్‌లో 2025 జూలై 5న ఒక పెనువిపత్తు సంభవిస్తుంది.
జపాన్‌కి, ఫిలిప్పీన్స్‌కి నడుమ సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది. .
దాని ప్రభావంతో 2011లో పెను విధ్వంసం సృష్టించిన సునామీకన్నా ఎత్తైన అలలు సముద్రంలో ఏర్పడతాయి’

జపాన్‌కు చెందిన మాంగా ఆర్టిస్ట్‌, ‘న్యూ బాబా వంగా’గా పేరొందిన ర్యోటుట్సుకీ రాసిన ‘ద ఫ్యూచర్‌ ఐ సా’ పుస్తకంలో చెప్పిన జోస్యం ఇది! 1999లో మొదటిసారి ప్రచురితమైన ఈ పుస్తకం..
2021 అక్టోబరులో పునఃప్రచురితమైంది.
2019లో ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్‌ సహా ఆ పుస్తకంలో ఆమె చెప్పిన పలు జోస్యాలు నిజంకావడంతో ఇది కూడా నిజమవుతుందేమోనని జపనీయులు భయపడుతున్నారు.
గత రెండువారాలుగా దక్షిణ జపాన్‌లోని టొకారా దీవుల్లో 900కుపైగా భూప్రకంపనలు నమోదవడం వారి భయాన్ని మరింత పెంచుతోంది.
‘‘ఎప్పుడూ కదులుతున్నట్టే ఉంది.
నిద్రపోవాలంటే భయమేస్తోంది’’ అని ఆ దీవుల ప్రజలు వాపోతున్నారు.
సునామీ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని భావిస్తున్నారు.

జూన్‌ 21 నుంచి మొదలైన ఈ భూప్రకంపనల తీవ్రత క్రమంగా పెరుగుతూ తాజా గా 5.5 తీవ్రతతో ఒక భూకంపం నమోదుకావడంతో జపాన్‌ వాతావరణ సంస్థ అప్రమత్తమైంది. అయితే..

టట్సుకీ జోస్యాన్ని నమ్మలేమని, అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి సహేతుకమైన, శాస్త్రీయ ఆధారాలూలేవని జపాన్‌ వాతావరణ సంస్థ అధికారులు కొట్టిపారేస్తున్నారు.

12 దీవుల సమాహారమైన టొకారాలో..

7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు.

4 ప్రధాన టెక్టానిక్‌ ప్లేట్ల నడుమ ‘పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’గా పేర్కొనే ప్రాంతంలో ఉండే జపాన్‌కు భూప్రకంపనలు కొత్తకాదు.

ముఖ్యంగా టొకారో దీవుల్లో ఉండే వారికి భూప్రకంపనలు సాధారణమే.

2023 సెప్టెంబరులో అక్కడ 346 ప్రకంపనలు నమోదయ్యాయి.

కానీ టట్సుకీ చెప్పిన తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఇన్ని ప్రకంపనలు వారిని భయపెడుతోంది.

 

టట్సుకీ జోస్యం గురించి విస్తృతంగా ప్రచారంకావడంతో చైనా, దక్షిణ కొరియా, తైవాన్‌ దేశాల నుంచి జపాన్‌కు ఎక్కువగా వచ్చే పర్యాటకుల సంఖ్య మూడు నెలలుగా బాగా తగ్గిపోయింది.

కిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో పర్యాటకుల సంఖ్య 50శాతం తగ్గింది.

సాధారణంగా హాంకాంగ్‌ నుంచి జపాన్‌కు వెళ్లే పర్యాటకులు సంఖ్య ఎక్కువుంటుంది.

జూన్‌-జూలై నెలల్లో హాంకాంగ్‌ నుంచి జపాన్‌కు విమాన టికెట్ల బుకింగ్‌లు 83శాతం పడిపోయాయి.

బుకింగ్‌లు లేకపోవడంతో దక్షిణ జపాన్‌లోని పలు నగరాలకు ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో నడపాల్సిన విమానాలను హాంకాంగ్‌ ఎయిర్‌లైన్స్‌ రద్దు చేసింది.

తస్మాత్‌ జాగ్రత్త: ‘2020 ఏప్రిల్‌లో ప్రపంచమంతా ఒక వైరస్‌ వ్యాపిస్తుంది..

