కోహీర్: హైవేపై కారు దగ్ధం….

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-2026-01-02T120554.536.wav?_=1

 

కోహీర్: హైవేపై కారు దగ్ధం….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహీర్ మండలంలోని దిగ్వాల్ వద్ద 65వ జాతీయ రహదారిపై షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక కారు దగ్ధమైంది. బీదర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఐదుగురు ప్రయాణికులు సకాలంలో కారు దిగి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కారు ఇంజిన్ లో మంటలు వ్యాపించడంతో డ్రైవర్ అప్రమత్తమై కారును నిలిపివేయడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

జహీరాబాద్‌లో మంటల్లో దగ్ధమైన కారు

ప్రమాదవశాత్తు మంటలు వవాహనం దగ్ధం

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T124237.102.wav?_=2

 

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, గురువారం రాత్రి జహీరాబాద్ బీదర్ రోడ్డులో ఒక కారు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుని బూడిదైంది. వివరాల ప్రకారం, జహీరాబాద్ బీదర్ రోడ్డులోని రైల్వే గేట్ సమీపంలో మారుతి ఓమ్ని వ్యాన్ చెడిపోయి మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు బూడిదైంది. కారులో సిఎన్‌జి గ్యాస్ ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. మంటలు చెలరేగిన వెంటనే భయం నెలకొంది మరియు ప్రయాణీకులు పారిపోయారు, ఎవరికీ గాయాలు కాలేదు లేదా ఎటువంటి ప్రమాదం జరగలేదు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు

భద్రాచలం రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం..

భద్రాచలం రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం

9మంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసుల మృతి ఘోరం

విచారం వ్యక్తం చేసిన పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి

*మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం..

పలమనేరు(నేటి ధాత్రి)

 

భద్రాచలం నుంచి అన్నవరానికి యాత్రికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు- మారేడుమిల్లి ఘాట్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోరమైన ప్రమాదంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 9 మంది మృత్యువాత పడడమే గాక అందులో పలమనేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉండడం చాలా విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న ప్రత్యేక సమావేశాలకు హాజరైన ఆయన ఈ ఘటనపై తక్షణం స్పందించారు. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితుల వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకొని వారికి అవసమైన సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఇక ప్రమాదంలో అసువులు బాసిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారుపలమనేరుకు చెందిన శివశంకర్ రెడ్డి, సునంద రెడ్డిలు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించిందని ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఆయన భరోసానిచ్చారు.

మంటల్లో చిక్కుకున్న కారు.. పోలీస్ ఆఫీసర్ సజీవ దనహం…

మంటల్లో చిక్కుకున్న కారు.. పోలీస్ ఆఫీసర్ సజీవ దనహం

 

కర్ణాటకలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్ సజీవ దహనమయ్యారు.

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది(Karnataka Accidnt). ఓ కారు.. డివైడర్‌ను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్న ఘటనలో అందులోని పోలీస్ అధికారి సజీవ దహనమయ్యారు. ధార్వాడ్ జిల్లాలోని అన్నిగేరి శివారులో ఈ ఘటన జరిగింది.
ప్రమాదం జరిగిందిలా..

కన్నడ రాష్ట్రంలోని హవేరి లోకాయుక్త కార్యాలయంలో పనిచేస్తున్న పి.సలీమత్ అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్(Lokayuktha Police Inspector Salimath).. శుక్రవారం రాత్రి గడగ్ నుంచి హుబ్బళికి హ్యుందాయ్ ఐ20 కారులో ఆయన నివాసానికి బయల్దేరారు. ఇంతలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అన్నిగేరి సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టింది(Car hits a divider). దీంతో కారులో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి(Cop Burnt alive). సమీపంలోని ప్రయాణికులు అప్రమత్తమై.. సలీమత్‌(Salimath)ను రక్షించేందుకు యత్నించారు. అయితే.. తేరుకునేలోపే అందులో ఉన్న పోలీస్ ఆఫీసర్ సజీవ దహనమయ్యారు.స్థానికుల సమాచారంతో.. అగ్నిమాపక సిబ్బంది(Fire Officials) ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అనంతరం.. కాలిపోయిన సలీమత్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే దిశగా విశ్లేషిస్తున్నారు.

