అంగన్వాడీ కేంద్ర అభివృద్ధికి కమిటీ సభ్యుల సహకారం..

అంగన్వాడీ కేంద్ర అభివృద్ధికి కమిటీ సభ్యుల సహకారం

మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట పట్టణంలోని శాంతి నగర్ అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ నర్సంపేట ప్రాజెక్ట్ పరిధిలో ఏఎన్ఎంఎస్సి కమిటీ సమావేశం ప్రాజెక్ట్ సిడిపిఓ మధురిమ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సిడిపిఓ మధురిమ మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో మాతా శిశు సంక్షేమం కోసం పౌష్టికాహారం అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్ర అభివృద్ధి కోసం ఏఎన్ఎంఎస్సి కమిటీ చైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్, కౌన్సిలర్ బత్తిని రాజేందర్ కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా చైర్మన్ చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలు గాజుల జ్యోతి, జగన్నాధ దీపికలకు శ్రీమంతం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ గర్భిణీగా నమోదైనప్పటి నుండి పిల్లలకు ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు ప్రభుత్వం అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ అరుణ, స్థానిక అంగన్వాడీ టీచర్లు దాసరి రమాదేవి, నల్లా భారతి, గొర్రె రాధ, బత్తిని శిరీష, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు నాడెం రాజ్యలక్ష్మి, బాలుగు రజిత, ఆర్పి అనిత, జ్యోతి, దీపిక, సంధ్య, మమత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version