వారపు సంత ప్రచారాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత..

వారపు సంత ప్రచారాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి..

 

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ పరిధిలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మరియు సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు తిధి 13 -2-2026 శుక్రవారం రోజున వారపు సంత ఏర్పాటు చేయడం కోసం పాలకవర్గంలో తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సర్పంచ్ సుజాత ఉప సర్పంచ్ బుడగం రాము మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ జెండా ఊపి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎర్ర సురేష్, జలగం కృష్ణ, ముంజాల సాయిబాబా, వార్డు మెంబర్లు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

స్థానిక సర్పంచ్ సాగర్ఆధ్వర్యంలో వారంతపుసంతఏర్పాటు…

స్థానిక సర్పంచ్ సాగర్ఆధ్వర్యంలో వారంతపుసంతఏర్పాటు…

 

తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో మండేపల్లి సర్పంచ్ గాదగోనీ సాగర్ ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో వారసంతపు సొంత ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మండపల్లి గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ మండపల్లి వారసంతపు సంత ఏర్పాటు చేయడం జరుగుతుందని. కనుక ఈ వారంతపు సంతలు నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకే దొరుకుతాయని ఇందులో కూరగాయలు కానీ నిత్యవసర వస్తువులు కానీ ఇతర ఏ వస్తువులైన అన్ని సదుపాయాలు ఉంటాయని ప్రజలు పట్టణాలకు వెళ్లి తీసుకువచ్చేఅవకాశలు లేకపోగా సమయం వృధాగా అందుబాటులో ఉండకపోవడంతోసమయం కలిసొస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటాయన్న ఉద్దేశంతో వారసంతపు సంత ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి వారం మూడు గంటలకు ప్రారంభమై సాయంకాలం ముగుస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరికీ అందుబాటులో విధంగా సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా రాబోయే రోజులలో పశువుల అంగడి కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామ ప్రజలు గాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గాని అందరు సహకరించి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ చుట్టుపక్కల గ్రామాల వారికి అందుబాటులో ఉండే విధంగా అందరు సహకరించాలని గ్రామంలో మైకు ద్వారా ప్రచారం నిర్వహించారుఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.

ప్రజల ఆస్తులను ద్వసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి.

ప్రజల ఆస్తులను ద్వసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి.

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో గత 20 ఏండ్ల నుండి నిర్వహిస్తున్న వారాంతపు సంత ప్రాంతంలో “మా ఊరి సంత” పేరుతో నిర్మించిన కూరగాయల రేకుల షేడ్లు, మూత్రశాలలను గురువారం జేసీబీ సాయంతో కూల్చివేసే క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడిన విషయం విధితమే.
ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి గణపురం మండల కేంద్రానికి చేరుకొని కూల్చివేతలు చేపట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగడి నిర్వహించుకునే ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం మరుగుదొడ్లు, అలాగే వారాంతపు సంతలో కూరగాయలు అమ్ముకునే వారికి సౌకర్యవంతంగా ఉండేలా షెడ్లు గత ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే, ఈ ప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన ఆస్తిని ఎటువంటి ముందస్తు నోటీసులు,పర్మిషన్ లేకుండా కూల్చివేతలు చేపట్టడం సరైన పద్ధతి కాదని,ప్రజల ఆస్తిని కూల్చివేసిన వారి పై కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోల్సాని లక్ష్మీ నరసింహారావు, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,మాజీ సర్పంచ్ పెంచాల రవీందర్, ఐలోని రామచంద్ర రెడ్డి, నాయకులు రవీందర్ రెడ్డి,గంజి జనయ, కసిరెడ్డి వెంకటరమణారెడ్డి,మామిండ్ల సాంబయ్య,రాజిరెడ్డి,మల్లారెడ్డి,జిల్లా యూత్ నాయకుడు గాజర్ల చింటుగౌడ్ ,వాజిద్ ,సింహాచలం ,కొమురయ్య,శ్రీనివాస్,యాకయ్య,రఘు,తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version