ప్రమాదానికి గురైన మరో స్కూల్ బస్..

ప్రమాదానికి గురైన మరో స్కూల్ బస్

◆:- ఆర్ ఎల్ ఆర్ స్కూల్ బస్ ఆటోని ఢీకొని ఆటోలో ఉన్న పాలక్యానులను ధ్వంసం అయిన దృశ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో మరో స్కూల్ బస్ ప్రమాదానికి గురైనది తృటిలో తప్పిన ప్రమాదం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు వివరాలకు వెళ్తే జహీరాబాద్ పట్టణంలోని ఆర్ ఎల్ ఆర్ స్కూల్ బస్ ఈ రోజు ఉదయం ఈ ఘటన జరిగింది వివరాలు తెలుసుకోని తెలియజేయడం జరుగుతుంది.

చనిపోయిన కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించిన మాజీ సర్పంచ్…

చనిపోయిన కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించిన మాజీ సర్పంచ్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన. నిరుపేద కుటుంబం ముద్దం బుచ్చవ్వఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ బి ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు అo కారపు .రవి తన ఔదార్యం చాటుకుంటూ. చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చి ఆమె పేరున ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు అందించేందుకు ముందు ఉంటానని వారికి హామీ ఇస్తూ వారు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. స్థానిక సిరిసిల్ల ఎమ్మెల్యే. కెటి రామారావు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా వచ్చే సహాయ సహకారాలు అందిస్తామని బీ ఆర్ఎస్ పార్టీ మీకు మీ కుటుంబానికి ఎల్లకాలం అండగా ఉంటుందని తెలియజేస్తూ. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ముద్దం బుచ్చవ్వ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆంకారపు రవీందర్ కి వారి కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలిపారుకార్యక్రమంలో. బహుజన సమాఖ్య అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్. వడ్డెర సంఘం మండల అధ్యక్షులు అలకుంట. దుర్గయ్య. కుటుంబ సభ్యులు మొత్తం మల్లయ్య నరేష్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

విషాదంలో ప్రజలు వినోదంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య…

విషాదంలో ప్రజలు వినోదంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య

* మీర్జాగూడలో రోడ్డు ప్రమాద ఘటన వద్ద ఎమ్మెల్యేకు నిరసన సేగ
•ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకుండా ప్రారంభోత్సవాలు
* ఎమ్మెల్యే బాటలోని ఆయన అనుచర గణం
* నియోజకవర్గ ప్రజలు చీదరించుకుంటున్న పట్టింపులేని ఎమ్మెల్యే
•అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాలే యాదయ్య
•ఆస్తులు, పదవులను కాపాడుకునేందుకే ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్న కాలే యాదయ్య
•మాజీ ఎమ్మెల్యేగా మారెందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్న ప్రజలు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శనివున్నట్లు చేవెళ్ల నియోజకవర్గం ఓటర్ల దుస్థితి. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కాలే యాదయ్య నియోజకవర్గ ప్రజల్ని నిండా ముంచుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తన ఆస్తులను, పదవిని కాపాడుకునేందుకే పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజల మీద ప్రేమతో కాదని స్థానిక ప్రజలు అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికై పార్టీలు మారినట్లు చెబుతున్న ఎమ్మెల్యే ఇప్పటివరకు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, నియోజకవర్గ ప్రజలు వరుసగా మూడు సార్లు కాలే యాదయ్యను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఓరగబెట్టింది ఏమి లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

