జల, వర, ‘‘సర్వ ప్రదాయని’’ కాళేశ్వరం!

-అన్నింటికీ నీళ్లే ఆధారం..

-కాళేశ్వరాన్ని వదిలేస్తే కరువు ఖాయం!

-మళ్ళీ తెలంగాణ ఎడారి కావడం తధ్యం.

-తెలంగాణ వలసల రాష్ట్ర కావడం పెద్ద దూరంలో లేదు.

-ప్రగతి అంటే ప్రజల బతుకులు బాగుపడాలి.

-ఎకానమీ వృద్ధితో ప్రజల జీవితాలలో వెలుగులు నిండాలి.

-ప్రజల సంపన్నులు కావాలని ప్రభుత్వాలు కోరుకోవాలి.

-ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఖజానా లెక్కలు చూసుకోకూడదు.

-ప్రజలు సంపన్నులుగా మారే ప్రణాళికలు అమలు చేయాలి.

-కాళేశ్వరం అలాంటి గొప్ప దిక్సూచికి నిదర్శనం.

-తెలంగాణ రెండు రకాల ఆదాయ వనరులు మీద ఆధారపడి వుంది.

-ఆ రెండు రంగాలు నీటి అవసరాలతో ముడిపడి వుంది.

-వ్యవసాయ ఉత్పత్తి, మార్కెటింగ్‌ తెలంగాణకు అవసరం.

-పారిశ్రామిక ప్రగతి, పట్టణీకరణకు నీరు ఎంతో అవసరం.

-ప్రజలకు సాగు, త్రాగుకే కాదు నిర్మాణ రంగానికి నీరు ప్రధానం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాళేశ్వరం నిజంగా తెలంగాణకు వరప్రదాయినే..అరవై ఏళ్ల తెలంగాణ గోసను తీర్చిందే. ఎవరూ ఊహించని తెలంగాణను ఆవిష్కరించిదే. అన్నమో రామ చంద్రా అని ఏడ్చిన తెలంగాణ అన్న పూర్ణగా మార్చిందే..వెయ్యి అడుగులకు బోర్లు చేసినా చుక్క నీరందని తెలంగాణలో, పది ఫీట్లలోనే నీరందించిన వర ప్రదాయినే..నలభై ఏళ్ల క్రితం పూడిపోయిన బావుల్లో కూడా నీరు చేసింది కాళేశ్వరం వల్లనే…నలభై ఏళ్లుగా వినియోగించని బావులు మళ్లీ సాగుకు పనికొచ్చాయంటే కారణం కాళేశ్వరమే…పాతాళంలో వున్న నీరును తెచ్చి సాగు చేసేందుకు వేసిన బోర్లు కరంటు అసవరం లేకుండా ఎల్లబోసినవి కాళేశ్వరం వల్లనే..అవును ఈ రోజు తెలంగాణ ఇంత పచ్చగా వుండడానికి కారణం కాళేశ్వరమే… కాళేశ్వరం ఎప్పుడూ శనేశ్వరం కాదు. తెలంగాణకు పట్టిన శనిని తరిమిన అదృష్టమే కాళేశ్వరం. సరిగ్గా పన్నెండేళ్లక్రితం ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్లపాటు కరవులో మగ్గిన తెలంగాణ ప్రాంతం. కరువు అంటే అలాంటి ఇలాంటి కరువు కాదు. భయంకరమైన కరువు. నీళ్లు లేకనా..కాదు..వానలు కురవకనా? లేదు. అన్నీ వున్నాయి. కాని తెలంగాణ నెత్తిన ఉమ్మడి పాలన అనే శని వచ్చి కూర్చన్నది. ఏలి నాటి శనికైనా కొంత కాలం వుంటుందేమో? కాని ఉమ్మడి పాలన శని 60 ఏళ్లు పట్టి తెలంగాణను పీడిరచింది. ఉమ్మడి పాలన మొదలైన నాటి నుంచే తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. రెండు రాష్ట్రాలు కలిసి నాటి నుంచే కొట్లాట మొదలైంది. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఆరాటం, పోరాటం రెండూ మొదలయ్యాయి. కాని కనికరించిన వారు లేదు. కదిలిన వారు లేరు. తెలంగాణకు ఉమ్మడి పాలకులు అన్యాయం చేస్తుంటే పట్టించుకున్న పెద్దలు లేరు. డిల్లీ నేతలకు తెలంగాణ అన్యాయం కనిపించనంగా ఉమ్మడిపాలకులు మాయ చేసి, మభ్యపెడుతూ వచ్చారు. పాలకులుగా ముందుండి తెలంగాణ నేతలను వెనక్కి నెట్టేశారు. బలం లేనితెలంగాణ అసెంబ్లీ సభ్యుల సంఖ్యను బలం చూసుకొని సీమాంద్ర నాయకులు పెత్తనం చేశారు. తెలంగాణ నిధులను ఆంద్రాకు ఎత్తుకెళ్లారు. తెలంగాణ నీళ్లను మలుపుకెళ్లారు. ఆఖరుకు తెలంగాణకు పని లేకుండా, ఉద్యోగాలు కొల్లగొట్టుకుపోయారు. తెలంగాణను ఎండబెట్టారు. లేని కరువును తెచ్చి రుద్దారు. కనికరం లేనిపాలన సాగించారు. తెలంగాణ గోస పుచ్చుకున్నారు. గొంతెండుతున్న తెలంగాణను చూసి నవ్వుకున్నారు. తెలంగాణకు కష్టం తెచ్చిపెట్టారు. అప్పుడప్పుడు మెతుకులు విదిల్చినట్లు ఎన్నికల సమయంలో ప్రాజెక్టులకు శంకుస్ధాపనలుచేసేవారు. ఆకాశంలో చుక్కలు చూపించి, ఓట్లు వేయించుకునేవారు. ఎప్పుడూ ఇదే తరీక..ఎన్నికలు అయిపోగానే మళ్లీ మెలిక. ఇదే ఉమ్మడి పాలకులు చేసిన మోసం..ద్రోహం..దౌర్జన్యం..ఆదిప్యతం. తలాపున పారుతున్న గోదావరి నీటిని తెలంగాణకు మళ్లిస్తే ఎండాకాలంలో ఆంద్రాకు చుక్క రాకుండాపోతుందనుకున్నారు. ఆంద్రాలో రెండో పంటకు నీళ్లివ్వాలంటే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మాణం చేయలేదు. తెలంగాణలో వున్న ప్రాజెక్టుల నీళ్లు కూడా పొలాలకు అందించలేదు. ఆంద్రాలో రెండో పండలకు అవసరమైనప్పుడు మాత్రం గెట్లెత్తుకున్నారు. శ్రీరాం సాగర్‌ నిర్మాణం నుంచి మొదలు, తెలంగాణలో ఏ ప్రాజెక్టు పూర్తి చేసినా, అది ఆంద్రా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణం చేశారు. తెలంగాణ ప్రజలకు మేలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు. ఎగువన శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నుంచి మొదలు కింద కిన్నెర సాని వరకు ఏపికి ఉపయోగ పడే ప్రాజెక్టులుగానే మార్చుకున్నారు. తెలంగాణకు చుక్కనీరించేందుకు మనసు రాలేదు. మిగులు జలాల కాలవలు ఆంద్రాకే, వరద జలాల కాలువలు ఆంద్రాకే ఇలా గోదావరి గలగల పారుతున్న సవ్వడి తప్ప, నీటిచుక్కను ఇవ్వలేదు. ఆఖరుకు సమ్మక్క సారక్క జాతర సమయంలో కూడా నీళ్లు వదిలేందుకు కూడా ఇష్టపడకపోయేవారు. ఇక కృష్ణా నది నీటిపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణం చేస్తామని చెప్పేవారు. పాలమూరును ఏనాడు పట్టించుకోలేదు. కాని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువనే పొక్కపెట్టి పోతిరెడ్డి పాడుపేరుతో వెనుక నుంచి వెనక్కే మళ్లించుకుపోయారు. నాగార్జున సాగర్‌లో కుడిలో ఏడాదంతా నీళ్లు తీసుకెళ్లారు. ఎడమ కాలువకు అడగంగ అడగంగా అరకొర వదిలేవారు. పైగా కుడి కాలువ నుంచి ఏపి రైతులకు, కృష్ణాడెల్టాకు ఉచితంగా నీళ్లిచ్చేవారు. ఎడమ కాలువకు నీటి తీరువా వసూలు చేసేవారు. కుడికాలువపై వున్న ఎత్తిపోతల ఖర్చు ప్రభుత్వం భరించేది. ఎడమ కాలువ ఎత్తిపోతల ఖర్చు రైతుల నుంచి వసూలు చేసేది. ఇంతటి దుర్మార్గమైన పాలననుంచి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కాళేశ్వరం వచ్చింది. తెలంగాణ సాగుకు నీరుండేది కాదు. భూ గర్భ జలాలకు దిక్కులేదు. వర్షాకాలం కురిసే వానలకు కూడా పంటలు పండిరది లేదు. బావులు నిండేవి కాదు. బాగా కాలమైనా మూడు నెలలకు మించి నీరు సాగుకు సరిపోయేది కాదు. బోర్లు వేసుకున్నా నీరు రాక తెలంగాణ రైతులు అప్పుల పాలైపోయేవారు. ఆ అప్పులు తీర్చేందుకు కూలీలుగా మారిన దుస్తితి చూసింది తెలంగాణ. అలాంటి తెలంగాణ రూపు రేఖలు మార్చింది కేసిఆర్‌. ముమ్మాటికీ ప్రతి తెలంగాణ వాది ఒప్పుకోవాల్సిందే. పార్టీలకతీతంగా కాళేశ్వరం అంశంలో గొప్పగా చెప్పుకోవాల్సిందే. దురదృష్టమేమిటంటే తెలంగాణ రైతుల ప్రయోజనాల కన్నా, రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయి. నిజాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్‌ పాలకులు తెలుసుకోవాలి. కాళేశ్వరంలో అవినీతి జరిగితే బైట పెట్టడం తప్పు కాదు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని ఏ తెలంగాణ వాది కోరుకోవడం లేదు. కాని ప్రజల సొమ్ముతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ఎండబెట్టడం సరైంది కాదు. కాళేశ్వరం మీద వేసిన కమీషన్‌ కూడా దాని నిర్మాణ సమయంత సాగ దీయడం కూడా ప్రభుత్వానికి మంచిది కాదు. కాళేశ్వరంలో జరిగిందని రేవంత్‌ సర్కారు కమీషన్‌ వేసినప్పుడు ప్రజలు స్వాగతించారు. కాని కాళేశ్వరం నీటిని వినియోగం ఆపడం నుంచి ప్రజల్లో ఒకింత బిఆర్‌ఎస్‌పై సానుభూతి పెరుగుతోంది. రానున్న కాలంలో అది మరింత పెరిగే అవకాశంవుంది. ఆ తర్వాత కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎవరు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్ధితి రాదు. కమీషన్‌ రిపోర్టు అందుకు అనుగుణంగా వచ్చినా ప్రజలు స్వాగతించరు. ఎందుకంటే కాళేశ్వరం వల్ల తెలంగాణ లబ్దిపొందింది. రైతులు సంతోషంగా వున్నారు. గత ఏడాది విసృతంగా వానలు కురిశాయి. సమృద్దిగా రైతులకు నీరందింది. దానితో కాళేశ్వరంతో పని లేకుండా పంటలు పండాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తే అది నిజమని ప్రజలు కూడా నమ్మారు. కాని గత సీజన్‌లో రైతులకు కొంత ఇబ్బంది ఎదురైంది. ఇప్పుడు కాలం కూడా ముఖం చాటేస్తుంది. ఇలాంటి పరిస్దితులు వస్తే, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం, పంటలు ఎండిపోకుండా చూసుకోవడం కోసం నీళ్లను ఆదా చేసి, రైతులకు ఇచ్చేందుకే కాళేశ్వరం అని ప్రజలు గుర్తించే రోజు వస్తోంది. ఇది కాంగ్రెస్‌కు ఇబ్బందికరమైన పరిస్దితి. కాళేశ్వరం నిర్మాణ సమయంలోనే అప్పటి బిఆర్‌ఎస్‌ పాలకుడు, కేసిఆర్‌ సుస్పష్టంగా చెప్పారు. మూడేళ్లు కాలం కాకపోయినా, కరువు వచ్చినా, తెలంగాణ రైతు నీళ్లకు ఇబ్బందులు ఎదురుకావని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు నిజం కానున్నది. జూలై నెల వస్తున్నా వాన చినుకు జాడ లేదు. వర్షాలు ఇప్పుడు కురుస్తాయన్న సంకేతాలు కూడ కనిపించడం లేదు. ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఓ వైపు రైతులు సాగు మొదలు పెట్టారు. గతంలో పదేళ్లపాటు కాలం కోసం ప్రజలు ఎదురుచూడలేదు. అటు దేవాదుల, ఇటు కాళేశ్వరంతో పుష్కలంగా భూ గర్బ జలాలు వున్నాయి. హైదరాబాద్‌ కు కూడా మంచి నీటి కటకట రాలేదు. పారిశ్రమలకు నీరు అందలేదన్న మాట వినిపించలేదు. ఇప్పుడు కూడా కాళేశ్వరాన్ని పట్టించుకోకపోతే, ఆగష్టులో అన్ని రంగాలకు ఇబ్బందులు ఎదరుకాకతప్పదు. ఇప్పుడు చెరువులు నింపాలన్నా, దేవాదులలో నీరు లేదు. ఇతర రిజర్వాయర్లలలో సమృద్దిగా నీరు లేదు. చెరువులుఎక్కడిక్కడ ఎండిపోయాయి. దీని ప్రభావం కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద పడుతుంది. రైతు కన్నెర్ర చేస్తే ఇక కనికరించే పరిస్ధితి వుండకపోవచ్చు. ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధ్యం కాదని, తెలంగాణకు నీరివ్వలేకనే ఉమ్మడిపాలకులు అన్యాయంచేశారు. కాళేశ్వరం వున్నా నీటిని ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం బద్‌నాం కాకతప్పదు. కాళేశ్వరంలో కుంగిన మూడు పిల్లర్లను బాగుచేస్తే బిఆర్‌ఎస్‌కు పేరొస్తుందని అనుకోవడం తగదు. కరవొచ్చి ఒక్క మడి ఎండినా, అది కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి నాంది జరుగుతుంది. కాంగ్రెస్‌ మరో పది కాలాల పాటు పాలించాలనుకుంటే, ప్రభుత్వం కొనసాగాలంటే నీటి సంక్షోభం లేకుంటే చూసుకుంటే మంచిది. లేకుంటే కాంగ్రెస్‌ చే జేతులా గడ్డు కాలం తెచ్చుకున్నట్లౌవుంది. బిఆర్‌ఎస్‌ను మరిపించేలా నీరివ్వండి. కాంగ్రెస్‌ను మళ్లీ మళ్లీ గెలిపించుకునేలా చేసుకోండి. రైతుకు నీళ్లందితే కాంగ్రెస్‌కు మేలు. రైతు ఏడిస్తే ఇదే కాంగ్రెస్‌కు గెలుపు ఆఖరు.

