ఘనంగా దొంతి అవి యుక్త్ రెడ్డి జన్మదిన వేడుకలు
దుగ్గొండి,నేటిధాత్రి:
నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి తనయుడు భవిష్యత్ యువ నాయకుడు దొంతి అవియుక్త్ రెడ్డి జన్మదిన వేడుకలను దుగ్గొండి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తకొండ రవివర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్ హాజరై కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి వారసుడు దొంతి అవి యుక్త్ రెడ్డి తన తండ్రి సిద్ధాంతాలను ఆచరిస్తూ సమాజ సేవలో ముందుకు సాగుతున్నారన్నారు. భవిష్యత్లో మంచి యువ నాయకుడిగా ఎదుగుతారని తెలిపారు.దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ మాట్లాడుతూ దొంతి అవియుక్త్ రెడ్డి ప్రజల మనిషిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆశయాలను నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో మరింత సేవా కార్యక్రమాలు చేపడతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు హింగే రామారావు, అజ్మీరా దంజ్య నాయక్, మాజీ ఎంపీపీ బూరుగు రవీందర్, క్లస్టర్ ఇంచార్జిలు ఇంగోలు రాజేశ్వర్ రావు, చెన్నూరి కిరణ్ రెడ్డి, ఒలిగే నర్సింగ రావు, రొట్టె రమేష్, అంబరగొండ రాజేశ్వర్ రావు, సర్పంచులు భూర రాధిక హేమచందర్, కూరతోట స్వప్న సురేష్, కొల్గురి సుజాత సుమంత్, పార్టీ సీనియర్ నాయకులు పుచ్చకాయల బుచ్చిరెడ్డి, ముత్యాల కుమార స్వామి, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వెండి సక్కుబాయి, దుగ్గొండి మండల మహిళా అధ్యక్షురాలు బుర్రి సునీత, నాయకురాలు మమతతో పాటు వివిధ గ్రామాల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