’’అంటూ కొవిడ్‌ గురించి టట్సుకీ 1999లోనే జోస్యం చెప్పారు.

అది నిజమైంది.

ఆమె జోస్యం అక్కడితో ఆగలేదు.

‘‘ఆ వైరస్‌ కొంతకాలంపాటు మాయమై 2030లో మరింత ప్రాణాంతకంగా మారి మళ్లీ వస్తుంది’ అని చెప్పారు.

ఆమె చెప్పినట్టే జపాన్‌లో ఇప్పుడు సునామీవస్తే 2030ని తల్చుకుని ప్రపంచం వణికిపోవడం ఖాయం!

మిల్లర్‌ ‘‘జగన్‌’’కు అధికారులు నోటీసులిచ్చారు..చేతులు దులుపుకున్నారు?

త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో చెప్పిన సివిల్‌ సప్లై ‘‘కమీషనర్‌ చౌహాన్‌.’’

-జగన్‌ నుంచి సమాధానం రాకపోతే అధికారులు ఏం చేస్తున్నారు?

-మాయమైన వడ్లను జగన్‌ అప్పగిస్తానంటున్నాడని సమాచారం?

-వడ్లు తిరిగి ఖమ్మం సివిల్‌ సప్లయ్‌కి అప్పగిస్తే తప్పు ఒప్పవుతుందా?

-మోసం చేసిన మిల్లర్‌కు శిక్ష తప్పుతుందా?

-ఖమ్మం జేసినే తప్పుపడుతూ వున్న జగన్‌ను హన్మకొండ అధికారులు వదిలేస్తారా?

-రైతులను మోసం చేసిన జగనే ‘‘నేటిధాత్రి’’ మీద కేసులు నమోదు చేస్తుంటే చూస్తూ

ఊరుకుంటారా?

-రేపటి రోజు హన్మకొండ అధికారులు ‘‘కోర్టు’’కు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.

-మోసం చేసిన జగన్‌పై చర్యలేవీ అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు?

-‘‘నేటిధాత్రి’’ వల్లనే జగన్‌ మోసం వెలుగులోకి వచ్చింది.

-జగన్‌ ప్రభుత్వాన్ని మోసం చేశాడని తెలిసింది.

-మోసం చేసిన జగనే ‘‘నేటిధాత్రి’’ మీద కేసు నమోదు చేయడం బరితెగింపు కాదా?

-రైతులను మోసం చేయాలనుకునే మిల్లర్లు పెరిగిపోరా?

-అది ప్రభుత్వ చేతగాని తనం అనిపించుకోదా!

-దొంగే దొంగ అని అరిచి ఇంకా ఎవరి కళ్లుగప్పాలనుకుంటున్నాడు?

-జగన్‌ చేసిన మోసం అధికారుల మెడకు చుట్టుకోదా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