‘‘నో డైరెక్ట్‌’’..’’ఓన్లీ డైవర్ట్‌’’.

-ప్రజల జీవితాలతో రాజకీయాలు ఆటలాడుకుంటున్నాయి.

-కేంద్రంలో జరుగుతున్నదే రాష్ట్రంలో జరుగుతున్నది.

-అన్ని రాష్ట్రాల రాజకీయాలలో ఇదే కీలకమౌతోంది.

-ప్రజా సమస్యలు చర్చించడం లేదు.

-ప్రతి పదిరోజులకొక సమస్య తెరమీదకు తేవడం పొద్దుబుచ్చుకోవడం.

-మీడియా పెరిగితే ప్రజా సమస్యలు వెలుగులోకి రావాలి.

-సోషల్‌ మీడియా కూడా తోడైనందుకు జనం అవస్థలు కనిపించాలి.

-మీడియా, సోషల్‌ మీడియా అంతా అభూత కల్పనలైపోయాయి.

-రాజకీయ పార్టీల కొమ్ముకాసే వేధికలైపోయాయి.

-ప్రతి విషయంలోనూ పిల్లిమొగ్గలే!

-ప్రతి అంశంలోనూ కప్పగంతులే.

-గెలిచిన పార్టీలు అంతా బాగుందనుకుంటున్నాయి.

-ఓడిన పార్టీలు గెలిచేందుకు తాపత్రయపడుతున్నాయి.

-అన్ని పార్టీలు కలిసి ప్రజా సమస్యలను గంగలో ముంచేస్తున్నాయి.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

