కేటీఆర్‌కు సీట్ నోటీసులపై భరత్ రెడ్డి విమర్శ

కేటీఆర్‌కు సీట్ నోటీసులు.. డైవర్ట్ రాజకీయం

ఆధారాలు లేకుండా కేటీఆర్‌కు నోటీసు.. ఎందుకు…?

కెటిఆర్ సేన భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వీసం భరత్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

కేటీఆర్‌కు సీట్ నోటీసులు ఇవ్వడం పై బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా కేటీఆర్ సేన జిల్లా అధ్యక్షుడు వీసం భరత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలన చేయకుండా రాజకీయ కక్ష సాధింపులే చేస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. మొన్న హరీష్‌రావుకు, నేడు కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం డైవర్ట్ పాలిటిక్స్ అని భరత్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉండగా, రాష్ట్రంలో సీట్ విచారణలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కేటీఆర్‌కు, మున్సిపాలిటీ ఎన్నికల్లో హరీష్‌రావు, కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం దౌర్భాగ్యమైన పరిస్థితి అని అభిప్రాయపడ్డారు.ఆధారాలు లేని కేసులు, కాలేశ్వరం ప్రాజెక్టు, ఈ-రేస్‌లో నోటీసులు ఇచ్చి మున్సిపాలిటీ ఎన్నికలను డైవర్ట్ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా దొరకక రైతులు తండ్రాగా ఉన్నారు. సంక్రాంతి తర్వాత కూడా రైతుభరోసా ఊసులు రాలేదని ఆయన ఆక్షేపించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానాలు ఆధారాలు లేవని చెప్పినా, కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని భరత్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి విదేశాల్లో విహరిస్తుండగా, పోలీసులు చెక్కర్లు కొట్టుకుంటున్నారని అన్నారు. రెండేళ్ల దర్యాప్తులో ఎలుక కూడా పట్టలేదని, ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన పేర్కొన్నారు…

ఒక బస్తా యూరియా కోసం రైతుల అగచాట్లురైతులకు సరిపడా యూరియా అందించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-2026-01-03T120620.123.wav?_=1

 

 

ఒక బస్తా యూరియా కోసం రైతుల అగచాట్లురైతులకు సరిపడా యూరియా అందించాలి.

యూరియా బస్తా కోసం క్యూ లైన్‌లో కార్పొరేటర్

ప్రభుత్వం మేల్కొని రైతులను ఆదుకోవాలి.

సుంకరి మనిషా శివకుమార్ 16వ డివిజన్ కార్పొరేటర్

కాశిబుగ్గ నేటిధాత్రి.

 

గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలో ఒక్క యూరియా బస్తా కోసం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటువంటి దుస్థితిని నిరసిస్తూ స్థానిక కార్పొరేటర్ సుంకరి మనిషా శివకుమార్ స్వయంగా క్యూ లైన్‌లో నిలబడి రైతుల కష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది.

⏩ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ

ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతుల సమస్యలను సీరియస్‌గా పరిగణలోకి తీసుకొని, రైతులకు సరిపడా యూరియా తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఎప్పుడూ లేని యూరియా కొరత సమస్య, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. ముందస్తుగా అవసరాలను అంచనా వేసి యూరియా నిల్వలు సిద్ధం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
వ్యవసాయ కాలానికి ముందే ప్రణాళికలు రూపొందించి, యూరియా సరఫరా సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం,నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి,
ముందస్తుగా యూరియా నిల్వలను ఏర్పాటు చేసి,
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిపడా యూరియా అందించాలని కార్పొరేటర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.ఇక ముందు గ్రామానికి రావాల్సిన యూరియా లోడ్ వంచనగిరి నుండి కాకుండా ధర్మారం లోనే పంచే ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.

యూరియా కొరతకు నిరసనగా జహీరాబాద్ ఎమ్మెల్యే..

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-2026-01-02T140034.528-1.wav?_=2

యూరియా కొరతకు నిరసనగా జహీరాబాద్ ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

యూరియా కొరతకు నిరసనగా అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు షాప్‌లలో లేని యూరియా యాప్‌లలో ఉంటుందా అంటూ ప్లకార్డులు ప్రదర్శన ప్లకార్డులు లోపలికి అనుమతి ఇవ్వని పోలీసులు పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం,

వర్షాకాలం లాగానే ఈ వేసంగి కూడా రైతులకు యూరియా గోసేనా,..

