పోషణ్ ప్రక్వాడలో భాగం గా గ్రాడ్యువేషన్ డేలో పాల్గొన్న సర్పంచ్

పోషణ్ ప్రక్వాడలో భాగం గా గ్రాడ్యువేషన్ డేలో పాల్గొన్న సర్పంచ్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం తహ రాపూర్ గ్రామంలోని అంగ న్వాడీకేంద్రంలో పోషణ్ పక్వా డ కార్యక్రమాల సందర్భంగా గ్రాడ్యువేషన్ డే నిర్వహించా రు. ఈ సందర్భంగా 5 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులకు ఫ్రీ స్కూల్ సర్టి ఫికెట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రం ఆవరణలో ఘనంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్కుక్కలసరోజన హాజరై పిల్లలకు సర్టిఫికెట్లు అంద జేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ పుణ్యవతి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యానికి పోష కాహారం ఎంతో ముఖ్యమని, గర్భిణీ స్త్రీల నుంచి పుట్టిన పిల్లల వరకు సరైన పోషణ అందించాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం పిల్లలకు యూనిఫారాలను పంపిణీచేశారు.ఈ కార్యక్ర మంలో ఉప సర్పంచ్ రావుల శ్రీనివాస్, ఫ్రీ స్కూల్ ట్రైనర్ రిజ్వనా, హైస్కూల్ హెడ్ మాస్టర్ రమేష్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ సదాకర్, చలి వాగు ప్రాజెక్ట్ డైరెక్టర్ కుక్కల తిరుపతి సెక్టార్ టీచర్లు మరియు ఆయాలు పాల్గొన్నారు.

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు…

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

ఎంపీసీ ద్వితీయ సంవత్స రం భానుశ్రీ 969 మార్కు లు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట ప్రభుత్వ జూని యర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ 2026 వార్షిక పరీక్ష లలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకువచ్చారని, కళాశాల ప్రిన్సిపాల్ కందకట్ల కోటేష్ విద్యార్థులను అభినందించి, అధ్యాపక బృందం కృషిని

ప్రశంసించారు. ద్వితీ య సంవత్సరం ఎంపీసీ విభా గంలో ఎ. భాను శ్రీ 967

ప్రశంసించారు. ద్వితీ య సంవత్సరం ఎంపీసీ విభా గంలో ఎ. భాను శ్రీ 967

 

మా ర్కులతో కళాశాల టాపర్‌గా బి. వరుణ్ 965, కె. విజయ్ కుమార్ 964,

సి.హెచ్. వరుణ్ 903 మార్కు లు సాధించారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో సి.హెచ్. నాగ శ్రీ 719

మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందారు. సీఈ సీ ద్వితీయ సంవత్సరం లో కె. భరత్ 541

మార్కు లతో ప్రతిభ చాటారు.ప్రథమ సంవ త్సరం ఎంపీసీ విభాగంలో కె. జెస్సికా 463 మా ర్కులతో మొదటి స్థానం సాధించగా, పి. పూజిత 441, పి. తరుణ్ కుమార్ 440, సి.హెచ్. హారిక 401 మా ర్కులు సాధించా రు.బైపీసీ ప్రథమ సంవత్స రంలో ఎస్‌కె. సానియా కౌస్రా 398 మార్కులతో నిలిచారు. డి. అర్చన 336, డి. క్రిస్టినా 332, జి. లహరి 329 మార్కు లు సాధించారు.కళాశాల మొత్తం ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 65%, ప్రథమ సంవత్స రం ఉత్తీర్ణత శాతం 39% నమోదైంది.ఈ విజయా నికి కృషి చేసిన విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని ప్రిన్సిపాల్ అభినం దించారు.

విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కాలిన్సీ ఎరోస్పేస్ *ఆధ్వర్యంలో…

విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కాలిన్సీ ఎరోస్పేస్ *ఆధ్వర్యంలో