రాను రాను రాజకీయాల రూపు రేఖలు మారిపోతున్నాయి. గత యాభైఏళ్ల రాజకీయాలకు ఇప్పటికీ పొంతన లేకుండాపోతున్నాయి. ఒకప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి, నిత్యం ప్రజా పోరాటాలు చేస్తేనే ప్రజలు ఆదరించేవారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకులనే ఆదరించేవారు. ఏ పార్టీ అయినా నిరంతరం పోరాటంలో వుంటేనే అదికారంలోకి తెచ్చేవారు. అది కేంద్రంలోనైనా రాష్ట్రాలలోనైనా ఆదర్శవంతమైన రాజకీయాలు చేసేవారు. కాని కాలం మారింది. మరీ ఈ రెండు దశాబ్ధాల కాలంలో నాయకులకు మాటలొస్తే చాలు. అబద్దాలు చెప్పడం వస్తే చాలు. నమ్మించడం తెలిస్తే చాలు. అవసరమైతే ప్రజలను సెంటిమెంటుతో ఒప్పిస్తేలు చాలు. కులం, మతం ఆసరాగా చేసుకొని రాజకీయాలుచేస్తే చాలు. ప్రజల్లో వున్న నమ్మకాలను పట్టుకొని రాజకీయాలు చేస్తేచాలు. అన్నట్లు తయారైపోయాయి. ఇందుకు ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడాలేదు. సిద్దాంతాలు పట్టుకుంటే రాజకీయాలు సాగే రోజులు కాదు. అందుకే ఇప్పుడు రాజకీయాలకు సిద్దాంతాలు లేవు. పార్టీలు ఏనాడో రూపొందించుకున్న విలువలు లేవు. అందుకే సమాజంలో ఎవరు నాయకులౌతున్నారో? ఎవరు గెలుస్తున్నారో? ఎందుకు గెలుస్తున్నారో? కూడ అర్దంకాని పరిస్ధితులు ఎదురౌతున్నాయి. రాజకీయాలు చేయడాన్ని కూడా తమదైన శైలిలో నడిపించేవారికే రాజకీయ భవిష్యత్తులుంటాయి. నాయకులకు వ్యతిరేకంగా వున్న పార్టీలపై కూడా ప్రజలు కోపం పెంచుకుంటున్నారు. నాయకులకు అండగా నిలబడుతున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో లేవు. వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషిస్తూ దేశ వ్యాప్త రాజకీయాలను ఒక గ్రంధంగా మార్చొచ్చు. రామాయణం కన్నా పెద్ద కావ్యం రావొచ్చు. అయితే ఇక్కడ ఆటలో అరటిపండ్లు ప్రజలే అవుతున్నారు. ప్రజల చేత, ప్రజలకొరకు, ప్రజలే ఎనుకున్న ప్రజా ప్రభుత్వం. ఇది పేరుకే అన్నది ఇప్పటి కాలం నిజం చేస్తోంది. కొన్ని నిజాలు చాలా చేదుగా, ఘాటుగా కూడా వుంటాయి. 2014లో కేంద్రంలో అదికారంలోకి రావడానికి బిజేపి పెద్దగా కష్టపడలేదు. కాని ఆ అదికారాన్ని వరసుగా మూడు సార్లు నిలబెట్టుకోవడానికి మాత్రం చేస్తున్న రాజకీయ విన్యాసం విచిత్రమైనది. ప్రజా సంక్షేమం గతంలో ఎప్పుడూ లేనంతగా చూపిస్తూ బిజేపి కేంద్రంలో తిరుగులేని పాలన కొనసాగిస్తుందా? అంటే ఔనని సమాదానం ఎంత మంది చెబుతారో మాత్రం చెప్పలేం. కాని బిజేపి పార్టీ మూలసిద్దాంతంలో ఒకటైన మతాన్నిమాత్రం గట్టిగా పట్టుకున్నది. హిందూ మతానికి ప్రమాదం వుందన్న భయాన్ని ప్రజల్లో రేకిత్తెంచగలిగింది. హిందూ సమాజాన్ని మాత్రం ఏకం చేయడంలో బిజేపి సక్సెస్‌ అయ్యింది. అదే కొనసాగిస్తూనే వుంది. అటు తిరిగి, ఇటు తిరిగి హిందూ పునరేకీకరణ అనేదే మూలసిద్దాంతమైపోయింది. అంతకు మించి ఏం చేస్తోంది అంటే చెప్పడానికి ఏదీ లేదు. కాని దేశం మాత్రం సుబిక్షంగానే వుంది. కరువు లేదు. ప్రజలకు పెద్దగా ఇబ్బంది లేదు. కాని నిరుద్యోగం విపరీతంగా పెగిపోయింది. దేశంలో సాగు వెనుకబడిపోయింది. అయినా సమృద్దికరమైన ఆహారమే జనానికి అందుతోంది. ఇప్పటికీ కొన్ని కోట్ల మంది అర్ధాకలితో బతుకుతున్నారు. ఆ వార్త మాత్రం ఎక్కడా కనిపించదు. వినిపించదు. ఆకలి కేకులున్నట్లు ఒక్క మీడియా రాయదు. ఇదే ఇప్పుడున్న రాజకీయాల్లో బెస్ట్‌ క్వాలిటీ. బిజేపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలోనే ఏ ఒక్క జాతీయ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మానం చేసింది లేదు. రాష్ట్రాలలో కూడా ఏపి, తెలంగాణ తప్ప దేశంలో ఎక్కడా ప్రాజెక్టులు నిర్మాణం చేసినట్లు వార్తలు లేవు. ప్రశ్నించే నాయకులను కులం మీద దెబ్బకొట్టాలి. మతాన్ని ముడిపెట్టి రాజకీయాలు చేయాలి. బిజేపిని ప్రశ్నించే ప్రతి వారిని హిందూ వ్యతిరేకులని నిందించాలి. దేశ ద్రోహులని ముద్రలు వేయాలి. ఇలా ఇప్పటి వరకు మూడుసార్లు అధికారంలోకి కేంద్రంలో, రాష్ట్రాలలో కూడా అధికారం దక్కించుకునేందుకు బిజేపి ఆడుతున్న రాజక్రీడలో ఎవరూ ఎదురు నిలబడి గెలవడం లేదు. 130 సంవత్సరాల చరిత్ర వున్న కాంగ్రెస్‌కూడా కాకావికలమైపోతోంది. బిజేపి డౌవర్ట్‌ పాలిటిక్స్‌ను మాత్రమే నమ్ముకొని రాజకీయాలు సాగిస్తోంది. కేంద్రం నుంచి గుజరాత్‌కు,ఉత్తరాదికి నిధులు ఎన్ని వెళ్తున్నా, కనీసం బిజేపి నాయకులు కూడా నోరెత్తలేని రాజకీయాలు రచిస్తోంది. కొనసాగిస్తోంది. ధరలు ఆశాకాశన్నంటుతున్నా ఎవరూ అడిగే పరిస్దితి లేదు. పక్క దేశాల కయ్యాలే రాజకీయంగా కాపాడుతాయన్నయని నమ్ముకుంటున్నారు. రాష్ట్రాలలో కూడా అదే పరిస్దితి. 2014 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ చేసిన వాగ్దానాలు అన్నీ ఇన్ని కావు. కాని అమలుచేసినవి కూడా పెద్దగా ఏమీ లేదు. కాని ఓట్ల రాజకీయంలో కొన్ని కీలకమైన అంశాలు జొప్పించి రాజకీయం కేసిఆర్‌ సాగించారు. నీళ్లను పట్టుకున్నాడు. ఆ విషయంలో పదేళ్ల కాలంలో చేయాల్సినంత చేశాడు. మిగత వాటిని వదిలేశాడు. అందుకే పదేళ్ల తర్వాత జనం కూడా కేసిఆర్‌ను వదిలేశారు. జనం కేసిఆర్‌ను కాదనుకుంటున్నారన్న సంగతి గ్రహించిన రేవంత్‌రెడ్డి తన రాజకీయం తాను మొదలుపెట్టారు. అప్పటి వరకు కాంగ్రెస్‌ నాయకులు ఊహలకందని ఎత్తులు వేశారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులు నోరు మూయించాడు. వారందిరినీ తన బాటలోకి తెచ్చుకున్నాడు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో అమలు జరుతున్న కొత్త పథకాలు అంటే గ్యారెంటీ కార్డుకే పరిమితం చేశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత బిఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో ప్రకటించింది. అప్పుడు కేసిఆర్‌ కాంగ్రెస్‌ హమీలను కూడా కలుపుకొని ప్రచారం చేసుకున్నాడు. విజయం సాదించాడు. కాని 2023 ఎన్నికల్లోనూ ఆరు కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల తర్వాత కేసిఆర్‌ తన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను ప్రకటించారు. 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను కాపీ కొట్టినా అప్పుడు కాంగ్రెస్‌ నాయకులు ఎవరూ మాట్లాడలేదు. కాని 2023 ఎన్నికల్లో సిఎం. రేవంత్‌ మొదటి దెబ్బ అక్కడి నుంచే మొదలు పెట్టారు. పదేళ్లు పాలించి, తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే కేసిఆర్‌ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోను కాపీ కొట్టాడంటూ బలంగా రేవంత్‌రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలు కూడా గమనించేలా చేశారు. కేసిఆర్‌ చెప్పే మాటలు మోసమని నమ్మించగలిగారు. కాంగ్రెస్‌ ఒక్కసారి మాటిస్తే మర్చిపోయేది లేదని చెప్పారు. మోసం చేయడం కాంగ్రెస్‌ చరిత్రలోనే లేదన్నారు. ఒక్కొసారి కాస్తా ఆలస్యమైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని జనాన్ని నమ్మించారు. గతంలో తెలంగాణ ఇస్తామని చెప్పాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇస్తాం..అని చెప్పడం మొదలు పెట్టారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు. ఇలా చెప్పిన ప్రతి వాగ్ధానాన్ని గ్యారెంటీ రూపంలో ప్రజలకు చేర్చారు. కార్డులు చేతిలో పెట్టారు. గెలిచారు. ఆ వెంటనే ఆట మొదలు పెట్టారు. జనాన్ని ఆరు గ్యారెంటీలు మర్చిపోయేలా చేయాలంటే బిఆర్‌ఎస్‌ నాయకుల నోరు మూయిస్తే చాలనుకున్నారు. సిఎం. రేవంత్‌ రెడ్డి తన సరికొత్త రాజకీయాన్ని సాగిస్తున్నారు. ఆఖరుకు ప్రతిపక్ష బిజేపి కూడ కాంగ్రెస్‌ను కాకుండా బిఆర్‌ఎస్‌నే టార్గెట్‌ చేసే రాజకీయాలు చేస్తున్నారు. సహజంగా అదికార పార్టీని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. కాని ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి రెండూ బిఆర్‌ఎస్‌ను పుడ్‌ బాల్‌ ఆడేస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ నోరు తెరవకుండా చేస్తున్నాయి. వీటినే డైవర్ట్‌ పాలిటిక్స్‌ అంటారు. కాళేశ్వరం పై కమీషన్‌ వేశారు. అది జీడిపాకంలా సాగుతూనే వుంది. గత 18 నెలులగా జనంలోనానుతూనే వుంది. దానికి ఇప్పుడే అంతం వుండదు. ఇంకా సాగదీస్తూనే వుంటారు. జనం ఎప్పుడూ మాట్లాడుకోవడానికి ఏదో ఒక సమస్య వుండాలి. అందులోనూ బిఆర్‌ఎస్‌ నాయకులు దోషులని జనం ఎప్పుడూ నమ్ముతూ వుండాలి. అలా కేసిఆర్‌ మీద కాళేశ్వరం, కేటిఆర్‌ మీద కార్లరేస్‌ కేసు, కవిత మీద లిక్కర్‌ కేసు ఇలా ప్రతి నిత్యం ఇవే అంశాలు చర్చలకు రావాలి. మీడియాలో ఇవే అంశాలపై చర్చల మీద చర్చలు జరగాలి. ప్రజా సమస్యలు తెరమీదకు రాకూడదు. తాజాగా బనకచర్ల తెరమీదకు వచ్చింది. ఇదెంత కాలం సాగుతుందో…ఎవరి రాజకీయాలకు చుట్టుకుంటుందో చూడాలి. రాజకీయ పార్టీలు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, ప్రజలు అంత అమాయకులు కాదు. దేనిని నమ్మాలో..దేనిని నమ్మొద్దో తెలియని వాళ్లు కాదు. కాని అప్పుడప్పుడు రాజకీయాలలో ప్రజలు కూడా బోల్తాపడతారు. తర్వాత మళ్లీ తేరుకుంటారు. అయిన ఇప్పుడున్న పరిస్దితుల్లో రాజకీయ పార్టీలు మాత్రం డైవర్ట్‌ పాలిటిక్స్‌నే నమ్ముకున్నారు. పక్కన ఏపిలో కూడా ఇదే అమలు చేస్తున్నారు.

నేడు ప్రో కొత్తపల్లి ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి.

నేడు ప్రో కొత్తపల్లి ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి.

◆ నివాళ్లు అర్పించిన ఎమ్మెల్యే మాణిక్ రావు,

◆ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలో ఆచార్య జయశంకర్ గారి 14 వ వర్ధంతి. జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ బిఆర్ఎస్ నాయకులు నివాళ్లు అర్పించిన ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ
ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని..
తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు అని, ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు…
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి ,భారత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

 

నడికూడ నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు అందరు కలిసి యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ శ్వాస మీద,ధ్యాస,మనకై మనం చేసే అన్వేషణే యోగాని,అదేవిధంగా తనువును,మనసును, ఆత్మను ఏకం చేసే ఒకే ఒక సాధనం యోగాని, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని,ఈ యోగా దినోత్సవాన్ని 2014 సెప్టెంబర్ 27 న భారత ప్రధాన నరేంద్ర మోడీ ఐక్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21 జరుపు కోవడం గురించి ప్రతిపాదన చేశారని,ఈ ప్రతిపాదనకు 193 ఐక్యరాజ్యసమితి ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారని,భద్రతా కమిషన్ లో శాశ్వత సభ్యులుగా ఉన్న భారతదేశం,అమెరికా, ఇంగ్లాండ్,చైనా,ఫ్రాన్స్,రష్యా దేశాలు కూడా ఈ తీర్మానానికి సహప్రతినిధులు అని,విస్తృతమైన చర్చల అనంతరం డిసెంబర్ 2014లో ఆమోదించబడి 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు.యోగా జూన్ 21న జరుపుకోవడానికి గల కారణం జూన్ 21న ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుందని ఎక్కువ ప్రగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోడీ సూచించారని అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు
తెలంగాణ ఉద్యమ పితామహుడు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజకుమార్, మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య,విద్యార్థిని,విద్యార్థులు మరియు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ కోడపాక రఘుపతి, ఎస్సై -2 ఈశ్వరయ్య, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా యోగా దినోత్సవం ను నిర్వహించారు. ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప విధానమని దీని ద్వారా విద్యార్థులు ఏకాగ్రతను, శారీరక మానసిక వికాసాన్ని సాధించవచ్చని చెప్పారు. ఎస్సై -2 ఈశ్వరయ్య స్వయంగా కొన్ని యోగాసనాలు వేసి విద్యార్థులతో చేయించాడు. యోగాతో శారీరక అనారోగ్యాలను తొలగించుకోవచ్చని విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆదర్శవంతమైన పౌరులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు బుర్ర సదయ్య విద్యార్థుల చే యోగాసనాలు వేయించారు. హాస్టల్ వార్డెన్లు వేణు సింగ్, అరుణలు పాల్గొని విద్యార్థులకు మొలకలు, రాగి జావా అందించి ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు బొమ్మరాజమౌళి, సరళ దేవి, నీలిమారెడ్డి రామనారాయణ కల్పన,శంకర్, మౌనిక, ఉస్మాన్ అలీ,బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం.

సిరిసిల్లలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

గర్భిణీ మహిళలకు యోగ ఒక వరం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

ఈరోజు మహిళా శిశు దివ్యాంగులు వయవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలతో ఆడిటోరియంలో గర్భిణీ మహిళలకు బాలింతలకు అంగన్వాడీ టీచర్లకు యోగ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మహిళల ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్య జనని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా మహిళలు గర్భిణీ సమయంలో బాలింత సమయంలో చేయవలసినటువంటి ప్రత్యేక ఆసనాలు ప్రత్యేక ధ్యానం ప్రత్యేక యోగా పద్ధతుల గురించి వివరించడం జరిగింది. ఈ పద్ధతులను ఉపయోగించడం ద్వారా పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలు జరుగుతాయని జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం వివరించారు. అలాగే జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ యోగ పద్ధతులు నేర్చుకోవడం ద్వారా సాధారణ ప్రసవాలు జరుగుతాయనిచెప్పారు. మన దేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరియు సిరిసిల్ల జిల్లా సి సెక్షన్ లలో అత్యధిక శాతంతో ముందున్నాయి.

