ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి చేస్తా 22వ వార్డు అభ్యర్థి మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ…

ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి చేస్తా 22వ వార్డు అభ్యర్థి మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలో, మీ విలువైన ఓటును 22వ వార్డు అభ్యర్థి మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి, చోటు కల్పించాలని. అభివృద్ధికి బాటలు వేసి వార్డు ప్రజల రుణం తీర్చుకుంటారని పట్టణంలోని, 22వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ కోసం ఆదివారం సాయంత్రం జహీరాబాద్ సీనియర్ నాయకులు షేక్ ఫరీద్ బీఆర్ఎస్ నాయకులు. ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మున్సిపాలిటీని గతంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని, కాలువ నిర్మాణాలు, రహదారుల ద్వారా సమస్యలు తీర్చిందని గుర్తు చేశారు. భవిష్యత్తులోను, కోట్లాది రూపాయలు వార్డుల వారిగా వెచ్చించి అభివృద్ధి పనులు చేసేందుకు, మొహమ్మద్ అబ్దుల్ ముర్తజ సిద్ధంగా ఉన్నారని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఇంటింటి ప్రచారానికి మంచి ఆదరణ వస్తుంది. ఎక్కడికి వెళ్లినా మహిళా ఓటర్లు సానుకూలంగా స్పందిస్తున్నారని వెల్లడించారు.

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా 22వ వార్డు అభ్యర్థి ఇంగిలి వీరేష్…

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా 22వ వార్డు అభ్యర్థి ఇంగిలి వీరేష్

పరకాల,నేటిధాత్రి

 

మున్సిపాలిటీ పరిధిలోని 22వవార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇంగిలి వీరేష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఇంటింట తిరుగుతూ యువ నాయకునిగా మీ ముందుకు వస్తున్ననని ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ వార్డులో ఉన్న డ్రైనేజీ, పారిశుద్ధ సమస్యలను రోడ్లను అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చి దిద్దుతానని ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు సమస్య ల పరిష్కరానికి శ్రమిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version