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో కాలిన్సీ ఏరోస్పేస్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు రామారావు, విశాల్ గారులు మొగుళ్ళపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న 190 మందిక విద్యార్థులకు బ్యాగులు,నోట్ బుక్కులు, పెన్నులు ,పెన్సిళ్లు మరియు ఇతర స్టేషనరీ పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు భాగ్యశ్రీ గారు అధ్యక్షత వహించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ కాలింగ్ చేరోస్పేస్ వారు అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తద్వారా జీవితంలో పురోగమించాలని అభిలసించారు.
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధిలు,మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థిని విద్యార్థులు చదువులో రాణించుటకై మా సంస్థ తరఫున ప్రతి సంవత్సరము విద్యాభివృద్ధికై ఇతోదికంగా సహాయ చేయడం జరుగుతుందని , అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా కావలసిన వసతులను సమకూర్చడంలో మా సంస్థ ముందు ఉంటుందని ఇంకా ఏదైనా సదుపాయాలు అవసరం ఉంటే మాకు తెలియజేసిన, వెంటనే మీకు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల వెంకన్న గారు మాట్లాడుతూ తను చదువుకున్న పాఠశాల విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్న ఎరోస్పేస్ ప్రతినిధి రామారావు గారిని అభినందించడం జరిగింది. ఫిజికల్ డైరెక్టర్ రాజయ్య గారు మాట్లాడుతూ గత సంవత్సరము పాఠశాలకు అందించిన స్పోర్ట్స్ మెటీరియల్ ద్వారా పలువురు విద్యార్థులను జాతీయ స్థాయిలో రాష్ట్రస్థాయిలో క్రీడాకారులుగా రాణించుటకు ఉపయోగపడిందని
ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్,రాజు, ప్రవీణ్ ,విజయభాస్కర్, కళ్యాణి, పద్మ, రాజయ్య, లలిత,చందర్ తదితరులు పాల్గొన్నారు.

పిడిసిల్ల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు.

పిడిసిల్ల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు.

మొగుళ్లపల్లి నేటి దాత్రి.

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామ సర్పంచి శ్రీమతి నైనాకంటి మమతా రెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపాల్ శ్రీ నన్న రామస్వామి ఉపసర్పంచ్ శ్రీమతి మాదం చైతన్య ఏఏపీసీ చైర్మన్ గొర్రె సుమలత మరియు వార్డ్ మెంబర్ కొండ్ర శోభ హాజరైనారు. ఈ కార్యక్రమాన్ని గౌరవ సర్పంచ్ నైనకంటి మమత రెడ్డి ప్రారంభించారురిటైర్డ్ ప్రొఫెసర్ నన్న రామస్వామి సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించారు. ఈ సైన్స్ మీద కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జెడ్పిహెచ్ఎస్ పిడిసిల్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులుఎండి సాధిక్ సార్ మాట్లాడుతూ పిల్లలను మరియు సైన్స్ ఉపాధ్యాయులు ఎస్ విజయ్ కుమార్, కొత్తూరు అంకుష్ అభినందించడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో పిల్లలకు బహుమతుల ప్రధానం వారి వారి ప్రతిభకు తగ్గట్టుగా బహుమతులు ఇవ్వడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ నన్నే రామస్వామి మాట్లాడుతూ నేను కూడా మీలాగే ఈ పాఠశాలలో పూర్వ విద్యార్థిని ఈరోజు రిటైర్డ్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పాఠశాలకు రావడం నాకు గర్వంగా ఉంది. పిల్లలు మీరు ఇష్టంతో చదువుకొని గొప్ప గొప్ప సైంటిస్టులు కావాలని ఆకాంక్షిస్తూ తన అనుభవాలను పంచుకున్నారు. నిర్మల్ చెక్క బొమ్మల తయారీ దేశంలోనే పేరుగాంచిన ప్రాంతం. అలాంటి చెక్క బొమ్మల తయారీకి ఉపయోగించే కర్ర పోనికి చెట్లు అంతరించిపోయే దశలో ఉన్నప్పుడు నేను కణజాల వర్ధనం ద్వారా ఆ చెట్ల జాతిని అభివృద్ధి పరచడం జరిగింది. ఈరోజు చాలా కుటుంబాలకు పోనికి చెట్లు ఆధారమవుతున్నాయి.అలాగే వేరుశనగ పంటలో టిక్కా తెగులు నుంచి సెనగ పంటను కాపాడడానికి కప్పలో ఉన్న ఆంటీ జన్యులను వేరుచేసి వేరుశనగ మొక్కలలో ప్రవేశ పెట్టడం ద్వారా వేరుశనగ టిక్కా తెగులు నివారించడం జరిగింది. ఈ విధంగా ఒక డజన్ దేశాలకు పైగా నేను సందర్శించి చాలా పరిశోధనలు చేశాను నాలాగే మీరు కూడా ఈ పాఠశాల నుంచి మంచి మేధావులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ మేళా కార్యక్రమంలో విజయవంతులైనటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మరియు వారి యొక్క ఉపాధ్యాయ బృందమైనటువంటి రాజమౌళి సార్ రవీందర్ శ్రీనివాస్ సార్ శ్రీధర్ స్వామి మరియు మధుసూదన్ అభినందిస్తున్నాను.

