క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పును గౌరవించాలి….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పును గౌరవించాలి….

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ డిమాండ్ చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ లో చైర్మెన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిందని, కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం క్యాతనపల్లిలో ప్రశాంతంగా ఎన్నికను నిర్వహించాలని అన్నారు. ఫిబ్రవరి 17 న జరిగిన కేసులో కోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం బెయిల్ షరతులలో భాగంగా బుధవారం ఆర్కేపీ పోలీస్ స్టేషన్ లో సంతకం చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్, కొంగల తిరుపతి రెడ్డి, మద్ది శంకర్,ఆర్నె సమ్మయ్య, యూత్ నాయకులు రామిడి లక్ష్మీకాంత్, కుర్మ దినేష్, సీపెళ్ళి సాగర్, బెల్లం అరున్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version