పొలంలో జారి పడి వ్యవసాయ కూలీ దుర్మరణం

పొలంలో జారి పడి వ్యవసాయ కూలీ దుర్మరణం
పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన సామాజిక కార్యకర్త నల్లమారి రమేష్
రైతు కూలీలకు సైతం భీమా సౌకర్యం కల్పించాలి
మృతుని కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి.
నేటి ధాత్రి అయినవోలు

అయినవోలు మండలం వనమాల కనపర్తి గ్రామానికి చెందిన సింగారపు రాములు (50) అనే రైతు కూలి అదే గ్రామానికి చెందిన ఓ రైతు దగ్గర వ్యవసాయపనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒడ్డు పైనుంచి కాలుజారి బురదలో పడి మరణించినాడు. మృతునికి భార్య నలుగురు ఆడపిల్లలు. నిరుపేద కుటుంబానికి చెందిన రాములు తను ఇన్నాళ్లు కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించాడు. అయితే ప్రమాదంలో రాములుమృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు నిరాశ్రయులుగా మిగిలిపోయినారు. అయితే ఆ కుటుంబం యొక్క దీనస్థితిని తెలుసుకున్న సామాజిక కార్యకర్త నల్లమారి రమేష్ సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సాయంగా 5000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని విధాల ఈ కుటుంబాన్ని ఆదుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి భర్త మరణంతో వితంతువుగా మారిన దేవేంద్రకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవస్థాన డైరెక్టర్ సింగారపు రాజు గ్రామ పెద్దలు బంధువులు ఉన్నారు.

కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నేత కార్మికులకుఅవగాహన.

*మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో
నేత కార్మికులకు,అవగాహన కార్యక్రమం*

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలోనీ మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ద్వారా ఈ రోజు ప్రగతి నగర్ లోని కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించినారు. ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. కార్మికులలో నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నిద్రలేమి వల్ల అనేక మానసిక సమస్యలు, శారీరక అనారోగ్యాలు వస్తాయని అన్నారు.జీవన శైలి వ్యాధులు బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, క్యాన్సర్స్ , ఆత్మహత్య ఆలోచనలు ఎక్కుగా ఉంటున్నాయని అన్నారు. ప్రతికూల ఆలోచనల్ని విడనాడి అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అనేక జీవన శైలి వ్యాధుల బారి నుండి బయట పడవచ్చని అన్నారు.కార్మికుల కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువగా ఉన్నాయని మైండ్ కేర్ సెంటర్ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండటం సహజమని తెలుపుతూ సమస్యపై కాకుండా వాటి పరిష్కారమార్గాల మీద దృష్టి నిలిపి ఓపికతో పరిష్కరించుకోవాలని అన్నారు.కార్మికుల్లో పొదుపు ప్రవృత్తి తక్కువగా ఉందని, తమ ఆదాయంలోంచి ఎంతో కొంత పొదుపు చేయడం అలవర్చుకోవాలని అన్నారు.సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలలో శారీరక, మానసిక ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎటువంటి మానసిక సమస్యలు ఎదురైనా వాయిదా వేయకుండా వెను వెంటనే పరిష్కరించుకోవాలని అన్నారు.
మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని, ఎటువంటి మానసిక సమస్య ఎదురైనా తమను సంప్రదించాలని కార్మికులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, రాపెల్లి లత, బూర శ్రీమతి, కార్మికులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ.

బాధిత కుటుంబాలకు పరామర్శ.

చిట్యాల నేటిధాత్రి:

చిట్యాల మండలంలో వివిధ గ్రామాలలో వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు ఏ డు నూతల నిశీధర్ రెడ్డి ,నవాబ్ పేట గ్రామానికి చెందిన మహమ్మద్ హకీం గత మూడు రోజుల క్రితం ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం నవాబ్ పేట గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు బిల్ల సత్యనారాయణ రెడ్డి కి ఆక్సిడెంట్ జరగగా వారిని పరామర్శించడం జరిగింది
అదేవిధంగా కైలా పూర్ గ్రామానికి చెందిన సకినాల కుమారస్వామి ఆక్సిడెంట్ లో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది
అదేవిధంగా చిట్యాల మండల కేంద్రానికి చెందిన అల్లం ఐలయ్య గత పది రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు
బిజెపి బూత్ అధ్యక్షుడు పందుల రాకేష్ గారు నానమ్మ పందుల రామక్క వారం రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించినారు,
ఆయన వెంట వరంగల్ పార్లమెంట్ లింగంపల్లి లింగంపల్లి ప్రసాద్ రావు బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు మండల రాఘవరెడ్డి సుద్దాల వెంకటరాజ వీరు అనుప మహేష్ గో పగాని రాజు లక్ష్మణ్ శ్రీ పెళ్లి సతీష్ చింతల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్.!

తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు

పత్రికా ప్రకటన

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి) :

 

 

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇంటర్ లో
2005- 26 . విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, ఇందిరమ్మ కాలనీ (గా). పం). సిరిసిల్ల లో ST బాలికల నుండి ధరఖాస్తులు ఇహ్వానిస్తున్నామని ప్రాంతయ సమ్వన్వయ అధికారి D. S. వెంకన్న ఒక ప్రకటనలో
తెలియజేసారు. ఆసక్తి గల అభ్యర్ధులు కళాశాల నందు మే 16న నిర్వహించే కౌన్సిలింగ్ అన్ని ఓరిజినల్ (TC, బోనాఫైడ్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, రెసిడెన్సి, డేట్అఫ్ బర్త్, మొదలగునవి మొగునని దృవీకరణ పత్రంలో పాటు, ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని, కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ : 9032170654, 8333925362

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version