గురుకుల ప్రవేశ ఫలితాల్లో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ జయకేతనం…

గురుకుల ప్రవేశ ఫలితాల్లో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ జయకేతనం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలో గల బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు గురుకుల విద్యాలయ సమితి విడుదల చేసిన 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 10 సీట్లను సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు.ఈ ప్రవేశ పరీక్షలో లౌక్య, శ్రేయాన్స్, సాత్విక్, సహస్ర, అరుణ్, చంద్ర అఖిల్, శరణ్య, స్నిగ్ధ శ్రీ, హర్షిత, దీపక్ అర్హత సాధించారు. అనంతరం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య మన భవిష్యత్తుకు పునాది వంటిదని, మంచి పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. జ్యోతి విద్యార్థులకు పూల బొకేలు అందజేసి అభినందించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ప్రశంసించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన ఏడుగురు విద్యార్థులలో ఏడుగురూ ఉత్తీర్ణులై…

గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన ఏడుగురు విద్యార్థులలో ఏడుగురూ ఉత్తీర్ణులై

జహీరాబాద్ నేటి ధాత్రి:

గ్రామ సర్పంచ్, పోలీస్ పటేల్ నాగేందర్, గురుకుల ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన బోరేగావ్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులైన మహమ్మద్ ఇలియాస్, వై. నాగభూషణంలతో కలిసి సత్కరించారు.విద్యార్థులను కూడా ప్రశంసించారు. గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన ఏడుగురు విద్యార్థులలో ఏడుగురూ ఉత్తీర్ణులై గ్రామానికి గౌరవం తెచ్చారని గమనించబడింది.
ఈ సందర్భంగా సర్పంచ్ పోలీస్ పటేల్ నాగేందర్ విద్యార్థుల కృషిని, ఉపాధ్యాయుల బోధనను, తల్లిదండ్రుల మద్దతును ప్రశంసించారు. వారు భవిష్యత్తులో మరింత విజయం సాధిస్తారని ఆయన ఆశించాడు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు (చి.మల్లన్న, మహ్మద్ ఖాదర్, నర్సిములు, మహ్మద్ నవాబ్, హైమావతి, లక్ష్మి, పార్వతి) గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సిద్ధాపూర్‌లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధిస్తారు.

సిద్ధాపూర్‌లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధిస్తారు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని
మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా, ఝరసంగం మండలం, సిద్ధాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ ప్రత్యేక కార్యక్రమం విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు మరియు స్వీయ అభివృద్ధిపై అవగాహనను పెంచింది. పాఠశాల ఆవరణలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థులు తెలుగు, హిందీ, భక్తి గీతాలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు

నూతన అంగులతో కొల్లూరు పాటశాల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం..

నూతన అంగులతో కొల్లూరు పాటశాల మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం :

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రైవేట్ పాటశాలకు ధీటుగా ఝరాసంగం మండల కొల్లూరులో ప్రభుత్వ పాటశాలకు నూతన పెయింటింగ్ వేయించడం జరిగింది,ఎన్నో రోజులుగా పాటశాలకు పెయింటింగ్ లేక బోషి పోయిన పాటశాలకు నూతన పాలకవర్గం పగ్గాలు చేపట్టినవేంటనే గ్రామ పంచాయతీ కార్యాలయానికి మరియు పాటశాలకు ప్రభుత్వా కార్యాలయాలకు నూతన వరువడి సృష్టించాలనే మంచి ఉద్ధ్యేశంతో పెయింటింగ్ వేయించడం జరిగింది.బడిని దేవాలయం గా బావించే మనము మన పిల్లలకు చక్కని వాతవరణంలో విద్యను అందజేయాలనే మంచి సంకల్పంతో పాటశాలకు పెయింటింగ్ వేసి ప్రైవేట్ పాటశాలకు ధీటుగా ప్రభుత్వా పాతశాలను రూపుదిద్దడం జరిగింధని నూతన పాలకవర్గం అభిప్రాయపడింది,అలాగే గ్రామంలో గల విద్యార్థుల తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేసారు…ఈ కార్యక్రమము గ్రామ పెద్దలు మరియు గ్రామ నూతన పాలకవర్గం అధ్వర్యంలో నిర్వహించారు..

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి..

