మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో కొనసాగుతున్న మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు.ఇందులో భాగంగా జిల్లాలోని మహిళా సమాఖ్యల కొరకు చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