వర్షాకాలం లాగానే ఈ వేసంగి కూడా రైతులకు యూరియా గోసేనా

యూరియా కోసం రైతు గోసఅధికారులు పాటించుకోరాఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటిదాత్రి

 

గణపురం మండలం ధర్మారావుపేట అదనపు గోదాం కు యూరియా వచ్చి రెండు రోజులైనప్పటికీ రైతులకు యూరియా పంపిణీ చేయక వ్యవసాయ అధికారులు రైతులకు ఎటువంటి సమాచారం ఇప్పటివరకు ఇవ్వకుండా వర్షాకాలం లాగానే ఈ వేసంగి కూడా యూరియా బస్తాలు రైతులకు సరైన సమయానికి అందివ్వక అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఆదర్శ రైతు ఆకుల సుభాష్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు ఒక రైతుగా నానా ఇబ్బందులు పడుతూ పంట సరిగా లేక దిగుబడి రాక కనీసం పెట్టుబడి లేక రైతు తెచ్చుకున్న అప్పు తీర్చే పరిస్థితిలో లేడు.కనీసం ఇప్పటికైనా రైతులకు ఎరువు బస్తాల కొరత లేకుండా చూడాలని అటు అధికారులను ఇటు నాయకులను కోరడమైనది.గతంలో 2009లో ఇటువంటి ఎరువుల కొరత ఏర్పడ్డ సందర్బంలో ప్రతి రైతుకు ఒక పాస్ బుక్ ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారులు అప్పుడు ఆదర్శ రైతులుగా మేము రైతుకు ఇవ్వడం జరిగింది ఈ పాస్ బుక్ వల్ల ఏ రైతు ఎన్ని సార్లు ఎరువులు తీసుకున్నారని ఒక లెక్క ఉంటుంది.ఇది విమర్శ కాదు సూచన గా స్వీకరించవలసినదిగా తెలుపుతున్నాము..

రైతులకు సులభంగా యూరియా లభించేలా చర్యలు తీసుకోవాలి..

రైతులకు సులభంగా యూరియా లభించేలా చర్యలు తీసుకోవాలి

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

 

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేయించడం వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ రైతు రక్షణ సమితి వరికేల కిషన్ రావు మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను ప్రవేశపెట్టి యూరియా బుకింగ్ చేయించడానికి తప్పనిసరి చేసింది.ఈ నిర్ణయం వల్ల మా జిల్లాలోని చాలా మంది రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రైతులకు కలుగుతున్న ఇబ్బందులు
స్మార్ట్ ఫోన్/ఇంటర్నెట్ లేకపోవడం చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం వల్ల యాప్ లో బుకింగ్ చేయించడం సాధ్యం కావడం లేదు వృద్ధ వయస్సు రైతులకు ఇబ్బంది,చదువు తక్కువ ఉన్న రైతులు యాప్ ని ఉపయోగించడంలో ఇబ్బంది పడుతున్నారు.
సమయం,డబ్బు వృధా ప్రతి రైతు కు విడిగా యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉండడం వల్ల సమయం, డబ్బు రెండూ వృథా అవుతాయి డీలర్ల నుండి ఎరువులు లభించకపోవడం యాప్ లో బుకింగ్ చేయించినా కొంతమంది డీలర్లు సరిగా ఎరువులు ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వానికి కోరికలు
ఈ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వానికి కింది కోరికలు తెలియజేస్తున్నాము
ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తప్పనిసరి నిబంధనను సడలించి,రైతులు ఆఫ్ లైన్ లో కూడా యూరియా బుకింగ్ చేయించే వీలు కల్పించాలి
ప్రతి గ్రామంలో ఒక స్థానిక సహాయకుడు (ఉదా: సర్పంచ్,వ్యవసాయ సహాయకుడు,గ్రామ సచివాలయ సిబ్బంది) ద్వారా యాప్ లో బుకింగ్ చేయించే వీలు కల్పించాలి.
యాప్ లో బుకింగ్ చేయించిన రైతులకు డీలర్లు సకాలంలో ఎరువులు ఇవ్వాలని బలమైన నియంత్రణ పెట్టాలి.
యాప్ ని సరళంగా, తెలుగులో ఉండేలా చేసి, రైతులకు శిక్షణ ఇవ్వాలి.
చివరి హెచ్చరిక
ఈ పరిస్థితి సాగితే రైతులు సకాలంలో యూరియా పొందలేకపోతారు,దీని వల్ల పంటలకు హాని చేకూరుతుంది.ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సులభంగా,సురక్షితంగా యూరియా లభించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్

అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు

ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.

