రంగశాయిపేటలో గ్రామదేవత బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

రంగశాయిపేటలో గ్రామదేవత బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు

వరంగల్ తూర్పు నేటిధాత్రి.

 

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 42వ డివిజన్ రంగశాయిపేటలో గ్రామదేవత బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నెహ్రూ కూడలిలో రంగశాయిపేట యూత్ ఫోర్స్ (ఆర్. వై. ఎఫ్), ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే రామాలయం వద్ద కొల్లూరి రిషినంద్ ట్రస్ట్, శ్రీరామ భజన మండలి సహకారంతో ఈ వేడుకలను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు.
ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సంప్రదాయ ఆనవాయితీ ప్రకారం రెండు చోట్ల తొలి బోనాన్ని కుమ్మర (శాలివాహన) కులానికి చెందిన భక్తులు సమర్పించారు. ప్రతి సంవత్సరం గ్రామదేవత బొడ్రాయికి తొలి బోనం కుమ్మరి కులస్తుల చేతుల మీదుగానే జరగడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, డప్పు చప్పుళ్ల నడుమ బోనాన్ని ఊరేగింపుగా బొడ్రాయి దేవత వద్దకు తీసుకువచ్చారు. గ్రామంలో సుభిక్షం, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు బొడ్రాయి దేవతను ప్రార్థించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి, బోనాలను నెత్తిన మోసుకుంటూ వచ్చిన మహిళలు, భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా కుమ్మర కుల పెద్దలు మాట్లాడుతూ, గ్రామదేవతలకు తొలి బోనం కుమ్మరి కులస్తులే సమర్పించడం అనాదిగా తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు. ఈ సంప్రదాయాన్ని నేటితరం కూడా కొనసాగిస్తూ, గ్రామ సంక్షేమం కోసం ప్రార్థనలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాలివాహనులు ఆవునూరి రవి, కుమారస్వామి, లక్ష్మీ, కందికొండ మోహన్ సుధాకర్, రమేష్, కుమార్, బిక్షపతి, శ్రీనివాస్, కృష్ణ, రాజు, మల్లేశం, రాజన్న, వెంకటేశం, దేవేందర్, సురేష్, హరీష్, వంశీ, వీరేశం, ఆర్.వై.ఎఫ్ బాధ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిన్నచెల్మెడలో దుర్గాభవాని జాతర ఉత్సవాలు

చిన్నచెల్మెడలో దుర్గాభవాని జాతర: 12 నుంచి 16 వరకు వైభవంగా ఉత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీ దుర్గాభవాని జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ రుద్ర గాయత్రి కృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

12న సోమవారం పీర్ల గంధం, 13న మంగళవారం బేతాళ స్వామి పూజలు, 14న బుధవారం గ్రామ దేవతలకు పూజలు, ప్రవచనాలు, భజన కార్యక్రమాలు, 15న గురువారం బండ్లు, బోనాలు, 16న శుక్రవారం దుర్గామాత కళ్యాణం, పెద్ద పూజలు, గౌరంగాలు ఉంటాయని వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లికి బోనాలు..

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లికి బోనాలు

బోనాలు, డప్పుచప్పులతో మారుమోగిన నర్సంపేట.

ఎల్లమ్మ తల్లి,కంఠమహేశ్వర స్వామికి వందలాది బోనాల సమర్పణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్ కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన కంఠమహేశ్వర స్వామి మహోత్సవాలు నర్సంపేటలో నిర్వహిస్తున్నారు.

గౌడ కుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి సురామాంబ, రేణుక ఎల్లమ్మ వనం మైసమ్మ, దేవతల ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంఠమహేశ్వరస్వామి రేణుక ఎల్లమ్మ లకు బోనాలతో నర్సంపేట పట్టణంలోని గౌడ కులస్తులందరూ , ఘటంకుండ పెద్దమనిషి, సారకోళ్ల పెద్దమనిషి, జయలక్ష్మి సెంటర్ నుండి పట్టణంలోని భవాని ఎలక్ట్రానిక్స్, ఫిష్ మార్కెట్ ద్వారా మహాత్మా గాంధీ విగ్రహం నుండి రామకృష్ణ దుకాణం నుండి సర్పకాస్ జెండా గద్ద నుండి ద్వారక పేట బైపాస్ రోడ్డు కల్లుమండ్వా నుండి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వరకు,పురవీధుల వెంట భాజా భజంత్రీలు నృత్యాలతో కదిలారు.పాకాల రోడ్డు కూడలిలో జెట్టి కళాకారులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