* ఘోర రోడ్డు ప్రమాద ఘటన వద్ద ఎమ్మెల్యేకు నిరసన సేగ

హైదరాబాదు బీజాపూర్ జాతీయ రహదారి చేవెళ్ల నియోజకవర్గం మీర్జాగూడ వద్ద ఈనెల 3వ తేదీన సోమవారం ఉదయం 6.15 గంటలకు ఘోర రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగితే తాఫీగా అందరూ వచ్చాక 9 గంటలకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యకు స్థానిక ప్రజల నుంచి నిరసనసెగ తగిలింది. ఈ ప్రమాదానికి కారణం గత 10ఎళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులే కారణమంటూ ఎమ్మెల్యే కాలే యాదయ్యను స్థానిక ప్రజలు అడ్డంగా నిలదీశారు. 2018 లో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా మీరేం చేశారని ఎమ్మెల్యేను స్థానికులు సూటిగా ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే మీరేం చేస్తున్నారని, ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారని స్థానికులు నిలదీశారు. అనంతరం ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ ఓ సందర్భంలో ఎమ్మెల్యే పై స్థానిక ప్రజలు రాళ్లుతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఎమ్మెల్యే చేసేది ఏమీ లేక నోరు మెదపకుండా సైలెంట్ గా అక్కడి నుంచి పారిపోయాడు. గత ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నియోజకవర్గ ప్రజల నుంచి పలు గ్రామాల్లో నిరసన సెగ తగిలింది. అయినగాని ఎమ్మెల్యే కాలే యాదయ్యలో ఎలాంటి మార్పు రాదని వచ్చే ఎన్నికల్లో కాలే యాదయ్య మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోతారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

•శవాల మీద ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

ఒకవైపు నియోజకవర్గం ప్రజలంతా ఘోర రోడ్డు ప్రమాదంలో 20మందికి పైగా ప్రాణాలు కోల్పోయి తీవ్ర ఆవేదనలో శోకసంద్రంలో ఉంటే అదేమీ పట్టనట్లు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తో కలిసి షాబాద్ మండలంలో పలు ప్రారంభోత్సవాలు చేశారు.ఈ ఘోర రోడ్డు ప్రమాదం వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా యావత్తు దేశ వ్యాప్తంగా ఈ ఘటన ప్రజలందరినీ కలిచివేయటం, అందరు దిగ్బ్రాంతికి గురై శోక సంద్రంలో మునిగిపోయారు. ఓవైపు శవాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అవుతుండగానే మానవత్వం లేని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఆయన అనుచరులతో కలిసి మానవత్వాన్ని మంట కలిలిపేలా షాబాద్ మండల పరిధిలో మాచన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం, కమ్యూనిటీ హాల్, పునరుద్ధరించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, పార్కును ప్రారంభించారు. అనంతరం పార్కులో ప్రారంభమైన క్రీడా పరికరాలపై విన్యాసాలు చేస్తూ ఆనందం పొందారు.

•రంగులు మార్చడంలో మమ్మల్ని మించిన వారే లేరయ్యా.

చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం, వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తాజా ఎమ్మెల్యే కాలే యాదయ్య రంగులు మార్చడంలో మిమ్మల్ని మించిన వారే లేరయ్యా అన్న ధోరణిలో, విశ్వదాభిరామ వినురవేమా అని వేమన పద్యాన్ని నిజం చేశారు.కేవలం నియోజకవర్గ అభివృద్ధి పేరుతో ఊసరవెల్లి రంగులు మార్చినట్టు పార్టీల జెండాలను మార్చటంలో తాజా ఎమ్మెల్యే కాలే యాదయ్య చరిత్ర సృష్టించారు.వరుసగా మూడుసార్లు కాలే యాదయ్యను నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడుసార్లు పార్టీలను మార్చి తమ ఆస్తులను, పదవులను కాపాడుకునేందుకే,అవకాశవాద రాజకీయాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇది నియోజకవర్గ ప్రజల పాలిట శాపంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కేఎస్ రత్నం కూడా ఊసరవెల్లిలా తెలుగుదేశం నుంచి టిఆర్ఎస్, టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి బిజెపి పార్టీల జెండాలను మార్చి చరిత్ర సృష్టించారు. మరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాలే యాదయ్య 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొంది టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరారు. 2019లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందగా, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామేన భీమ్ భరత్ పై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అనంతరం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలా గెలుపొందిన మూడుసార్లు అధికార పార్టీలో లేకుంటే తన ఆస్తులు, పదవులను కాపాడుకుకోలేననే భయంతోనే రంగులు మార్చడంలో ఒకరిని మించి ఒకరు తయారయ్యారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గత 20 ఏళ్లుగా,నాలుగు పర్యాయాలు చేవెళ్ల నియోజకవర్గం (ఎస్సీ)నుంచి ప్రాతినిధ్య ఊహించిన ఇద్దరు (మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య) ఊసరవెల్లిలా రంగులు మార్చడంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ ఆదర్శంగా నిలిచారని నియోజకవర్గ ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలు మారిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో వారి ఆస్తులు, పదవులను కాపాడుకునేందుకే పార్టీలు మారుతున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలపై ప్రేమతో కాదని నియోజకవర్గ ప్రజలు బల్లగుద్ది చెబుతున్నారు.