 

ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్‌ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.

 

రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్‌ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్‌ సర్కారు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

 

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.

 

ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.

రైతును నిండా ముంచుతున్న యూరియా పంపిణీ కేంద్రాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-23T124342.598.wav?_=3

 

రైతును నిండా ముంచుతున్న యూరియా పంపిణీ కేంద్రాలు

* తెల్లారేసరికి మండలం దాటుతున్న యూరియా సంపద
* రైతులంటే చిన్నచూపు చూస్తున్న సంబంధిత అధికారులు
* ఇరుగుపొరుగు వారి ఆధార్ కార్డులతో యూరియా దోపిడి
* జిల్లా నుండి పక్క రాష్ట్రాలకు దర్జాగా తరలిపోతున్న యూరియా

మహాదేవపూర్ సెప్టెంబర్ 23 (నేటి ధాత్రి)

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో రైతును నిండా ముంచుతున్న యూరియా పంపిణీ కేంద్రాలు. జిల్లా నుండి మండలం వరకు రైతులు యూరియా పంపిణీ కేంద్రాల ముందు ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ క్యూ లైన్ లో ఉదయం నుండి సాయంత్రం వరకు నిలబడితే ఆధార్ కార్డుకు ఒకటి నుండి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్న పరిస్థితి మండలం లో నెలకొంది. దీనిని ఆసరా చేసుకొని యూరియా బస్తాల కోసం యూరియా పంపిణీ కేంద్రాల నిర్వహకులు వ్యవసాయ అధికారులకి అనుమానం రాకుండా, తనిఖీ చేసిన దొరకకుండా ఇరుగుపొరుగు వారి ఆధార్ కార్డులను జమచేసి అవసరం లేకున్నా ఒక్కొ ఆధార్ కార్డుకు రెండు బస్తాల చొప్పున దర్జాగా తీసుకొని అక్రమంగా నిల్వ ఉంచి గుట్టుచప్పుడు కాకుండా పక్క మండలాలకు, పక్క రాష్ట్రానికి బస్తాకు 400 రూపాయల చొప్పున తీసుకొని రాత్రికి రాత్రి ట్రాక్టర్లలో, ట్రాలీ ఆటోలలో సరఫరా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇలా సరఫరా చేయడంతో మండలంలో కృత్రిమంగా యూరియా కొరత ఏర్పడి ఒక్కొక్క యూరియా పంపిణీ కేంద్రాల ముందు రైతులు గొడవలు, కొట్టుకునే పరిస్థితి నెలకొందనీ, రైతులు పంటకు మొదలు యూరియా బస్తా కొనుగోలు నుండి పంట పండించి చేతికి వచ్చి అమ్మకం జరిగే వరకు రైతుకు కష్టలు తీరలేని పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉంటే సంబంధిత అధికారులు రైతులంటే చిన్నచూపు చూస్తూన్నారని లేకుంటే యూరియా అక్రమంగా ఎందుకు తరలిపోతుందని రైతులు గుసగుస పెట్టుకుంటున్నారు. యూరియా అక్రమంగా తరలింపు చేస్తున్న యూరియా పంపిణీ కేంద్రాలపై, మండలాన్ని దాటిస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని అక్రమ యూరియా దందాపై ఉక్కు పాదం మోపాలని రైతులు సంబంధిత అధికారులను వేడుకుంటున్న పరిస్థితి మహాదేవపూర్ మండలంలో నెలకొంది. ఇప్పటికైనా రైతుల గోడు విని సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా యూరియా తరలిపోకుండా యూరియా పంపిణీ కేంద్రాలపై నిఘా ఉంచాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అందరికీ బతుకమ్మ పండుగ అయితే రైతులకు యూరియా బస్తాల పండుగ…