జెట్టి కళాకారులు పట్టుపోసి వివిధ కళారూపాలను ప్రదర్శించారు ఎల్లమ్మ తల్లి వేషాధారణ పలువురిని ఆకట్టుకున్నది.ఎల్లమ్మ నృత్యధారణ డప్పు కళాకారుల నృత్యాలతో నర్సంపేట పట్టణం మారుమోగింది. శ్రీకంఠమహేశ్వర స్వామి దేవాలయం చేరుకొని శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురామాంబా, దేవతల కళ్యాణం పూజారులు నిర్వహించారు. అనంతరం రేణుక ఎల్లమ్మకు గావు పట్టడం కార్యక్రమాన్ని ఎల్లమ్మ తల్లి పూజారులు నిర్వహించారు. కన్నుల పండుగ బోనాల పర్వదినం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి బోనాలు తరలివచ్చాయి. గౌడ కుటుంబాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బోనాలను చేసి ఎల్లమ్మతల్లికి వందలాది బోనాలు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.

ధూప దీప నైవేద్యాలతో వారివారి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగలి వెంకటనారాయణ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి

లింగయ్య గౌడ్, కార్యదర్శి మాచర్ల అయిలు మల్లు, ఉడుగుల శ్రీనివాస్ గౌడ్, గౌడ్ మాజీ అధ్యక్షులు వరుసగా ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, డాక్టర్ పుల్లూరు శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నేతలు సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్, గొడిశాల సదానందం గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లికి బోనాలు…

కన్నుల పండువగా ఎల్లమ్మ తల్లికి బోనాలు

బోనాలు, డప్పుచప్పులతో మారుమోగిన నర్సంపేట.

ఎల్లమ్మ తల్లి,కంఠమహేశ్వర స్వామికి వందలాది బోనాల సమర్పణ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్ కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన కంఠమహేశ్వర స్వామి మహోత్సవాలు నర్సంపేటలో నిర్వహిస్తున్నారు.గౌడ కుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి సురామాంబ, రేణుక ఎల్లమ్మ వనం మైసమ్మ, దేవతల ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంఠమహేశ్వరస్వామి రేణుక ఎల్లమ్మ లకు బోనాలతో నర్సంపేట పట్టణంలోని గౌడ కులస్తులందరూ , ఘటంకుండ పెద్దమనిషి, సారకోళ్ల పెద్దమనిషి, జయలక్ష్మి సెంటర్ నుండి పట్టణంలోని భవాని ఎలక్ట్రానిక్స్, ఫిష్ మార్కెట్ ద్వారా మహాత్మా గాంధీ విగ్రహం నుండి రామకృష్ణ దుకాణం నుండి సర్పకాస్ జెండా గద్ద నుండి ద్వారక పేట బైపాస్ రోడ్డు కల్లుమండ్వా నుండి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వరకు,పురవీధుల వెంట భాజా భజంత్రీలు నృత్యాలతో కదిలారు.పాకాల రోడ్డు కూడలిలో జెట్టి కళాకారులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జెట్టి కళాకారులు పట్టుపోసి వివిధ కళారూపాలను ప్రదర్శించారు ఎల్లమ్మ తల్లి వేషాధారణ పలువురిని ఆకట్టుకున్నది.ఎల్లమ్మ నృత్యధారణ డప్పు కళాకారుల నృత్యాలతో నర్సంపేట పట్టణం మారుమోగింది. శ్రీకంఠమహేశ్వర స్వామి దేవాలయం చేరుకొని శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురామాంబా, దేవతల కళ్యాణం పూజారులు నిర్వహించారు. అనంతరం రేణుక ఎల్లమ్మకు గావు పట్టడం కార్యక్రమాన్ని ఎల్లమ్మ తల్లి పూజారులు నిర్వహించారు. కన్నుల పండుగ బోనాల పర్వదినం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి బోనాలు తరలివచ్చాయి. గౌడ కుటుంబాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బోనాలను చేసి ఎల్లమ్మతల్లికి వందలాది బోనాలు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.
ధూప దీప నైవేద్యాలతో వారివారి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగలి వెంకటనారాయణ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, కార్యదర్శి మాచర్ల అయిలు మల్లు, ఉడుగుల శ్రీనివాస్ గౌడ్, గౌడ్ మాజీ అధ్యక్షులు వరుసగా ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, డాక్టర్ పుల్లూరు శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నేతలు సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్, గొడిశాల సదానందం గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మొదలైన కంఠమహేశ్వర స్వామి ఉత్సవ వేడుకలు…