•ఎమ్మెల్యే కాలే యాదయ్య ఏపార్టీలో ఉన్నారో బహిరంగ ప్రకటన చయాలి

బీఆర్ఎస్ పార్టీ భీ పామ్ పై గెలుపొందిన ఎమ్మెల్యే కాలే యాదయ్య అసలు తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా…? లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కోనసాగుతున్నరో నియోజకవర్గ ప్రజలకు బహిరంగ ప్రకటన చేయాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో కోనసాగితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పిలుపుల్లో ఎందుకు పాల్గొనటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన అనుచర కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపార్టీ కండువాలు వేసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైతుండగా మరి ఆయన ఎందుకు కాంగ్రెస్ కండువా వేసుకోవటం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన వేటు పడి ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేను ఈసారి ఇంటి బాట పట్టిస్తామని ఓటర్లు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధికై తమ ఎమ్మెల్యే కాలే యాదయ్యకు భగవంతుడు మంచి బుద్ధి, మంచి జ్ఞానాన్ని ప్రసాదించి హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 మరో ఘోర రోడ్డు ప్రమాదం..

 మరో ఘోర రోడ్డు ప్రమాదం..

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులకు వణుకు పుట్టిస్తున్నాయి. ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. తాజాగా..

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రయాణించాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు వణికిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కర్నూలులో రోడ్డు ప్రమాదం మరువకముందే చేవెళ్లలో మరో ఘోరం జరిగింది. టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే, తాజాగా, కర్ణాటకలోని బీదర్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో-కారు ఢీ కొనడంతో నలుగురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మృతులు నవీన్‌ (40), రాచప్ప (45), కాశీనాథ్‌ (60), నాగరాజు (26)గా గురించారు. గణగాపూర్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు హుటాహుటినా సహాయక చర్యలు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి…

రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి

మహాదేవపూర్ నవంబర్2నేటి ధాత్రి *

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండల కేంద్రంలొని అంబటిపల్లి గ్రామ అమరేశ్వర ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్న గోడపర్తి నాగరాజు శర్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన శుక్రవారం రోజున చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మహదేవన్ నుండి అంబర్ పెళ్లికి వెళుతుండగా సూరారం రైతు వేదిక ప్రాంతంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలుపుతూ అతని వెంట ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టూ వీలర్ మెకానిక్స్ ని ప్రభుత్వం గుర్తించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-28T130132.045.wav?_=3

 

టూ వీలర్ మెకానిక్స్ ని ప్రభుత్వం గుర్తించాలి

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో టూ వీలర్ మెకానిక్ గా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంతోష్ వృత్తి లో భాగంగా మంచిర్యాల వెళ్లి భీమారం తిరుగు ప్రయాణం చేస్తున్న మార్గమధ్యలో రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై మంచిర్యాలలో గత పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర టు వీలర్ మెకానిక్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి బాబు,రాష్ట్ర ప్రచార కార్యదర్శి రంగు ప్రకాష్,కార్యవర్గ సభ్యులు మహేష్, ముజామీల్,మడిపల్లి సత్యం హాస్పిటల్ వెళ్లి సంతోష్ ఆరోగ్య బాగోగులు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి బాబు మాట్లాడుతూ.. మెకానిక్ వృత్తిని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని అన్నారు.సామాన్య మానవుల జీవితంలో ఒక భాగమైన మోటార్ సైకిల్ రిపేర్ చేస్తూ ఎంతోమంది రోజువారి జీవన ప్రయాణంలో సహాయకులుగా నిలబడుతున్న మెకానికులకు గుర్తింపు లేకుండా పోతుందని వాపోయారు.ప్రభుత్వం వాళ్లకంటూ ఎటువంటి పథకాలు కానీ,లోన్స్ సౌకర్యాలు కానీ,వైద్య ఆరోగ్య వెసులుబాట్లు కానీ ఒక్కటి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు.అలాగే మెకానిక్ వృత్తిలో అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి వైద్య సేవలు ఉచితంగా అందించాలని కోరారు.