అందరికీ బతుకమ్మ పండుగ అయితే రైతులకు యూరియా బస్తాల పండుగ

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం రాష్ట్రం మొత్తంలో ఆడబిడ్డల పండుగ బతుకమ్మ రంగుల హరివిల్లులా మెరవగా రైతు ఇంట్లో మాత్రం నిశ్శబ్దం మబ్బులా అలుముకుని ఉందని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి తీవ్ర వేదన వ్యక్తం చేశారు.
గత పది సంవత్సరాల పాలనలో రైతు ఒక్కసారైనా యూరియా కోసం సొసైటీల ఎదుట క్యూలో నిలబడలేదని గర్వంగా చెప్పుకున్న రోజులు ఇవేనా? ఇక ఇప్పుడు పరిస్థితి చూస్తే రాత్రి ఒకటి మూడు గంటలకు రైతు కడుపు మంటలు ఆపుకోలేని స్థితిలో ఎరువుల బస్తా కోసం కాచుకొని కూర్చోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది అని ఆయన ప్రశ్నించారు.
రైతు చెమటతో పాలు పిండే గడ్డిపండు వంటి భూమి ఎరువుల కోసం తహతహలాడుతున్న ఈ దృశ్యం చూసి పల్లెల గుండెల్లో రక్తం ఉడికిపోతోంది. ఇంకో రెండు మూడు నెలల్లో కోతకు వచ్చే పంట యూరియా లేక వాడిపోతుందేమోనన్న భయం రైతు కళ్లలో నిద్రను దోచేస్తోంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక బతుకమ్మ పూలు వర్ణరంజితంగా విరబూస్తున్నా రైతు హృదయంలో మాత్రం కన్నీటి బిందువులే తొణుకుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పాటల్లో ఆనందం వినిపిస్తోంది కానీ రైతు ఊపిరిలో మాత్రం ఒకటే అనాధ విలపన యూరియా యూరియా అని కరుణాకర్ రెడ్డి హృదయ పూర్వకంగా వ్యాఖ్యానించారు

రైతులకు తప్పని… యూరియా తిప్పలు..

రైతులకు తప్పని… యూరియా తిప్పలు..

#రాత్రి వేళలో యూరియా కోసం రైతులపడి గాపులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

గత నెల రోజులుగా మండలంలో యూరియా కోసం రైతుల అగచాట్లు సమసిపోవడం లేదు. ఈసారి మండలంలో అత్యధికంగా మొక్కజొన్న, వరి పంటల సాగు గత ఏడాది కంటే సాగు విస్తీర్ణం పెరగడంతో పంటలకు అధిక మొత్తంలో యూరియా వాడకం ఉండడంతో రైతులు యూరియా బస్తాల కోసం నాన ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నదని మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం జరగడంతో రైతులు వ్యవసాయ పనులన్నీ పక్కనపెట్టి. వేకువ జాము నుండే యూరియా బస్తా కోసం ప్రభుత్వ ఆగ్రోసుల వద్ద, ప్రైవేటు డీలర్ల వద్ద క్యూ లైన్ లో నిలబడి పడి గాపులు కాస్తున్నారు. రాత్రి వేళలో సైతం కేంద్రాల వద్ద రైతులు పడుకున్న సంఘటనలు సైతం ఉండడం గమనార్వం.

#యూరియా కొరత లేదు.

రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ మంత్రిత్వశాఖ సంబంధిత అధికారులు సైతం రాష్ట్రంలో ఎలాంటి యూరియా కొరత లేదని రైతులకు సరిపడా యూరియాను అందించడం జరుగుతుందని చెప్పినప్పటికీ అది మాటలకే పరిమితం అవడం తప్ప ఆచరణలో ఎక్కడ కనిపించడం లేదని ప్రతిపక్ష పార్టీలు, రైతులు గగ్గోలు పెడుతున్న యూరియా కొరత నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని రైతులు వాపోతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులతో ఎలాంటి సమీక్షలు జరపకుండా గాలికి వదిలేయడంతో రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పలువురు ప్రజా సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు రైతులు పడుతున్న కష్టాలను గమనించి పంటలకు సరిపడా యూరియాను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇదేమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి

“నేటిధాత్రి”, బిగ్ బ్రేకింగ్

ఇదేమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి

యూరియా కై..రాత్రి వేళలో పడిగాపులు.

లోడ్ వచ్చిన పంపిణీ. జరగడం లేదు.

అధికారులు స్పందించి.. పంపిణీ చేయాలని వేడుకోలు.