హన్మకొండ సివిల్‌ సప్లై శాఖ ఏం చేసింది? ఏం చేస్తోంది? అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త చర్చగా మారింది. హన్మకొండకు చెందిన మిల్లర్‌ జగన్‌ చేసిన నిర్వాకం అందరికీ తెలుసు. ఖమ్మం జిల్లా నుంచి వడ్లు వచ్చాయన్నది నిజం. హన్మకొండ జిల్లాకు చెందిన కొంత మంది మిల్లర్ల పేరు మీద ఆర్వోలు జారీ అయ్యాయని తెలుసు. ఆ మిల్లులకే తొలత వడ్లు చేరాయన్నది నిజం. చేరిన వడ్లు ఆ మిల్లర్లు తీసుకోవడం లేదని హన్మకొండ సివిల్‌ సప్లై అధికారులు లేనిపోనివి సృష్టించారన్నది తెలుసు. ఖమ్మం నుంచి వచ్చిన వడ్లు ఆ మిల్లలకు కాకుండా, మరుసటి రోజులు అర్ధాంతరంగా మిలర్ల జగన్‌ మిల్లులకు తరలిపోయాయన్నది నిజం. ఆ మిల్లర్‌ అధికారుల ఆశీస్సులతో ఆ వడ్లు తన మిల్లలకు చేరవేసుకున్నారన్నది నిజం. ఈ విషయంలో తొలత ఖమ్మం జేసికి సమాచారం ఇవ్వలేదన్నది నిజం. తర్వాత వడ్ల లెక్కల్లో తేడాలొచ్చాయన్నది నిజం. ఆ విషయం ఖమ్మం జిల్లా జేసి గుర్తించారన్నది నిజం. వెంటనే జగన్‌కు ఖమ్మం జేసి తాఖీదులు పంపిచారన్నది నిజం. ఈ విషయాలన్నీ నేటిధాత్రి అక్షరం పొల్లు పోకుండా నిజాలు రాసిందన్నది కూడా వాస్తవం. ఇక్కడ వడ్లు చెందాల్సిన మిల్లులకు చెరలేదు. చెందలేదు. కాని ముందు లిస్టులో లేని జగన్‌ మిల్లులు వడ్లు తరలించిన అధకారులు బాగానేవున్నారు. వచ్చిన వడ్లు తమ మిల్లులకు చేరకపోయినా మిల్లర్లు సైలెంట్‌గానే వున్నారు. ఆ మిల్లులకు న్యాయం జరగాలన్న నేటిదాత్రికి మిల్లర్‌ జగన్‌ నోటీసులు పంపడం జరిగింది. అంటే అక్రమంగా వడ్లను మిల్లులకు తరలించిన వ్యక్తే, తనకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడం అంటే దొంగే దొంగ అని అరిచినట్లే వుంది. అసలు హన్మకొండ అధికారులు ఎవరి మేలు కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలు చెల్లించిన జీతాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. పైగా మిల్లర్‌ జగన్‌కు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మిల్లర్‌ జగన్‌ ఆగడాలకు వంత పాడుతున్నారు. ఖమ్మం జిల్లా జేసి పంపిన వడ్ల లెక్కలు చూసుకునే తీరిక హన్మకొండ అధికారులకు లేదు. మరి అధికారులు ఏం చేస్తున్నట్లు? రైతులకు, ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టే వారిపై వార్తలు రాసినందుకు నేటిధాత్రికి నోటీసులు పంపడాన్ని అధికారులు ఎలా సమర్ధించుకుంటారో కోర్టులో తేలుతుంది. రైతులను మోసం చేసి తిరిగి న్యాయస్ధానాలను కూడా తప్పుతోవ పట్టించాలని చూస్తున్న జగన్‌ సంగతి తేలుతుంది. రైతులను మోసం చేసి, ప్రభుత్వం కళ్లుగప్పి నేరం చేసిన అక్రమార్కులకు కూడా పరువు అనేది ఒకటి వుంటుందా? అది పరువుకు భంగం