మిత్రబృందం చేయూతగా నిలిచిన స్నేహితులు

ఆపదలో ఉన్న స్నేహితుని కుటుంబానికి చేయూతగా నిలిచిన మిత్రబృందం

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో అక్టోబర్ 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో మంతెన శ్రీనివాస్ మరణించడంతో వారి బాల్య మిత్రులు 1991 టు 1992 బాయ్స్ హై స్కూల్ మిత్రులందరు శ్రీనివాస్ కు ప్రగాఢ సంతాపం తెలిపారు. మిత్రులు అందరూ కలిసి శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు శ్రీనివాస్ కుటుంబానికి శుక్రవారం అందజేశారు.కష్ట కాలంలో ఉన్న మిత్రుని కుటుంబాన్ని వారి వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి కష్టాల్లో ఉన్న మిత్రుని కుటుంబాన్ని ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మిత్రులందరికీ తెలియజేశారు ఇకముందు కూడా శ్రీనివాస్ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్న మిత్రుల సహాయంతో సహాయ సహకారాలు అందిస్తామని వారి కుటుంబానికి భరోసా కల్పించారు.

ప్రాణదాత సలాం నీకు…..

ప్రాణదాత సలాం నీకు…..!

శ్రీకాంత్ అవయవదానం మహోన్నతమైనది. కుమారుడి అవయవాలు దానం చేసిన. భార్య సారిక. తల్లిదండ్రులు. నాగమణి శివరాజ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాయికోడ్ మండలం, కుసునూర్ గ్రామ వాస్తవ్యులు మద్నూర్ రాచప్ప గారి మనుమడు తనయుడు శివరాజ్ నాగమణి గార్ల దంపతుల పెద్ద కొడుకు కీ.శే.శ్రీ. శ్రీకాంత్ హైద్రాబాద్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో ఉద్యోగం చేసేవాడు. దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల గ్రామ జన్మస్థలంకు వచ్చారు. దసరా పండుగ ముంగించుకొని, అతడు ఈనేల 5న 38A హైద్రాబాద్ వెళ్ళుతుండగా శివంపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. ద్విచక్ర వాహనం పైన ప్రయాణిస్తు తాను నడుపుతున్న ద్విచక్ర వాహనానికి వెనకాల నుంచి వస్తున్న
ద్విచక్ర వాహనం వచ్చి బలంగా ఢీ కొట్టడంతో, ప్రమాదానికి గురై తలకు తీవ్ర గాయలు కావడంతో, హుటాహుటిన హైద్రాబాద్ ప్రైవేట్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ లో, జాయిన్ చేశారు.

 