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి

# పదో తరగతి టాపర్లకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నగదు పారితోషకం .

నల్లబెల్లి , నేటి ధాత్రి:

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించి గ్రామీణ ప్రాంత ప్రజలను ఆర్థిక నష్టపోకుండా ఉండాలని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ డివిజన్ మేనేజర్ వరప్రసాద్ అన్నారు . బుధవారం నల్లబెల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు చదువుకో తెలంగాణ అనే కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు చదువులో ముందుండాలని సూచించారు . ఈ సందర్భంగా డిఎం వర ప్రసాదు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్రస్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతిభవంతులైన విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నగదు పంపిణీ చేపట్టినట్లు చెప్పారు . రాష్ట్రస్థాయిలో టాపర్ గా వచ్చిన విద్యార్థికి 5 లక్షలు , రెండో స్థానం విద్యార్థికి 3 లక్షల రూపాయల తో పాటు ప్రతి జిల్లా స్థాయి మొదటి స్థానం విద్యార్థులకు 2 రెండు లక్షల చొప్పున,119 నియోజకవర్గస్థాయి విద్యార్థులకు లక్ష రూపాయలు , రాష్ట్రంలోని 6 29 మండల స్థాయిలో ప్రధమ టాపర్లకు పదివేల చొప్పున నగదును శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తున్నా అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయురాలు అంబి వసంత , కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారి ఏ . సునీత నందిగామ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు తోపాటు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ యాదండ్ల రాజు , నల్లబెల్లి డివో పి . శ్రీను , బీడీఈ చరణ్ రాజ్, విజయ్ రెడ్డి లు పాల్గొన్నారు

అంగన్వాడి కేంద్రాలు సమయపాలన పాటించాలి.

అంగన్వాడి కేంద్రాలు సమయపాలన పాటించాలి.

సూపర్వైజర్ జయప్రద.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండలం లోని నైన్ పాక గ్రామ సెక్టార్ మీటింగ్ ఓడితల లక్ష్మీ అంగన్వాడి టీచర్ కేంద్రంలో సమావేశము ఏర్పాటు చేసుకొవడం జరిగింది, జయప్రద సూపర్వైజర్ ఎజెండా అంశాలు, సమయపాలన, పిల్లల బరువు, ఎత్తు, పోషకాహార పంపిణీ, బాల్యవివాహాలు, గృహ సందర్శన, పిల్లల టీకాల గూర్చి రివ్యూ చేయడమైనది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బండి భగవాన్ , ఉపసర్పంచ్ కాంపల్లి శ్రీకాంత్ హాజరై పిల్లలకు బాలమృతం ,ఎగ్స్ పంపిణీ చేయడం జరిగింది. స్కూల్ హెచ్ఎం మహేందర్ మాట్లాడుతూ పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాలకు, ప్రైమరీ స్కూల్స్ పంపించినట్లయితే నేటి బాలలే రేపటి పౌరులుగా అన్ని రంగాలలో ముందంజలో ఉంచుతామని అందుకు ప్రజా ప్రతినిధులు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లకుండా సహాయ సహకారాలు అందించాలని కోరి ఉన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ స్కూల్స్ ఎటువంటి సహాయ, సహకారాలుఅవసరం ఉన్న అందిస్తామని తెలిపినారు.25.మంది అంగన్వాడీ టీచర్స్ ఆశ వర్కరు సుమలత హాజరైనారు.

అమ్మకు అక్షరమాల తో వయోజన విద్యాభివృద్ధి

అమ్మకు అక్షరమాల ద్వారా వయోజన విద్యాభివృద్ధి

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా వయోజన విద్య అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ అన్నారు.జిల్లాలోని హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి,గ్రామపంచాయతీ సర్పంచ్ మిట్టపల్లి రామ్ రెడ్డి లతో కలిసి ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మాట్లాడుతూ అక్షరాలు దిద్ది చదువు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని, 15 నుండి 60 సంవత్సరాల లోపు వారందరూ చదువుకోవాలని,అప్పుడే సమాజంలో గౌరవ స్థానం లభిస్తుందని అన్నారు.ఉల్లాస్ అక్షరాస్యత కేంద్రాలకు నిరక్షరాస్యులు ప్రతి ఒక్కరు రావడమే కాకుండా చదువు నేర్చుకుని 100 రోజుల్లో అక్షరాస్యులుగా తయారు కావాలని,అక్షర వికాసం పుస్తకంలోని 16 చాప్టర్ లను 100 రోజులలో పూర్తి చేయాలని తెలిపారు.వయోజన విద్య నేర్చుకుంటున్న మహిళా సంఘ సభ్యులు అక్షరాస్యతతో కీలక జీవన నైపుణ్యాలు నేర్చుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అక్షర కేంద్రం వాలంటీర్లు శిరీష,దాసరి శ్యామల,జె డి ఎం.రామచందర్,ఎ పి ఎం వెంకటేష్,సి సి లు మోహన్, కృపవర్ణ,రాజమణి,వి ఓ ఎ లు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.

