నూతన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన అల్లాడి నర్సింహులు…

నూతన మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన అల్లాడి నర్సింహులు

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

జహీరాబాద్ నియోజకవర్గ అల్లాడి వీరేశం బట్టల దుకాణ యజమాని.అమెరికా పర్యటన ముగించుకొని జహీరాబాద్ కు వచ్చిన సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లాడి నరసింహులు గారికి కలిసిన సందర్భంగా జహీరాబాద్ నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మహమ్మద్ యూనుస్ గారికి ఎస్ వి షాపింగ్ మాల్ లో ఘనంగా పూలమాలలు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మహమ్మద్ యూనుస్
మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధిని మనమందరం కలిసి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలలో ప్రాధాన్యత భేదాలు వర్గ విభేదాలు ఎప్పటికీ ఉండరాదని ఆయన హితవుపలికారు. ఎన్నికల పోటీల్లో మాత్రమే పోటీ ఉండాలి గెలిచిన అనంతరం అందరూ ఐకమత్యంతో సమన్వయంతో అభివృద్ధిలో భాగస్వామ్యం కావలసి ఉంటుందని ఆయన గుర్తు చేశారు.

మెట్పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో…

మెట్పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ లకు సన్మానం
మెట్ పల్లి ఫిబ్రవరి 17 నేటి ధాత్రి

 

మెట్ పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం వారి ఆధ్వర్యంలో మెట్ పల్లి పట్టణ మున్సిపల్ చైర్మన్ నూతనంగా ఎన్నికైన మైలారపు లింబాద్రి ని వైస్ చైర్మన్గా నియమితులైన ఓంకారి నవీన్ ని 23వ వార్డు కౌన్సిలర్ గా కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ ని నూతనంగా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా సంఘ భవనంలో సంఘ అధ్యక్షులు కొండ మురళి సంఘ సభ్యులు వారిని ఘనంగా శాలువతో సన్మానం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ మీ అందరి సహకారంతో మున్సిపల్ చైర్మన్ గా నియమితుల కావడం సంతోషకరమని మీకు ఏ సహాయం కావాలన్నా తన వద్దకు ఎప్పుడైనా రావచ్చని మీకు ఎల్లప్పుడు సహాయ సహకారం అందిస్తానని అలాగే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘ అధ్యక్షులు కొండ మురళి కార్యదర్శి ఇంద్రాల ఈశ్వర్ కోశాధికారి మద్దే నపల్లి స్వామి ఉపాధ్యక్షులు ఎదులాపురం కుమార్ గౌరవ అధ్యక్షులు కొడిమ్యాల వెంకటస్వామి మ్యాడపు అశోక్, గడిపల్లి నారాయణ భూమేశ్వర్ చంద్రగిరి రామకృష్ణ మ్యాడపుశ్రీనివాస్,రవి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

రామాయంపేట పట్టణ సుందరీకరణ వేగవంతం…

రామాయంపేట పట్టణం సుందరీకరణ.. పనులు వేగవంతం..

టై బజార్ వేలం రద్దు..

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వ్యాపారులు..

రామాయంపేట సెప్టెంబర్ 13 నేటి ధాత్రి (మెదక్)

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆదేశాల మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో ఆనందాన్ని నింపుతున్నారు.
రామాయంపేట పట్టణంలో కూరగాయల మార్కెట్ టై బజార్ వసూల్ వేలం ను రద్దు చేసిన నిర్ణయంపై రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.


ఇక పట్టణ సుందరీకరణలో భాగంగా — సంగారెడ్డి నుంచి వెలుకతుర్తి వెళ్లే 765 డీజి ప్రధాన రహదారిపై, అలాగే సిద్దిపేట వెళ్లే రహదారి డివైడర్ మధ్యన బటర్‌ఫ్లై లైట్ల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది.
దాదాపు ఒక కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్రావు అధ్యక్షత వహించారు.

పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రామాయంపేటలో జరుగుతున్న సుందరీకరణ పనులు పూర్తయితే పట్టణం మరింత అందంగా మారనుందని రామాయంపేట పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సరాపు యాదగిరి.రమేష్ రెడ్డి. విప్లవ కుమార్. పిట్ల ప్రకాష్.మాజీ కౌన్సిలర్లు సుందర్ సింగ్. దానికి స్వామి. చింతల స్వామి. తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version