ఝరాసంగం అభివృద్ధికి ప్రతీక – మాజీ సర్పంచ్ జగదీశ్వర్…

ఝరాసంగం అభివృద్ధికి ప్రతీక – మాజీ సర్పంచ్ జగదీశ్వర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలంలో జరిగిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సి.ఎస్.ఆర్ కార్యక్రమం ఒక సాధారణ సేవా కార్యక్రమం కాదు… ఇది ఒక నాయకుడి దూరదృష్టి, పట్టుదల, గ్రామం పట్ల నిబద్ధతకు ప్రతీక.ఈ మహత్తర కార్యక్రమం వెనుక ఉన్న అసలు శక్తి –ఝరాసంగం మాజీ సర్పంచ్ జగదీశ్వర్ గ్రామాభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు…కార్పొరేట్ సంస్థలను సంప్రదించి, ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితిని వివరించి, అవసరాలను వివరంగా తెలియజేసి, ప్రతీ అంశాన్ని స్వయంగా పర్యవేక్షించి – ఈ భారీ సహాయాన్ని ఝరాసంగానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.295 బంక్ బెడ్‌లు.590 పరుపులు 4 మొబైల్ టాయిలెట్లు 130 ట్రంక్ బాక్స్‌లు 42 ఇనుప రాక్లు.కంప్యూటర్లు, ప్రింటర్లు, లైబ్రరీ సామగ్రి దోమతెరలు, ఫ్యాన్లు, బీరువాలు తదితర వసతి సామగ్రి ఇది సాధారణ సహాయం కాదు –ఇది వందలాది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే మహత్తర మార్పు..హాస్టల్ విద్యార్థులు ఇకపై నేలపై నిద్రపోవాల్సిన అవసరం లేదు పరిశుభ్రత మెరుగుపడుతుంది డిజిటల్ విద్యా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి
గ్రంథాలయ అభివృద్ధితో చదువుపై ఆసక్తి పెరుగుతుంది ఇది అన్నీ సాధ్యమైంది ఎందుకంటే –
జగదీశ్వర్ గ్రామాన్ని తన కుటుంబంలా భావిస్తారు.
పదవి లేకున్నా సేవ ఆగలేదు…అధికారంలో లేకున్నా అభివృద్ధి ఆగలేదు గ్రామం కోసం ఆయన పోరాటం, పట్టుదల ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఝరాసంగం ప్రజల గర్వకారణం
సమాజ సేవకు మారుపేరు యువతకు ఆదర్శం
విద్యార్థుల భవిష్యత్తుకు ఆశాకిరణం –
జగదీశ్వర్ ఇలాగే ఝరాసంగం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు

తంగళ్ళపల్లి గ్రామపంచాయతీకి సర్పంచిగా నామినేషన్ దాఖలు చేసిన అoకారపూరవి….

తంగళ్ళపల్లి గ్రామపంచాయతీకి సర్పంచిగా నామినేషన్ దాఖలు చేసిన అoకారపూరవి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ అహంకారపురవి తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మేజర్ గ్రామపంచాయతీ ఆయన సందర్భంగా ఇదివరకు గ్రామపంచాయతీకి చేసిన సేవలను గుర్తిస్తూ సర్పంచిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాననిగత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో గ్రామంలోని ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని ఎంతోఅభివృద్ధిగా తీర్చిదిద్దామనిఅలాగే గ్రామ ప్రజలకు ఏ ఆపతిఅవసరం వచ్చిన ముందుండి నడిపించామనిఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా గ్రామ ప్రజలందరూ తను చేసిన అభివృద్ధిని గుర్తించి ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలనిఓటర్లందరూ అభివృద్ధి వైపు చూసి ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకముందు కూడా గ్రామ అభివృద్ధి చేయడానికి నన్ను గెలిపించవలసిందిగాకోరుచు ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో. తంగళ్ళపల్లి మాజీ ఎంపీపీ పడిగెలమానస రాజు. మాజీ సర్పంచ్ అనిత రవి మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య. Pacs వైస్ చైర్మన్ ఎగుమామిడివెంకట రమణారెడ్డి. కందుకూరి రామ గౌడ్. గ్రామస్తులు తదితరులు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version