చినిగేపల్లిలో ఉచిత ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం

చినిగేపల్లిలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలంలోని చినిగేపల్లి గ్రామంలో 59వ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఫ్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే లక్ష్యంతో

ఈ పాఠశాల మంజూరైంది. పాఠశాల ప్రారంభోత్సవంలో చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. విద్యే భవిష్యత్తుకు పునాది అని, ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదువు కొనసాగించాలని వక్తలు సూచించారు. ఈ పాఠశాల మంజూరుపై గ్రామస్తులు, సర్పంచ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్, కార్యదర్శి, సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

విద్యార్థుల కు స్పోర్ట్స్ యూనిఫామ్స్ ల పంపిణీ..

 

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-1.wav?_=1

 

విద్యార్థుల కు స్పోర్ట్స్ యూనిఫామ్స్ ల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గ ము,ఝరాసంగం మండల్ ,దేవరం పల్లి మండల పరిషత్తు స్కూల్ లో విద్యార్థుల కు స్పోర్ట్స్ యూనిఫామ్స్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.దేవరంపల్లి పల్లి గ్రామానికి చెందిన చాకలి శేఖర్ అదే పాఠశాలలో చిన్న తనం లో చదువు కొని తాను చదువుకున్న పాఠశాలో విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్స్ లను పంపిణీ చేసి సేవ దృక్పధాన్ని చాటుకున్నారు. ఈ చిన్న పాటి సేవ చెయ్యడం చాలా సంతోషం అని తెలియజేసారు.సమాజంలో అందరు కూడా తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల కు ఎదో ఒక సేవ చెయ్యాలని సూచించారు.చిన్న చిన్న సామాజిక సేవలు కూడా సంతృప్తి ఇస్తాయని ఝారసంఘం మండల విద్యాధి కారి శ్రీనివాస్ లు అన్నారు. సామాజిక సేవ చెయ్యడం లో అందరూ పోటీ పడాలి అని గ్రామ సర్పంచ్ రవి పాటిల్ అన్నారు. అదే పాఠశాల లో చదువు నేర్పిస్తున్న భవాని ప్రధానోపాధ్యాయురాలు కూడా విద్యార్థులకు షూ లను, మరియు ఐడెంటి కార్డ్ లను అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిధుల కు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ,వారి తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భవాని, సర్పంచ్ రవి పాటిల్, శేఖర్ రాజు ,మోహిన్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి వార్డ్ మెంబర్ కు సన్మానం..

బిజెపి వార్డ్ మెంబర్ కు సన్మానం

కుక్కముడి రమేష్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం బస్వారాజు పల్లి బిజెపి నుండి గెలుపొందిన సందర్భంగా యూత్ శాలువగప్పి శుభాకాంక్షలు తెలియజేశారు రమేష్ మాట్లాడుతూ నాకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించిన ఆడపడుచులకు అన్నయ్యలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్లకు నాతోటి మిత్రులకు పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు

ఘనంగా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవం…..

ఘనంగా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవం…..

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం (మాచునూర్)లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో సోమవారం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహిం చారు. ప్రధానోపాధ్యాయురాలు మహేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉంటున్న విద్యార్థుల ఉన్నత విద్య లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాటు ఉపా ధ్యాయులు హరిప్రకాష్ శుక్ల వసంత్, రిషబ్, చతుర్వేది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

అంతర్జాతీయ వర్క్ షాప్ నిర్వహించడం అభినందనీయం…

అంతర్జాతీయ వర్క్ షాప్ నిర్వహించడం అభినందనీయం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

అంతర్జాతీయ కార్యాశాల పోస్టర్ ఆవిష్కరణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్ ను నిర్వహించడం అభినందనీయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్, రాజమండ్రి కందుకూరి వీరేశలింగం తియాటిక్ కళాశాల, సంయుక్తంగా ఈడుమెంట్ యు ఎడ్యుకేషనల్ ప్రో. వెంకట్స్ .టైమ్ అనే సంస్థల సౌజన్యంతో ఇంటర్నేషనల్ ఇంటెన్సీస్ థీసిస్ రైటింగ్ వర్క్ షాప్ అనే అంశంపై 15 రోజుల అంతర్జాతీయ కార్యాశాలను ఆన్లైన్ విధానంలో కొనసాగించే వర్క్ షాప్ పోస్టర్ ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నందుకు గాను చీఫ్ పాట్రన్ ప్రొఫెసర్ మల్లం నవీన్, కన్వీనర్ ఎంఎంకే రహీముద్దీన్ ఎమ్మెల్యే అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా 100 శాతం అడ్మిషన్లు సాధించినందుకు గాను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ తీసుకున్న చొరవ,ప్రణాళికలను మరింత పెంపొందించాలన్నారు. కళాశాలకు అవసరమైన అభివృద్ధిలో ముందుండి నడుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నవీన్ తో పాటు, అధ్యాపకులు ఎం ఎం కె రహీముద్దీన్,డాక్టర్ కందాల సత్యనారాయణ, ఎస్ కమలాకర్,
డాక్టర్ రాంబాబు,డాక్టర్ సోమయ్య,
ఎస్ రజిత పాల్గొన్నారు.