మొదలైన కంఠమహేశ్వర స్వామి ఉత్సవ వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణ గౌడ గీతా పారిశ్రామిక సహకారం సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తుల ఆరాధ్యదైవం కంఠమహేశ్వర స్వామి,రేణుక ఎల్లమ్మతల్లి బోనాల ఉత్సవాలు ఈ నెల 7 వరకు జరుగనుండగా పట్టణ గౌడ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన శనివారం వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.ముందుగా పట్టణ గౌడ కులస్తులు ఆ దేవాలయంలో దొర్నపాక అలంకరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో మొదలుపెట్టి
కంఠమహేశ్వర స్వామి -సూరమాంబదేవి, రేణుక ఎల్లమ్మతల్లి – జమదగ్ని మహారాజ్ ,వనమైసమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం పట్టణంలోని గ్రామ దేవతల వద్ద పూజలు నిర్వహించారు.
అలాగే దేవాలయంలో నిర్వహించిన సూరమాంభదేవి నాటకంలో గౌడ కులస్తులు మహిళలు ఆయా కుటుంబాలు మంగళ నీరాజనాలతో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళపెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగలగాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్, చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్,మున్సిపల్ మాజీ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, పుల్లూరి స్వామి కపిల్ గౌడ్,సోల్తి సారయ్య గౌడ్,గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, వరుస మాజీ అధ్యక్షులు ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్,డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గిరగాని శ్రీనివాస్ గౌడ్,పంజాల రాజు గౌడ్, సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

కంఠమహేశ్వరస్వామి కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

కంఠమహేశ్వరస్వామి కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో వచ్చే అక్టోబర్ 4, 5, 6,7 తేదీలలో నిర్వహించనున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురమాంబ దేవి,శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్ని మహారాజ్ బోనాల పండుగ,కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు గాని గౌడ సంఘం కమిటీ బాధ్యులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,సంఘం పెద్దలు సారయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్ ,తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్, తాళ్లపల్లి శ్రీను గౌడ్, గాధగోని సాంబయ్య గౌడ్, బొమ్మగాని కుమారస్వామి గౌడ్, గిరగాని చంద్రమౌళి గౌడ్,గండు లింగయ్య గౌడ్ ,గౌడ పెద్దలు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ కు కంఠమహేశ్వరుని వేడుక ఆహ్వానం…

మున్సిపల్ కమిషనర్ కు కంఠమహేశ్వరుని వేడుక ఆహ్వానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణ గౌడ గీతా పారిశ్రామిక సహకారం సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి,రేణుల ఏళ్ళమ్మతల్లి బోనాల ఉత్సవాలు వచ్చే అక్టోబర్ 4 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నామని దీనికి ప్రతి ఒక్క గౌడ కుటుంబం నుంచి బోనాలు తరలిరావాలని పట్టణ గౌడ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్ కోరారు.ఈ నేపథ్యంలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ను గౌడ సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు ఆహ్వానం పలికారు.అలాగే బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ దాత సోల్తి సారయ్య గౌడ్ కు, నర్సంపేట డివిజన్ గౌడ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు గండి లింగయ్య గౌడ్ కు ఆహ్వాన పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇదేండ్లకోసారి కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు నర్సంపేట పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.దీనిలో భాగంగా పట్టణంలోని ప్రతి గౌడ కుటుంబం నుంచి బోనాలు తరలి రావాలని కోరారు. దీనికోసం ప్రజలందరినీ సమాయత్తం కోసం సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.ఉత్సవాల కోసం ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని కమిషనర్ భాస్కర్ ను కోరారు. అనంతరం కమిషనర్ భాస్కర్ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి వచ్చి సౌకర్యాల ఏర్పాటుపై పరిశీలన చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షులు బొమ్మగాని కుమారస్వామి గౌడ్, గిరగాని చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, నాతి సదానందం గౌడ్, తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్ సురేష్ గౌడ్, తాబేటి లక్ష్మణ్ గౌడ్, మండ వీరన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

గౌడ పట్టణ కమిటీని సన్మానించిన గౌడ జర్నలిస్టులు…

గౌడ పట్టణ కమిటీని సన్మానించిన గౌడ జర్నలిస్టులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ గౌడ సంఘం నూతన కమిటీని నర్సంపేట గౌడ జర్నలిస్టులు సన్మానించారు.గౌడ పట్టణ కమిటీని ఇటీవల ఎన్నుకోగా పట్టణ గౌడ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్ ,ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ తో పాటు కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు,సంఘం అభివృద్ధి కోసం ప్రతీ ఒక్క గౌడబిడ్డ పాటుపడాలని కోరారు.నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుండి 7 వరకు కంఠమహేశ్వర స్వామి సూరమాంబదేవి,రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్ని బోనాల మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ఉత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వెంకటేశ్వర్లు గౌడ్ పిలుపునిచ్చారు.

గౌడ జర్నలిస్టులకు సన్మానం..