కాబట్టి యోగ నేర్చుకోవడం ఆసనాలు ధ్యానం ద్వారా మనం సాధారణ ప్రసవాలకు మళ్ళించవచ్చని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో రామకృష్ణ మఠం నుండి డాక్టర్ అంజలి,దీప్తి చాలా సాధారణ పద్ధతులతో ఏ విధంగా యోగాను పూర్తి చేయవచ్చు ధ్యానం గురించి కూడా వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా ఒక్కో మెట్టు గురించి వివరించడం జరిగింది. పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు గురించి వివరించారు. మంచి సంకీర్తన వినడం మంచి చిత్రాలు చూడడం ఆహ్లాదకర వాతావరణము ప్రశాంత వాతావరణము సమయానికి ఆహారం తీసుకోవడం కనీసం 8 గంటల నిద్ర ఇలాంటివి కూడా తప్పనిసరిగా పాటించాలని సూచించారు.. అలాగే ఈ కార్యక్రమానికి డాక్టర్ సురేంద్రబాబు పీడియాట్రిషన్ అతిథిగా హాజరై పిల్లల ఆరోగ్యానికి మంచి చేస్తాయని యోగా ధ్యానం పద్ధతులు వాడుకుని ఏకాగ్రతను జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని సదస్సుకు హాజరైన అందరు సిబ్బందికి తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో సిడిపివోలు సౌందర్య ఉమారాణి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రోజా సూపర్వైజర్లు పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకిషన్ ఇన్చార్జ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ , చైల్డ్ హెల్ప్ లైన్ కో ఆర్డినేటర్ పరమేశ్వర్, సఖి కో ఆర్డినేటర్ మమత, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది చర్ల ఇక్కడ రాజకీయం ఎక్కువ అభివృద్ధి తక్కువ.

ఇది చర్ల ఇక్కడ రాజకీయం ఎక్కువ అభివృద్ధి తక్కువ

సీనియర్ జర్నలిస్టు నరసింహ

నేటి ధాత్రి చర్ల:

చర్ల మండల కేంద్రంలోని ప్రజల బాధలు వర్ణనాతీతం తరతరాలుగా దళితులు గిరిజనులు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉండగా నేటికీ మెరుగైన వైద్య సౌకర్యం అందకపోవడం దురదృష్టకరం 100 సంవత్సరాల ప్రభుత్వ వైద్యశాలలో ఎక్సరే స్కానింగ్ సెంటర్ ఎమ్మారై స్కానింగ్ సిటీ స్కానింగ్ లేకపోవడం శోచనీయం మండలంలోని నేటికీ కొన్ని పాఠశాలలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేకపోవడం దురదృష్టకరం అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారు కానీ ప్రభుత్వ బడులకు పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంలో అంతర్యం ఏమిటో ఇది అధికారులు నిర్లక్ష్యమా స్థానిక రాజకీయ నాయకుల వైఫల్యం చర్ల మండల కేంద్రంలో తాలుపేరు డ్యామ్ ఉండగా పెద్ద కాలువ ద్వారా దుమ్ముగూడెం మండలానికి సాగునీరు తరలిపోతున్న చర్ల మండలంలోని కొన్ని గ్రామపంచాయతీలకు నీరు అందకపోవడం ఏమంటారు అంటే గిరిజనులకు సాగునీరు అవసరం లేదా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించకపోవడంలో వైఫల్యం ఏమిటి ఉప్పరిగూడెం కొయ్యూరు సుబ్బంపేట గ్రామపంచాయతీలకు సాగునీరు కాలువల ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎందుకు ఇవ్వటం లేదు తాలిపేరు డ్యామ్ మూడు గేట్ల వల్ల అభివృద్ధి చెందిన ఆ కాంట్రాక్టర్ ఎవరు తాలిపేరు డ్యాం కాలువల మీద డ్యామ్ మీద ఆ కాంట్రాక్టర్ ఎంత లబ్ధి పొందాడు అసలు తాలుపెరు డ్యామ్ ను పూర్తిస్థాయిలో ఎందుకు అభివృద్ధి పరచడం లేదు తాలిపేరు డ్యామ్ లో పూర్తిస్థాయిలో పూడిక తీసి అధునాతన హైడ్రాలిక్ గేట్లను అమర్చి ఆ ప్రాంతంలో హరిత హోటల్స్ కట్టి టూరిజం సెక్టర్ అభివృద్ధి పరచకపోవడంలో అంతర్యం ఏమిటి ఈ ప్రాంతంలోని గిరిజన దళిత యువతకు తాళిపేరు డ్యాం దగ్గర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఇక్కడ యువత కోరుకుంటున్నారు చర్ల మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కేంద్రం నిధులు అధిక మొత్తంలో ఈ ప్రాంతానికి వస్తున్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణం అన్ని శాఖల అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ నాయకుల అవగాహన రాహిత్యమా లేకపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఉండాలని అనుకుంటున్నా నాయకులు ఎవరు చర్ల మండల కేంద్రంలో రైతు వేదికలు రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారా కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు చర్ల మండల కేంద్రంలో పర్యటించకపోవడం లోపం ఏమిటి ఎన్ని సంవత్సరాలు అయినా దళితులు గిరిజన రైతులు అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏమిటో ఇందిరమ్మ ఇండ్ల కోసం పడిగాపులు కాస్తున్న దళితులు గిరిజన కుటుంబాలు గూడు కోసం పడరాని పాట్లు పడుతున్న కుటుంబాలు దండుపేట నుండి కొత్తపెళ్లి లింగాపురం గొంపల్లి మొగుళ్లపల్లి కత్తిగూడెం రహదారి మీదుగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధుల ద్వారా రహదారి మంజూరు చేసిన పూర్తిస్థాయిలో రహదారి వేయకుండా ఎక్కడ పనులు అక్కడే నిలిపివేసి గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించకుండా నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ అధికారులను ఏసీబీ విచారణ కోరుతుందా అని ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంతంలోని దళిత గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్ల కొరకు క్రాప్ లోన్స్ ద్వారా రైతులకు సుమారు ఎకరానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఈ ప్రాంతంలోని రైతులు చిన్న సన్నకారు రైతులు అభివృద్ధి చెందుతారు కానీ రైతులు బ్యాంకు లోకి వెళితే కూర్చోమని చెప్పే బ్యాంకు మేనేజరు లేడు క్రాప్ లోన్ ఆఫీసర్ లేరు ఆ చెప్పు అయ్యా రైతు నాకు లోను కావాలి సార్ ఎంత ఏంటని రైతుతో అవహేళనతో మాట్లాడుతూ అనేక రకాలుగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు అసలు చర్ల మండల కేంద్రంలోని బ్యాంకు మేనేజరు క్రాప్ లోన్ ఆఫీసర్లు రైతులకు పంట రుణాలపై అవగాహన కల్పించకపోవడంలో అంతర్యం ఏమిటి ఆర్.బి.ఐ రైతులకు ఇవ్వమన్న రుణం ఏమిటి బ్యాంక్ అధికారులు రైతులకు ఇస్తున్న రుణం ఎంత చర్ల మండల ప్రాంతంలోని రైతులకు బ్యాంకర్లు అవగాహన సదస్సులు ఏర్పరచి ఒక ఎకరం రెవెన్యూ భూమికి ఐదు లక్షల వరకు రుణ సహాయం అందించాలని చర్ల మండల కేంద్రంలోని రైతుల ఆకాంక్ష అదేవిధంగా మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ నేటి వరకు ఏర్పరచకపోవడంలో అంతర్యం ఏమిటి గిరిజనులు దళితుల ఇండ్లు తగలబడి పోతున్న పట్టించుకునే అధికారులే లేరు వరికుప్పలు దగ్ధమవుతున్న పేదలు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్న అధికారులు ఫైర్ స్టేషన్ ఏర్పరచకపోవడంలో ఇంత నిర్లక్ష్యమా భద్రాచలం నియోజకవర్గంలో ఇసుక రాంపులు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్న చర్ల మండల కేంద్రంలోని యువతకు ఉపాధి కల్పించకపోవడంలో అంతర్యం ఏమిటి సింగరేణి సంస్థకు ఇసుక రాంపుల నిర్వహణను కేటాయించి మండల కేంద్రంలోని దళిత గిరిజన యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు భద్రాచలం నియోజకవర్గం లో చర్ల మండలం ఏర్పడి సంవత్సరాలు అవుతున్న నేటికీ చర్ల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పరచకపోవడం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు నిర్లక్ష్యం భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్నా చర్ల మండలానికి నిధుల కొరత సృష్టిస్తున్న జిల్లాలోని అధికారులు ఎవరు చర్ల పోలీస్ స్టేషన్కు మావోయిస్టు ప్రభావిత ప్రాంత నిధులు రావడం లేదా వస్తే ఆ నిధులు ఏమవుతున్నాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా భద్రాద్రి జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉన్నా చర్ల మండలానికి నిధుల కొరత సృష్టిస్తున్న జిల్లాలోని అధికారులు ఎవరు చర్ల పోలీస్ స్టేషన్కు మావోయిస్టు ప్రభావిత ప్రాంత నిధులు రావడం లేదా వస్తే ఆ నిధులు ఏమవుతున్నాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అని సీనియర్ జర్నలిస్ట్ నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా భద్రాద్రి జిల్లాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు

వరుణుడి రాక కోసం పడిగాపులు కాస్తున్న రైతన్న.

కరుణించు వరుణ దేవా…

వరుణుడి కోసం రైతుల ఎదురుచూపులు…

వరుణుడి రాక కోసం పడిగాపులు కాస్తున్న రైతన్న…

అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి-చెరువులు,కాలువలు,కుంటలు అడుగంటిపోయినాయి…

నేటి ధాత్రి గార్ల:

జూన్ మొదటి వారంలోనే తొలకరి పలకరించినప్పటికీ నైరుతి రుతుపవనాలు ఆలస్యంతో మూడు వారాలైన ఒక్క వర్షం పడకపోవడంతో ఖరీఫ్ సీజన్ వెనక్కి వెళ్తుంది. ఖరీఫ్ లో వ్యవసాయ పనులు ప్రారంభానికి సరైన వర్షాలు లేవు. జూన్ నెల ప్రారంభమై 20 రోజులు దాటిన ఎండలు మండిపోతున్నాయి. రోజువారి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు పైబడి నమోదు అవుతున్నాయి. చిన్నపాటి వర్షాలు కురిసిన మండుతున్న ఎండలతో వ్యవసాయ పనులు ప్రారంభానికి ఏ మాత్రం అనుకూలంగా లేవని రైతులు చెబుతున్నారు. తొలకరి చినుకులు కురుస్తాయని ఉద్దేశంతో పది రోజుల కిందట వరి దుక్కులు ప్రారంభించారు. మొక్కజొన్న, పత్తి పంటలు వేసుకున్నారు. మొలకలు వచ్చినప్పటికీ ఎండకు పంట అంతా ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు.

అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చెరువులు, కాలువలు, కుంటలు అడుగంటిపోయినాయి. నీటి చుక్క కరువైంది. వరుణుడు ముఖం చాటేయడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ముందస్తు తొలకరి జల్లులకు విత్తనాలు వెతుకున్న అన్నదాతలు ఆందోళనలకు గురవుతున్నారు. బోర్లు, మోటార్లు ఉన్న రైతులు పొలాలకు తడిపేందుకు ప్రయత్నం చేస్తుంటే, ఏ సౌకర్యం లేని రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిస్తేనే పంటలకు ప్రాణం అన్నట్లుగా పరిస్థితులు మారినాయి. మబ్బులు కనిపిస్తున్న, వాన మాత్రం పడకపోవడంతో పొలాల్లో మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వరి, పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేసింది. ఖరీఫ్ సాగు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్న వర్షాలు ఎప్పుడు పడతాయా? అని ఆశతో ఎదురుచూస్తున్నారు.

త్వరలోనే సిరిసిల్ల లో పద్మశాలి భవన్ నిర్మాణం పూర్తి.

త్వరలోనే సిరిసిల్ల లో పద్మశాలి భవన్ నిర్మాణం పూర్తి

హైదారాబాద్ లోని చేనేత భవన్ లొ ప్రత్యేక సమావేశం

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి భవన్, మార్కండేయ ఆలయా నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి లోని చేనేత భవన్ లో పద్మశాలి భవన్ నిర్మాణం పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో మధ్యలో ఆగిపోయిన పద్మశాలీల కుల భవనము, మార్కండేయ స్వామి ఆలయం నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు..బీసీ సంక్షేమ శాఖ ద్వారా 5 కోట్ల నిధుల విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడడం జరిగిందన్నారు..టెస్కో నుంచి కూడా ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా కోరడం జరిగింది అని తెలిపారు..ప్రస్తుతం పిల్లర్లు పోసిన భవనాన్ని స్లాబ్ వరకు తీసుకువచ్చి, మరో 3 కోట్ల 40 లక్షలతో కళ్యాణ మండపం నిర్మాణం పూర్తిచేసుకుని, అందులో పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.. మరో 2 కోట్లతో మార్కండేయ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మొత్తం 11 కోట్లతో అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు..
చేనేతలకు ప్రభుత్వ పక్షాన పెండింగ్ లో ఉన్న బిల్లులన్నీ ఇప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పవర్లూమ్ కార్మికులకు పని కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా తల్లులకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తున్నట్లు తెలిపారు.. గతంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ అంత్యోదయ కార్డులను అందజేసినట్లు గుర్తు చేసుకున్నారు.

భవిష్యత్తులో చేనేత, పవర్లూమ్ కార్మికులకు సంబంధించి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజా ప్రభుత్వం చూసుకుంటుందని తెలిపారు.. ప్రభుత్వమిచ్చిన ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్పింది వింటునట్లు తెలిపారు.. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిందని అన్నారు..నేతన్నల ఎన్నో ఏళ్ల కల 50 కోట్లతో యారన్ డిపో ఏర్పాటు చేసినట్లు తెలిపారు..పేదలకు ఉపయోగపడే ప్రతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,బీసీ వేల్పర్ అధికారులు బల మాయదేవి, సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు..

యోగ అనేది మానవతా సంపద.

యోగ అనేది మానవతా సంపద

#మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది..

#ఇది కేవలం ఆరోగ్యానికి కాదు ప్రశాంతతకు కూడా ఓక మార్గం..

యోగ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మరియు ఎంపీ

హన్మకొండ నేటిధాత్రి:

 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.
యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు, శరీరానికి,ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో కేంద్ర పురావస్తు శాఖ మరియు ఆయుష్ విభాగం తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డా కడియం కావ్యగారితో కలిసి పాల్గొన్నారు.
శిక్షణ పొందిన యోగ నిపుణులతో ప్రత్యేకంగా యోగా ఆసనాలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు యోగా సాధన చేయాలని,యోగ అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని సూచించారు.భారతీయ సంస్కృతికి యోగా చిరునామా అని అన్నారు.ప్రపంచమంతా మన సంప్రదాయలను ఆదరించే చేసిన ఆత్మీయ సాధన అని కొనియాడారు.ప్రతి రోజు యోగా చేయాలనే కోరిక ఉంటున్న కూడా రోజు దినచర్య వలన సమయం కేటాయించలేకపోతిన్నామని చెప్పారు.నగరంలో యోగ సెంటర్ ల పై అవగాహన కల్పించాలని నూతన యోగ కేంద్రాల్ని ఏర్పాటు చేసిన ప్రజలను ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి,జిల్లా వైద్యశాల అధికారి అప్పయ్య మరియు కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న నాయకులు నాయిని లక్ష్మా రెడ్డి,సుగుణాకర్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్,మాడిశెట్టి సతీష్ మరియు యోగ నిపుణులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

యోగాతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

యోగాతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు

యువత వ్యసనాలకు బానిస కావద్దు….

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

ములుగు జిల్లా నేటిధాత్రి:
ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన వారి ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని డి బ్ల్యూ సి డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో నిర్వహించిన యోగ కార్యక్రమంలో అదనం కలెక్టర్ మహేందర్ జి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి గోపాల్ రావు తో కలిసి జ్యోతి ప్రజ్వల చేసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానసిక, శారీరక, ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని సూచించారు. యువతీ యువకులు వ్యసనాలకు బానిస కాకుండా మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం వేళలా కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, యోగ చేయడం వలన పలు రకాల వ్యాధులు దరి చేరకుండానే ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు.
అనంతరం యోగ ఆసనాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు,
జిల్లా ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ లీ చంద్ర, డాక్టర్ సంధ్య (జిల్లా ఇన్చార్జ్) యోగ ఇన్స్ట్రక్టర్ శ్రీ గురు శివ కృష్ణ, హరిత, మానస, లయ, ప్రియాంక, గిరివర్ధన్ లు పాల్గొన్నారు.

యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలి.

యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలి

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల నేటిధాత్రి:

 

నిరంతర యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుంకుమేశ్వర స్వామి ఆలయ చైర్మన్,యోగ గురువు కొల్గూరి రాజేశ్వర రావు ఆద్వర్యంలో శనివారం పరకాల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పతంజలి యోగ మహర్షికి జ్యోతి ప్రజ్వలన గావించి సుమారు రెండు గంటల పాటు వివిధ రకాల యోగాసనాల,ప్రణాయమాలు పట్టించడం జరిగింది.అనంతరం యోగా”డే”ను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా,ఆనందంగా గడపాలంటే ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి యోగాను నిత్య ప్రక్రియగా పాటించాలన్నారు.తాను కొంత కాలంగా యోగ వర్చ్యువల్ గా పాటిస్తున్నట్లు తెలిపారు.

మానసిక ప్రశాంత చేకురుతుందని,ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నట్లు వెల్లడించారు.యోగా
9సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయస్సు వరకు యోగాను ఎవరైన పటించ వచ్చన్నారు.
యోగ గురువు రాజేశ్వరరావు మాట్లాడుతూ యోగా డే ప్రాశస్త్యాన్ని వివరించారు.అనంతరం అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించి,మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి తన జన్మదినం సందర్భంగా అందించిన భగవద్గీతను యోగ అభ్యాసకులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్డీవో డాక్టర్ కే నారాయణ,మున్సిపల్ ఇంచార్జీ కమిషనర్ సుష్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,సిఐ క్రాంతికుమార్, కాంగ్రెస్ నాయకులు పాడి ప్రతాప్ రెడ్డి,ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మౌనిక,ప్రభుత్వ అయూష్ వైద్యాధికారి సీనియర్ జర్నలిస్టు మెండు రవిందర్,మాజీ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ.

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ఆకస్మిక తనిఖీ

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):

 

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గది, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. 

విద్యార్థులకు మ్యాథ్స్ పాఠ్యాంశాలు బోధించి.. ప్రశ్నలు వేసి.. సమాధానాలు రాబట్టారు. ప్రతి పాఠ్యాంశాన్ని శ్రద్ధగా చదవాలని, అనుమానాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాలయం ఎస్ఓ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు.

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేనివని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంబగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్ లు అన్నారు. తెలంగాణ సిద్ధాంత కర్త, జయశంకర్ వర్ధంతి పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన నష్టాలను, కష్టాలను.. తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ప్రజలకు వివరిస్తూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్ సార్ రగిలించారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే శ్వాసగా, ధ్యాసగా వారు నడిపిన పోరాటం, జీవితం మహోన్నతమైనదని, మీరు కలలుగన్న తెలంగాణ ప్రగతి సాక్షిగా మీకివే మా నివాళులు అని అన్నారు.తెలంగాణ ప్రాంతం ఆంధ్ర పాలకుల వల్ల అణగారిపోయి అభివృద్ధికి నోచుకోకుండా ఉందని వారి నుండి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమ కర్త కెసిఆర్‌తో వెన్నంటి ఉండి తెలంగాణ ప్రాంతంలో మన నీళ్లు,మన నిధులు,మన ఉద్యోగాలు కావాలని, కోరుకునే వ్యక్తులలో మొదటి వ్యక్తి జయశంకర్ అని అన్నారు. ఆశయాలను బంగారు తెలంగాణ కోసం నిత్యం తపించే గొప్ప ఆదర్శవాది అని అన్నారు. వారి మరణం తెలంగాణ ప్రాంత ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు రెవెల్లి ఓదెలు, అనిల్ రావు, పోగుల మల్లయ్య, జాడి శ్రీనివాస్, జిలకర మహేష్, సీనియర్ నాయకులు అలుగుల సత్యం, జక్కన బోయిన కుమార్, రామిడి లక్ష్మి కాంత్, గోనె రాజేందర్, ఖలీం,చంద్రకిరణ్, కుర్మ దినేష్ తదితరులు పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.

‘యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి’

◆ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం పురస్కరించుకుని శనివారం జహీరాబాద్ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆదర్శ విద్యాలయంలో పతాంజలి యోగా పీఠం ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. వేడుకల్లో పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతను
వశిష్ట యోగా ప్రతినిధులు, క్రీడాకారులు ఇతర ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థినిలు వ్యాయామ ఉపాధ్యాయులు గురువులు వివరిస్తూ దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అప్పుల బాధ తట్టుకోలేక నేత కార్మికుడు ఆత్మ హత్య.