కలుగుతుందా? తప్పు చేసినప్పుడు పరువు గుర్తుకు రాలేదా? మోసం చేసినప్పుడు పరువు పోతుందన్న ఆలోచన రాలేదా? నేటిధాత్రి నిజాలు వెలుగులోకి తేవడం వల్ల పరువు పోయిందా? పరువుగా బతకాలనుకున్నప్పుడు తప్పు చేయడమే విడ్డూరం. తప్పు చేసిన తన పరువును వెతుక్కోవాలనుకోవడం నిజంగానే విచిత్రం. అందుకే జగన్‌ వ్యవహారం చూసేందుకు ఏకంగా సివిల్‌ సప్లైశాఖ కమీషనర్‌ చౌహన్‌ రంగంలోకి దిగుతున్నట్లు నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పారు. ఇంతటి దుర్మార్గం ఎందుకు జరుగుతోంది? అధికారులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అందరి లెక్కలు తేల్చుతా? అని చెప్పారు. ఎందుకంటే హన్మకొండ జాయింట్‌ కలెక్టర్‌ మిల్లర్‌ జగన్‌కు నోటీసులు పంపించానంటున్నారు. తాను చేసింది పొరపాటు అని ఒప్పుకోని జగన్‌, మాయమైన వడ్లను తిరిగి ఇచ్చేస్తానని చెబుతున్నట్లు సమాచారం అందుతోంది. అంటే మాయం చేసిన వడ్లను తిరిగి సివిల్‌ సప్లై శాఖకు అప్పగిస్తే చేసిన నేరం మాసిపోతుందా? తప్పు ఒప్పవుతుందా? అందుకు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం వుంది. అందుకే నేరుగా కమీషనర్‌ చౌహన్‌ రంగంలోకి త్వరలో దిగుతున్నట్లు చెబుతున్నారు. అక్రమ మిల్లర్‌ జగన్‌, వార్తలు రాసిన నేటిధాత్రిపై కేసులు నమోదు చేస్తే అధికారులు కూడా కోర్టుకు హజరుకాకతప్పుతుందా? మిల్లర్‌ జగన్‌ను అధికారులు ప్రోత్సహించినట్లు స్పష్టమైన ఆదారులున్నాయి. ఖమ్మం నుంచి వచ్చిన వడ్లు మిల్లర్‌ జగన్‌కు పంపలేదు. కాని ఆ వడ్లు హన్మకొండకు వచ్చి, ఆర్వోలున్న మిల్లుల వద్దకు లారీలు చేరుకున్న తర్వాత దారి మళ్లింపబడ్డాయి. అధికారుల పర్యవేక్షణలోనే అవి జగన్‌ మిల్లులకు చేరాయి. అందుకు కారణాలు అధికారులు ఎన్ని చెప్పినా సమర్ధనీయం కాదు. అంతే కాకుండా ఈ విషయాలన్నీ నేటిదాత్రి రాయడం వల్లనే వెలుగులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ స్పందించాల్సి వచ్చింది. మిల్లర్‌ జగన్‌కు నోటీసులు పంపడం జరిగింది. అసలు వడ్లు తన మిల్లులకు మళ్లించుకుపోవడమే జగన్‌ చేసిన తొలి నేరం. తర్వాత ఆ వడ్ల లెక్కలను తారు మారు చేసి వాటిని మాయం చేయడం అతి పెద్ద నేరం. ఇన్ని నేరాలు చేసిన వ్యక్తి నేటిధాత్రికి నోటీసులు పంపించడం అంటేనే ఆయన వెనుక అధికారులు సపోర్టు ఎంత వుందనేది తెలిసిపోతోంది. ఇలా నేరం చేసిన వారే న్యాయస్దానాలను ఆశ్రయిస్తున్నానని ఎవరిని బెదిరిస్తారు? న్యాయాన్ని ఎవరూ బెదించలేరు. అన్యాయం ఎప్పటికీ గెలవలేదు. కమీషనర్‌ చౌహాన్‌ రంగంలోకి దిగిన తర్వాత అంతా తేలుతుంది. జగన్‌ వ్యహారం బండారం అంతా బైటపడుతుంది. అదికారులు తీరు అంతా వెలుగులోకి వస్తుంది.