అదనపు గదుల నిర్మాణం కొరకు వినతి పత్రం ..

అదనపు గదుల నిర్మాణం కొరకు వినతి పత్రం ..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో. అదనపు గదులు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిపాలన అధికారికి వినతి పత్రం.సమర్పించిన గ్రామస్తులు నాయకులు ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలం.లో. పలు కార్యక్రమంలో మరియు ప్రారంభోత్సవాల్లో.పాల్గొన్న పరిపాలన రాళ్ల పేట గ్రామస్తులు నాయకులు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఇందులో భాగంగా. తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట. గ్రామంలో. ఎంపీపీ ఎస్. పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని. బోధన ధ్యాసనకై. కేవలం ఒకే గది ఉందని. ఒకటి నుండి ఐదు తరగతి వరకు. విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి. చదువుకోడానికి. ఇబ్బందికరంగా ఉందని. దయచేసి వెంటనే. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి తగిన తరగతి గదులు మంజూరు చేయవలసిందిగా. గ్రామస్తులు తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున జిల్లా పరిపాలన అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారు విద్యార్థుల పిల్లల ను సౌకర్యాల నిమిత్తం.మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు

విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి…

విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి
*డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.
లింగారెడ్డి*

నర్సంపేట,నేటిధాత్రి:

 

విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, దానికి ప్రభుత్వం చొరవచూపి ఎక్కువ నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా పీజీ, డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన జిల్లా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ విద్యారంగం పేదలకు అందని విధంగా తయారు కావడం జరిగిందన్నారు. పాలకులు కేటాయించవలసిన నిధుల కేటాయింపులో పక్షపాతం చూపడం తో విద్యారంగం ముందుకు పోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని మానవనరుల అభివృద్ధిలో భాగంగా కాకుండా లాభనష్టాల కోణంలో చూపడంతో నేడు విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు అందరికీ విద్య అందాలనే కొఠారి కమిషన్ ను అమలు పరచకుండా వ్యాపారంగా చూడడంతో నేడు విద్యారంగం వెనుకబడిపోయిందన్నారు. గ్రామీణ ప్రాంతా బడుగు బలహీన వర్గాల చదువు కోసం ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడమే దీనికి ప్రధానమైన కారణం అన్నారు. విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డెమొక్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రఘు శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని కాపాడడం కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయి ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ విద్యారంగంలో మార్పు లేదన్నారు. డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన కాగిత యాకయ్య పదవీ విరమణ సందర్భంగా ఆయనను డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.ఈ జిల్లా సదస్సులో అధ్యాపక జ్వాలా సంపాదకుడు డాక్టర్ గంగాధర్, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ. శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రాజ్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోవిందరావు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోవిందరావు, నర్సంపేట ఎంఈఓ కొర్ర సారయ్య, ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షులు గుంటి రామచందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు జి. ఉప్పలయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మబూబాబాద్ జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తంగెళ్ల సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు దార్ల రవీందర్ రాష్ట్ర కౌన్సిలర్ కొమ్మాలు జిల్లా ఉమా శంకర్ ఉపాధ్యక్షురాలు సుధారాణి, వివిధ మండలాల బాధ్యులు ఎస్కే సర్దార్ కొర్ర రమేష్ మాలోతు జగన్ ఈదుల వెంకటేశ్వర్లు రావుల దేవేందర్ శ్యాంప్రసాద్, ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

గురుకులం.. కేసీఆర్ కల సాకారం

గురుకులం.. కేసీఆర్ కల సాకారం

ప్రతి ఐదుగురిలో ఒక విద్యార్థికి మెడికల్ సీటు

◆:- పేదింటి బిడ్డలకు భరోసా..