అప్పుల బాధ తట్టుకోలేక నేత కార్మికుడు ఆత్మ హత్య

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

 

సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్ కు చెందిన వలస రమేష్(48) అనే నేతకార్మికుడు అప్పుల బాధలు తట్టుకోలేక కార్గిల్ లేక్ చెరువులో దూకి ఆత్మ హత్య చేసుకోని మృతి చెందాడని జరిగినది. నేత కార్మికుడైన రమేష్ పవర్ లూమ్స్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు.గత ఏడాది నుండి సరైన ఉపాధి లేక చేసిన అప్పులు 5 లక్షలు ఇక ఎలా తీర్చాలో తెలియక కార్గిల్ లేక్ చెరువులో దూకి బలవన్మరణం చేసుకున్నాడని మృతుని బంధువులు తెలిపారు.మృతుని భార్య లావణ్య, సాయి చరణ్, సచిన్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగినది.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు

హాజరైన బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.కాళీ ప్రసాద్ రావు

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.కాళీ ప్రసాద్ రావు హాజరయ్యారు.ఈసందర్బంగా మాట్లాడుతూ యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక,మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం ‘యోగ’అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది మరియు శరీరం మరియు మనస్సు కలయికకు ప్రతీకగా చేరడం లేదా ఏకం చేయడం అని,నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరించబడుతోంది మరియు జనాదరణ పొందుతూనే ఉందని,దాని సార్వత్రిక విజ్ఞప్తిని గుర్తించి,11 డిసెంబర్ 2014న ఐక్యరాజ్యసమితి 69/131 తీర్మానం ద్వారా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు.యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యమని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్థాపించే ముసాయిదా తీర్మానాన్ని భారతదేశం ప్రతిపాదించింది మరియు రికార్డు స్థాయిలో 190 సభ్య దేశాలు ఆమోదించాయన్నారు.

జనరల్ అసెంబ్లీ 69వ సెషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ ప్రతిపాదనను మొదట ప్రవేశపెట్టారు.యోగా అనేది మనస్సు మరియు శరీరం,ఆలోచన మరియు చర్య యొక్క ఐక్యతను కలిగి ఉంటుందని మన ఆరోగ్యానికి మరియు మన శ్రేయస్సుకు విలువైన సంపూర్ణ విధానం. యోగా అంటే వ్యాయామం మాత్రమే కాదు,మీతో, ప్రపంచంతో మరియు ప్రకృతితో ఏకత్వం యొక్క భావాన్ని కనుగొనడానికి ఇది ఒక మార్గం,యోగా అనేది శారీరక శ్రమ కంటే ఎక్కువ మరియు రోజువారి జీవితంలో సమతుల్య వైఖరిని కొనసాగిస్తుందని పనితీరులో నైపుణ్యాన్ని ఇస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కాచం గురుప్రసాద్,ఆర్పి జయంతి లాల్,కాసగాని రాజ్ కుమార్, ఎరుకలు దివాకర్,మార్తా రాజభద్రయ్య,ఎర్రం రామన్న, సంగా పురుషోత్తం,బాసాని సోమరాజు పటేల్,మార్త బిక్షపతి,సందీప్,కుమారస్వామి నరసయ్య,పావుశెట్టి సునీత,దంచనాదుల కిరణ్ కుమార్,కందుకూరి గిరి ప్రసాద్,కాలుగుల గోపీనాథ్, గోగుల రాజిరెడ్డి,రవీందర్ యాదవ్,నగేష్,బాలాజీ మురళి,ఆర్పీ సంగీత,చెట్ల రజినీకాంత్,సంగా ప్రభాకర్, బండి యాదగిరి,మధుసూదన్ రెడ్డి, రాంబాబు,ప్రజా ప్రతినిధులు,బిజెపి నాయకులు,పతాంజలి వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఠాగూర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు.

ఠాగూర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన సింగ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యోగ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తలపెట్టినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. యోగ ప్రాచీన భారతీయ సంప్రదాయమని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి కళాధర్ రెడ్డి, పద్మ, కట్ట ఈశ్వర చారి, రమేష్, పోషం,చంద్రమౌళి, సతీష్, ప్రసాద్, తిరుపతిరెడ్డి, నూనె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ రైస్‌ మిల్లర్ల మోసాలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు ప్రజా సంఘాల నిర్ణయం!

`జర్నలిస్టులను బెదిరిస్తే ఊరుకోం : జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ‘‘అన్నంచిన్ని వెంకటేశ్వరరావు.

`ఈ విషయంపై తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్లు ప్రకటించిన దళిత హక్కుల పోరాట సమితి.

వరంగల్‌ జిల్లా అధ్యక్షులు సంఘి ఎలేందర్‌.

`త్వరలోనే కార్యచరణ ప్రకటిస్తామన్న సిపిఐ వరంగల్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి.

`రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ప్రకటించారు.

`రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులలో ప్రజా ప్రయోజన వాజ్యాలు వేయాలని సమాలోచనలు!

`త్వరలో కోర్టులను ఆశ్రయించనున్న ప్రజా సంఘాలు.

`అక్రమ మిల్లర్లపై కేసుల నమోదుకు ప్రయత్నాలు.

`రైతులను మోసం చేసినట్లు తేట తెల్లమైనా అధికారులు చలించకపోవడంపై ప్రజా సంఘాల ఆగ్రహం.

`హన్మకొండ జిల్లాలో ఓ మిలర్ల్‌ చేసిన మోసం వెలుగులోకి వచ్చింది.

`జాయింట్‌ కలెక్టర్‌ కూడా మోసం జరిగినట్లు కమీషనర్‌కు నివేదిక పంపడం జరిగింది.

`ఖమ్మం జేసి సదరు మిల్లర్‌పై చర్యలకు సిఫారసు చేయడం కూడా జరిగిపోయింది.

`ఇంకా మిల్లర్‌ పై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నట్లు ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలు.

`రైతులను మోసం చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదని ప్రజా సంఘాల హెచ్చరిక.

`హన్మకొండ జిల్లాలో రైతులను మోసం చేసిన మిర్లర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్‌.

`సివిల్‌ సప్లయ్‌ అధికారులు స్పందించకపోతే ఆందోళనకు ప్రజా సంఘాల కార్యాచరణ.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఆరుగాలం శ్రమించే రైతులను మోసం చేయడం కొంత మంది మిల్లర్లకు అలవాటైంది. రైతులు కష్టం దోచుకోవడం నేర్చుకున్నారు. రైతులు పండిరచిన వడ్లను దోచుకొని కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ అదికారులు చోద్యం చూస్తున్నారు. తప్పు చేసిన మిల్లర్లను ఉపేక్షిస్తున్నారు. రైతులను మోసం చేస్తున్న అక్రమ మిల్లర్లపై చర్యలు తీసుకోవడం వదిలేసి, వారికి అధికారులు వంత పాడుతుంటారు. సహకరిస్తుంటారు. మిల్లర్ల అక్రమ సంపాదనలో అధికారులు కూడా అక్కడక్కడ భాగస్వాములౌతున్నారని సిపిఐ వరంగల్‌ జిల్లా కార్యదర్శి మేకల రవి, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు సంఘి ఏలేందర్‌ ఆరోపించారు. రైతులను మోసం చేస్తున్న మిల్లర్లకు వ్యతిరేకంగా త్వరలో తమ పార్టీ,సంఘాల ఉద్యమ కార్యాచరణ వుంటుందని వేర్వేరు ప్రకటనల్లో తెలియజేశారు. అంతే కాకుండా త్వరలోనే రైతు సంఘాలను కలుపుకొని పెద్దఎత్తున నిరసలు తెలియజేస్తామన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌సప్లై అధికారులకు రిప్రజెంటేషన్లు ఇవ్వడంతోపాటు, అన్ని జిల్లాలలోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కోర్టులల్లో దాఖలు చేస్తామని నేటిధాత్రితో తెలిపారు. ఈ సందర్భంగా రవి, ఏలెందర్‌లు నేటిధాత్రితో మాట్లాడుతూ రైతులను అన్యాయానికి గురి చేస్తున్న మిల్లర్లను ఇక ఉపేక్షించేది లేదని వారికి శిక్షలు పడే వరకు తమ పోరాటం సాగుతుందన్నారు. నేటిధాత్రి అక్రమ మిల్లర్లపై సాగిస్తున్న అక్షర పోరాటాన్ని చాలా కాలంగా గమనిస్తున్నామన్నారు. అయినా కొంత మంది మిల్లర్లలో మార్పులు రావడం లేదన్నారు. అలాంటి మిల్లులు మూత పడేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. మిల్లర్లు మింగిన రైతుల సొమ్ము కక్కించే వరకు తమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టు రాష్ట్ర శాఖతోపాటు, అన్ని జిల్లాల శాఖలను కూడా అప్రమత్తం చేస్తామన్నారు. ఏక కాలంలో హన్మకొండ, వరంగల్‌ జిల్లాలతోపాటు, తెలంగాణలోని అన్ని రాష్ట్రాలలోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తామన్నారు. అంతే కాకుండా అన్ని జిల్లాల్లోని సివిల్‌ సప్లయ్‌ కార్యాలయాల ముందు, అక్రమ మిల్లర్లు నిర్వహిస్తున్న మిల్లుల మందు కూడా నిరసనలు తెలియజేస్తామన్నారు. రైతుల పొట్ట గొడుతున్న మిల్లులను మూసి వేస్తే గాని మిగతా మిల్లర్లల్లో మార్పులు రావన్నారు. రైతులతో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే కూలిపోయిన ఘటనలు దేశంలో అనేకం వున్నాయన్నారు. రైతు చట్టాలలో మార్పులు తెస్తామని కేంద్రం నిర్ణయం తీసుకుంటే రైతుల పక్షాన ప్రజా సంఘాల పోరాటం ఎలా విజయం సాదించిందో అందరికీ తెలుసన్నారు. మన దేశంలో రైతు చట్టాలు ఎంత బలంగా వున్నాయో అవగాహన లేని కొంత మంది అక్రమ మిల్లర్లు రైతులను మోసం చేయడం చిన్న వ్యవహారం అనుకుంటున్నారని ఆక్షేపించారు. వడ్ల విషయంలో రైతులను మోసం చేయడం పెద్ద నేరమన్న సంగతి తెలిసి కూడా మిల్లర్లు మోసం చేస్తే వారికి శిక్ష తప్పదన్నారు. గత కొంత కాలంగా నేటిధాత్రి దినపత్రికలో వస్తున్న వరుస కథనాలు చూస్తున్నామన్నారు. రైతుల కోసం నేటిధాత్రి ఇంత పోరాటం సాగిస్తుంటే తాము మౌనంగా వుండడం సరైందికాదని నిరసనలు తెలియజేయాలని, ఉద్యమాలు సాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హన్మకొండ జిల్లాకు చెందిన ఒక్క మిల్లరే ఇంత అరాచాకాలు సాగిస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది మిల్లర్లు ఆయన బాటలో నడుస్తున్నారో నివేదికలు సిద్దం చేస్తామన్నారు. అసలు తనకు చెందని వడ్లను తన మిల్లులకు చేర్చుకోవడమే అక్రమ మిల్లర్‌ చేసిన తప్పు. ఆయనకు మేలు చేసేలా ఇతర మిల్లులకు అన్యాయంచేయడం అదికారులు చేసిన పెద్ద తప్పు. అలా ఇతర మిల్లులకు చెందాల్సిన వడ్లను దింపుకున్న మిల్లర్‌ జగన్‌, రైతులను మోసంచేయడం పెద్ద నేరం. ఇంత యధేచ్చగా రైతులను ఒక్క మిల్లర్‌ మోసం చేస్తుంటే అదికారులు ఏం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన అదికారుల్లాగా హన్మకొండ అదికారులు ఎందుకు నిజాయితీగా పనులు చేయడం లేదని వారు నిలదీశారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరక్కుండా చూసుకోవాల్సిన అధికారులు అక్రమ మిల్లర్లకు సహకరిస్తూ నేరాలు చేస్తున్నారని రవి, ఏలెదంర్‌లు అన్నారు. అక్రమ మిల్లర్లకు సహకరిస్తూ, రైతులను మోసం చేస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకునేలా తాము అన్ని ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకోకపోతే వారికి వ్యతిరేకంగా కూడా పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రైతులను మిల్లర్లు ఇంతగా మోసం చేస్తున్నట్లు ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. నేటిధాత్రి ఎంతో ధైర్యంగా అక్రమ మిల్లర్లు సాగిస్తున్న అవినీతి దందాను బైట పెట్టి, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. సహజంగా మిల్లర్లు చేసే మోసం ఇంత పెద్ద మొత్తంలో వుంటుందని ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని, నేటిదాత్రి మూలంగా మిల్లర్ల బాగోతం మొత్తం బైటపడిరదన్నారు. రైతులను ఎన్ని రకాలుగా మిల్లర్లు మోసం చేస్తున్నారో ఒక్కొ అంశం మీద వరస కధనాలు రాయడం సామాన్యమైన విషయం కాదన్నారు. నేటిధాత్రి ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను వాళ్లు అభినందించారు. ఇలాగే సమాజంలో జరుగుతున్న అన్ని అక్రమాలు, మోసాలపై నేటిధాత్రి దృష్టిపెట్టాలని కోరారు. అక్రమ మిల్లర్ల వ్యహారం ఇక రాష్ట్రమే కాదు, దేశ వ్యాప్తంగా తీసుకెళ్లి అక్రమ మిల్లర్ల బండారం బైటపెడతామన్నారు. రైతులను మోసం చేసిన వారికి శిక్ష పడేవరకు తాము ఉద్యమిస్తామని రవి, ఏలేందర్‌ తెలిపారు. 

