అజంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్…

అజంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామంలో అజంతా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలకు బిపి, షుగర్,గుండె పరీక్ష,కంటీ పరీక్ష చేయించి అర్హులు అయిన వారికి కళ్ళజోడు ఇవ్వడం జరిగింది.దానికి గెస్ట్ గా గణపురం స్టేషన్ ఎస్సై రేఖ అశోక్ , సర్పంచ్ సునీత- శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు మిట్టపెల్లి అరవింద్ మాట్లాడుతూ ఆరోగ్యంలేని మనిషి జీవితంలో ఏదీ సాదించలేడు, మనకు రోగం బారిన పడితే తప్ప ఆరోగ్యం గురించి ఆలోచన రాదు, దాని కోసం ఎల్లవేళలా గ్రామ ప్రజలు బాగుండాలి అని ఈ నిర్ణయం అజంతా యూత్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అజంతా యూత్ అసోసియేషన్ ఉప అధ్యక్షులు చిన్న కుమార్, కోశాధికారి కుక్కమూడి నవీన్, ప్రధాన కార్యదర్శి మట్టెవాడ హరీష్, కార్యదర్శి మిట్టపెల్లి అశోక్, ప్రచార కార్యదర్శి కన్నూరి రంజిత్, సలహాదారులు కుర్రి రాజు,కుక్కమూడి అశోక్,కుక్కమూడి కుమార్ , రమేష్, కళ్యాణ్, నవీన్, నరేష్,సాయి, మహేష్, గణేష్,గ్రామ పెద్దలు, ఉపసర్పంచ్, వార్దుమెంబెర్స్, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

మెగా మెడికల్ క్యాంప్

మెగా మెడికల్ క్యాంప్

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ మంచిర్యాల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ప్రాంతంలోని పీహెచ్సీ లో మెగా మెడికల్ క్యాంప్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు ఉచితంగా బీపీ, షుగర్,టీబీ,బ్లడ్,డెంగ్యూ, మూత్ర వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు.తీవ్ర ఆరోగ్య ఇబ్బందులతో ఉన్న పెషేంట్స్ ని అంబులెన్స్ ద్వారా మంచిర్యాలకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ పూదరి కుమార్, హెచ్ఇ అల్లాడి శ్రీనివాస్, రమేష్ సిహెచ్ఓలు రమేష్, అక్తర్,టీబి ప్రోగ్రాం సూపర్వైజర్ సాయి రెడ్డి, ఐసిటిసి మెంబెర్స్ డా.పద్మశ్రీ ఆర్ బి హెచ్ కే మెడికల్ ఆఫీసర్,డా.మమత, ఎఎన్ఎం లు రజిత,వజ్ర, సునంద,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయండి

మెడికల్ క్యాంప్ పోస్టర్ ఆవిష్కరణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

ఈనెల 29 ఆదివారం రోజున రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి సిఈఆర్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ మునీర్ జ్ఞాపకార్థం మునీర్ మెమోరియల్ ఆధ్వర్యంలో కరీంనగర్ రెనే హాస్పిటల్, మంచిర్యాల మెడి లైఫ్ హాస్పిటల్ వారు నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ క్యాంపును విజయవంతం చేయాలని రెండో వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, రెనే హాస్పిటల్ జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ లు అన్నారు. అనంతరం మెడికల్ క్యాంపు వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు మునీర్ జ్ఞాపకార్థం సింగరేణి క్లబ్ లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, గత మూడు సంవత్సరాలుగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ అభిలాష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు, వసీముద్దీన్, శంకర్, పాషా, సారయ్య, రాజేందర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version