కుండ పోత వర్షం పడిన రైతులు పడిన కాపులు కాస్తున్నారు.

రైతు వేదిక వద్ద కరెంటు సప్లై లేకున్నా ఫోన్ లైట్ ద్వారా చూసుకుంటూ పడిగాపులు కాస్తున్న రైతులు.

“నేటిధాత్రి”,నిజాంపేట, మెదక్

రైతు యూరియా పొందడం అంటే ఓ యుద్ధం చేసినట్టుగా మారింది. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు యూరియా లోడ్ రావడం జరిగింది.

urea shortage in Nizampet, Medak

సమాచారం తెలుసుకున్న రైతులు గ్రామంలో గల రైతు వేదికలో యూరియా పంపిణీ చేస్తారెమొనని వేచి ఉన్నప్పటికీ యూరియా పంపిణీ జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి భారీ వర్షం కురవడంతో కరెంటు బంద్ అయినప్పటికీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చీకటిలో, చెప్పులతో సహా క్యూలైన్లో ఉన్నారు.

urea shortage in Nizampet, Medak

యూరియా పంపిణీ జరగకపోవడంతో తెల్లవారితే.. క్యూలైన్ పెరుగుతుందని రైతులు రాత్రి వేళలో క్యూ లైన్ కట్టారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి యూరియాను పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు.

urea shortage in Nizampet, Medak
urea shortage in Nizampet, Medak

యూరియా కోసం రైతులు అరిగోసలు పడుతున్న…

యూరియా కోసం రైతులు అరిగోసలు పడుతున్న పాటించుకొని ప్రభుత్వం

పంటలకు సరిపడా యూరియ అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రైతుని రాజుల చేసిన కేసిఆర్- సుంకె రవిశంకర్

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులను చూసి ఆగిన చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఈసందర్భంగా రైతులు రవిశంకర్ కి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పాస్ బుక్ మీద ఒక్క యూరియా బస్తానే ఇస్తాం అంటున్నారు మాకు ఐదు ఎకరాలు వ్యవసాయానికి ఒక్క బస్తా ఏం సరిపోతుంది అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్య విన్న రవిశంకర్ వెంటనే సంబంధింత అధికారికి ఫోన్ చేసి యూరియా కోసం తల్లడిల్లుతున్న రైతాంగం గురించి వివరించారు. వెంటనే వారికి యూరియా తెప్పించి రైతులకు అందించాలని కోరారు. అనంతరం రైతులతో ముచ్చటిస్తూ పంటలకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూస్తే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. తెలంగాణ రాకముందు ఎరువులు, విత్తనాల కోసం రైతులు చెప్పులను లైన్‌లో పెట్టి గంటల తరబడి నిరీక్షించారని, ప్రస్తుతం అదే పరిస్థితి ప్రతి చోటా కనిపిస్తుందన్నారు. అన్నదాతలు గత పదిరోజులుగా యూరియా కోసం ఇబ్బందిపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసు పుస్తకం, ఆధార్‌కార్డుపై ఒక్క యూరియా బస్తానే ఇస్తుండడంతో ఐదెకరాలు, పదెకరాల భూమి ఉన్న రైతులకు అది ఏమూలకు సరిపోదని పేర్కొన్నారు. ఎకరాకు సుమారు ముప్పై వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు ఎరువు వేసే సమయంలో యూరియా లభించకుండా పంట దిగుబడిలో ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఏఒక్కరోజు కూడా ఎరువుల కోసం ఇబ్బందిలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే ఈఅవస్థ అని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఎకరాకు కనీసం రెండు బస్తాల యూరియాను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే, మరోసారి రైతుల పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

యూరియా కొరత సృష్టించింది కేంద్రం.

యూరియా కొరత సృష్టించింది కేంద్రం

తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం…?

గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్

కేసముద్రం/ నేటి ధాత్రి

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు, కొద్ది మొత్తంలో వచ్చిన యూరియా పంపిణీలో పూర్తిగా సహకరిస్తున్న మహబూబాబాద్, కేసముద్రం పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియచేసిన కేసముద్రం విలేజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్.ఈ సందర్భంగా ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ… కొంతమంది బిఆర్ఎస్ కార్యకర్తలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బధనం చేయడానికి పూనుకొని రైతులకు లేనిపోని అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని ఒక అవగాహన లేకుండా బదనం చేస్తున్నారని కావున రైతులందరూ ఎవరు ఈ యూరియా కొరతకు కారణం ఏ ప్రభుత్వం అనేది పూర్తిగా తెలుసుకోవాలని రాష్ట్రానికి సరిపడా యూరియా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు ముందు ధర్నా చేసిన ఏ ఒక్కరు రాష్ట్రానికి సపోర్ట్ చేయకపోగా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మాత్రం కంకణం కట్టుకున్నారని, రాష్ట్రంలో బిజెపి ఎంపీలు సగం మంది ఉన్నారని వారు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నానని అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే ఎవరు ఎందుకు అడగట్లేదని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి రాష్ట్రం గురించి రాష్ట్ర రైతుల గురించి అడగకపోవడం శోచనీయం..? రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి కదా బిజెపి ఎంపీలు ప్రజా ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలుఅవుతుంది ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతుంటే ఓర్వలేని కొందరు ప్రభుత్వంపై అవగాహన లేని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా అన్నారు

యూరియా కోసం రైతుల తిప్పలు…

యూరియా కోసం రైతుల తిప్పలు
వర్షాన్ని లెక్కచేయని క్యూలైన్‌లు..

రామయంపేట సెప్టెంబర్ 11 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

రామాయంపేట మండలం కాట్రియాల, ధర్మారం గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు అత్యవసరమైన యూరియా కోసం తెల్లవారుజాము నుంచే సొసైటీ ఎదుట బారులు తీరారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా, తడుస్తూనే ఒక బస్తా యూరియా కోసం ఎనిమిది గంటలపాటు క్యూలైన్‌లలో నిలబడ్డారు.
“తడిసినా పర్వాలేదు… మా పంటలకు యూరియా లేకపోతే ఎండిపోతాయి” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రైతులు కూడా వర్షాన్ని లెక్కచేయకుండా లైన్లలో నిలబడటం గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో
రైతులు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు.ఇక మాకు హామీలు వద్దు వెంటనే యూరియా సరఫరా చేయాలి. పంటల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T131902.044-1.wav?_=4

 

 

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు

పరకాల నేటిధాత్రి

 

 

 

 

యూరియా కొరతపై రైతులు బుధవారంరోజున పరకాల పట్టణలోని వ్యవసాయ మార్కెట్ ముందు ఆందోళనకు దిగారు.యూరియా అందక సాగు సీజన్ మధ్యలో తీవ్రంగా నష్టపోతున్నామంటూ పరకాల హనుమకొండ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.రైతుల ఆందోళన కారణంగా రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి రాకపోకలు దాదాపు గంటసేపు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి.అనంతరం పరకాల ఎస్ఐ విఠల్ సిబ్బందితో కలిసి నిరసన చేపట్టిన దగ్గరికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

రువుల కోసం పట్టా పాస్ బుక్కు ఆధార్ జిరాక్స్ లు తీసుకురావాలి…

రువుల కోసం పట్టా పాస్ బుక్కు ఆధార్ జిరాక్స్ లు తీసుకురావాలి

గణపురం సొసైటీ చైర్మన్ కన్నె బోయిన కుమార్ యాదవ్

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

 

గణపురం మండల కేంద్రంలో గణపురం సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ తో మాట్లాడుతూ వ్యవసాయ సహకార సంఘం ఖరీఫ్ సీజన్ గాను ఎరువులు తీసుకునే రైతులు దయచేసి వారి ఆధార్ కార్డు పట్టా పాస్ బుక్ జిరాక్స్ తీసుకొని సొసైటీ ద్వారాఎరువులు తీసుకోవాల్సిందిగా రైతులను వేడుకుంటున్నాము పట్టా పాస్ బుక్ లేని రైతులు మండల వ్యవసాయ అధికారి లేదా గ్రామ వ్యవసాయ అధికారి ద్వారా సంతకం పెట్టించుకుని అట్టిపత్రాలను సొసైటీకి తీసుకొని వచ్చి ఎరువులు తీసుకోవాల్సిందిగా రైతులను వేడుకుంటున్నాను 15 రోజుల క్రితం వివిధ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవడం వల్ల రైలు పట్టాలు కొట్టుకపోవడం రహదారులు తెగిపోవడం వల్ల యూరియాకు కొన్ని రోజులు అంతరాయం ఏర్పడ్డాది పది రోజుల నుండి ప్రతిరోజు ఒక లారీ చొప్పున యూరియాను దిగుమతి చేసుకుంటున్నాము రైతు మహాశయులారా యూరియా కొరత ఉన్నదని కొంతమంది వ్యక్తులు ప్రభుత్వంపై వ్యతిరేకత భావం ఏర్పడే విధంగా పనిగట్టుకుని లేని యూరియా కొరతను సృష్టిస్తున్నారు రైతులు వారి మాయ మాటలు నమ్మవద్దని రైతులను చైర్మన్ గా వేడుకుంటున్నాను మనకు యూరియా సరిపడే విధంగా అందించడానికి భూపాలపల్లి శాసనసభ్యులు
గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో ప్రతిరోజు యూరియా రావడం జరుగుతుంది రైతులు ఎటువంటి అపోలో నమ్మకుండా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి…