                                   

నేటిధాత్రి జోలికొస్తే ఊరుకోం: అనం చిన్ని వెంకటేశ్వరరావు. జర్నలిస్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు.

సమాజంలో ప్రజా సమస్యలు వెలుగులోకి వచ్చేదే మీడియాతో…అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యకాలాపాలు వెలుగులోకి వచ్చేదే మీడియాతో.. సమాజాభివృద్ది, ప్రగతి కోసం న్యితం ఆరాటపడేది, పోరాటం చేసేదే మీడియా. అలాంటి మీడియా అక్రమార్కులు జీర్ణించుకోలేదు. తమ అక్రమ సంపాదన వదులుకోలేరు. అన్యాయం చేయడం ఆపుకోలేరు. తోటి వారిని మోసం చేయడం మానుకోలేరు. కోట్ల కోసం ఏ గడ్డైనా తింటారు. అశుద్దమైనా ఆనందంగా భుజిస్తారు. అలాంటి వారి మంచి కోరుకోరు. ఎదుటి వారి నాశనమే కోరుకుంటారు. అక్రమాస్దులు కూడబెట్టుకుంటారు. అలాంటి వారికి నేటిధాత్రి దినపత్రిక మీద మాట్లాడే నైతికత వుండదు. ఆ హక్కు కూడా వుండదు. ఓ వైపు రైతులను నిండా ముంచుతూ, ప్రభుత్వాన్ని మోసంచేస్తూ, పర్యావరణాన్ని పాడు చేస్తూ, అన్ని రకాలుగా ప్రకృతిని విధ్వంసం చేస్తూ, సమాజంలో ఆర్ధిక అచారకానికి పాల్పడే వ్యక్తుల గుండెల్లో నేటి దాత్రి అక్షర అంకుశం. అలాంటి నేటిదాత్రిపై ఎలాంటి దాడులకు దిగినా జర్నలిస్టు సంక్షేమ సంఘం చూస్తూ ఊరుకోదు. నేటిధాత్రి యాజమాన్యాన్ని బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాళ్లు సరిదిద్దుకుంటే మంచిది. రైతులను మోసం చేయడం ఆపుకుంటే ఎంతోమంచింది. అంతే కాని తాము చేసే అక్రమాలకు, అన్యాయాలకు నేటిదాత్రి అడ్డొస్తుందని లేనిపోని కుట్రలు చేస్తే తెలంగాణ జర్నలిస్టు సమాజమంతా కదులుతుంది. సమాజానికి మంచి చేసేవారిని ప్రోత్సహించడం, చెడు చేసేవారిని చీల్చిచెండాడడమే మీడియాకు తెలుసు. మీడియాకు శత్రువులంటూ, మిత్రులంటూ వుండరు. కావాలనే మిడియాతో అక్రమార్కులే శత్రుత్వాలు పెంచుకుంటుంటారు. అది అసలే మంచిది కాదు. నేటిధాత్రి యాజమాన్యం, జర్నలిస్టుల జోలికి ఎవరు వచ్చినా జర్నలిస్టు సంక్షేమ సంఘం ఉపేక్షించదు.

కార్మికులారా ఏకం కండి! సినీ గద్దల మాయలో పడకండి!!

 

`‘‘రోహౌస్‌’’లు ముందు టెంట్లు వేయండి!

`రెచ్చగొట్టి పబ్బం గడిపేవారితో అప్రమత్తంగా వుండండి.

??’’రోహౌస్‌’’ లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మరొక ‘‘రోహౌస్‌’’ ఓనరే చిత్రపురి సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కి పీర్యాదు చేసిన ఇప్పటివరకు చర్యలు లేవు.??

??కార్మికులు ధర్నాలు చేయాల్సింది ఫిల్మ్‌ చాంబర్‌ ముందు కాదు.??

`14 ఎకరాలు దోచుకున్న గద్దల రో హౌస్‌ ముందు నిరసనలు చేపట్టండి.

`‘‘రోహౌస్‌’’ లు అక్రమమని నినదించండి.

`‘‘రోహౌస్‌’’ లు కూల్చేదాకా నిరవదిక నిరసనలు కొనసాగించండి.

`అవినీతి పెద్ద ఎత్తున జరిగింది ‘‘రోహౌస్‌’’ లలోనే అది గమనించండి.

`‘‘ట్విన్‌ టవర్స్‌’’ నిర్మాణానికి అడ్డుపడితే మొదటికే మోసం వస్తుంది.

??14 ఎకరాలలో అప్పార్టుమెంట్లు నిర్మాణం చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది.??

`కార్మికులను ఎగదోస్తున్న ‘‘రోహౌస్‌’’ పెద్దల కుట్రలు పసిగట్టండి.

`వారి కుటిల ఎత్తుగడలలో బలికాకండి.

??చిత్రపురి సొసైటీ లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలకు ఏర్పాటుకు డిమాండ్‌ చేయండి.??

`ప్రతి కార్మికుడు పాలు పంచుకునేలా చూడండి.

`ముందు ‘‘రోహౌస్‌’’ ల మీద దృష్టి పెట్టండి.

`కళ్ల ముందు కనిపిస్తున్న ‘‘రోహౌస్‌’’ లు కనిపించకుండా కనికట్టు కడుతున్నారు.

`అక్రమంగా నిర్మాణం చేసుకున్న ‘‘రోహౌస్‌’’ ల మీద అంతస్తులు చేపడుతున్నారు.

`‘‘రోహౌస్‌’’ ల 14 ఎకరాలు కూడా కార్మికుల సొంతమే.

`ఆ స్థలం వదిలేసి, అవకాశవాదుల మాటలు విని మోసపోకండి.

`తప్పుడు సమాచారమిచ్చి రెచ్చగొట్టే వారి పంచన చేరకండి.

`నిజా నిజాలు తెలుసుకోకుండా ‘‘రో హౌస్‌’’ పెద్దల వలలో పడకండి.

`నిజాలు గమనించి చిత్రపురి మీ సొంతమని తెలుసుకోండి.

`కార్మికుల కోసం ‘‘నేటిధాత్రి’’ అలుపెరగని అక్షర పోరాటం సాగిస్తోంది.

`కార్మికులకు ‘‘నేటిధాత్రి’’ చెప్పే నిజాలు చేరకుండా చేస్తున్నారు.

`చిత్రపురి సొసైటీలో లేనిపోని చిచ్చులకు మీరు బాధ్యులు కాకండి.

`పెనం మీద నుంచి పొయ్యిలో పడకండి.

`సినీ గద్దల మాటలు విని ఇంకా మోసపోకండి.

`ఏ రాజకీయ పార్టీ మీకు న్యాయం చేయదు.

`చిత్రపురి పేరుతో రాజకీయంగా పబ్బం గడుపునే వారున్నారు.

`ఏ రాజకీయ పార్టీ అండ కార్మికులకు అవసరం లేదు.

`కార్మిక నాయకులుగా రాజకీయ పార్టీలను ముందు పెట్టకండి.

`పోరాటం మీది, ఆరాటం మీది.

`అంతిమంగా ఎంత కాలమైన చిత్రపురి మీది.

`సినీ గద్దలతో పాటు, రాజకీయ పార్టీలు దూరుతాయి.

`ఇప్పటికే మీ జివితాలు ఆగమయ్యాయి.

`కార్మికుల పేరు చెప్పి రాజకీయ పార్టీలు సమస్య పరిష్కారం కాకుండా సాగదీస్తున్నారు.

`చిత్రపురిలో సమస్యల సమరం రావణ కాష్టం చేయాలని చూస్తున్నారు.

`చలిమంటలు చేసి సినీ గద్దలు చలికాచుకుంటున్నాయి.

`కార్మికుల బతుకులను జీవిత కాలం నాశనం చేస్తున్నాయి.