N.Ramachandra Rao elected As New President of BJP

– Acceptable leader for all groups

– Long association with RSS

– Dedicated worker since the beginning

– Coming three years considered as peaceful one

– Before elections Bandi Sanjay may pick up as President

– Etela, Aravind were not considered

After several months of hiatus, the BJP has finally picked a new face to lead the party in Telangana. Old timer and loyalist N Ramachandra Rao has been named as the new BJP state president. Rao repalced Union Coal and Mines Minister G. Kishan Reddy who was elected as the BJP’s state unit president in July 2023 replacing Bandi Sanjay Kumar. Pertinently, Union Minister of State and former BJP state president Bandi Sanjay pitched for Rao’s candidature. And Rao has the backing of Rashtriya Swayamsevak Sangh (RSS). It is said that for the next 3 years, Rao will lead the party in the state, and then Bandi Sanjay might take over before General elections. Though Sanjay was removed from the president’s post in the last elections, the BJP top brass still looks at him as someone who can take on the Opposition in Telangana.
In an interesting development, former MLC N Ramachandra Rao has reportedly been directed to file nomination for the State BJP president post, even as the nomination filing process was underway at the BJP office here on Sunday. The move clearly indicates the national leadership’s preference in selecting the new State president. Interestingly, Malkajgiri MP Etala Rajender, Union Minister of State for Home Bandi Sanjay, former MP DK Aruna and Goshamahal MLA T Raja Singh were among the key contenders for the post. In a video message, Raja Singh appealed to the party to consult both grassroots workers and senior leaders before finalising the new State president. However, the party’s directive to Ramachandra Rao appeared to go against this appeal. As there were no other nominations filed, N. Ramachandra Rao get elected in unanimous. Union Minister of State MSME Shobha Karandleage acted as Central Returning officer. Elections were held at BJP state head quarters in Hyderabad.
In Telangana, the party is understood to have decided in favour of Ramachander Rao after a section of Telangana RSS leaders and one faction in the party had recommended his name to the leadership. He has strong roots in the RSS and was tempered in the school of ABVP. He has also remained loyal to the saffron party since the time he joined. In fact, he is a dyed-in-the-wool BJP leader. The party veered to the conclusion that Ramachander Rao fits the bill since he is acceptable to all sections in the party. Though he belongs to the Brahmin community he has been chosen to keep the party afloat till the elections arrive three and a half years from now. The party is understood to have decided on the pros and cons of other leaders, but each one has his own disadvantage of opposition from one or the other groups in the party.
For instance, if Eatala is taken as president, there might be objection to him from Bandi Sanjay Kumar’s group, and if the latter is asked to helm the party, there might be opposition from Eatala and even Union Minister Kishan Reddy. Nizamabad MP Aravind Dharmapuri, who was also in the race for the president’s post, seemingly was not considered. The camaraderie between Union Home Minister Amit Shah and Bandi Sanjay indicated that the top brass takes his words seriously. And therefore they agreed on Rao. Even Arvind has opposition in the party, but when it comes to Ramachandra Rao, he is an acceptable leader. The party seemed to have decided against Eatala Rajender because of his long association with the BRS and also is under a cloud now in the wake of his role in the construction of Kaleshwaram project by Justice PC Ghose Commission of Inquiry. Being given many opportunities within the BJP, is still seen as someone who supports the BRS in the state. It may be recalled that Eatala Rajendra was once a minister in the BRS Chief K Chandrashekar Rao’s government. He left the party after fallout with KCR. During the inauguration of the Turmeric board in Nizamabad, when Amit Shah asked the audience to raise their hands if they think BRS is corrupt and the large-scale corruption was done in the Kaleshwaram Project, Eatala did not lift his hand. This did not go unnoticed. Party members have time and again informed the national leadership of Eatala’s closeness to a few BRS leaders. The party did not appear to be in the mood to take any chances. Ever since Bandi Sanjay was eased out as the party’s Telangana president ahead of the 2023 Assembly elections, Union Minister G Kishan Reddy has been handling both responsibilities.
Rao, 66, is an advocate from Telangana. From 2015 to 2021, he was a Member of the Telangana Legislative Council (MLC) for Hyderabad, Ranga Reddy, and Mahabubnagar Graduates’ Constituency. He has also been in charge of the Bharatiya Janata Party’s membership drive in Telangana. Rao started his legal practice in Hyderabad in 1985. In 2014, he was elected as a member of the Bar Council of India. He has also been BJP’s Chief Spokesperson and the General Secretary of undivided Andhra Pradesh. Rao’s father, Professor NVRLN Rao, was Dean of the Faculty of Engineering for Osmania University. His daughter, Amuktha Naraparaju, is based in Australia and works in the IT sector. His son, Avaneesh Naraparaju, is a practising lawyer at the Telangana High Court. Rao took to politics while at Picket Kendriya Vidyalaya school during the Emergency. He was elected President of the Students’ Union (affiliated to Akhil Bharatiya Vidyarthi Parishad, (ABVP) for three straight years while studying Bachelor of Arts at Railway Degree College. He has also been secretary (ABVP) of Osmania Law College Student Union. Rao was jailed 14 times during his student years. Rao attended high school in 1977 at Kendriya Vidyalaya in Picket Secunderabad. He did a BA from Railway Degree College, Secunderabad in 1980 and got a Master of Arts (Political Science) from Osmania University in 1982. Rao did a Bachelor’s in Law from Osmania University in 1985.
After election N. Ramachandra Rao expressed his deepest gratitude to the people of Telangana for their unwavering faith in our shared vision for the state. He also thanked the Almighty for bestowing upon me this immense responsibility to serve our great land and its spirited citizens. This opportunity is a solemn mandate to work relentlessly for the aspirations of every heart of the people of Telangana. He conveyed his heartfelt thanks to Hon’ble Prime Minister Shri NarendramodiJi, Union Home Minister Shri AmitShah Ji, & BJP National President Shri @JPNaddaJi for reposing their trust in me. He also expressed his gratitude to all other senior leaders at Central and state level for extending their support to him to become the president of BJP State unit.
It is very common that after election of any leader there appears some discontent among the party leaders who contended for the post. Likewise after election of Ramachandra Rao also some mixed response appeared among the party leaders of various levels. After becoming the new president of BJP, there will be great challenge for Ramachadra Rao in the form of Jubilee Hills by election. At the same time huge task before new president is to bring leaders belong to various sections under one umbrella. It is believed that being dedicated leader and with smooth behaviour Ramachandra Rao will become successful in bringing all such leaders and make them to move towards the party goals. When compare to other leaders who contended for this post, he has no groups will become an advantage for him to consolidate his position. At the same time his prolonged career in RSS and good relations in party higher level as well as his long time association with the state level leaders who worked for the party since the beginning will give edge for him. Before election of Ramachadra Rao party brought ‘M-3’ formulae forefront in order to pacify ‘Munnuru Kapu, Mudiraj and Madiga’ sections. As part of this Madakrishna Madiga received with good preference by awarding him with ‘Padmasri’. SC sub cast classification also brought to implementation. Now new state president Ramachandra Rao has Hercules task to coordinate all these three sections as per the wish of the party.

బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్‌. రామచంద్రరావు

అన్ని గ్రూపులకు ఆమోదయోగ్య నాయకుడు

ఆర్‌ఎస్‌ఎస్‌తో విడదీయరాని అనుబంధం

తొలినాటినుంచి నిబద్ధ పార్టీ కార్యకర్త

రాబోయే మూడేళ్లు రాజకీయంగా శాంతియుత కాలం

ఎన్నికల ముందు మళ్లీ బండి సంజయ్‌కే ఛాన్స్‌?

ఈటెల, అరవింద్‌ను పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కొన్ని నెలలుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్‌ తొలగింది. మొదట్నుంచీ పార్టీలో నిబద్ధ కార్యకర్తగా పనిచేసిన ఎన్‌. రామచంద్రరావు నూతన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఇప్పటివరకు కేంద్ర బగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీకి సారథ్యం వహిస్తున్నారు. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించిన తర్వాత 2023 జూలై నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. కాగా ఎన్‌. రామచంద్రరావుకు మొదట్నుంచీ ఆర్‌.ఎస్‌.ఎస్‌.తో మంచి అనుబంధం వుంది. ఆయన సంఫ్‌ు కార్యకర్తగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఆయనకు రాష్ట్ర ఆర్‌.ఎస్‌.ఎస్‌. నుంచి సంపూర్ణ మద్దతు లభించడం కూడా ఒక కారణం. రాబోయే మూడేళ్ల కాలం ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. తర్వాత వచ్చే ఎన్నికల ముందు బండిసంజయ్‌కి పార్టీ పగ్గాలను తిరిగి అప్పగించే అవకాశాలున్నాయి. బండిసంజ య్‌ను పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించినప్పటికీ, కేంద్ర నాయకత్వం, ఆయన మాటకు అత్యంత విలువనిస్తుంది. బీజేపీని నాటి అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమన్న స్థాయికి తీసుకెళ్లిన ఆయన సేవలను పార్టీ అధిష్టానం ఇప్పటికీ గుర్తిస్తోంది.
గతనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో, కేంద్ర నాయకత్వం రామచంద్రరావును నామినేషన్‌ దాఖలు చేయాలని కోరడం విశేషం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి విషయంలో కేంద్ర నాయకత్వం ఒక స్పష్టమైన వైఖరి తో వున్నదని దీంతో స్పష్టమైంది. అయితే మల్కాజ్‌గిరి ఎం.పి. ఈటెల రాజేందర్‌, నిజామాబాద్‌ ఎం.పి. అరవింద్‌కుమార్‌, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, మహబూబ్‌నగర్‌ ఎం.పి. డి.కె. అరుణ కూడా ఈ పదవికి పోటీదార్లుగా వున్నారు. అయితే రాజాసింగ్‌ ఒక వీడియోను విడుదల చేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగానే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగాలని కోరారు. కానీ అధిష్టాం దీన్ని పట్టించుకోలేదు. కేంద్ర ఎంఎస్‌ఎంఈ సహాయ మంత్రి శోభ కరండల్‌జీ కేంద్ర ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కాగా రామచంద్రరావు ఒక్కరే నామినేషన్‌ ఫైల్‌ చేసిన నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