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ?

 

 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే,

 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన స్టాండ్ ఏంటన్నది చెప్పడంలేదు. ఇప్పుడిది తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కొన్ని షరతులు పెట్టారు. ఇది రాష్ట్ర రైతుల సమస్యలతో ముడిపడి ఉందన్న కేటీఆర్.. బీఆర్ఎస్ తెలంగాణలో ప్రధాన విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ, ఎన్‌డీఏ, ఇండియా కూటమి రెండింటికీ అదే దూరం పాటిస్తోందని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతులకు 2 లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చే కూటమికి మాత్రమే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ‘కృత్రిమంగా’ సృష్టించిన సమస్య అని కేటీఆర్ ఆరోపించారు. సెప్టెంబర్ 9కు ముందు యూరియా రాష్ట్రానికి రావాలి.. మోదీ ప్రభుత్వం ఇస్తే ఎన్‌డీఏ అభ్యర్థికి, రాహుల్ గాంధీ ఇస్తే ఇండియా అభ్యర్థికి తాము మద్దతిస్తామని కూడా కేటీఆర్ చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయమై ఇంకా ఎవరూ మాతో సంప్రదించలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల హితమే మాకు ప్రధానమని అదే సమయంలో కేటీఆర్ అంటున్నారు. కాగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలుగు వాసి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలుగు గౌరవం’ పేరుతో బీఆర్ఎస్‌ మద్దతివ్వాలని కోరారు. కానీ, కేటీఆర్ దీన్ని తిరస్కరించి, ‘రేవంత్ రెడ్డి మూడో తరగతి సీఎం. కాంగ్రెస్ మూడో తరగతి పార్టీ అని విమర్శించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని.. అసలు కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు.

ఇక, బీఆర్ఎస్ ను ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మద్దతు కోరుతారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సూటిగా సమాధానమిచ్చారు. తనను అధిష్టానం ఆదేశిస్తే, తప్పక బీఆర్ఎస్ పార్టీని కోరతానని తేల్చి చెప్పారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా మద్దతు ఇస్తుందా.. లేక ఎవరికీ ఇవ్వకుండా మిన్నకుంటుందా అనేది తేలాలి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.

ఫర్టిలైజర్స్ షాపుని తనిఖీ చేసిన ఏడిఏ జగదీశ్వర్ రెడ్డి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T161553.624.wav?_=5

 

ఫర్టిలైజర్స్ షాపుని తనిఖీ చేసిన ఏడిఏ జగదీశ్వర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

 

నూతన ఏడీఏగా నియమితులైన జగదీశ్వర్ రెడ్డి పట్టణంలోని అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ షాపును గురువారం రోజున తనిఖీ చేయడం జరిగింది.ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా కొరత ఉన్న నేపథ్యంలో మండల పరిధిలోని రైతులకు మాత్రమే యూరియాను ఆధార్ కార్డు అనుసంధానం చేసుకొని ఈ పాస్ మిషన్ ద్వారా యూరియాను అందించేలా వ్యాపారులు సహకరించాలని రైతులు ఏ మండలంలో ఉన్నారో ఆ మండల పరిధిలో నె యూరియాను తీసుకోవాలని వ్యాపారులు స్టాక్ బోర్డులో ఎరువుల నిలువ,ధర వివరాలను పొందుపరచాలని స్టాక్ రిజిస్టర్లు తప్పకుండా అప్డేట్ అయి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

రైతులకు తక్షణమే యూరియా అందించాలి: బీఆర్ఎస్ ధర్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T131112.007.wav?_=6

రైతులకు యూరియా తక్షణమే అందించాలి

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో ధర్నా, రాస్తారోకో

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని మాందారిపేటకూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగండ్ర వెంకట రమణారెడ్డి నాయ కత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయ త్నంలో భాగంగానే ఇది జరుగు తున్నది.సిబిఐకి కాలే శ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.