సత్ఫలితాలనిస్తున్న ప్రతిభా కళాశాలలు నీట్-2025లో సత్తాచాటిన మైనార్టీ గురుకుల విద్యార్థులు అల్గోల్, బూచినెల్లి క్యాంపస్ల నుంచి 16 మందికి ఎంబీబీఎస్ సీట్లు పదేండ్లలో డాక్టర్లుగా 1200 మందికి పైగా గురుకుల విద్యార్థులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

జహీరాబాద్, మాజీ ముఖ్యముతై కేసీఆర్ కన్న కలలు సాకారమవుతున్నాయి.. దీంటి బిడ్డల బంగారు భవిష్యత్తుకు గురుకులాలు బాటలు వేస్తున్నాయి. ఉన్నత విద్యకు ప్రతిభా కళాశాలలు విరునామాగా నిలుస్తు న్నాయి. అందుకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజక లోని అల్గోర్ బూచి బూచిపెట్టె గ్రామ గ్రామ శివారులో (టెర్రెస్) మైనార్డ్ గురుకుల క్యాంపస్ విదర్శనం. ఈ రెండు బ్యాండ ల నుండి ఈ ఏడాద్ 18 మందికి పైగా విద్యార్థులు ఎంటి బీఎస్ సీట్లను సాధించడం తెలంగాణ గురుకుల విద్యావ్య వన్దకే గర్వకారణం. ఇఐటీ, మెడిసిన్ తదితర ఉన్నత విద్యా భ్యాసమనేది మీద, మధ్యతరగతి విద్యార్థులకు అందన్ డ్రాక్ష ఆర్థికంగా ఉన్న కుటుంబాలవారైతే

 

 

పేరొందిన విద్యాసంస్థల్లో లక్షలు ఖర్చుపెట్టి కోచింగ్ తీసుకోగలుగుతారు. కానీ, విరుపేద, మధ్యతరగతి విద్యార్థుల పరిస్థితి అందుకు విరుద్ధం. అప్పు చేసి కోచింగ్ తీసుకోవాలి. లేదంటే ఆశయాన్ని వదులుకోవాల్సిందే. అలాంటి పేదింటి బిడ్డల ఆశయాలకు ఊపిరి పోసి, ప్రతిభకు మెరుగులు దిద్ది, వారి కల లను సాకారం చేయాలన్న ఉదాత్త లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వేలాది గురుకులాలను ఏర్పాటుచేసి ఇంటర్, డిగ్రీతో పాటు నాణ్యమైన విద్యను అందించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల సొసైటీల ఆధ్వ ర్యంలో 66. మైనార్టీ సొసైటీ పరిధిలో 12 గురుకుల కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (ప్రతిభా కళాశాలలు) గా తీర్చిదిద్దింది.

 

 

ఆయా ప్రతిభా కాలేజీల్లోకి మెరిట్ ఆధారంగా విద్యా ర్థులను ఎంపిక చేసి ఐఐటీ, తేవారు, వీటి పాటు జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేవి ధంగా ఏర్పాట్లు చేసింది. పోటీపరీక్షలకు సంబంధించిన ఇంటెన్సివ్ కోచింగ్స్ను ఉచి తంగా అందించింది. ఫలితంగా గత పదేం లో గురుకులాల విద్యార్థులు రికార్డుస్థా యిలో ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశం వారు.

 

 

 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన ఉన్నత విద్యాసంస్థ ల్లోనూ అడ్మిషన్లు పొందుతున్నారు. రాష్ట్రం లోని గురుకుల విద్యావ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా సీవోఈలు గిలిచాయంటే అతి శయోక్తి కాదు ఇప్పటివరకు అన్ని సీవోధుల నుంచి మొత్తంగా 1,500 మందికిపైగా విద్యా ర్థులు వైద్యరంగంలోకి ప్రవేశించడం కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతున్నది..

 

 

మైనార్టి గురుకులాల నుంచే 10 మందికి ఎంబీబీఎస్ సీట్లు

కేసీఆర్ దార్శనికతడు సంగారెడ్డి జిల్లా జహీ రాబాద్ నియోజకవర్గంలోని అల్గో అల్గోల్, బూరె వెళ్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల క్యాంపస్లు అద్దంపడుతున్నాయి. ఆయాకళా శాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య తోపాటు జేఈఈ, నీటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు.

 

 

దీంతో ఇక్కడి విద్యా ర్థులు వార్షిక పరీక్ష ఫలితాల్లో మంచి మార్కు లతోపాటు జిల్లా, రాష్ట్రాస్థాయిలో ర్యాంకులు సాదిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోని
అనేక ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాలు పొందు తున్నారు. 2020 సంవత్సరానికిగాను నిర్వ హించిన నీట్ ప్రవేశ పరీక్షకు అల్గోల్, బూచి వెల్లి గురుకుల బాలుర, బాలికల కళాశాలలకు చెందిన 70 మంది విద్యార్థులు హాజర య్యారు. ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలి తాల్లో ఆయా కళాశాలలకు చెందిన 15 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలే జిల్లా సీట్లు సాదించి సత్తా చాటారు.