తెలంగాణ ఆర్‌.ఎస్‌.ఎస్‌. విభాగం, రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం రామచంద్రరావు పేరును సిఫారసు చేయడం ఈ ఎన్నికకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆయనకున్న విడదీ యరాని అనుబంధం, ఎబీవీపీలో రాజకీయ పాఠాలు నేర్చుకోవడం, మొదట్నుంచీ బీజేపీకి విధేయంగా వుండటం, పార్టీలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్య నాయకుడు కావడం ఆయనకు కలిసొచ్చిన అంశాలు. పార్టీ మిగిలిన వారిని పరిశీలించినప్పటికీ, ఒక్కక్కరికీ ఒక్కో రకమైన ప్రతి కూలత వుండటాన్ని కూడా పార్టీ నాయకత్వం గుర్తించింది. వీరిలో ఎవరికి అవకాశమిచ్చినా ఇతర వర్గాలనుంచి అసమ్మతి చెలరేగే ప్రమాదమున్న సంగతిని అర్థం చేసుకునే చివరకు రామచం ద్రరావువైపు మొగ్గు చూపింది. ఉదాహరణకు ఈటెల రాజేందర్‌ను, ఇటు బండిసంజయ్‌ వర్గం, కిషన్‌ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. ఇక బండిసంజయ్‌ అభ్యర్థిత్వాన్ని ఈటెల, కిషన్‌రెడ్డి అడ్డుకుంటారు. నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ కుమార్‌ను పార్టీ పరిగణలోకి తీసుకోలేదు. అమిత్‌ షాతో అత్యంత సాన్నిహిత్యం వున్న నేపథ్యంలో బండి సంజయ్‌ మాటకు విలువ ఎక్కువ. ఆయన రామచంద్రరావుకు మద్దతు ప్రకటించినట్టు తెలుస్తోంది. అరవింద్‌ కుమార్‌కు కూడా రా మచంద్రరావు అభ్యర్థిత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇక ఈటెల రాజేందర్‌ విషయానికి వ స్తే ఇప్పటికీ ఆయనకు బీఆర్‌ఎస్‌ నాయకులతో సాన్నిహిత్యం వుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఆయన్ను కూడా ప్రశ్నించడం మరో కారణం. ఆయనకు ఎన్ని అవ కాశాలిచ్చినా బీఆర్‌ఎస్‌ పట్ల సానుభూతి వున్న నేతగానే పేరుపడ్డారు. కె.సి.ఆర్‌. ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత కె.సి.ఆర్‌.తో వచ్చిన విభేదాల కారణంగా పార్టీనుంచి బయటకు వచ్చారు. అదీకాకుండా తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి నిజామాబాద్‌ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ అవినీతి పార్టీ అని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అంగీకరించేవారు చేతులెత్తమని కోరగా, పాల్గన్నవారిలో చాలామంది చేతులెత్తారు. కానీ ఈటెల రాజేందర్‌ మిన్నకుండిపోయారు. దీన్ని అధినాయకత్వం గుర్తింలేదనుకుంటే పొరపాటే. పార్టీ నాయకత్వం వివిధ నేతల వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. ఈ అంశం కూడా రాష్ట్ర నాయకులు అమిత్‌ షా చెవిన వేయకుండా వుండరు. ఇవన్నీ ఈటెల రాజేందర్‌ ఎ న్నికకు ప్రతికూలంగా మారాయి.
ఇక ఎన్‌. రామచంద్రరావు (66) ప్రస్తుతం అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. 2015 నుంచి 2021 వరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గం నుంచి ఎం.ఎల్‌.సి.గా తెలంగాణ శాసనమండలిలో కొనసాగారు. అంతేకాదు రాష్ట్రంలో బీజేపీ మెంబర్‌షిప్‌ డ్రైవ్‌కు ఆయన ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. 1985లో రామచంద్రరావు అడ్వకేట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2014లో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్‌ ఎన్‌వీఆర్‌ఎల్‌ఎన్‌ రావు, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ ఫ్యాకల్టీ డీన్‌గా పనిచేశారు. రామచంద్రరావు కుమార్తె ఆముక్త నారపరాజు ఆస్ట్రేలియాలో ఐ.