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 చిత్రపురి సొసైటీ ఏర్పాటైన కాలం నుంచి కార్మికులను మోసం చేయడం, వారి అమాయకత్వాలను అలుసుగా చేసుకుంటున్నారు. సినీ పెద్దలు సమయానుకూలంగా కార్మికులను పావులుగా వాడుకుంటున్నారు. సినీ కార్మికులు అంటే నిర్మాతలు, దర్శకులు, నటలు కాదు. సినిమాలలో ఎదగలేక, ఎదుగూబొదులేక, సరైన అవకాశాలు రాక చిన్న చిన్న వేషాలకు పరిమితైననటులు. మిగతా అన్ని రంగాలలో చిన్న ఆదాయంతో బతికే వాళ్ల కోసమే చిత్రపురి. అలాంటి చిత్రపురిలో పెద్దలెందుకు దూరినట్లు. కార్మికుల భూముల్లో ఎందుకు వాలినట్లు. వీలైతే సినిమా పేరుతో కోట్లు సంపాదించుకునే పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా కార్మికుల భూముల్లో వాలడం అంటే పేదల కడుపు కొట్టడమే. ఎలాగూ సినిమా మీద పిచ్చితో వచ్చినవారిని వెట్టి చారికీ చేయించుకుంటున్నారు. వారి బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. వారి కష్టం దోచుకుంటున్నారు. ప్రభుత్వం కార్మికుల కోసం ఇచ్చిన భూములను కూడా ఆక్రమించుకోవడం అన్యాయం. దుర్మార్గం. ఇలా ఏళ్లు చిత్రపురి మీద బతుకుతున్న ఎంతో మంది మధ్య వర్తులు, దళారులు, కార్మికుల పొట్టగొడుతున్నవారున్నారు. చిత్రపురికి ఒక సొసైటీ ఏర్పాటు చేసింది పెద్దలకు ఆశ్రయం కల్పించమని కాదు. పేదలకు అన్యాయం జరగొద్దని..కాని చిత్రపురి సొసైటీ ఏం చేస్తోంది? గతంలో చేయాల్సిందంతా చేసిన వారు, తప్పుకున్నారు. తర్వాత వచ్చిన వారు కూడా పెద్దలకు కొమ్ముకాయడమే చూస్తున్నాము. అసలు చిత్రపురిలో రోహౌజ్‌లు నిర్మాణానికి సొసైటీ ఎందుకు ఒప్పుకున్నది. ఎలా ఒప్పుకున్నది. ఎవరి ప్రోధ్భలంతో ఒప్పుకున్నది. ఎవరి ఒత్తిళ్లు చిత్రపురి సొసైటీ మీద పనిచేసిందనేది కూడా కార్మికులకు తెలియాల్సిన అవసరం వుంది. ఎందుకంటే చిత్ర పురి అనేది కార్మికుల సొత్తు. కార్మికుల హక్కు. అంతే కాని సినీపెద్దల కోసం ఇచ్చింది కాదు. సినీ పెద్దలు వాలడానికి వీలులేదు. అయినా దూరిపోయారు. కార్మికుల భూములు లాక్కున్నారు. అదికారులను మభ్యపెట్టి రోహౌజ్‌లు నిర్మించుకున్నారు. ఈ విషయంలో కార్మికులను చైతన్యం చేసిన వారు లేదు. రోహౌజ్‌ల నిర్మాణం అనేది బైలాలోనే లేదు. ప్రభుత్వం ఇచ్చిన జీవో. 658లో అసలే లేదు. సినీ పెద్దల ప్రస్తావన ఒక్క ముక్క కూడా లేదు. వారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం అన్ని రకాల షరతులతో జీవో విడుదల చేసింది. ఆ జీవోను తిమ్మిని బమ్మిని చేసి, కార్మికులను మోసం చేసి 14 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఇప్పుడిప్పుడే కార్మికులకు అసలు నిజాలు తెలుస్తున్నాయి. నేటిధాత్రి దిన పత్రిక గత కొన్నేళ్లుగా చిత్రపురిలో జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై అనేక కధనాలు రాసింది. రోహౌజ్‌ల గుట్టు రట్టు చేసింది. రోహౌజ్‌ల నిర్మాణం అక్రమం, అనైతికం, చట్టరిత్యా నేరమని తేల్చి చెప్పింది. అసలు రోహౌజ్‌లలో కూడా ఒక్కొ గద్దలకు ఒకటికి రెండు రోహౌజ్‌లున్నాయి. ఆ రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నవారు ఇండియాలో కూడా లేనివారున్నారు. అమెరికా లాంటి దేశాలలో వున్నవారికి కూడా రో హౌజ్‌లు ఇచ్చారు. కార్మికుల స్ధలంలో ఇంతటి అన్యాయానికి ఎందుకు ఒడిగట్టారు? ఈ విషయాలన్నీ పూస గుచ్చినట్లు నేటిధాత్రి గత కొన్ని సంవత్సరాలుగా కార్మికులను నిద్రలేపుతూ వుంది. అయినా ఇప్పటికీ కార్మికులలో కొంత మందిని విడదీసి, సినీ గద్దలు మళ్లీ ఫిల్మ్‌ చాంబర్‌ ముందు ధర్నాలుచేయిస్తున్నారు. నిరసనలు వ్యక్తంచేసేలా ప్రోత్సహిస్తున్నారు. ట్విన్‌ టవర్స్‌లోనే కాదు, ఇతర అప్పార్టుమెంట్ల నిర్మాణంలో అవకతవలు, అవినీతి జరిగిందని కార్మికుల చేత ప్రశ్నింపజేస్తున్నారు. మంచిదే. కాని రోహౌజ్‌ల అమ్మకాలు,నిర్మాణాలపై కూడా నిరసలు తెలియజేయాల్సిన అవసరం వుంది. కార్మికులకు భూమిని కార్మికులకు అప్పగించాల్సిన అవసరం వుంది. ఆ రోహౌజ్‌లకు చెందిన 14 ఎకరాలు కార్మికులదే అన్న సత్యాన్ని తెలియజేయకుండా, కొంత మంది కార్మికులను ఇంతకాలం మభ్యపెడుతూ వచ్చారు. ఇంకా మభ్యపెడుతూనే వున్నారు. రోహౌజ్‌ల అమ్మకాల వల్ల వచ్చిన అదనపు ఆదాయాన్ని కార్మికుల కోసంనిర్మాణాలలో ఉపయోగించామని లేనిపోని లెక్కలు చెబుతున్నారు. 14 ఎకరాలలో కూడా పూర్తిగా కార్మికులకే ఇండ్ల నిర్మాణం చేపట్టి ఇస్తే ఎంతో మంది కొనుగోలు చేసుకునేవారు. కార్మికులందరికీ న్యాయం జరిగేది. ఆ పద్నాలుగు ఎకరాలను ఇతరులకు, సినీ రంగానికి సంబంధం లేనికి వారికి కట్టబెట్టడం నేరం కాదని ఎవరు చెప్పారు. అలా అమ్మకాలు జరపొచ్చని ఎవరు అనుమతులిచ్చారు. మున్సిపల్‌ శాఖనుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్మాణాలుచేశారు. మున్సిపల్‌ నుంచి వున్న ఆదేశాలను ఎందుకు తుంగలో తొక్కారు. రోహౌజ్‌ల కోసం కేటాయించిన భూమిలో కూడా భూమి హక్కులు ఎవరికీ బదలాయించలేదు. కార్మికులు తెలుసుకోవాలి. రో హౌజ్‌లైనా సరే అప్పార్టుమెంటు తరహాలోనే నిర్మాణం చేయాలని నిబంధనలు,మున్సిపల్‌ ఆదేశాలు స్పష్టంగా వున్నాయి. అంతే కాని రోహౌజ్‌లు వ్యక్తిగతంగా అప్పగించాలిన ఎక్కడాచెప్పలేదు. ఆ భూములు కొనుగోలు చేసుకున్నామని చెప్పుకుంటున్నవారికి సొంతం అసలే కాదు. రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్న స్ధలంలో నాలుగైదు అంతస్దులు నిర్మాణం చేసుకున్నా, అది పైన అంతస్ధులు కూడా సొసైటీ నుంచి కొనుగోలు చేయాలి. కాని అందుకు విరుద్దంగా నిర్మాణాలు సాగుతున్నాయి. ఓ పక్క రో హౌజ్‌లు కూల్చివేసి, ఆ స్దలం కార్మికులకు అప్పగించాలని డిమాండ్లున్నాయి. ఈ విషయంలో ఇంకా కార్మికులను తప్పుతోవ పట్టిస్తున్నారు. రోహౌజ్‌లు నిర్మాణం చేసుకొని ఐదారేళ్లుగా నివాసాలు వుంటున్నారు. అంటూ కొత్త లెక్కలు చెబుతున్నారు. సినిమాకు సంబంధం లేని వారిని ఎవరు కొనుగోలు చేయమన్నారు? ఎందుకు కొనుగోలు చేశారు. హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత ముప్పై,నలభై ఏళ్లుగానే కాదు, వంద సంవత్సరాల క్రితం నుంచి వుంటున్న వారిని కూడా ఖాళీ చేయిస్తున్నారు. మాకు తెలియకుండా అప్పుడు కొనుగోలు చేశామని చెబుతున్నప్పటికీ వినిపించుకోవడం లేదు. చట్టం గురించి తెలియక కొనుగోలుచేశామని చెబితే సరిపోదు. ఇక్కడ కూడ ఆంతే చిత్రపురిలో సినీ కార్మికులకు తప్ప మరొకరికి చోటు లేదు. ఐదారేళ్లుగా అక్కడ కోట్లు పెట్టి కొనుగోలు చేసి నివాసముంటున్నామంటే చట్టం ఒప్పుకోదు. అలా వాళ్లను మోసం చేసి, భూములు అమ్మిన వారిని నిలదీయండి. అంతే తప్ప కార్మికుల భూములను సొంతం చేసుకుంటామంటే కుదరదు. అందుకే కార్మికులారా! ఇప్పటికైనా ఏకం కండి. మాయమాటలు చెప్పేవారి మాటలు నమ్మకండి. చిత్రపురి సొసైటీలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటుకు డిమాండ్‌ చేయండి. ఒక రోజు కాకపోతే వారం రోజులు సమావేశాలు ఏర్పాటుచేయమని కోరండి. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన అవకతవకలపై చిత్రపురిసొసైటీని నిలదీయండి. ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి. తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టకండి. ఆ వెంటనే రోహౌజ్‌ల ముందు టెంట్లేసుకోండి. నిరసన ప్రదర్శనలు మొదలు పెట్టండి. కార్మికుల స్ధలాన్ని ఆక్రమించుకున్నవారు ఎందుకు ఖాళీ చేయరో చూడండి. తమ స్వప్రయోజనాల కోసం వాడుకునే వారిని నమ్మకండి. మీకు మీరుగా నాయకులు కండి. ఏ రాజకీయ పార్టీ వచ్చినా కార్మికులకు న్యాయం చేసింది లేదు. కార్మికుల పక్షాన పోరటం చేసినట్లు నటించి, రాజకీయ పార్టీలు సొసైటీకి తొత్తులుగా మారిపోయారు. వారు అనుకున్న లక్ష్యం నేరవేర్చుకుంటున్నారు. కార్మికులకు రాజకీయ పార్టీలు,నాయకులు కూడా అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. కార్మికులంతా ఏకతాటిపైకి రండి. రాజకీయ నాయకులను ఎంటర్‌ చేయండి. వారి మాటలు నమ్మకండి. ఎవరి మాట నమ్మకండి. నిజా నిజాలు తెలుసుకోండి. జరిగిన తప్పులను గుర్తించండి. మోసం చేసిన వారి లెక్కలు తీయండి. మోసం చేసిన పెద్దలను బజారు కీడ్చండి. సినీమా అవకాశాలు పోతాయని భయపడకండి. సినిమాల వల్ల ఇక సంపాదించేదేమీ వుండదు. కనీసం పోరాటం చేస్తే నీడనైనా దొరుకుతుంది. సినీ పెద్దల మాయపడితే సినిమాలుండవు. ఉండడానికి ఇల్లూ వుండదు. జీవిత కాలం అద్దెబతుకులు, అరువు జీవితాలే మిగులుతాయి.

error: Content is protected !!
Exit mobile version