ఘనంగా అవియుక్తురెడ్డి జన్మదిన వేడుకలు.

ఘనంగా అవియుక్తురెడ్డి జన్మదిన వేడుకలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి తనయుడు యంగ్ డైనమిక్ లీడర్ దొంతి అవియుక్త రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం తిరుపతిరెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడుగా రాజకీయాల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజల మన్ననలు పొందాలని . ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోతు చరణ్ సింగ్, మండల ప్రధాన కార్యదర్శి మాలోతు మోహన్, సర్పంచ్ సిద్ధ సంతోష్, నాయకులు వెంగళ దాసు రమేష్, బాలాజీ నాయక్, బత్తిని మల్లయ్య, పోగుల కుమారస్వామి, వైనాల పవన్, రఫీద్, పోలు దాసరి రాము కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.

మల్లయ్య మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మండల కేంద్రానికి చెందిన పిట్టల మల్లయ్య (75) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి మండల నాయకులు తో కలిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించి మల్లయ్యకు నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మల్లయ్య కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉండి పార్టీకి ఎలా లేని సేవలు చేశారు ఆయన అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా మల్లయ్య కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆయన వెంట జిల్లా కార్యదర్శి మాలోత్ రమేష్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, నాయకులు పెంతల కొమరారెడ్డి, హౌసింగ్, రమేష్ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version