తొమ్మిది రోజులు ఐసీయులో అబ్జర్వేషన్ ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు. తొమ్మిది రోజులు కూడా డాక్టర్లు ఎంతో శ్రమించి ట్రీట్మెంట్ చేసిన శరీరంలో ఎలాంటి చలనం మార్పు రాకపోవడంతో, సోమవారం కిమ్స్ హాస్పిటల్ వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు. ఎన్ని రోజులు ఐసియులో పెట్టి చికిత్సలు అందించిన ప్రయోజనం ఉండదని వైద్యులు. భార్య సారికకు మరియు
తల్లిదండ్రులు శివరాజ్ నాగమణి గార్లకు తేల్చి చెప్పారు. వైద్యుల సూచన మేరకు, శ్రీకాంత్ అవయవాలు అన్ని పని చేస్తున్నందున అవయవాలు దానం చేయొచ్చని వైద్యులు సూచించారు. దీంతో తనయుడి 5 అవయవాలు దానం చేయడానికి తల్లిదండ్రులు మరియు భార్య అంగీకరించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో చేసిన అవయవదానం ఎంతో మందికి పునర్జన్మనిస్తోంది. వైద్యులు వెంటనే గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, వేరు చేసి, వివిధ ఆసుపత్రులల్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి కోసం గ్రీన్ చానెల్ మార్గంలో తరలించి ఆరుగురుకి అమర్చినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇలా అరుగురు జీవితాల్లో వెలుగు నింపిన. భార్య సారిక, తల్లిదండ్రులు శివరాజ్ నాగమణి ఆదర్శంగా నిలిచారు. మా కుమారుడి ప్రాణాన్ని కోల్పోయిన ఆరుగురికి ఊపిరి పోశాడని, భార్య సారిక, మరియు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పెద్ద కుమారుడు తమకు దూరమవడంతో, వారు గుండెలవిసేలా రోదించారు. కుసునూర్ గ్రామం, చేవెళ్ల గ్రామంలో అందరితో కలిసి మెలిసి ఉండే శ్రీకాంత్ మరణ వార్తతో గ్రామంలో. విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఆటో బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T132115.373.wav?_=4

 

ఆటో బైక్ ఢీ.. ఇద్దరికి గాయాలు.

నిజాంపేట: నేటి ధాత్రి

 

ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలైన ఘటన నిజాంపేట మండలం నందిగామ గ్రామ శివారులో చోటుచేస్తుంది. రామయంపేట నుంచి వస్తున్న బైక్ ను ఆటో ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఫారెస్ట్ అధికారి మహేష్, ఎంపీడీవో కార్యాలయ ఆపరేటర్ శ్రీనివాస్ గౌడ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్ లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం: వ్యక్తి మృతి

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న కారు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

జహీరాబాద్లోని అల్గోల్ చౌరస్తా వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన మారాటి బాలాజీ (40)ని కారు ఢీకొట్టింది. ఈ నెల 3వ తేదీ రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన బాలాజీ, చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం పూట మృతి చెందారు. కారు డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని, డ్రైవర్ గౌతమ్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడి తరఫున ఫిర్యాదు అందింది. జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రమాద బాధితుడికి 50 వేల సాయం చేసిన తట్టు విశ్వనాథ్…

క్షత్తగాత్రుడికి పరామర్శించి 50000 యాభై వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన

◆:- తట్టు విశ్వనాధ్*

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కడమంచి కిషోర్ తండ్రి లక్ష్మయ్య వయస్సు 30 సంవత్సరాలు గ్రామము అనేగుంట మండలం జహీరాబాద్ గారు బూచినెల్లి శివారులో .హైవే రోడ్డు పై బైక్ స్కిడ్ కావడం వల్ల కింద పడి తలకు తీవ్ర గాయలై సంగా రెడ్డి లోని ప్రైవేట్ ఆసుపత్రి (ధరణి) లో తలకు ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్నారు ఇట్టి విషయాన్ని కుటుంబ సభ్యులు జహీరాబాద్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆదుకోవాలని కోరగా తక్షణమే తన తమ్ముడైన తట్టు విశ్వనాథ్ కు తెలుపగా సంగారెడ్డి లోని ఆసుపత్రికి చేరుకొని కిషోర్ ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తట్టు విశ్వనాథ్ 50000/- వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కిషోర్ కుటుంబ సభ్యులు కడిమించి ప్రేమలమ్మలక్ష్మయ్య లు తట్టునారాయణ మరియు తట్టు విశ్వనాధ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగదీశ్, కోమారి కిష్టయ్య, కడిమించి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T144229.093.wav?_=5

రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం

చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి:

 

 

బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్నంపెట్టే రైతన్నలను నిండా ముంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన రైతు కళ్యాణపు రాజమొగిలి(రవి) యూరియా కోసం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనగా తీవ్రగాయాలపాలై హనుమకొండలోని ప్రయివేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న ఆయనను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా రవి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నరని విమర్శించారు.పులిగిల్ల గ్రామానికి చెందిన రైతులకు వరికోలు గ్రామంలో టోకెన్లు ఇవ్వడమేంటి అక్కడ టోకెన్ తీసుకొని పరకాలలో సొసైటీలో యూరియా ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
ఎలాగైనా పంటలను దక్కించుకోవాలనే ఆరాటంతో యూరియా కోసం బయలుదేరిన రైతులను రోడ్డు ప్రమాదాలపాలై ప్రాణాలు కోల్పోతున్న మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంఘటలకు తావులేదన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచిన ఘనత కేసిఆర్ దన్నారు. రైతులెవరూ అధైర్య పడొద్దని,ధైర్యంగా నిలబడి కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కొట్లాడి యూరియా తెచ్చుకుందామని అన్నారు.మీకు అండగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. రైతులను గోసపెడుతున్న కాంగ్రేస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని అన్నారు.పరకాల ఆర్టీసీ డీఎం,అగ్రికల్చర్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ప్రమాదంలో కాలువిరిగిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మహదేవపూర్ బాధిత కుటుంబాలను బీజేపీ నేతలు పరామర్శ…

బాధిత కుటుంబాలను పరామర్శించినబీజేపీ రాష్ట్ర నాయకులుచల్లనారాయణ రెడ్డి**

* మహదేవపూర్ సెప్టెంబర్ 13 (నేటి ధాత్రి *

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి రాంశెట్టి సమ్మయ్యని పరామర్శించి ప్రమాదంకు సంబదించిన పరిస్థితులను, వారి బాగోగులను అడిగి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డీ అలాగే
గిరిజన ఆశ్రమ పాఠశాల ఆవరణలో హాస్టల్స్ లో డైలీ వెజ్, కాoటినింజెంట్ వర్కర్ల సమస్యల పరిష్కరానికై చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతు తెలుపుతూ, ప్రభుత్వం వెంటనే వర్కర్ల సమస్యల పరిష్కరానికి కృషి చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది,
మహాదేవపూర్ మండలంలోని అంబట్ పల్లి గ్రామంలో గురువారం గోదావరి తీరా ప్రాంతంలో పిడుగు పాటుకు మృతి చెందిన 94 గోర్లు, వాటి కాపరులను పరామర్శించి, అనంతరం మాట్లాడుతూ పశు సంబంధిత అధికారులు, కలెక్టర్ తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరడం జరిగింది,అలాగే 94 మృతి చెందిన గోర్లతో పాటు ఇంకో 30 గోర్లు కూడా చనిపోయే పరిస్థితి లో వున్నవి కాబట్టి వాటిని కూడా కలుపుకొని ఆర్థిక సహాయం చేయాలనీ, గొర్ల యొక్క విలువ మొత్తం 14 లక్షల నుంచి 15లక్షలు వరకు ఉంటుందని,కానీ ప్రభుత్వ సహాయం కింద గొర్రెకు 5000 వేలు నష్ట పరిహారం ఇస్తూ బాధిత కుటుంబలు 9 లక్షల వరకు నష్ట పోతుందని, ఆలా కాకుండా 14 లక్షలు అన్నిటి విలువ కట్టి ప్రభుత్వo ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు, అలాగె బీజేపీ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు,ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, ప్రధాన కార్యదర్శులు గుజ్జుల శంకర్ శంకర్,లింగంపల్లి వంశీదర్ రావు,శ్రావణ్, బీజేపీ మండల నాయకులు ఆడప లక్ష్మి నారాయణ, కొక్కు శ్రీనివా స్, సాగర్ల రవీందర్, దాడిగేలా వెంకటేష్, రాకేష్, అయ్యప్పతో పాటు పలువురు పాల్గొన్నారు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T122009.181.wav?_=6

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: దైవ దర్శనానికి వెళ్తూ దుర్ఘటనకు గురైన కుటుంబంలో విషాదం నెలకొంది. జహీరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయాలపాలయ్యారు. పస్తాపూర్ ఆనంద్నగర్ కాలనికి చెందిన దండు వెంకటేశం (45), ఆయన అక్క కొడుకు సాయికుమార్ (20) ప్రాణాలు కోల్పోయారు. జహీరాబాద్ నుంచి న్యాల్కల్ మండలంలోని ముంగి ఆశ్రమానికి బయలుదేరిన ఈ కుటుంబం రైల్వే గేట్ దాటిన కాసేపటికే దుర్ఘటన చోటుచేసుకుంది.