టి. రంగంలో పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అవినాష్‌ నారపరాజు తెలంగాణ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీసు చేస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో పికెట్‌ కేంద్రీయ విద్యాయంలో చదువుతున్న కాలంలో రామచంద్రరావు రాజకీయాల్లోకి ప్రవేశించారు. రైల్వే డిగ్రీ కళాశాలలో చదువుతున్న కాలం లో ఆయన ఏబీవీపీ రాష్ట్ర యూనియన్‌కు మూడేళ్ల పాటు అధ్యక్షుడిగా వరుసగా ఎన్నికయ్యారు. ఉస్మానియా లా కాలేజీ యూనియన్‌కు ఎబివిపి తరపున అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాను చదువుకుంటున్న కాలంలో 14సార్లు జైలుకెళ్లారు. 1982లో ఆర్డ్స్‌ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీనుంచి మాస్టర్స్‌ డిగ్రీని సంపాదించారు. 1985లో బ్యాచులర్‌ ఆఫ్‌ లా డిగ్రీని ఇదే యూనివర్సిటీనుంచి పొందారు.తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, తనపట్ల అచంచల వి శ్వాసం వ్యక్తం చేసిన తె లంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్పూర్తిదాయక రాష్ట్ర ప్రజలకు సేవచేసే గురుతర బాధ్యతను అప్పగించిన నరేంద్ర మోదీ, అమిత్‌ షా, జె.పి. నడ్డాలకు కృతజ్ఞత లు తెలిపారు. ఇదే సమయంలో తనకు రాష్ట్ర పార్టీ నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
రామచంద్రరావు ఎన్నికపై పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తం కావడం మామూలే. మరెవరు ఎన్ని కౖౖెనా ప్రతికూల గ్రూపుల నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం సహజమే. అయితే ఏ గ్రూపునకు చెందనివాడు కావడంతో అందరి ఆమోదాన్ని రామచంద్రరావు పొందగలిగారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత రామచంద్రరావుకు జూబిలీ హిల్స్‌ ఉప ఎన్నిక రూపంలో సవా లు ఎదురుకానుంది. అంతేకాదు పార్టీలోని వివిధ గ్రూపుల మధ్య కూడా సమన్వయం సాధించడం ఆయన ముందున్న మరో సవాలు. కాకపోతు మృదుస్వభావి, అందరినీ కలుపుకుపోయే స్వభావం వున్న నాయకుడిగా రామచంద్రరావుకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. అంతేకాదు అందరినీ పార్టీ ఉమ్మడి లక్ష్యాలవైపు నడిచేలా చేయడానికి కూడా ఆయన పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాకపోవచ్చు. పార్టీ కేంద్ర మరియు రాష్ట్ర నాయకత్వాలతో సన్నిహిత సంబంధాలు, మొద ట్నుంచీ పార్టీకి విశ్వసనీయ కార్యకర్తగా పనిచేసిన అనుభవం ఆయనకు సానుకూలంగా మారనున్నది. అయితే రామచంద్రరావు ఎన్నికకు ముందే పార్టీ ‘ఎం`3’ ఫార్ములాను ముందుకు తెచ్చింది. ‘ముదిరాజ్‌, మున్నూరు కాపు, మాదిగ’ వర్గాలను ఆకర్షించేందుకు పార్టీ రూపొందించిన ఫార్ములా ఇది. దీన్ని రామచంద్రరావు గట్టిగా అమలు చేసి ఆయా వర్గాలు పార్టీవైపు మళ్లేలా చేయాల్సి వుంటుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, మాదిగ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగను తన పక్కనే కూర్చోబెట్టుకోవడమే కాదు, ఎస్సీ ఉపకుల వర్గీకరణకు కూడా సానుకూలంగా స్పందించారు. సుప్రీంకోర్టు కూడా అనుకూల తీర్పునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలో దీన్ని అమలు చే శారు. ఇదే మాదిరి మిగిలిన రెండువర్గాలను పార్టీకి అనుకూలంగా మారేలా రామచంద్రరావు కృషి చేయాల్సి వుంటుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version