 

 

అంటే ఇక్కడ చదివిన ప్రతి బదుగురిలో ఒక్కరు డాక్టర్ కాబోతున్నారు. అల్గోల్ బాలుధ గురు కుల కళాశాలకు చెందిన మహ్మద్ ఫిరోస్, ధర్మ తేజ, సిద్ధి రమేశ్, ఎస్వీ ఆయాన్, ఎండీ ఓబెడ్, గౌతమిఖన్నా, సృజన్కుమార్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు. బూచి వెల్లి గ్రామ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన అస్మా పాతిమా షేక్ సమీనా మర్దార్ గాలి అనూష, తస్కీన్ ఖామర్, షాగుప్తా షాహీన్, ప్రియా అంజీర్, తస్లీం, సరేఖ మర్డాన్, ఫిరోస్ ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు.

 

 

 

గురుకుల కళాశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు రాష్ట్రస్థాయిలో ఉన్నత స్థాయి ఉద్యోగా లను సాధిస్తుండటం గర్వంగా ఉన్నదుని ఆయా గురుకుల కళాశాల ప్రిన్సిపాల్స్, అధ్యా పకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

కేసీఆర్ దూరదృష్టికి

◆:- తార్కాణం గురుకులాలు గురుకుల

◆:- విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడం సంతోషం

◆:- ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లుగా
ఎదగడం గర్వకారణం

మాజీ మంత్రి హరీశ్ రావు

కేసీఆర్ గొప్ప ఆలోచన, దూరదృష్టితో నిర్మించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇందులో చదువుకొన్న ఎందరో విద్యార్థులు ఇప్పుడు ఇంజినీర్లు, డాక్టర్లు, ఉన్నతో ద్యోగులుగా సేవలందించడం గర్వకార ణమని తెలిపారు. 2021లో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచిపల్లి మైచార్జీ గురుకులం ప్రారంభం సంద ర్భంగా ఓ విద్యార్థితో ముచ్చటించిన సన్నివేశాన్ని సోమవారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్యూచర్లో ఏం అవు తావమ్మా? అని అడిగిన ప్రశ్నకు డాక్ష ర్ను అవుతాను సార్ అని చెప్పిన ఫిస్టోన్ అనే విద్యార్థిని మాట నిలబెట్టు కున్నది.

 

 

కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది’ అని హరీశ్రావు వెల్లడించారు. ఫిరోసోపాటు అదే మైనార్టీ గురుకులం నుంచి మరో ఎని మిది మంది, అల్గోల్ మైనార్టీ గురుకుల నుంచి ఏడుగురు విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించడం గర్వకారణమన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంచి విద్యార్థులు విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడటం అభినందనీయమన్నారు. లీఆర్ఎస్ సర్కారు దూరదృష్టి, గురుకు చాల ప్రిన్సిపాళ్లు, ఉపాద్యాయుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసంవల్లే సాధ్యమైం దని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్న కేసీఆర్ కలలను నీరు పేద విద్యార్థులు సాకారం చేయడం గొప్ప విషయమని అభినందించారు.

థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై బెల్ట్స్ పంపిణి.

థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై బెల్ట్స్ పంపిణి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలంలోని నాచినపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు థౌసండ్ పిల్లర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై,బెల్ట్స్,గుర్తింపు కార్డులను ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్ సౌజన్యంతో అందిజేశారు
ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం గంగాధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 1000 పిల్లర్స్ లైన్ క్లబ్ అధ్యక్షులు పరికిపండ్ల వేణు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి గ్రామస్తులు ముందుకు రావాలన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకున్న వారికే ఉన్నత విద్యాభ్యాసం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. నిబద్ధత గల ఉపాధ్యాయులు చక్కని విద్యా బోధన చేస్తున్నారని అభినందించారు. గ్రామీణ ప్రాంతాలలో అత్యంత నిరుపేద విద్యార్థులు పాఠశాలల్లో చదువుకోవడానికి వస్తారని వారికి సహాయ సహకారాలు అందించడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. పాఠశాల అభివృద్ధి కోసం తాము కృషి చేస్తామని రాజ్ కుమార్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రాజగోపాల్, జోనల్ చైర్మన్ చొప్పరి సోమయ్య, మాజీ సర్పంచ్ పెండ్యాల మమతా రాజు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఓరుగంటి కవిత తిరుపతి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి, ఉపాధ్యాయురాలు వీణ జ్యోతి, పెండ్యాల రాము మడతలపాటి కుమార్, రుదీర్, జటబోయిన రాజు, గుండెబోయిన కాజీ యాదవ్, పుట్టపాక భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version