నర్సంపేట పట్టణ జర్నలిస్టులను నూతనంగా ఎన్నికైన నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు గాదగోని సాంబయ్య గౌడ్,ఆర్థిక కార్యదర్శులు నాతి సదానందం గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్,డైరెక్టర్లు తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్,మొగలగాని సురేష్ గౌడ్,వేముల కృష్ణ గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగెళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్,సంఘ సభ్యులు తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, తాబేటి లక్ష్మణ్ గౌడ్,కోల చరణ్ గౌడ్,జర్నలిస్టులు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,రడం శ్రీనివాస్ గౌడ్,బుర్ర వేణు గౌడ్, కందుల శ్రీనివాస్ గౌడ్,జూలూరి హరిప్రసాద్ గౌడ్,తడుక రమేష్ గౌడ్,వద్లకొండ పవిత్రన్ గౌడ్,వడ్లకొండ రాజ్ కుమార్ గౌడ్, కొయ్యడి సనత్ గౌడ్,గోపగాని శోభన్ గౌడ్,బండారి సుమంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కోట మైసమ్మ బోనాలు

ఘనంగా కోట మైసమ్మ బోనాలు

 

బాలానగర్ /నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం కోట మైసమ్మ బోనాలను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. కోట మైసమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బోనాల పండుగ ప్రసిద్ధమైనదన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

పోచమ్మ తల్లిని దర్శించుకున్న…

పోచమ్మ తల్లిని దర్శించుకున్న

రాష్ట్రప్లానిoగ్ బోర్డు వైస్ చైర్మన్
చిన్నారెడ్డి

వనపర్తి నేటిదాత్రి .

 

 

తెలంగాణ రాష్ట్ర సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా వనపర్తి పట్టణ ములో పోచమ్మ గుడి దగ్గరపోచమ్మ తల్లి ని రాష్ట్ర ప్లా నింగ్ బోర్డు వైస్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి దర్శించుకున్నారు. చిన్నారెడ్డి పోచమ్మ అమ్మవారి ఆశీస్సలు వనపర్తి నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కారు ఆలయ కమిటీ సభ్యులు చిన్నారెడ్డి ని శాలువా తో సన్మానించారు చిన్నారెడ్డి వెంట. కాంగ్రెస్ నేతలు రాగి వేణు శ్రీరంగాపురం రాజేంద్రప్రసాద్ నంది మల్ల యాదయ్య మైనార్టీ నాయకులు అక్తర్ చీర్ల జనార్దన్ పార్టీ నేతలు ఉన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ నాయకులు అక్తర్,వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్ధన్, వనపర్తి జిల్లా ప్లీడర్ కిరణ్ కుమార్,వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అనిష్, వనపర్తి జిల్లా అధ్యక్షులు రోహిత్ , వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు, నాగార్జున యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ నాయకులు రాగి అక్షయ్ ఇర్ఫాన్ సీనియర్ నాయకులు రాగి వేణు కోళ్ల వెంకటేష్, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

గణపురం మండలంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల తో ముక్కులు

గణపురం మండలంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాల తో ముక్కులు

పవిత్ర శ్రావణమాసం లో

చివరి బుధవారం పోచమ్మ తల్లికి బోనాల మొక్కులు

మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారికిని రెండు గ్రామస్తులు పూజించారు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం గణపురం లక్ష్మారెడ్డిపల్లి రెండు గ్రామాలలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించారు.
పవిత్ర శ్రావణమాసం పురస్కరించుకుని చివరి బుధవారం పోచమ్మ తల్లికి బోనాలతో మొక్కులు సమర్పించుకున్నారు. నియమ నిష్ఠలతో మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి అమ్మవారిని పూజించారు.
డప్పు వాయిద్యాల నడుమ,శివ సత్తుల పునకాలతో గ్రామ వీధులలో ఊరేగింపుగా బోనాలు నెత్తిన ఎత్తుకుని పెద్ద సంఖ్యలో రెండు గ్రామస్తులు పోచమ్మ తల్లి దగ్గరికి చేరి వైభవంగా వేడుక నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు పాడిపంటలు సమృద్ధిగా పండాలని పోచమ్మ తల్లి ని కోరుతూ కోళ్లు,పొట్టేలను అమ్మవారికి బలి ఇచ్చి నైవేద్యంగా సమర్పించారు.

సురభిలో బోనాల సంబరాలు..

సురభిలో బోనాల సంబరాలు

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని సురభి పాఠశాలలో బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు. అమ్మవారికి బోనాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొలాటం, తెలంగాణ జానపద నృత్యాలు, పాటలతో కార్యక్రమం చాలా రంజుగా సాగింది. విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈవేడుకలు మన సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేస్తూ అందరికి ఆనందాన్ని కలిగించాయి. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చిప్ప వీరేశం, డైరెక్టర్ చిప్ప వీర నర్సయ్య, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version