BRS Holds Protest

నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతి రేకంగా మాట్లాడిన రేవం త్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తె లంగా ణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవా లి. లేదంటే మున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని, బెదిరింపులు కేసు లు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువ య్యారని అన్నారు. రోడ్డుపై బఠాయించి ధర్నాచేసి నిరసన తెలిపారు ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మే కారణం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంవచ్చి న తర్వాత రైతులు ఆరిగోస పడుతు న్నారన్నారు సకాలం లో రైతు బంధు అందక ఎరు వులు లేక అష్ట కష్టాలు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నా రని మండి పడ్డారు రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర మంలో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

BRS Holds Protest

అల్లాడుతున్న అన్నదా తలు గంటల తరబడి నిరీక్షణ

వేసినపంట అదను దాటి పోవడంతో యూరియా రైతులు అల్లాడిపోతున్న పనులన్నీ మానుకొని ఎరువుల దుకాణం వద్ద పడికా పులు కాస్తున్నాం అన్నదాతలు ఎరువుల కేంద్రం వద్ద క్యూ కట్టారు యూరియా బస్తాలు తక్కువ రావడంతో ఉన్నవారికి ఒక్కొక్కడిగా ఇవ్వడం జరుగుతుంది. మండల కేంద్రంలో పంపిణీ చేస్తున్న యూరియా బస్తాలను రైతులను అడిగి తెలుసుకు న్నారు. మండల వ్యవసాయ అధికారికి రైతుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు సంపూర్ణంగా అందే టట్లు చూడాలని మాట్లాడడం జరిగింది.రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే అన్నారు

నిజాంపేటలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123957.151-1.wav?_=7

నిజాంపేటలో..
వెంటాడుతున్న యూరియా కష్టాలు..

నిజాంపేట: నేటి ధాత్రి

యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. నిజాంపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ లో యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ యూరియా పంపిణీలో రైతులు అధిక సంఖ్యలో టోకెన్ తీసుకొని క్యూ లైన్ లో ఉదయం నుండి వేచి ఉండగా పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలో క్రితం వర్షాలు లేక వర్షాలకు ఏడిస్తే.. ఇప్పుడు వర్షాలు సంమృద్ధిగా కురిసినప్పటికీ యూరియా కోసం పడిగాపులు కాయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి యూరియా చల్లకపోతే.. వేసిన పంట ఎదుగుదల నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని వేడుకుంటున్నారు.

రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T141243.834.wav?_=8

 

రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలం

రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు

ఎలుకటి రాజయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా విషయంలో మళ్ళీ పాత రోజులు వచ్చాయని, యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి వచ్చిందని, చెప్పులు, ఆధార్ కార్డ్స్ వరుసలో పెట్టి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఉదయం నుండి రాత్రి వరకు ఉన్నా యూరియా దొరుకుతుందో లేదో అనే భయం రైతుల్లో ఉందని,రాష్ట్ర మంతా యూరియా కోసం రైతులు రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని,సకాలంలో యూరియా దొరకక వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ శివారు ఉట్టి తండా కు చెందిన రైతు భూక్య బాలు అనే రైతు పత్తి పంటను తీసివేయడం ప్రభుత్వం వైఫల్యనికి నిదర్శనం అన్నారు.గత ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అలోచించి తగినంత యూరియా సరఫరా చేసిందని, కాని ప్రస్తుత ప్రభుత్వం రైతుల గురించి ఏరోజూ ఆలోచన చేయడం లేదని, 2 లక్షల ఋణమాఫీ అని కొంతమందికి మాత్రమే చేసి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగినంత యూరియా సరఫరా చేయాలని, రైతులు అందరికి ఋణ మాఫీ చేసి ఆదుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేణుకుంట్ల రాము మాదిగ నాయకులు బొజ్జపెల్లి ప్రభాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version