సంతల వేలం వాయిదా మున్సిపల్ కమిషనర్ అంజయ్య
పరకాల,నేటిధాత్రి
2026-27 సంవత్సరానికి గాను పరకాల మున్సిపాలిటీలోని తైబజార్, పశువుల సంత మరియు గొర్రెలు మేకల సంతలకు సంబంధించిన వేలాన్ని 31 మార్చి మంగళవారంనకు వాయిదా వేస్తున్నట్టు పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ వేళలో పాల్గొనాలనుకునేవారు 2లక్షల డిడి,5లక్షల ఇంటి వ్యాలివేషన్ సర్టిఫికెట్స్ మరియు 9చెక్కులు,2500 రూపాయల షెడ్యూల్ ఫామ్ రుసుము చెల్లించి 30 మార్చి సాయంత్రం 5గంటల వరకు కార్యాలయంలో సమర్పించి మంగళవారం 11గంటలకు వేలంలో పాల్గొనాలని తెలిపారు.ఏదైనా వివరాలకోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