 

బీదర్ నుంచి జహీరాబాద్ వస్తున్న లారీ అజాగ్రత్తగా అతివేగంగా దూసుకొచ్చి, ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన బలానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వెంకటేశం సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గాయపడిన వారు వరలక్ష్మి అలియాస్ భవాని (వెంకటేశం భార్య), నాగేశ్వరరావు (బావ), పిల్లలు రిషికేశ్, హరిచందన, జాన్వీ వీరు అందరూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

సంఘటన సమాచారం అందుకున్న వెంటనే సీఐ శివలింగం, ఎస్ఐలు నవీన్ కుమార్, కాశీనాథ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో ఇరుక్కుని మృత్యువుతో పోరాడుతున్న సాయికుమార్ను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. అంబులెన్స్లో తరలిస్తుండగా అతను దుర్మరణం పాలయ్యాడు. ఇరుక్కున్న క్షతగాత్రులను తాళ్లు, ఇనుప రాడ్ల సహాయంతో బయటికి తీశారు. అనంతరం మృతదేహాలను పట్టణంలోని ఏరియా ఆసుపత్రి మార్చురికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T113732.763-1.wav?_=7

 

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మండల కేంద్రంలోని ఎస్టిపిపి పవర్ ప్లాంట్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆవు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పశువుల యజమానులు వాటిని నిర్లక్ష్యంతో వదిలిపెట్టడం వల్ల రోడ్డుపైకి వచ్చి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అన్నారు. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న ఆవుని గ్రామపంచాయతీ సిబ్బందితో ఎలాంటి ప్రమాదాలు జరగకముందే తొలగించాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు

తాను చనిపోతూ.. మరో ఏడుగురికి ప్రాణదానం

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T105756.104.wav?_=8

తాను చనిపోతూ.. మరో ఏడుగురికి ప్రాణదానం

 

 

 

బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ యువకుడి అవయవ దానంతో ఏడుగురికి ప్రాణదానం చేశారు. జీవన్‌దాన్‌ వైద్యులు తెలినిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా జనప్రియ వెస్ట్‌ సిటీ, మియాపూర్‌కు చెందిన భువనగిరి కృష్ణ సుమంత్‌ (37) ప్రైవేట్‌ ఉద్యోగి.

 బ్రెయిన్‌డెడ్‌(Braindead)కు గురైన ఓ యువకుడి అవయవ దానంతో ఏడుగురికి ప్రాణదానం చేశారు. జీవన్‌దాన్‌ వైద్యులు తెలినిన వివరాల ప్రకారం రంగారెడ్డి(Rangareddy) జిల్లా జనప్రియ వెస్ట్‌ సిటీ, మియాపూర్‌కు చెందిన భువనగిరి కృష్ణ సుమంత్‌ (37) ప్రైవేట్‌ ఉద్యోగి. ఈనెల 18న ద్విచక్రవాహనంపై వెళుతూ బైక్‌పై నుంచి పడిపోయాడు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణ సుమంత్‌ బ్రెయిన్‌డెడ్‌కు గురైనట్టు వైద్యులు నిర్దారించారు.

జీవన్‌దాన్‌ ప్రతినిధులు అవయవ దానంపై ఆయన తండ్రి నరేందర్‌కు అవగాహన కల్పించడంతో ఆయన అందుకు అంగీకరించారు. కృష్ణ సుమంత్‌ శరీరం నుంచి 2 కిడ్నీలు, 2కార్నియాస్‌, లివర్‌, లంగ్‌, గుండె సేకరించి మరో ఏడుగురు వ్యక్తులకు అమర్చి వారికి ప్రాణదానం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version